• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Farmers

వచ్చేవి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాలు : ప్రపంచ బ్యాంకు

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Forecasts, gloomy days, World Bank

ఎంకెఆర్‌

   ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన అనేక వాగ్దానాలలో రెండు ప్రాధాన్యతగలిగినవి. ఒకటి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తెచ్చి ప్రతి వారి ఖాతాలో పదిహేనులక్షలు వేస్తామన్నది ఒకటి. రెండవది 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది మరొకటి. ఇవి రెండూ ఎంతో ముఖ్యమైనవి. మొదటి దాని గురించి అసలు సాబ్‌ అలా చెప్పలేదు అనే వారు కొందరు, ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఎన్నికల సమయంలో చెప్పిన వాటినన్నింటినీ అమలు జరపలేరంటూ సమర్ధించేవారు మరి కొందరు. ఇంకొందరున్నారు చెప్పినట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేకపోయినా కొత్తగా విదేశాలకు తరల కుండా చేశారంటారు. అయితే అది కూడా వాస్తవం కాదని, గత రెండు సంవత్సరాలలో కొత్తగా భారతీయులు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి కనుక అది కూడా వాస్తవం కాదని తేలిపోయింది. బహుశా వారికి అచ్చేదిన్‌ వచ్చి వుంటాయి. రెండవది రైతుల ఆదాయాలు రెట్టింపు చేయటం. ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనమౌతున్న తరుణంలో ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఓట్లను కొల్ల గొట్టేందుకు నరేంద్రమోడీ చెప్పటం మరో నల్లధనం వెలికితీత వంటిదే. మోడీ అంతరంగమైన అమిత్‌ షా ఏదో మాయాజాలం చేసి వాగ్దానాలు అమలు చేస్తారు అని నమ్ముతున్నవారు ఇంకా వున్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు ప్రపంచ బ్యాంకు 2016 జోశ్యం గురించి చేసిన ప్రకటన ఆ ఆశల మీద కూడా నీళ్లు చల్లింది.జనం మీద భారం మోపే చమురు ధరలు పెరుగుతాయన్నది ఒకటి. కోట్లాది మంది రైతులు నోట్లే రాబోయే రోజుల్లో కూడా మట్టే అని మరొకటి. జనవరి జోశ్యంలో 2016-17లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు గతేడాదితో పోల్చితే 1.8శాతం పెరుగుతాయని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. మూడు నెలలు తిరిగే సరికి రెండవ సవరింపులో 2016లో 1.8, 2017లో 1.7శాతం మేరకు ధరలు పతనమౌతాయని పేర్కొన్నది. తదుపరి అంచనాలలో ఏం చెబుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పిన రెండూ జనానికి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాల రానున్నాయని వెల్లడిస్తున్నాయి.

    సరిగ్గా బ్యాంకు ఈ నివేదికను రూపొందిస్తున్న తరుణంలోనే ఇక నుంచి రైతులు తమ వుత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అందుకు గాను ఏప్రిల్‌ 14న ‘ఇనామ్‌’ ప్రారంభించారు. దీన్ని ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ అని పిలుస్తున్నారు. రైతులు సమీప మార్కెట్లో అక్కడి వ్యాపారులు చెప్పిన అతి తక్కువ ధరలకు తమ వుత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నదని ఇనామ్‌ ద్వారా కోరుకున్న ధరకు అమ్ముకొని అధికంగా సంపాదించుకోవచ్చని ప్రధాని ప్రకటించారు. తొలి దశలో ఎనిమిది రాష్ట్రాలలోని 22 మార్కెట్‌ యార్డులను అనుసంధానించారు.మొత్తం 585 వ్యవసాయ మార్కెట్‌ యార్డులను 2018 నాటికి పూర్తిగా అనుసంధానిస్తారు. అయితే ఇందుకు రాష్ట్రాలు చట్టాలను సవరించి అనుసంధానానికి ఆమోదం తెలపాల్సివుంటుంది. తొలి దశలో గుజరాత్‌, తెలంగాణా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, హర్యానా , జార్ఖండ్‌, హిమచల్‌ ప్రదేశ్‌కు చెందిన మార్కెట్లను అనుసంధానించారు. ఇరవై అయిదు రకాల పంటలను విక్రయించుకోవచ్చు. తొలి దశలో ఆయా రాష్ట్రంలోని మార్కెట్లలో మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో క్రయ విక్రయాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. వాటిని కోల్పోవటానికి ఏ రాష్ట్రమూ అంగీకరించదు. అందువలన ఈ సమస్యను ఎలా పరిష్కరించేది చూడాల్సి వుంది. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న విధానం అమలులోకి రావటం అంత సులభం కాదని చెబుతున్నారు.

   గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ పంటలపై రైతాంగానికి వస్తున్న ఆదాయాలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా తమ బాధ్యతల నుంచి ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఈ మార్కెట్లు కూడా దానిలో భాగమే. ఈ ఏడాది బడ్జెట్‌లో రైతాంగానికి పెద్ద పీట వేసినట్లు ప్రభుత్వం, మీడియా కూడా డబ్బా కొట్టాయి. బడ్జెట్‌ను అంకెల గారడీ అని కూడా వర్ణిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2022 రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని పదే పదే చెబుతున్నారు. దీనిలో రెండు అర్ధాలు వున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ మేరకు రైతాంగ వుత్పత్తుల ధరలు పెరిగితే రైతులకు ఎక్కువ డబ్బు వచ్చినట్లు కనిపించవచ్చుగానీ అదే సమయంలో వారి పెట్టుబడులు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. స్ధిర ధరలలో పెరుగుదల ఎంత అన్నదే నిజమైన కొలబద్ద అవుతుంది. అలా జరగాలంటే ప్రభుత్వాలు అది కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఎంత మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపాయన్నదానిని బట్టే వుంటుంది.

    ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది కంటే విలువ తగ్గిన రూపాయల కేటాయింపు అంకెల్లో ఎక్కువగా కనిపించినా, దేశ స్ధూలాదాయంలో శాతాలలో చూస్తే గతేడాది కంటే వ్యవసాయంలో భాగమైన గ్రామీణ వుపాధికి కేటాయింపు 0.3శాతం తగ్గింది. వాటిలో గతేడాది బకాయిల మొత్తం, యంత్రాల వినియోగానికి అనుమతుల వంటి వాటిని చూస్తే వాస్తవానికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఆదాయంలో ఇది కూడా ఒక భాగంగా మారిన విషయం తెలిసిందే. అందువలన ఆదిలోనే హంసపాదు అన్నట్లు గ్రామీణ బడ్జెట్‌గా వర్ణించిన దానిలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తేలిపోయింది.

                                     వ్యవసాయ రంగంలో సంక్షోభం

     గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభ తీవ్రత పెరుగుతోంది. అందువలననే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యల తీవ్రత పెరిగింది తప్ప తగ్గటం లేదు.గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది.వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ హయాంలో వ్యవసాయరంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నది. దానిని మరుగు పరచి దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారంతో ఎన్‌డిఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో తీవ్ర ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.సరిగ్గా అటు వంటి పరిస్థితి మరోసారి ప్రారంభమై దిగజారటం వేగం పుంజుకుంటున్న స్ధితిలో నరేంద్రమోడీ రైతాంగానికి ఆదాయాల రెట్టింపు వంటి అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చారు. రైతాంగం సంక్షోభంలో భాగంగా రుణవూబిలో కూరుకుపోయిన కారణంగానే రుణాల రద్దు నినాదానికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడికి పీఠం అప్పగించారు.

     2004ఎన్నికలలో ఎన్‌డిఏ రైతుల ఆగ్రహాన్ని చూసిన తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నది. గ్రామీణ వుపాధి కార్యక్రమం దాని పర్యవసానమే. దీనికి తోడు ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడి రైతుల ఆదాయాలు పెరిగాయి.అది మరో నిర్మాణ రంగం పెరుగుదలకు దోహదం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారికి వేతన రూపంలో ఆదాయాలు పెరగటానికి కూడా దారితీసింది. ఇది కొంత మేరకు సంక్షోభాన్ని పెరగకుండా చేసింది తప్ప పూర్తిగా పరిష్కరించలేదు. యుపిఏ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత లోటు తగ్గింపు పేరుతో కోతలు విధించటం ప్రారంభించింది. ఇదే సమయంలో వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ఆగిపోయి మరోసారి వెనుక పట్టు పట్టింది. బడ్జెట్‌ కోతలో భాగంగా వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గాయి. 2010-11 నుంచి అప్పటి వరకు స్ధిరంగా వున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి పెరగటం ప్రారంభమైంది. మోడీ హయాంలో ఇంకా పెరుగుతోంది. మాంద్యం లేదా సంక్షోభం తలెత్తినపుడు పెట్టుబడిదారులకు రాయితీలు తప్ప ప్రజా సంక్షేమానికి కోత పెడతారు. దానిలో వ్యవసాయం కూడా ఒకటని వేరే చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభంలో వున్న వర్తమాన తరుణంలో కొన్ని విభాగాలకు కొంత కేటాయింపులు పెంచినంత మాత్రాన రానున్న ఆరు సంవత్సరాలలో రైతుల అదాయాలు రెట్టింపు అవుతాయంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి వుండదు. నిజానికి ఎరువులు,డీజిల్‌, ఇతర పెట్టుబడులపై ఇస్తున్న రాయితీలను ఎత్తివేసిన తరువాత బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయింపులు పెంచినా దాని వలన రైతాంగానికి ఎలాంటి వుపయోగం వుండదు.

      నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడుల గురించి జపం చేస్తోంది. ఆయనను ప్రధాని గద్దెపై కూర్చొనేందుకు ఎంపిక చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మరోవైపు స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో కబుర్లు చెబుతోంది. ఆహార వుత్పత్తుల రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తామని అరుణ్‌ జెట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పటం ఆచరణలో విదేశీ ఆదరణ మంచగా దేశాన్ని మార్చటమే. . ఇది చిన్న సన్నకారు రైతాంగానికేమీ వుపయోగపడదని ముఖ్యంగా పండ్లు, కూరగాయల రైతాంగానికేమీ ప్రయోజనం లేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను పెంచితేనే వారికి లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అంటే ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధన, పేదరిక నిర్మూలన కూడా ఇమిడి వుంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం అంటే విదేశీ కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులకు పెద్ద పీట వేయటమే. విదేశీ పెట్టుబడులు వ్యవసాయరంగంలో ప్రవేశించటం వాటి లాభాల కోసం తప్ప మన బాగుకోసం కాదు. బ్రిటీష్‌ వారు తమ ఆక్రమిత దేశాలైన భారత్‌, చైనా వంటి చోట్ల తమ లాభాల కోసం నల్లమందు సాగు, తయారీని ప్రోత్సహించి జనాన్ని నల్లమందు భాయీలుగా మార్చటమే కాదు చివరకు నల్లమందు యుద్ధాలు చేసిన విషయం చరిత్ర చెబుతోంది.

      అంతెందుకు వర్తమాన చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను పెంచి పోషించేందుకు అమెరికన్లు అక్కడ వారిచేత అదే పని చేయించారు. ఇప్పుడు మత్తుమందుల రవాణాలో ఆఫ్ఘనిస్తాన్‌ ఒక కీలక ప్రాంతంగా మారింది. తాలిబాన్లకు అవసరమైన ఆదాయ వనరుగా మారింది. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులంటే మరో విధంగా చెప్పాలంటే ఈ విధానం వెనుక వున్న పరమార్ధం తన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవటం, మార్కెట్‌ శక్తులకు రైతాంగాన్ని అప్పగించటమే. దానిలో అంతర్బాగంగానే రైతులకు ఏమాత్రం వుపయోగపడకుండా ఇప్పుటికే వున్న పంటల బీమా పధకంలో మార్పులతో అందుకు శ్రీకారం చుట్టింది. రైతాంగానికి రక్షణ కల్పించే అనేక అంశాలలో బీమా ఒకటి మాత్రమే. బీమా సంస్ధలు ప్రీమియం స్వీకరించే ముందు చెప్పే కబుర్లకు తరువాత చెల్లించాల్సిన సమయంలో పెట్టే షరతులకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. అయినా వ్యవసాయ సంక్షోభానికి సమగ్ర పంటల బీమా అన్నది ఒక తోడ్పాటు మాత్రమే తప్ప జిందా తిలిస్మాత్‌ కాదు. మరో విధంగా చెప్పాలంటే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని రైతాంగాన్ని ఒక ఆర్ధిక సరకుగా ద్రవ్య వ్యాపారులకు అప్పగించే నయా వుదారవాద విధానం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలలో మనకంటే మెరుగైన వ్యవసాయ బీమా పధకాలు వున్నప్పటికీ ఏదో ఒక పేరుతో ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటమే గత దశాబ్దన్నర కాలంగా దోహా చర్చలు ముందుకు పోకపోవటానికి అడ్డుపడుతున్న కారణాలలో ఒకటని గుర్తించాలి. మోడీ సర్కార్‌ ఆ సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు, వున్నవాటిని క్రమంగా రద్దు చేస్తోంది.

    ప్రపంచ బ్యాంకు వ్యవసాయం గురించి తాజాగా చెప్పిన అంశాల గురించి చూద్దాం. గత ఎనిమిది త్రైమాసకాలుగా (రెండు సంవత్సరాలుగా) ప్రపంచంలో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పడిపోతూనే వున్నాయి.గతేడాది కంటే తొమ్మిదిశాతం తక్కువ. ఎక్కువ భాగం వ్యవసాయ వుత్పత్తుల ధరలు ఈ ఏడాది పతనం అవుతాయి. ధాన్యం ధరలు 3.4శాతం తగ్గుతాయని జనవరిలో వేసిన అంచనాను తాజాగా 5.3శాతానికి పెంచింది. వ్యవసాయ ధరలు తగ్గటంతో పాటు చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని చెప్పటం అంటే అంటే పరోక్షంగా రైతులపై మరింత భారం మోపటమే. ఎరువుల ధరలు తక్షణమే పెరుగుతాయి.ఇది ఒక విష వలయం. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి అన్నింటినీ దెబ్బతీస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న, సన్న కారు రైతాంగాన్ని భూమికి దూరం చేసే యత్నాలు

19 Tuesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Latin America

≈ Leave a comment

Tags

Agriculture, Brazil’s peasant internationalism, farmland privatization, La Via Campesina, Narendra Modi, Niti Aayog, peasant internationalism, peasants

Poster from the campaign “O Grito dos Excluídos” (“The Scream of the Excluded”). Some rights reserved.

ఏప్రిల్‌ 17 అంతర్జాతీయ భూ పోరాట దీక్షా దిన ప్రాధాన్యత

ఎం కోటేశ్వరరావు

    చెదురుమదురుగా వున్న చిన్న భూ కమతాలను ఒకటిగా చేయాల్సిన అవసరం వుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పంగారియా చెప్పారు. సోమవారం నాడు జమ్మూలోని కాశ్మీర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసంలో భూ కమతాలను పెద్దవిగా రూపొందించాల్సిన అవసరం గురించి చెప్పారు. ఇది జరగాలంటే రైతులు భూములను అమ్ముకొని ఇతర పనులను చూసుకోవాలి, అయితే భూమి కలిగి వుంటే రక్షణ వుంటుందని భావిస్తున్న కారణంగా వారు విక్రయానికి ముందుకు రారు, అందువలన యజమానులకు భూములపై చట్టపరమైన రక్షణ కల్పించి వాటిని కౌలుకు ఇచ్చే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం వుందని పంగారియా చెప్పారు. ఈ మేరకు కేంద్రం ఒక నమూనా బిల్లును రూపొందించిందని దానిని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకొని చట్ట సవరణ చేయవచ్చని చెప్పారు. ఇది జరిగితే చిందరవందరగా వున్న కమతాలను కౌలుకు తీసుకొని పెద్దవిగా రూపొందించటం సులభం అవుతుందని తెలిపారు. దేశంలో2011-12 సమాచారాన్ని బట్టి భూమిపై 49శాతం కార్మికవర్గం ఆధారపడుతున్నదని, జిడిపిలో వ్యవసాయ వాటా 15శాతం మాత్రమే వుందని, వ్యవసాయ రంగం ఏటా ఐదు శాతం వృద్ధి చెందినా రాబోయే రోజులలో జిడిపి వాటా తగ్గనుందని కూడా ఆయన చెప్పారు.

     పంగారియా మాటలు, కౌలు రైతు నమూనా బిల్లును బట్టి రైతాంగం నుంచి ముఖ్యంగా చిన్న రైతాంగం నుంచి ఏదో ఒక రూపంలో భూములను విడిపించి ధనిక, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించటాన్ని వేగవంతం చేయాలన్నది నరేంద్రమోడీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఇది అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య కార్పొరేట్‌ సంస్ధలు, ద్రవ్య పెట్టుబడిదారుల వత్తిడి మేరకు వాటి ప్రతినిధులుగా వున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలు ఎప్పటి నుంచో సూచిస్తున్న విధానం. మన దేశంలో భూమి కోసం జరిగిన మహత్తర పోరాటాలు, ప్రాణత్యాగాల పూర్వరంగం, భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తే తప్ప పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందదన్న సాంప్రదాయ అవగాహన మేరకు ఒకవైపు భూస్వాములతో రాజీ పడుతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూసంస్కరణల చట్టాలను చేయకతప్పలేదు. ముందే చెప్పుకున్నట్లు భూస్వాములతో రాజీ కారణంగా ఆ చట్టాలను నీరు గార్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ వంటి పార్టీలు అసలు భూ సంస్కరణల గురించి మాట్లాడటానికే సిద్ధం కానందున ఆ చట్టాలను అమలు జరిపే ప్రసక్తే వుండదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా నయా వుదారవాద విధానాలు అమలులోకి వచ్చిన కారణంగా సిపిఎం వంటి కమ్యూనిస్టు, ఇతర వామపక్ష పార్టీలు తప్ప కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు భూముల నుంచి రైతాంగాన్ని తొలగించేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దారులు వెతుకుతున్నాయి. మన దేశంలోని సంక్లిష్ట పరిస్ధితులు, ముందే చెప్పుకున్నట్లు గ్రామీణ ప్రాంతాలలో భూ దాహం కారణంగా వారు అనుకున్నది వెంటనే సాధ్యం కావటం లేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్లు చిన్న,సన్నకారు రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి వారు భూములను వదులుకొనేట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెట్టటం మానివేశారు. ఎరువులు, డీజిల్‌ వంటి వాటికి ఇస్తున్న రాయితీలు,సబ్సిడీలను ఎత్తివేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తున్నారు. ధాన్య సేకరణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకొంటోంది. వాటి స్ధానంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తోంది.ఇవన్నీ భూముల నుంచి రైతాంగాన్ని తప్పించేందుకు, కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు చేస్తున్న ప్రయతాలు.

     అటువంటి యత్నాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీక్షించేందుకు ఈ నెల 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటాల దీక్షా దినం పాటించబడింది.ఈ సందర్బంగా అనేక దేశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్‌ 17న బ్రెజిల్‌లో భూమికోసం, భుక్తి కోసం శిరమెత్తిన రైతాంగంపై కార్పొరేట్లకు వత్తాసుగా రంగంలోకి దిగిన మిలిటరీ,పోలీసులు భూమిలేని పేదల వుద్యమ సంస్ధ(ఎంఎస్‌టి) సభ్యులు, మద్దతుదార్లపై జరిపిన కాల్పులలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో గాయపడ్డారు.ఈ హత్యాకాండ జరిగిన సమయంలోనే మెక్సికోలోని లాక్సాకాలాలో వివిధ దేశాల రైతు సంఘాల ప్రతినిధుల రెండవ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే అంతర్జాతీయ రైతుపోరాటాల దినం పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బ్రెజిల్‌లో హత్యాకాండకు పాల్పడిన వారికి ఇంత వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. ప్రతి ఏటా అప్పటి నుంచి ఆ రోజును రైతాంగ పోరాటాల దీక్షా దినంగా పాటిస్తున్నారు.

    ప్రపంచ పెట్టుబడిదారీ వర్గ లాభాల రేటును కాపాడేందుకు దాని ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ రూపొందించిన అజెండా, విధానాల మేరకుముందుకు తెచ్చిన సరికొత్త విధానాలకే ముద్దుగా సంస్కరణలు అని పేరు పెట్టారు. వాటినే నయా వుదారవాదం అని ప్రపంచీకరణ అని రకరకాలుగా పిలుస్తున్నారు. పేరులోనేమున్నది పెన్నిది అన్నట్లుగా ఏం చెప్పినా కార్పొరేట్ల లాభాల సంరక్షణే వీటి ప్రధాన లక్షణం, ధ్యేయం. తమ లాభాల కోసమే పెట్టుబడిదారీ వర్గం తమ పెరుగుదలకు అడ్డంగా వున్న ఫ్యూడల్‌ విధానాన్ని బద్దలు కొట్టింది. భూసంస్కరణలను ప్రోత్సహించింది. అదే పెట్టుబడిదారీ వర్గం బహుళజాతి గుత్త సంస్థలు(కార్పొరేట్‌లు)గా మారి ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేస్తున్నాయి. వాటి కన్ను ఇప్పుడు పరిశ్రమలు, వాణిజ్యంతో పాటు వ్యవసాయంపై పడింది.ఈ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేయటం ద్వారా దాని నుంచి కూడా లాభాలు పిండాలని చూస్తోంది. దానిలో భాగంగా రైతులను భూములనుంచి వెళ్లగొట్టి కార్పొరేట్‌ భూస్వాములను తయారు చేసేందుకు పూనుకుంది. ఈ ప్రయోగాలకు ముందుగా లాటిన్‌ అమెరికాను ఎంచుకుంది.

    గుండు సూది నుంచి వూరంత ఓడల నిర్మాణాల మొదలు, వాటిని విక్రయించే వాణిజ్య సంస్ధలుగానూ, వాటికి అవసరమైన ముడి సరకులు అందించే, వ్యవసాయానికి అవసరమైన విత్తనాల నుంచి, పురుగుమందులవరకు తయారీ, సరఫరా, చివరకు వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు చేసి వాటిని ఆహారంగా మార్చి విక్రయించటం వరకు కార్పొరేట్‌ కంపెనీలు వివిధ అవతారాలు ఎత్తుతున్నాయి. అందువలన వర్తమానంలో పోరాటాలు కూడా వివిధ తరగతుల కార్మికులు, రైతులు, వినియోగదారులు అందరూ ఐక్యంగా తమను ప్రభావితం చేస్తున్న కార్పొరేట్లకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో శత్రువు ప్రత్యక్షంగా కనపడే వాడు, ఇప్పుడు అలా కాదు. వ్యవసాయ రంగంలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో పాటు ద్రవ్య పెట్టుబడిదారులు కూడా ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో వుండి అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను, మదనపల్లిలోని టమోటా, కర్నూలు వుల్లిపాయల, నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌లను కూడా అదుపు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.ఈ సంక్లిష్ట,నూతన పరిస్ధితులను అర్ధం చేసుకోవటానికి, కార్యాచరణకు పూనుకోవటానికి నూతన పద్దతులు, రూపాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే నయావుదారవాద విధానాల ప్రయోగం మొదలయిందో అక్కడే వికటించి ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. అందుకనే నయావుదారవాద విధానాలకు వ్యతిరేేక వేదికగా లాటిన్‌ అమెరికా తయారైంది. వుద్యమాలు, వాటి రూపాలు అన్నింటిలోనూ నూతన విధానాలు, పద్దతులు వునికిలోకి వస్తున్నాయి. రాబోయే రోజులలో ఇంకా వస్తాయి.భూమి హక్కుతో పాటు ఆహార హక్కును కూడా కార్పొరేట్‌లు హరించేందుకు పూనుకున్నాయి. భూములను కబళిస్తున్న కార్పొరేట్‌ సంస్ధల బకాసురులకు వ్యతిరేకంగా నేడు భూ పోరాటం చేయటం అంటే ఒక్క రైతులే కాదు, సదరు కార్పొరేట్‌ కంపెనీ వలన ప్రభావితమయ్యే తరగతులందరూ కలిసి వస్తేనే అవి సంపూర్ణం అవుతాయి. అంటే రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి వుద్యోగులు, వినియోగదారులూ భాగస్వామలు కావాల్సి వుంది.

    గత కొద్ది దశాబ్దాలుగా అనుసరించిన స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్య విధానాలు సామాన్య రైతు వుత్పత్తి ఖర్చులకంటే తక్కువకు వ్యవసాయ వుత్పత్తుల ధరలను నెట్టి గిట్టుబాటు కాకుండా చేస్తున్నాయి.ఒకే రకమైన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎరువులు,పురుగు మందుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పర్యవసానంగా చిన్న రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. 1935లో అమెరికాలో 70లక్షల కమతాలు వుండగా నేడు 21లక్షలకు తగ్గిపోయాయి. రానున్న పది-ఇరవై సంవత్సరాలలో 40 కోట్ల ఎకరాల మేరకు చేతులు మారవచ్చని అంచనా. అమెరికాలో 30లక్షల మంది వ్యవసాయ కార్మికులు తక్కువ వేతనాలు, మానవ హక్కులకు నోచుకోకుండా గడుపుతున్నారు. అమెరికాలో మరొక ముఖ్యాంశాన్ని కూడా చూడాల్సి వుంది. మన దేశంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారి మాదిరే అమెరికాలో రెడ్‌ ఇండియన్లు, లాటినోలు, ఆసియన్‌ అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్ల వంటి వారందరూ కేవలం ఏడు శాతం భూమి కలిగి వుండగా తెల్లజాతీయులు 93శాతం భూమి కలిగి వున్నారు.

     భూ కేంద్రీకరణ ఒక్క అమెరికాలోనే కాదు ఐరోపాలోనూ జరుగుతోంది. అక్కడ వంద హెక్టార్లు, అంతకు పైబడినవి కోటీ 20లక్షల కమతాలున్నట్లు అంచనా. అవి మొత్తం కమతాలలో కేవలం మూడు శాతమే అయినా అక్కడి భూమిలో సగం వాటిలోనే వుంది. జర్మనీలో 1966-67లో 12,46,000 కమతాలుండగా 2010 నాటికి 2,99,100కు పడిపోయాయి. వీటిలో కూడా రెండు హెక్టార్లకు లోపు వున్నవి 1990లో 1,23,670 వుండగా 2007 నాటికి 20,110కి తగ్గాయి. యాభై హెక్టార్లు అంతకంటే ఎక్కువ వున్న కమతాలలోని భూమి 1990లో 92లక్షల హెక్టార్లు వుండగా 2007 నాటికి కోటీ 26లక్షల హెక్టార్లకు పెరిగింది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తూర్పు ఐరోపా దేశాలు ఐరోపా యూనియన్‌లో చేరినందున రైతాంగం దివాలా తీసింది. పశ్చిమ ధనిక దేశాల నుంచి భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ వుత్పత్తులు వరదలా తూర్పు దేశాలను ముంచెత్తాయి. దానికి తోడు ఐరోపా యూనియన్‌ అందచేసే సబ్సిడీలను పొందేందుకు చిన్న రైతులు అనర్హులు అన్న నిబంధన కారణంగా వారంతా గిట్టుబాటు గాక భూములను అమ్ముకున్నారు. ఈ పరిస్ధితిని స్పెక్యులేటర్లు, కార్పొరేట్‌ మదుపుదార్లు సొమ్ము చేసుకున్నారు.

    ఐరోపా వుమ్మడి వ్యవసాయ విధానం పేరుతో అందచేసిన సబ్సిడీలు పెద్ద రైతాంగమే దక్కించుకుంటోంది.ఇటలీలోని 0.29శాతం కమతాలు 2011లో అందచేసిన మొత్తం రాయితీలలో 18శాతం మొత్తాన్ని దక్కించుకున్నాయి. వాటిలో 0.000 శాతం(150 కమతాలు) అన్ని రకాల సబ్సిడీలలో ఆరుశాతాన్ని దక్కించుకున్నాయి. స్పెయిన్‌లో 75శాతం సబ్సిడీలను 16శాతం, హంగరీలో 72శాతం మొత్తాలను 8.6 శాతం పెద్ద కమతాల రైతులు దక్కించుకున్నారు. ఈ పరిణామాలను చూసిన తరువాత ప్రస్తుతం ప్రతి హెక్టారుకు ఇంత అనే పద్దతిలో సబ్సిడీలు ఇచ్చేందుకు నిబంధనలను సవరిస్తున్నారు. భూమి మాత్రమే కాదు కార్పొరేట్లు సముద్రాలను కూడా కబళిస్తున్నారు.చేపలు పట్టుకొనే హక్కును వేలం వేయటంతో బడా బ్యాంకులు, కార్పొరేట్లు రంగంలోకి దిగి చిన్నచిన్న మత్స్యకారులను వెనక్కు నెట్టివేస్తున్నాయి.

   లా వియా కంపేసినా (స్పానిష్‌) అంటే రైతు మార్గం పేరుతో 1993లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్ధ ప్రతి ఏటా ఏప్రిల్‌ 17న రైతాంగ పోరాటాలను సమీక్షిస్తున్నది. భూమికోసం, భూ రక్షణ పోరాటంలో భవిష్యత్‌లో మరొక ప్రాణం పోరాదన్నది దాని నినాదం. ప్రస్తుతం 73 దేశాలు, 164 జాతులకు చెందిన సంస్దలు , ఎన్‌జీవోలు ఈ వుద్యమంలో భాగస్వాములుగా వున్నాయి. ఏటేటా మరింతగా విస్తరించటంతో పాటు మరిన్ని పోరాటాలకు వేదికగా ఈ వుద్యమం మారుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More
Like Loading...

Fixation of Nutrient Based Subsidy (NBS) rates for Phosphatic and Potassic (P&K) fertilizers for the year 2016-17

23 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Fertilizers, Fertilizers subsidies, NBS subsidies

  The Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi has approved fixation of Nutrient Based Subsidy (NBS) rates for Phosphatic and Potassic (P&K) fertlizersfor the year 2016-17, due to decreasing trend in international prices of finished fertlizers and raw materials.  These are as follows:

Year Per Kg subsidy rates (in Rs.)
N P K S
2016-17 15.854 13.241 15.470 2.044

 

At the same level of consumption of P&K fertilizers (about 310.44 LMT) during 2016-17 as in 2015-16, the total subsidy implication on P&K fertilizers for 2016-17 at proposed rates works out to be about Rs.21,274 crore.

Government has been implementing Nutrient Based Subsidy (NBS) Policy for decontrolled P&K fertlizersw.e.f. 1stApril, 2010.  Under this Policy, the subsidy onPhosphatic and Potassic (P&K) fertilizers is announced by the Government of annual basis for each nutrient i.e., Nitrogen (N), Phosphorous (P), Potash (K) and Sulphur (S) on per kg basis which is converted into subsidy per tonne depending upon the nutrient content in each grade of the fertilizers.  These rates are determined taking into account the international and domestic prices of P&K fertilizers, exchange rate, inventory level in the country etc.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Fertilizer companies are required to print the MRP and available subsidy on each bag of P&K fertilizers.

16 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Fertilizer companies, Fertilizers, MRP, P&K, subsidy

 

The Minister of State for Chemicals & Fertilizers  Shri Hansraj Gangaram Ahir informed the Lok Sabha  today in reply to an Unstarred Question  that  the existing mechanism put in place to monitor the prices of P&K fertilizers is as under:-

i.                    Sale of fertilizers above the printed  price is punishable under the EC Act.

ii.                  (a) It has been made mandatory for the fertilizer companies to submit alongwith their subsidy claims, the cost data of their fertilizer products from 2012-13 onwards in prescribed format on six monthly basis . The Department has also appointed Cost Accountants/ Firms to scrutinize the said cost data to ensure that the prices fixed by the fertilizer companies are reasonable.

(b) It has also been stipulated in the provisions that in cases, where after scrutiny, unreasonableness of MRP is established or where there is no correlation between the cost of production or acquisition and the MRP printed on the bags, the subsidy would be restricted or denied even if the product is otherwise eligible for subsidy under NBS Scheme. In proven case of abuse of subsidy mechanism, the Department of Fertilizers, on the recommendation of Inter-Ministerial Committee may exclude any grade/grades of fertilizers of a particular company or the fertilizer company itself from the NBS Scheme. This punitive provision checks overpricing of Fertilizers.

                                                                                                                                          

Department of Fertilizers allocates sufficient /adequate quantities of fertilizers to States by issuing monthly supply plan and continuously monitors the availability of fertilizers. Details of availability of all chemicals fertilizers ( Urea, DAP, MOP & NPK) for the last three years 2013-14 to 2015-16 ( April, 2015 to February, 2016 ) are given below:-

 

 

( Figure in LMT)

Year Urea DAP MOP NPK
Availability Sales Availability Sales Availability Sales Availability Sales
2013-14 306.75 304.54 72.90 69.03 23.32 21.92 79.63 75.15
2014-15 310.42 308.73 77.80 75.57 30.72 27.79 90.57 85.98
2015-16  (April-15 to Feb.-16) 305.92 290.48 96.58 85.11 25.85 22.39 90.51 82.01

 

 

It can be seen from the above table that availability of all chemical fertilizers against sales is sufficient/adequate and there is no shortage of fertilizers.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విలాసాలకు మాల్యను విదేశాలకు ! సామాన్య రైతును పరలోకానికి !!

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

bankers, cbi, farmer, luxuries, nare, Narendra Modi, Narendra Modi Failures, non-payment of dues, vijay mallya

ఎం కోటేశ్వరరావు

   తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యను విలాసాలకోసం సగౌరవంగా విదేశాలకు పంపిన బ్యాంకర్లు, అధికారయంత్రాంగం సామాన్య రైతును మాత్రం పరలోకానికి పంపింది. తమిళనాడులోని ఒక రైతు లక్షా 30వేలు చెల్లించలేకపోయినందుకు పోలీసులు, రికవరీ ఏజంట్లు కలిసి చితకబాదటాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వుదంతం వెలుగులోకి వచ్చింది. అరయలూరు జిల్లాకు చెందిన బాలన్‌ ఒక ట్రాక్టరు కొనుగోలుకు రు.3.4లక్షల రుణం తీసుకున్న ఆ రైతు వడ్డీతో సహా రు.4.1లక్ష చెల్లించాడు. ఇంకా 1.3లక్షల బకాయి వుంది. పంటలు దెబ్బతిన్న కారణంగా దానిని చెల్లించలేకపోయాడు తప్ప పని గట్టుకొని ఎగవేసిన వ్యక్తి కాదు.బాలన్‌ను కొట్టిన దృశ్యాలు వీడియో చిత్రీకరించినట్లు కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.మాల్య మంచి వాడంటూ కొందరు రాజకీయ వేత్తలు బహిరంగంగా ప్రకటించారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నందుకు యావత్‌ జాతి నిజంగా సిగ్గు పడాల్సి వుంది.

   సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సిబిఐ) మన దేశంలో వున్నత దర్యాప్తు సంస్ధ. ప్రతిష్టతో పాటు అప్రతిష్టను కూడా సమపాళ్లలో మూట కట్టుకుంది. తాజాగా విజయ్‌ మాల్యా వుదంతంలో అది వ్యవహరించిన తీరుపై దానిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలని ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ చేసిన డిమాండ్‌పై మామూలు ప్రకారం మోడీ నోరు విప్పుతారని ఎవరూ అనుకోవటం లేదు నిజంగా నోరు విప్పితే అది మేకిండియా తొలి వుత్పత్తే అవుతుంది.

    విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన పది రోజుల తరువాత సిబిఐ తన అధికారి తప్పు చేసినట్లు చెప్పిందంటే యధా ప్రధాని తధా సిబిఐ అని చెప్పుకోవాల్సి వుంది. గతేడాది అక్టోబరులో తొలి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసినపుడు తమ అధికారి తప్పు చేశాడని ఇప్పుడు సిబిఐ చెప్పటం నష్ట నివారణ చర్యలలో భాగంగా కట్టుకధ అంటే తప్పేముంది? ఆ తప్పు చేసింది ఒక గుమస్తా కాదు, ఎస్‌పి స్ధాయి అధికారి.ఒక వేళ నిజంగా పొరపాటే అయి వుంటే వెంటనే గుర్తించి వుండాలి, అదే జరిగి వుంటే మాల్య పరారీ వార్తలు వచ్చిన మరుక్షణమే అది వాస్తవం కాదని ప్రకటించాలి అదేమీ జరగలేదే ? ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల్య తమకు అందుబాటులో వుండి సహకరించారని చెప్పిన సిబిఐ లుక్‌అవుట్‌ నోటీస్‌ ఎందుకు జారీ చేశారంటే ఇప్పుడే చెబుతోంది?

   ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయల చెల్లింపులో విఫలమైన మాల్య గురించి అది చేసిన ఫిర్యాదుతో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత అక్టోబరు పదిన జరిపిన సోదాల సందర్భంగా మాల్య ఆచూకీ తెలియలేదు. దాంతో ప్రశ్నించేందుకు అందుబాటులో వుంచేందుకు అతనిని పట్టుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు రాసినట్లు సిబిఐ చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారంట్‌ లేని వ్యక్తులను అడ్డగించటం కుదరదని ఆ విషయం తెలియక ఒక అధికారి నోటీసు జారీ చేశారని, తరువాత దానిని గుర్తించి మరుసటి నెలలో అతని గురించి తెలియచేస్తే చాలని మరోనోటీసు జారీ చేసినట్లు ఇప్పుడు చెబుతోంది. ఆ విధంగా చూసినపుడు మాల్య లండన్‌ వెళ్లటం గురించి తమకు తెలుసునని , వెళ్లటంలో తప్పులేదని వెంటనే సిబిఐ ఎందుకు చెప్పలేకపోయింది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈనెల 18వ తేదీన హాజరు కావాలని జారీ చేసిన నోటీసుపై ఇంతవరకు మాల్య స్పందన వెల్లడి కాలేదు. ఇదిలా వుండగా మాల్య కర్ణాటక బిడ్డ అని అనేక విమాన సంస్ధలు నష్టాలపాలైనట్లే అనేక కింగ్‌ ఫిషర్‌ కూడా నష్టపోయిందని అలాంటి వారిని అనేక మందిని వదలి కేవలం మాల్యనే ఎందుకు వెంటాడుతున్నారని నిద్రలేచిన మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం నాడు ప్రశ్నించారు. బ్యాంకులకు చెల్లించటంలో విఫలమైన వారు 60 మంది వరకు వున్నారని, మాల్య రాజ్యసభ సభ్యుడు గనుకనే ఇలా చేస్తున్నారని గౌడ ఆరోపించారు. మాల్య పెద్దమనిషి అని ఆయన భారత్‌కు తిరిగి వస్తారని జమ్మూ-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సినీదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ ద్వారా మాల్యాకు ఒక సలహా ఇచ్చారు. మాల్య వెంట తిరిగే బికినీ భామలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాంకుకు పంపి రుణం తీర్చుకోవచ్చన్నారు. అయితే బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించవేమోగాని బ్యాంకర్లు సిద్దపడతారని పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

India Going Slow on Future Liberalisation Commitments Under WTO

09 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Agreement on Agriculture, Agriculture, Doha Development Agenda, Liberalisation, Nairobi MinisterialConference, The Uruguay Round WTO, WTO

The outcomes in the area of agriculture in the Nairobi MinisterialConference are results of the demands of developing countries including India. Among these, the Decision on Public Stockholding for Food Security Purposes and a Special Safeguard Mechanism for the developing countries acknowledge the special requirements of the developing countries to protect the livelihood and food security of their farmers. India was at the forefront of negotiating these outcomes in Nairobi. In trade negotiations, including multilateral trade negotiations in the World Trade Organization (WTO), India has always taken a consistent stand to protect the interest of the country and its farmers.

The mandate of the Doha round of trade negotiations in the WTO envisaged the reductions of, with a view to phasing out, all forms of export subsidies. The Uruguay Round WTO Agreement on Agriculture (AOA) permits use of export subsidies to the Members that used them during the base year 1986-88. Mostly developed countries like the US, EU, Norway, Australia, Canada, New Zealand, Switzerland, Liechtenstein and some developing countries like Brazil, Columbia etc. are entitled to provide export subsidies as per Agreement on Agriculture (AoA). India could use only a special and differential provision of AoA that allows developing countries to use subsidies aimed at reducing the cost of marketing including internal and external transport as well as handling and processing costs provided that these are not applied in a manner that would circumvent export subsidy reduction commitments. As per the Ministerial Decision adopted in Nairobi, developed countries will immediately remove export subsidies, except for a few agriculture products, and developing countries will do so by 2018, with a longer time-frame in some limited cases. Developing countries will retain the flexibility of covering marketing and transport costs for agriculture exports until the end of 2023, while the poorest and food-importing developing countries will enjoy additional time to cut export subsidies. This Decision ensures that countries will not resort to trade-distorting export subsidies.

India remains committed to the Doha Development Agenda, which has development at its core. If it is concluded as per its mandate, it will result in better integration of developing countries in the global trading system.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Assessment of Demand and Supply of Agricultural Produces

04 Friday Mar 2016

Posted by raomk in Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

agricultural crops, Agricultural Produces

The Working Group on Crop Husbandry Demand and Supply Projections, Agricultural Inputs and Agricultural Statistics constituted as a part of the formulation of the Twelfth Five Year Plan (2012-17) projected demand and supply for different agricultural crops till 2016-17.

The Working Group estimated demand and supply on the basis of various approaches of supply and demand projection methods. The detailed demand projections and actual production in recent years is given in table below. The relevant information on various aspects, such as prices, production, supply etc., of agricultural commodities is extensively disseminated to farmers through agricultural extension  services,  Kisan  Call Centres, farmers   portal   and  m-Kisan   portal   under National e-Governance Plan in Agriculture (NeGP-A) to help in their farming/cropping decision which are profitable to them.

Government has taken a number of initiatives to improve quality of statistical inputs used for demand and supply projections through improved survey methodology on Household Consumer Expenditure Surveys of National Sample Survey Office as well as use of modern techniques/ technologies such as remote-sensing, etc., in Crop Cutting Experiments for assessment of yield/production, besides thorough scrutiny of data on production reported by State Governments.

Projected Demand and Supply of Food Commodities during 12th Plan

(Million Tonnes)

Crop/Group of Crops Projected Demand Projected Supply  

Actual Production

 

Terminal Year 12th Plan

2016-17

Terminal Year 12th Plan 2016-17  

2011-12

 

 

2012-13

 

 

2013-14

 

2014-15

 

 

2015-16*

 Rice 110 98-106 105.30 105.24 106.65 105.48 103.61
Wheat 89 93-104 94.88 93.51 95.85 86.53 93.82
Coarse Cereals  

36

 

42-48

 

42.01

 

40.04

 

43.29

 

42.86

 

38.40

Total

Cereals

 

235

 

240-251

 

242.20

 

238.79

 

235.79

 

234.87

 

235.83

Pulses 22 18-21 17.09 18.34 19.25 17.15 17.33
Foodgrains 257 258-272 259.29 257.13 265.04 252.02 253.16
Oilseeds 59 33-41 29.80 30.94 32.74 27.51 26.34
Sugarcane 279 365-411 361.04 341.2 352.14 362.33 346.38
Vegetables 161 NA 156.33 162.19 162.90 169.48 168.51**
Fruits 97 NA 76.42 81.29 88.97 86.60 89.02**

 

*2nd Advance Estimates

** 1st Estimates

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎలాగూ నోరు విప్పరు, భక్తులైనా చెప్పాలి

04 Friday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

agrarian policy, Fertilizers, Fertilizers subcidies, kisan budget, MSP, Narendra Modi, NDA, urea

నేతి బీరలో నెయ్యి -మోడీ రైతు బడ్జెట్‌

మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌  2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది.

ఎం కోటేశ్వరరావు

       సుప్రసిద్ద లాయర్‌ అయిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అందమైన పదాలతో ఈనెల ఒకటిన ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ గురించి కల్పించిన భ్రమలు లేదా ప్రచారంతో నిజంగానే రైతులు తమ ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఆశపడుతున్నారు. తాను రావటమంటేనే రైతులకు మంచి దినాలు వచ్చినట్లని నరేంద్రమోడీ రెండు సంవత్సరాల క్రితం తెలిపారు. పాపం ఈ విషయం తెలియక లేదా చెడుదినాలు దాపురించి గాని స్వయంగా బిజెపి పాలనలోని మహారాష్ట్రలోనే మోడీ గద్దె నెక్కిన తరువాత 1130 మంది రైతులు బలవన్మరణం చెందారు. అదే రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీ గోపాల్‌ షెట్టి రైతులు ఆత్మ హత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని సెలవిచ్చారు. అది తమ పాలన అని కూడా మర్చిపోయారు పాపం. ఆత్మహత్యలు కొనసాగుతుండటంతో మహారాష్ట్రలోని 28 మంది మంత్రులు ఒకే రోజు పర్యటన జరిపి అసలేం జరుగుతోందో తెలుసుకొమ్మని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ఆదేశించారు.ఇదంతా మోడీ రైతు బడ్జెట్‌ ప్రకటించిన తరువాతే సుమా !

    మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌ 2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన సూటూ బూటూ నలగ కుండా అలాంటి వారి మధ్యనే విదేశాలు, స్వదేశంలో తిరిగే ప్రధాని నరేంద్రమోడీ ఈ మధ్య కాలంలో తొలిసారిగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. త్వరలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నాయి కదా అని ఎవరైనా అంటే వారి గోడు ఎవరు వినిపించుకుంటారు చెప్పండి. ప్రతివారికీ ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ద్వారా తాము చెప్పదలచుకున్నదానిని గోబెల్స్‌ మాదిరి పదే పదే చెప్పటం తప్ప ఎదుటివారి విమర్శలను విననట్లు ప్రవర్తించటం మోడీ గారికి బాగా అబ్బింది. అందుకే మన్‌కీ బాత్‌ పేరుతో నెల నెలా జన్‌కీ బాత్‌తో పని లేకుండా తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు.

    బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు ఒడిషా, కర్ణాటకలోలో బిజెపి నిర్వహించిన రైతుల సభలో ప్రధాని ఒక విషయం చెప్పారు. అది కొందరికి స్వంత డబ్బాలాగా అనిపించవచ్చు, మరి కొందరికి ‘అబ్బ ఎంతబాగా చెప్పిండు’ అన్న పరవశం కూడా కలిగించవచ్చు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందంటూ చేసిన ఆరోపణల సందర్బంగా తన ప్రభుత్వం యూరియా దుర్వినియోగం కాకుండా దానికి వేపపూత పూస్తున్నందుకు అక్రమార్కులకు మంటగా వుందని, వారు తనను వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పారు.

   యూరియా మన దేశం నుంచి పక్కనే వున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు దొంగ రవాణా అవుతోందని చాలా కాలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంటుంది కనుక దాన్ని అరికట్టటానికి మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్రంపై ఎక్కువగా వుంటుంది. ఒక్క యూరియా మాత్రమే ఎందుకు దుర్వినియోగం అవుతోంది, మిగతా ఎరువులు ఎందుకు తరలి పోవటం లేదు? దీని గురించి కూడా ప్రధాని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.

     అసలు విషయం ఏమంటే మన ప్రధాని నరేంద్రమోడీ (ప్రధానిగా) పుట్టక ముందే వేప పూత యూరియా తయారు చేస్తున్నారు. యూరియా నుంచి విడుదలయ్యే నైట్రోజన్‌ సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే దానికి వేప పూత అవసరమని, అలాంటి యూరియా వలన దిగుబడులు పెరిగాయని కనుకొన్న మన శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు గత దశాబ్ది కాలంగా దాని వినియోగం, తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2011-12లో 3.62 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు(ఎంఎంటి)గా వున్న వేప పూత యూరియా అమ్మకాలు 2013-14లో 6.34 ఎంఎంటికి పెరిగాయి. గత ప్రభుత్వమే వేప పూత యూరియా తయారీపై వున్న కొన్ని అంక్షలను తొలగించి సబ్సిడీ యూరియాను నూటికి నూరుశాతం వేప పూతతో తయారు చేయాలని స్వదేశీ వుత్పత్తిదారులను ఆదేశించింది. ఇతరంగా కూడా కనీసం 75శాతం వేప పూత యూరియా తయారు చేయాలని ఆదేశించింది.మోడీ అధికారానికి వచ్చిన 2014లో మన దేశంలో టన్ను యూరియా ధర 86.76 డాలర్లు వుండగా పాకిస్ధాన్‌లో 260.19, బంగ్లాదేశ్‌లో206.74, చైనాలో 264.82 డాలర్లుగా వుంది. అందువలన దొంగరవాణాను వేపపూత అడ్డుకుంటుందని చెబితే పిచ్చి బియ్యం పెడతానని బెదిరించే చిన్ననాటి అమ్మమ్మ కబుర్లు తప్ప మరొకటి కాదు.

     ఎరువుల ధరల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో డిఎపి ధర 2011 అగస్టు నెలలో 603 డాలర్లు వుండగా 2016 జనవరిలో 385 డాలర్లకు తగ్గింది. అదే మన దేశంలో 2010-11లో సగటున టన్ను ధర రు.10,750 వుండగా ఈ ఏడాది జనవరిలో 26 వేల రూపాయలు వుంది. ఇదే విధంగా ఎంఓపి ఇతర ధరల నియంత్రణ నుంచి తొలగించిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా ధరలో పెద్ద మార్పులేదు. మిగతా దేశాలలో కూడా యూరియాఏతర ఎరువుల ధరలు పెరిగిన కారణంగా దొంగరవాణా లేదు. దీని అర్ధం ఈ కారణంగా మన దేశంలో యూరియా ధర పెంచమని కాదు, పెంచాలన్నా వీలు కాని స్ధితి అన్నది వేరే కధ.

      1997-98 వరకు డిఎపి, ఎంఓపి వంటి ఎరువుల ధరలు యూరియా కంటే కొంచెం తక్కువగానో ఎక్కువగానో వుండేవి. అందువలన రైతులు శాస్త్రవేత్తలు చెప్పినట్లు తగు పాళ్లలో వాటిని వినియోగించారు. తరువాత సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు నూట్రియంట్‌ ప్రాతిపదిక విధానాన్ని ఎప్పుడైతే అమలులోకి తెచ్చారో ఇతర ఎరువుల ధరలు యూరియా కంటే ఐదు రెట్ల వరకు పెరిగి అందుబాటులో లేకుండా పోయాయి.మన పాలకుల అసమర్ధత కారణంగా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్‌లో డిఏపి, ఎంఓపి ధరలు తగ్గినా మన రైతాంగానికి పెద్దగా తగ్గలేదు.మరోవైపున సబ్సిడీ రద్దయింది.దీంతో రైతులు యూరియాను ఎక్కువగా వినియోగించటంతో రైతులకు నష్టదాయకమైన అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందువలన కాంప్లెక్స్‌ ఇతర ఎరువుల ధరలను యూరియా స్ధాయికి తగ్గిస్తేనే రైతాంగానికి అచ్చే దిన్‌ వచ్చినట్లు లేకుంటే పొలాల సారం దెబ్బతిని మరింతగా చచ్చే దినాలు వస్తాయి. గతేడాది ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ నిమిత్తం 72,447 కోట్లను ప్రకటించింది. ఎంత ఇచ్చిందీ తెలియదు. ఈ ఏడాది 70వేల కోట్లని పేర్కొన్నది. ఈ మొత్తంలో 51వేల కోట్ల రూపాయలు కేవలం యూరియాకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిన్నింటికి కలిపి కేవలం 19వేల కోట్లే. ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని రైతుల వారీ లెక్కవేస్తే సాగు భూమి 14 కోట్ల హెక్టార్లుగా వున్నందున సగటున ఎకరానికి రెండువేల రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేసి ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని మోడీ సర్కార్‌ ఆలోచిస్తున్నది. ఇదే జరిగితే యూరియా ధరకు కూడా రెక్కలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. దీని వలన కౌలు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. వారికి ఈ మాత్రం కూడా దక్కే అవకాశం లేదు. పది ఎకరాలు మించి పెద్ద రైతులకు సబ్సిడీ లేదన్నా లేదా తగ్గించి ఇస్తామన్నా వారి పొలాలను సాగు చేసే అరక్షిత కౌలుదార్లు అదనంగా ఖర్చు చేయాల్సిందే. నరేంద్రమోడీ ఈ విధానాలను సవరిస్తారా లేదా అనేదాన్ని బట్టి రైతుల సంక్షేమం వుంటుంది.అలాంటి సూచనేమీ బడ్జెట్‌లో లేదా ఆర్ధిక సర్వేలో లేదు కాబట్టి గత కాంగ్రెస్‌ బూట్లతోనే నడిచేందుకు పూనుకున్నారని అన్న వారిని దేశద్రోహులు అంటే కుదరదు.

     రైతుల నేటి దుస్ధితికి గత పాలకుల విధానాలే కారణమని బిజెపి విమర్శించింది. దానిలో ఎలాంటి తప్పు లేదు. 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలు లేదా నయా వుదారవాద విధానాలు దీనికి నూటికి నూరు పాళ్లు కారణం, ఈ కాలంలో వాటిని గతంలో ఐదు సంవత్సరాలు అమలు జరిపిన బిజెపి ఎన్‌డిఏ ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వక తప్పదు. ఇప్పుడు సమస్య ఏమంటే ఆ విధానాలను మార్చ కుండా మోడీ రైతాంగానికి మంచి దినాలను ఎలా తీసుకు వస్తారు? గుజరాత్‌ మోడల్‌ అన్నారు. దాని ప్రకారం పెట్టుబడులైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు , మద్దతు ధరలు ఎక్కువ ఇచ్చారా ? లేదు దేశ వ్యాప్తంగా ఒకే ధరలు. మొదటి బడ్జెట్‌లో విధానపరమైన అంశాలేమీ పేర్కొన లేదు. రెండు, మూడవ బడ్జెట్లలో కూడా వాటి ప్రస్తావనే లేదు. గత పాలకుల విధానాలు మార్చకుండా రైతాంగానికి రెట్టింపు ఆదాయం ఎలా కల్పిస్తారు? మంత్రదండం ఏమైనా వుందా ?

      మన వ్యవసాయ రంగం కుదేలవటానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారకులు ఎవరు? మహారాష్ట్ర బిజెపి ఎంపీ చెప్పిన ప్రకారమైతే ఆత్మహత్య కూడా ఒక ఫ్యాషన్‌గా మారింది.అంటే తమ ఆత్మహత్యలకు తామే కారకులు. పాలకుల విధానాలు ఎలా దెబ్బతీస్తున్నాయో ఎరువుల గురించి చెప్పుకున్నాము. ప్రకృతి వైపరీత్యాలైన అతి వృష్టి,అనా వృష్టి అందుకు తోడ్పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే వుప్పు సముద్రం పాలవుతున్న గోదావరి జీవ జలాలతో లక్షలాది బీడు భూములు పచ్చపచ్చగా మారతాయని, విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతాయని ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు. రైతు బడ్జెట్‌ అని అనేక మంది కీర్తిస్తున్న ఆ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గంగ శుద్ధికి రెండున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించిన పోలవరానికి కేటాయించిన మొత్తం వంద కోట్ల రూపాయలు. ఈలెక్కన కేటాయింపులు జరిపితే అది పూర్తి కావటానికి మరో 50-60 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.అయినా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తలుపు చెక్కతో కాకపోయినా తమలపాకుతో కూడా అంటించి గట్టిగా మాట్లాడటానికి సాహసించటం లేదు. విరోధంతో కంటే స్నేహంతో సాధించుకోవాలని కబుర్లు చెబుతున్నారు. విరోధం తెచ్చుకోమని, తొడగొట్టమని ఎవరు చెప్పారు. కనీస నిరసన తెలపటం బాధ్యత కాదా? గుడ్డి కన్ను మూస్తే ఏమిటి తెరిస్తే ఏమిటి అన్నట్లుగా స్నేహంగా వుండి, కొంత మందికి కేంద్ర మంత్రి వర్గంలో వుద్యోగాలిప్పించి సాధించింది ఏముంది ? గంగ శుద్ధికి నిధులు ఇవ్వవద్దని చెప్పటం లేదు. అది ఈనాటి సమస్య కాదు, అంత తేలిక కూడా కాదని హైదరాబాదులో మూసీ, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి పధకాలు వెల్లడించాయి. ముందు గంగను కలుషితం చేస్తున్న వారిని అదుపు చేసిన చర్యలున్నాయా ? జనానికి అవసరమైన ఆహారాన్ని పండించే ప్రాజెక్టులకా మొదటి ప్రాధాన్యత లేక మరొకదానికా ?

      వ్యవసాయరంగ పునరుద్దరణ అంటే ఖాయిలా పడినదానిని తిరిగి పనిచేయించటానికి వివిధ పధకాలకు 35,984 కోట్ల కేటాయింపుతో పాటు పన్నులు వేసే అన్ని సేవలపై 0.5శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ వసూలు ద్వారా సమకూరే మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేస్తారు. అంటే జనంపై అదనపు భారాలు మోపుతారు. జనంలో రైతులు కూడా వుంటారు కనుక కొత్త పెన్షన్‌ పధకం ప్రకారం వుద్యోగులు, కార్మికులు తమ పెన్షన్‌కు తామే నిధులు సమకూర్చుకున్నట్లుగా రైతులు కూడా తమ కల్యాణానికి తాము కూడా తమ వంతు నిధులు సమకూర్చుకోవాలి. నూతన పంటల బీమా పధకం గురించి రైతాంగంలో ఎన్నో ఆశలు కల్పించారు.అది అమలులోకి వచ్చిన తరువాత గానీ అసలు విషయం అర్ధం కాదు. ఈ పధకం అమలుకు కేంద్రం-రాష్ట్రాలు చెరి సగం నిధులు భరించాలి. ఏడాదికి 17,600 మేరకు అవసరమౌతాయని అంచనా వేశారు. కానీ బడ్జెట్‌లో రు.5500 కోట్లు మాత్రమే ప్రకటించారు. అంటే ఈ ఏడాది పూర్తిగా అమలు జరగదని అనుకోవాలి.

   మరో ముఖ్య సమస్య కనీస మద్దతు ధరలు. అవి వున్నా రైతాంగానికి పెద్ద వుపయోగం లేకుండా పోతోంది. ఒక్క యూరియా తప్ప మిగతా పెట్టుబడులన్నీ విపరీతంగా పెరిగి పోయాయి. వాటితో పోలిస్తే మద్దతు ధరలు ఏ మూలకు చాలవు. వాటిపై తమ విధానమేమిటో ఇంత వరకు వెల్లడించలేదు.మిగతా అంశాలకు సంబంధించి రైతాంగానికి భారాలు తగ్గించే లేదా ఆదాయాలు పెంచే నిర్దిష్ట పధకాలు, విధానాలేవీ బడ్జెట్‌లో లేవు.ఫలానా సమస్యపై మాది ఫలానా విధానం అంటే దాని గురించి ఒక అభిప్రాయమో అభినందనో చెప్పవచ్చు. అదేమీ లేదు. వాటి గురించి కారణ జన్ముడిగా భావిస్తున్న నరేంద్రమోడీ నోరు విప్పరని తేలిపోయింది. కనీసం ఆయన శిష్య పరమాణువులు లేదా భక్తులైనా చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Wastage of Agro-Products

03 Thursday Mar 2016

Posted by raomk in Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Agriculture, Agro-Products, Farmers, Wastage, Wastage of Agro-Products

A study conducted by Central Institute of Post-Harvest Engineering and Technology (CIPHET), Ludhiana has estimated that annual value of harvest and post-harvest losses of major agricultural produces at national level was of the order of Rs. 92,651 crore based on production data of 2012-13 at 2014 wholesale prices.

The Ministry of Food Processing Industries is implementing a Central Sector Scheme, namely the Scheme for Infrastructure Development for Food Processing having components of Mega Food Parks, Integrated Cold Chain, Value Addition and Preservation Infrastructure and Modernization of Abattoirs.

Under the Scheme, 135 Integrated Cold Chain Projects have been sanctioned by the Ministry with the cold chain capacity of 4.75 Lakh MT of Cold Storage/Controlled Atmosphere/Modified Atmosphere storage, Deep Freezer, 114.75 MT/Hour of Individual Quick Freezer(IQF), 120.05 Lakh Litres Per Day of Milk Storage/Processing and 787 number of Reefer vehicles.

The Government is also providing various incentives to promote creation of cold chain infrastructure to reduce loss of agricultural produce. The details of such incentives are as follows:

 Services of pre-conditioning, pre-cooling, ripening, waxing, retail packing, labeling of fruits and vegetables have been exempted from Service Tax in Budget 2015-16.

  • Loans to food & agro-based processing units and Cold Chain have been classified under Agriculture activities for Priority Sector Lending (PSL) as per the revised RBI Guidelines issued on 23/04/2015.
  • Under Section 35-AD of the Income tax Act 1961, deduction to the extent of 150% is allowed for expenditure incurred on investment for (i) setting up and operating a cold chain facility; and (ii) setting up and operating warehousing facility for storage of agricultural produce.
  • Government has extended Project Imports benefits to cold storage, cold room (including for farm level pre-cooling) or industrial projects for preservation, storage or processing of agricultural, apiary, horticultural, dairy, poultry, aquatic and marine produce and meat. Consequently, all goods related to Food Processing, imported as part of the project, irrespective of their tariff classification, would be entitled to uniform assessment at concessional basic customs duty of 5%.
  • Refrigeration machineries and parts used for installation of  cold storage, cold room or refrigerated vehicle, for the preservation, storage, transport or processing of agricultural, apiary, horticultural, dairy, poultry, aquatic and marine produce and meat under Tariff Head: Chapter 84 are exempted from Excise Duty.
  • Construction, erection, commissioning or installation of original works pertaining to post-harvest storage infrastructure for agricultural produce including cold storages for such purposes are exempted from Service tax.
  • Capital investment in the creation of modern storage capacity has been made eligible for Viability Gap Funding scheme of the Finance Ministry. Cold chain and post-harvest storage has been recognized as an infrastructure sub-sector.

So far, 3.12 Lakh Metric Tonne of Cold Storage/Controlled Atmosphere/Deep Freezer, 77 Metric Tonne/Hour of Individual Quick Freezer(IQF), 95 Lakh Litres Per Day of Milk Storage/Processing and 456 Number of Reefer Vehicles have been created under the Scheme of Cold Chain, Value Addition and Preservation Infrastructure.

Under the Scheme of Cold Chain, Value Addition and Preservation Infrastructure of the Ministry of Food Processing Industries stand alone cold storages are not assisted. The financial assistance is provided for creating an integrated cold chain having components of cold storage, minimal processing and reefer vehicles etc.

National Center for Cold Chain Development (NCCD) under Department of Agriculture, Co-operation & Farmers Welfare has conducted a study “All India Cold Chain Infrastructure Capacity (Assessment of Status & Gap)”. As per the study the Cold Chain requirement in the country stands as follows:

 

Type of Infrastructure Infrastructure Requirement (A) Infrastructure Created (B) All India Gap

(A-B)

Cold Storage* 35.10 million tons 31.82 million tons 3.28 million tons
Pack-house 70,080 nos. 249 nos. 69,831 nos.
Reefer Vehicles 61,826 nos. 9,000 nos. 52,826 nos.
Ripening Chambers 9,131 nos. 812 nos.   8,319 nos.

 

*Gap may be 8.25 million tones considering the operational capacity of 26.85 million tones.

The study has not covered perishable produce like milk and other milk products like cheese, yogurt, paneer, marine products, fish and meat etc. However, ice cream is included under the frozen category. Only fruits and vegetables currently consumed and capable of being handled in cold chain have been considered.

Ministry of Agriculture and Farmers Welfare has accepted the Report and it has been circulated to State Governments for reference and future development of Cold-chain.

To accelerate the availability of cold storage and to improve the efficiency of Cold Chain Management a Task Force under the Chairmanship of Secretary, Ministry of Food Processing Industries was set up by the Prime Minister’s Office in 2014 with a view to re-visiting the strategies, financial incentives to all cold storage/ cold chain related schemes and recommend institutional mechanism for enhancing capacity of cold chain in the country. The Task Force has, inter alia, recommended that the Government should aim at creating an additional capacity of 7.5 million tonnes over the next five years with fund allocation of Rs. 6,100 crore. Out of this, 5 million tonnes may be created together by National Horticulture Mission and National Horticulture Board (2.5 million tonnes each) under Mission for Integrated Development of Horticulture Scheme of Department of Agriculture, Cooperation and Farmers Welfare and 2.5 million tonnes under the scheme of the Ministry of Food Processing Industries. The Government has accepted the report.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d