• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2022

శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు మాల్దీవులకు పరారీ, అత్యవసర పరిస్థితి ప్రకటన !

13 Wednesday Jul 2022

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ 1 Comment

Tags

President Gotabaya Rajapaksa flees, Ranil Wickremesinghe, Sri Lanka Crisis


ఎం కోటేశ్వరరావు


బుధవారం నాడు పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన శ్రీ లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు పారిపోయినట్లు వార్తలు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని విక్రమ సింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశాడు. సోమవారం రాత్రి దుబాయి పారిపోయేందుకు చేసిన యత్నాన్ని ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది విఫలం చేశారని కొన్ని వార్తలు రాగా, అమెరికా వీసా నిరాకరించిందని మరికొన్ని వార్తలు. దాంతో సముద్ర మార్గం ద్వారా దేశం విడిచి పోవాలని చూశాడు. చివరకు మిలిటరీలో తనకు అనుకూలురైన వారి సహకారంతో దేశం వదలి వెళ్లాడు. గొటబయ పరారీకి మన దేశం సహకరించిందన్న వార్తలను విదేశాంగశాఖ ఖండించింది. అతగాడి ఆచూకీ గురించి చెప్పేందుకు మాల్దీవుల సర్కార్‌ కూడా తిరస్కరించింది. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లవచ్చని వార్తలు వచ్చాయి.


రాజీనామా డిమాండ్‌ చేసిన పౌరుల ఆందోళన కారణంగా శుక్రవారం రాత్రి అధ్యక్ష నివాసం నుంచి ఒక సైనిక నౌకా కేంద్రానికి గొటబయ వెళ్లాడు. అక్కడి నుంచి కటునాయకే సైనిక వైమానిక కేంద్రానికి తరలించారు. తదుపరి రెండు మిలిటరీ హెలికాప్టర్లలో గొటబయ పరివారం సోమవారం నాడు కొలంబో విమానాశ్రయానికి వెళ్లింది. ఎందుకు అన్నది అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా దుబాయి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ప్రముఖులు ఉండే గదికి వెళ్లి గొటబయ పాస్‌పోర్టుపై ముద్రవేసేందుకు తిరస్కరించారని, తాను పౌరులు ప్రయాణించే విమానాలు ఎక్కనంటూ గొటబయ తిరస్కరించినట్లు, తరువాత మధ్య ప్రాచ్యానికి నాలుగు విమానాలు గొటబయ లేకుండానే వెళ్లినట్లు వార్తలు. లంక అధ్యక్ష పదవిలో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు అక్కడి నిబంధనలు అంగీకరించవు. దీన్ని అవకాశంగా తీసుకొని పారిపోయే ఎత్తుగడతోనే బుధవారం నాడు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ముందస్తు తేదీ వేసిన రాజీనామా లేఖను ముందుగానే అందచేశారని చెబుతున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.


విదేశీ రుణం 51బిలియన్‌ డాలర్లకు గాను జూన్‌లో చెల్లించాల్సిన 8.6బి.డాలర్ల కిస్తీ చెల్లింపులో లంక సర్కార్‌ విఫలమైంది. ఐఎంఎఫ్‌, ఇతర సంస్థలు, దేశాలతో కొత్త రుణాల కోసం చేస్తున్న సంప్రదింపులు ఇంకా కొలిక్కి రాలేదు. ” సార్థక ప్రజాస్వామిక పాలన ”ను ప్రోత్సహించే పేరుతో ”అంతర్జాతీయ అభివృద్ధికోసం పని చేసే అమెరికా సంస్థ( యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. గొటబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గంముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగపరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్ధిక లబ్ది లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30నాటికి పదిరోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పుగా ముడిచమురు, గాస్‌ ఇప్పించాలంటూ కతార్‌కు గొటబయ సర్కార్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. కతార్‌ను మంచి చేసుకొనేందుకు లంకలో పనిచేస్తున్న కతార్‌ ఛారిటీ అనే కతార్‌ ప్రభుత్వ సంస్థ మీద నిషేధాన్ని వెనక్కు తీసుకుంది.2019లో జరిగిన ఉగ్రవాద చర్యలకు ముస్లింలే కారణమని, వారికి కతార్‌ ఛారిటీ నిధులు అందచేసిందని ప్రభుత్వం విమర్శించింది. సదరు సంస్థ నిధులను ప్రభుత్వం స్థంభింపచేసింది. అంతే కాదు కరోనా కారణంగా మరణించిన ముస్లింల శవాలను ఖననం చేస్తే భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని గొటబయ సర్కార్‌ నిషేధం విధించింది.


శ్రీలంక ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ కతార్‌ సర్కార్‌ కరుణించలేదు. ఐఎంఎఫ్‌తో చేసుకొనే ఒప్పందాన్ని బట్టి తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్‌ ప్రభుత్వం కూడా సాయానికి సిద్దం అంటూనే తమ సంగతి కూడా తేల్చాలని మెలికపెట్టింది. తాము చమురు సరఫరాకు అవసరమైన 360 కోట్ల డాలర్లకు గాను దానికి చెల్లించే వడ్డీ బదులు చమురు తవ్వకాలకు గాను లంకలో కొంత ప్రాంతాన్ని తమ అప్పగించాలని షరతు పెట్టగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. నెలకు 30 కోట్ల డాలర్ల చొప్పున 12నెలల్లో రుణం ఇస్తామని, దాన్ని ఐదు సంవత్సరాల విరామం తరువాత పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలని ఒమన్‌ ప్రతిపాదించింది. దీని సంగతి కూడా తేలిస్తే తాము చమురు కొనుగోలుకు రుణం ఇస్తామని లంకలో ఒమన్‌ రాయబారి స్పష్టం చేశారు. ఇవేవీ తేలకుండానే గొటబయ పరారీ, ఇతర పరిణామాలు సంభవించాయి.


శ్రీలంక పరిణామాలకు కుటుంబ పాలనే కారణమనే సూత్రీకరణలు, సంక్షేమ పధకాల అమలు వల్లనే సంక్షోభం తలెత్తిందనే రాగాలూ వినిపిస్తున్నాయి.అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ నిజానికి లంక సమస్య తప్పుడు విధానాల వలన తలెత్తింది. దీనికి కరోనా, ఇతర కారణాలు కూడా తోడయ్యాయి.దేశ జిడిపిలో పన్నెండుశాతం సమకూర్చే టూరిజం 2019లో జరిగిన ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్నది. దీనికి కరోనా తోడైంది. విదేశాల్లో పనిచేసే శ్రీలంక వాసులు పంపే మొత్తాలు జిడిపిలో 8-10శాతం ఉండేవి. కరోనాతో అవి కూడా నిలిచిపోయాయి. 2019లో అధికారానికి వచ్చిన గొటబయ ప్రకటించిన పన్నుల రాయితీ కారణంగా పన్ను చెల్లించే ధనికుల సంఖ్య 15 నుంచి నాలుగు లక్షలకు తగ్గింది. వాట్‌ను 15 నుంచి 8శాతానికి తగ్గించాడు, మరో ఏడు పన్నులను రద్దు చేశాడు. వాటిలో ఒకటి దేశ పునర్‌నిర్మాణానికి కార్పొరేట్ల నుంచి వసూలు చేస్తున్న రెండు శాతం పన్ను. 2018లో టూరిజం ద్వారా 440 కోట్ల డాలర్లు రాగా 2021నాటికి 40 కోట్లకు పడిపోయింది. రసాయన ఎరువుల దిగుమతులు నిలిపివేసిన కారణంగా పంటలు దెబ్బతిని ఆహార కొరత ఏర్పడింది. ప్రపంచంలో తలెత్తిన సంక్షోభం కారణంగా వివిధ ప్రాజక్టుల మీద ఆశించిన రాబడి కూడా రాలేదు. ఇలా విధానపరమైన తప్పిదాలు,బయటి కారణాలు లంకను దెబ్బతీశాయి.


శ్రీలంక సంక్షోభానికి మూలం చైనా ఇచ్చిన అప్పులు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అనేక దేశాలు గతంలో లంక మాదిరే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికీ చైనా రుణాలు ఇవ్వలేదు.1990 దశకంలో ఆసియా టైగర్‌గా పేరు తెచ్చుకున్న ఇండోనేషియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి తిరిగి కోలుకున్నది.1960దశకం నుంచి ఇప్పటి వరకు 147 దేశాలు రుణ చెల్లింపుల్లో విఫలం చెందినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక సమాచారం పేర్కొన్నది. కంపెనీలు బాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేనట్లుగానే ప్రభుత్వాలు కూడా అప్పులు చేసి సకాలంలో కిస్తీ చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. చరిత్రలో 1557లో తొలిసారిగా స్పెయిన్‌ దివాలా ప్రకటించింది. తరువాత పద్దెనిమి, పందొమ్మిదవ శతాబ్దాలలో 15సార్లు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయింది.వర్తమానంలో లాటిన్‌ అమెరికా దేశమైన అర్జెంటీనా 2001లో 132 బిలియన్‌ డాలర్లు, తరువాత 2016, 2020లో కూడా రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది. సోవియట్‌ విచ్చిన్నం తరువాత 1998లో రష్యాకూ అదే పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్‌ 1998,2020లో, ఈక్వెడార్‌ 2008,2020లో, మెక్సికో 1982,1995లో, జమైకా 2010లో శ్రీలంక పరిస్థితినే ఎదుర్కొన్నాయి.


1960,70 దశకాల్లో అనేక లాటిన్‌ అమెరికా దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి పారిశ్రామికీకరణ కోసం రుణాలు తీసుకున్నాయి. చమురు ఎగుమతి చేసే దేశాలలో ఒకటైన మెక్సికో 1970 దశకంలో భవిష్యత్‌లో వచ్చే చమురు ఆదాయాన్ని చూపి ప్రైవేటు బాంకుల నుంచి రుణాలు తీసుకుంది.1973లో చమురు ధరలు పతనం కావటంతో ఇబ్బందుల్లో పడింది. కొద్ది సంవత్సరాల క్రితం వెనెజులా కూడా చమురు ధరల పతనం, అమెరికా ఆంక్షలకారణంగా సకాలంలో రుణాలు చెల్లించలేకపోయింది.1975-83 కాలంలో వాణిజ్యబాంకుల నుంచి లాటిన్‌ అమెరికా దేశాలు తీసుకున్న రుణాలు ఏటా 20శాతం పైగా పెరిగాయి. రుణ మొత్తం 75 నుంచి 315 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది ఆ ప్రాంత జిడిపిలో 50శాతం. ఇదే కాలంలో వడ్డీ రేట్లు కూడా పెరగటంతో వడ్డీ, అసలు చెల్లింపు ఏటా 12 నుంచి 66 బి.డాలర్లకు చేరింది. ఈ దేశాలేవీ చైనా నుంచి రుణాలు తీసుకోలేదు. మన కరెన్సీ విలువ పతనం కారణంగా విదేశాలకు చెల్లించాల్సిన డాలర్ల కొనుగోలు ధర పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది.తాజా సమాచారం ప్రకారం మన దేశానికి ఉన్న 621బిలియన్‌ డాలర్ల విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణాల మొత్తం 267 డాలర్లు ఉంది, రానున్న తొమ్మిది మాసాల్లో దీన్ని తీర్చాల్సి ఉంది. రూపాయి విలువ పతనం కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణాల మీద వత్తిడి పెరుగుతుంది. దీని కోసం కొత్త రుణాలు తీసుకోవాలి లేదా ఆస్తులను తెగనమ్మి చెల్లించాలి. డాలరు విలువ, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్న కారణంగా కొత్త రుణాలు మరింత భారంగా మారతాయి. రుణదాతలు కఠినమైన షరతులు విధిస్తారు. ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచబాంకు జోక్యాలను అంగీకరించాలని, వాటి షరతులను అమలు జరపాలని డిమాండ్‌ చేస్తాయి. ఆ సంస్థలు రుణాలు తీసుకున్న దేశాలు తమ మార్కెట్లను మరింతగా తెరవాలని, సంక్షేమ పధకాలకు కోత పెట్టాలని, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలగా చట్టాల సవరణ వంటి అనేక అంశాలను రుద్దుతాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు ఎక్కువ భాగం ధనికదేశాలవే వుంటాయి గనుక వాటి ప్రయోజనాలను ముందుకు తెస్తాయి. శ్రీలంకకు మన దేశం చేస్తున్న సాయాన్ని చూపి అదానీ కంపెనీ విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి తెచ్చినట్లు వచ్చిన వార్తల గురించి తెలిసిందే.


శ్రీలంక విషయానికి వస్తే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకోవాలని గొటబయ సర్కార్‌ నిర్ణయించి ఏప్రిల్‌ నుంచే సంప్రదింపులు ప్రారంభించింది.ఐబిఎఫ్‌డి( ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఫిస్కల్‌ డాక్యుమెంటేషన్‌-నెదర్లాండ్స్‌) సంస్థ మే 31న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లంక సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించింది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా వాట్‌ను ఎనిమిది నుంచి పన్నెండు శాతానికి పెంచింది.వాట్‌ చెల్లించాల్సిస సంస్థల నమోదుకు లావాదేవీల ప్రారంభాన్ని 30 నుంచి 12 కోట్లకు తగ్గించారు.కార్పొరేట్‌ పన్ను 24 నుంచి 30శాతానికి పెంచింది. 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశీయ కంపెనీలు విదేశీ వ్యక్తులకు చెల్లించే డివిడెండ్స్‌ను ఆదాయపన్ను పరిధిలోకి తెచ్చారు. టాక్స్‌ హాలిడేలను, పన్ను రాయితీలను కొన్ని రంగాలకు మినహాయించారు. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు రాయితీ మొత్తాన్ని రు. 30 లక్షల నుంచి 18లక్షలకు తగ్గించారు. ఆదాయపన్ను విధింపు రు. 30 నుంచి గాక పన్నెండు లక్షల నుంచే ప్రారంభిస్తారు. ఇలాంటివే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఇవన్నీ ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థలను ప్రసన్నం చేసుకొనేందుకే. గతంలో గొటబయ సర్కార్‌ కార్పొరేట్లకు అప్పనంగా రాయితీలు ఇచ్చిందని, పన్ను చెల్లించగలిగిన వారికి మినహాయింపులిచ్చి ఖజానాను గుల్లచేసిందనే విమర్శలు ఉన్నాయి.పైన పేర్కొన్న అంశాలు గతంలో చేసిన వాటిని కొన్నింటిని సవరించినట్లు కనిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా సామాన్యజనంపై భారాలు మోపే వాట్‌ పెంపుదల వంటివి కూడా ఉన్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం చూసినపుడు ఐఎంఎఫ్‌ షరతుల వలన కార్మికుల నిజవేతనాలు పడిపోవటం, భారాలు పెరగటం వంటి పరిణామాలను, వాటికి ప్రతిఘటన పోరాటాలను చూశాము. లంకకు ఐఎంఎఫ్‌ విధించే షరతులు పూర్తిగా వెల్లడైన తరువాత వాటి ప్రభావం గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలకుల అస్తవ్యస్త విధానాల మీద జనం చేసిన తిరుగుబాటు రేపు భారాలకు వ్యతిరేకంగా కూడా పునరావృతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెయ్యి చైనా కంపెనీల రాక జుమ్లా – 2,783 భారత కంపెనీల పోక నిజం !

11 Monday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Chinese companies, Chinese investment, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి వెయ్యి కంపెనీలు మన దేశానికి వస్తున్నట్లు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఇంకే ముంది చైనాలో ఫ్యాక్టరీలన్నీ ఖాళీ అవుతున్నాయన్నట్లుగా వాటిని చూసి అనేక మంది కొండంత రాగాలు తీశారు. తాజాగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది.దానిలో జెపి మోర్గాన్‌ కంపెనీ ప్రతినిధులతో మన దేశానికి ఉన్న ఎగుమతుల అవకాశాల గురించి చెప్పించారు. చైనా ప్రస్తుతం తక్కువ నైపుణ్యంతో ఉత్పత్తి చేసే దుస్తులు, పాదరక్షలు, తోలు వస్తువులు, ఫర్నీచర్‌ వంటి ఎగుమతుల నుంచి వైదొలుగుతున్నదని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు భారత్‌కు అవకాశం వచ్చింది కనుక వినియోగించుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. దాని కొనసాగింపుగా రాష్ట్రాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పెద్దలు చెప్పారు. పూర్వకాలంలో రాజుల దగ్గర ఉండే కొందరు వారి మనసెరిగి దానికి అనుగుణంగా కబుర్లు చెప్పేవారు. ప్రస్తుతం రెండింజన్ల సర్కార్లున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు మేకిన్‌ ఇండియా ఎగుమతుల బదులు బుల్డోజర్ల మీద కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎగుమతులకు అవకాశం లేదు గనుక ఇప్పుడైనా వాటిని పక్కన పెడతారేమో, పనికి వచ్చే పనులు చేస్తారేమో చూద్దాం. ఇంతకూ చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలేమైనట్లు ? జనాలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు గనుక ఎప్పటికప్పుడు కొత్త కతలు చెబుదాం మిత్రోం !


తాజాగా వచ్చిన వార్తల ప్రకారం చైనా కంపెనీలు కొన్ని అమెరికా సరిహద్దుల్లో ఉన్న మెక్సికోకు తరలేందుకు చూస్తున్నట్లు, అక్కడ వేతనాలు తక్కువ, పన్ను రాయితీలు ఎక్కువ, సరకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నది సారాంశం. దాన్ని వేరే విధంగా చూస్తే చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు తగ్గుతున్నాయి. చైనాలో పెట్టిన కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాయి. ఎందుకని ? అమెరికా మాజీ నేత నోటి దూల ట్రంప్‌ అధికారంలో ఉండగా 2018లో చైనా మీద ప్రారంభించిన వాణిజ్యం యుద్ధం నుంచి ఎలా వెనక్కు తగ్గాలా అని ప్రస్తుత నేత జో బైడెన్‌ చూస్తున్నాడు. చైనా నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్ను పెంచి వారిని దెబ్బతీస్తానని ట్రంప్‌ కలలు గన్నాడు. అవే పన్నులు అమెరికన్ల మీద భారాలు మోపాయి. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు అక్కడ తలెత్తిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను నివారించాలంటే చైనా వస్తువుల మీద పన్ను తగ్గించటం మినహా మరొక మార్గం లేదని బైడెన్‌కు అర్ధమైంది.

ఈ పూర్వరంగంలోనే చైనాలో ఉన్న కొన్ని కంపెనీల ఆలోచనల గురించి ఎటి కియర్నీ అనే కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. చైనా నుంచి కంపెనీలను మెక్సికో, కెనడా లేదా మధ్య అమెరికా దేశాలకు తరలిస్తే లాభదాయకమని గతేడాది 78శాతం మంది అమెరికన్‌ కంపెనీల అధికారులు భావిస్తే ఈ ఏడాది మార్చి నెలలో 92శాతానికి పెరిగారట.పదహేడు శాతం మంది ఇప్పటికే మెక్సికో వెళ్లినట్లు చెప్పారు. 2018లో అమెరికా-కెనడా-మెక్సికో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఫర్నీచర్‌ తయారీదారులు స్థానికంగా దొరికే వాటి నుంచి 50శాతం ముడివస్తువులను ఉపయోగిస్తేనే మెక్సికో పన్ను రాయితీలు వర్తిస్తాయి.దీన్ని అమలు జరపటం కష్టం కనుక ఏం జరుగుతుందో చెప్పలేం. జో బైడెన్‌ దిగుమతి పన్ను ఎత్తివేస్తే చైనాలోనే కొన్ని కానసాగవచ్చు, కొన్ని మెక్సికోకు తరలవచ్చు తప్ప మన దేశం వైపు వచ్చే అవకాశం లేదు. లాభసాటిగా ఉంటే అమెరికన్లతో పాటు కొన్ని చైనా కంపెనీలు కూడా మెక్సికోలో కొత్తగా పరిశ్రమలు పెట్టవచ్చు. అలా పెట్టకూడదనే ఆంక్షలను చైనా ప్రభుత్వం విధించలేదు.మెక్సికోకు చైనా కంపెనీలు తరలే అవకాశం గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా కొందరు చెబుతున్నారు. ఎవరిష్టం వారిది ఎవరి లాభం వారిది గనుక వారికే వదిలేద్దాం !


చైనా మార్కెట్లో ప్రవేశించేందుకు విదేశాల నుంచి అనేక మంది అక్కడకు వెళ్లి కంపెనీలు పెట్టటం, తరువాత ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడకు పోవటం నిరంతరం జరుగుతున్నదే.దుస్తుల ఉత్పత్తి బంగ్లాదేశ్‌, వియత్నాంలో లాభసాటిగా ఉంటుందని దశాబ్దక్రితమే అనేక మంది తరలి వెళ్లారు. మొత్తం మీద చూసినపుడు అనేక మంది భావిస్తున్నట్లు లేదా కొందరు కోరుకుంటున్నట్లుగా పొలోమంటూ చైనా నుంచి వలసలు లేవు. విదేశీ పెట్టుబడుల పెరుగుదల రేటు తగ్గటం, పెరగటం తప్ప పూర్తిగా ఆగిపోలేదు. కనీస వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది చైనా గ్వాంగఝౌ దుస్తుల పరిశ్రమలో కనీసవేతనం 313 డాలర్లుంటే, ఇండోనేషియాలో 243, కంపూచియాలో 190,మయన్మార్‌లో 157, బంగ్లాదేశ్‌లో 95 డాలర్లుందని జర్మనీ స్టాటిస్టా సంస్థ పేర్కొన్నది. ఇతర దేశాల్లో లేని సంక్షేమ పధకాలు చైనాలో అదనం అన్నది తెలిసిందే. చైనా ప్రస్తుతం అధిక విలువ గలిగిన ఉత్పత్తుల తయారీ మీద కేంద్రీకరించినందున గిట్టుబాటుగాని తక్కువ విలువగల వస్తు తయారీ సంస్థలు రాకపోవచ్చు, ఉన్నవి వెళ్లిపోవచ్చు.


కరోనా, ఇతర పరిణామాల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాటికి తోడు రాజకీయాలు ఉండనే ఉన్నాయి. దానిలో భాగంగా చైనా మీద ఆధారపడటం తగ్గించాలని అనేక మంది చెబుతున్నారు. నిజానికి ఆధారపడాలని ఎవరూ వత్తిడి తేలేదు. అమెరికా ముందుకు తెచ్చిన ఇండో పసిఫిక్‌ ఆర్ధిక చట్రం(ఐపిఇఎఫ్‌) మీద ఎక్కువగా ఆధారపడాలని కొందరు సూచిస్తున్నారు. ఎవరూ మనకు సరకులు ఉచితంగా ఇవ్వనపుడు ఎక్కడ తక్కువ ధరలు ఉంటే అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఎవరు మన వస్తువులను కొంటే వారికే అమ్ముతాం. మబ్బులను చూసి చేతిలో ఉన్న ముంత నీళ్లు పారపోసుకున్నట్లుగా పరిస్థితి మారకుండా చూసుకోవాలి.చైనాకు మన ఎగుమతులు దెబ్బతినకూడదు. చెరువు మీద అలిగే వారు కొందరు చైనా వస్తువుల కొనుగోలు నిలిపివేసి, వారికి వస్తువులు ఎగుమతి ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తారని పగటి కలలు కనేవారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. రాత్రంతా సత్రాలు, మఠాల్లో గంజాయి దమ్ము లేదా బార్లలో మందుకొట్టి అది చేయాలి, ఇది చేయాలి అని వాగి తెల్లవారి మత్తుదిగిన తరువాత ఎవరిదారిన వారు పోవటం తెలిసిందే.


పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా కాకుండా వస్తూత్పతికి చైనాను అనుకరించాల్సిన అవసరం లేదని, గత కొద్ది సంవత్సరాలుగా అది పని చేయలేదని అందువలన సేవారంగం మీద కేంద్రీకరించాలని రఘురామ్‌ రాజన్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పెట్టుబడుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం కనిపించటం లేదు. 2014 నుంచి 2021 నవంబరు వరకు వివిధ కారణాలతో మన దేశం నుంచి 2,783 విదేశీ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయి.2021 నవంబరు 30 నాటికి దేశంలో 12,458 విదేశీ కంపెనీలు చురుకుగా పని చేస్తున్నట్లు కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పినట్లు 2021 డిసెంబరు ఎనిమిదవ తేదీన ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. మన దేశంలోని జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ను చైనా సంస్ధ అనుబంధ ఎంజి మోటార్‌ ఇండియా 2017లో కొనుగోలు చేసింది. ఇటీవల మహారాష్ట్రలోని తాలేగాంలోని ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్‌ కంపెనీ ముందుకు రాగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటంతో లావాదేవీ ఆగింది. ” గుజరాత్‌ను ఆదర్శంగా చూపుతూ చైనా పెట్టుబడులను కోరిన మోడీ ” అనే శీర్షికతో 2011నవంబరు తొమ్మిదిన తన బీజింగ్‌ ప్రతినిధి పంపిన వార్తను హిందూ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ససేమిరా చైనా పెట్టుబడులను అంగీకరించేది లేదంటున్నారు. పదేండ్లలో ఎంత మార్పు ! పెట్టుబడులు వద్దుగానీ మనకు చైనా కరెన్సీ యువాన్లు కావలసి వచ్చాయి.


రష్యా నుంచి దిగుమతులు చేసుకొని మన చమురు సంస్థలు ఎంతో లబ్ది పొందుతున్నాయి.పశ్చిమ దేశాల ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేము. ఈ లోగా రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే మన దేశ సంస్థలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మన దేశంలో సిమెంటు తయారీలో పెద్ద కంపెనీ ఆల్ట్రాటెక్‌. అది చైనా కరెన్సీ యువాన్లు చెల్లించి రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గు దిగుమతి చేసుకొంటోంది. ఇది మన కస్టమ్స్‌ పత్రాల్లో నమోదైన సమాచారమని రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ 29న తెలిపింది.ఈ లావాదేవీల విలువ 17,26,52,900 యువాన్లు లేదా 2.581 కోట్ల డాలర్లు. రష్యా – మన దేశం మధ్య రూపాయి-రూబుల్‌ లావాదేవీల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మన కరెన్సీ విలువ పడిపోతున్నందున అది ఏ మేరకు ఖరారు అవుతుందో చెప్పలేము. ఈ లోగా చైనా కరెన్సీతో చెల్లింపులు జరిపే అవకాశాన్ని మన కార్పొరేట్‌ సంస్థలు కనుగొన్నాయి.దీనితో వచ్చే సమస్యల గురించి, తదుపరి కూడా కొనసాగుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పటం లేదు. మన దేశంలోని బాంకులు చైనా, హాంకాంగ్‌, సింగపూర్లలో ఉన్న బ్రాంచీల ద్వారా డాలర్లతో యువాన్‌లు కొనుగోలు చేసి రష్యాకు చెల్లిస్తారు. లేదా చైనా బాంకుల నుంచి మన బాంకులు యువాన్‌ల రుణాలు తీసుకుంటాయి. దీన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటి వరకు అడ్డుకున్నట్లు వార్తలు లేవు. వచ్చే రోజుల్లో ఈ లావాదేవీలు ఇంకా పెరుగుతాయా, మన ఆర్ధిక రంగం మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పటికైతే చెప్పగలిగింది లేదు.


చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు బారులు తీరాయంటే అక్కడ చౌకగా వస్తు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుకు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఉన్న స్థానిక మార్కెట్లో అమ్ముకొనేందుకు అని గ్రహించాలి. ప్రపంచ కంపెనీలు 2020లో చైనా నుంచి 900 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు చేయగా 1.4లక్షల కోట్ల డాలర్ల మేర స్థానికంగా విక్రయించారంటే దాని ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చని కియర్‌నీ గ్రేటర్‌ చైనా సంస్థ చైర్మన్‌ హి షియావోక్వింగ్‌ అన్నాడు. 2015 నాటికి చైనాలో విదేశీ పెట్టుబడులతో పని చేసే వివిధ కంపెనీల 8,36,595 ఉన్నట్లు, 2020 చివరి నాటికి అవి 10,40,480కి పెరిగినట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. అందువలన కొన్ని వేల కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్లినా అదేమీ పెద్ద పరిణామం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్రీలంక – అధ్యక్షుడు గొటబయ పరారీ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా !

09 Saturday Jul 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

PM Ranil Wickremesinghe resigns, President Gotabaya Rajapaksa flees, Sri Lanka Crisis


ఎం కోటేశ్వరరావు


ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో శనివారం నాడు (2022 జూలై 9) జరిగిన అనూహ్య పరిణామాల్లో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారిక నివాసం నుంచి పారిపోయినట్లు వార్తలు రాగా, ప్రధాని రనిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు వార్తలు. ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ గొటబయ రాజీనామా కోరుతూ శనివారం నాడు ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన పూర్వరంగంలో రాజధాని కొలంబో, ఇతర అనేక ప్రాంతాలలో పోలీసులు శుక్రవారం రాత్రి కర్ఫ్యూ విధించటాన్ని అనేక మంది వ్యతిరేకించటంతో శనివారం ఉదయం సడలించారు. పోలీసు ఆంక్షలను ఖాతరు చేయకుండా వేలాది మంది గొటబయ నివాసంలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టిన గొటబయ శుక్రవారం రాత్రే ఒక సైనిక కేంద్రానికి వెళ్లి తలదాచుకున్నట్లు చెబుతున్నారు. ఇది రాసిన సమయానికి ఎక్కడ ఉన్నదీ నిర్దారణ కాలేదు, రాజీనామా బాటలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కొద్ది వారాల క్రితం గొటబయ సోదరుడు, ప్రధానిగా ఉన్న మహింద రాజపక్స నివాసం ఎదుట నిరసన ప్రదర్శనల కారణంగా రాజీనామా చేసి ట్రింకోమలీలోని మిలిటరీ నౌకా కేంద్రంలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.


అసాధారణమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో మార్చి 15 నుంచి ప్రారంభమైన ప్రజల ఆందోళన తీవ్రతరం అవుతున్నది. గొటబయ కుటుంబపాలన, అనుసరించిన విధానాలు దేశాన్ని అన్ని విధాలుగా అస్తవ్యస్తం గావించాయి. ప్రజల నిరసనలు ప్రారంభమైన తరువాత వేగంగా మారిన అనేక పరిణామాల్లో ప్రభుత్వం ఐఎంఎఫ్‌కు, అమెరికాకు మరింత దగ్గరైంది. గతంలో అప్పులిచ్చి, కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న చైనా చేతుల్లోకి లంక వెళ్లిందని ఊరూవాడా టాంటాం వేసిన మీడియా మారుతున్న పరిణామాల గురించి మౌనం దాల్చింది. అంతేకాదు ముస్లిం విద్వేషాన్ని విపరీతంగా రెచ్చగొట్టిన లంక పాలకులు ఇప్పుడు చమురు కోసం అరబ్బు దేశాలకు దగ్గర అవుతున్నారు. వారి షరతులకు సలాం అంటున్నారు. ” సార్థక ప్రజాస్వామిక పాలన ”ను ప్రోత్సహించే పేరుతో ”అంతర్జాతీయ అభివృద్ధికోసం పని చేసే అమెరికా సంస్థ( యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. జూన్‌ చివరిలో ప్రధాని రానిల్‌ విక్రమ సింఘే ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఇందుకు గాను 5.7 కోట్ల డాలర్లను గ్రాంటుగా అమెరికా ఇవ్వనుంది, 2026వరకు ఈ పధకం కొనసాగుతుంది. గతంలో 2011లో మహింద రాజపక్సే ప్రభుత్వం కూడా ఇదే సంస్థ నుంచి రెండు పధకాలను అమలు జరిపిందని విక్రమ సింఘే గుర్తు చేశాడు.


2019లో శిరిసేన-విక్రమ సింఘే ప్రభుత్వం అమెరికాకు చెందిన మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌(ఎంసిసి) నుంచి 48 కోట్ల డాలర్లు గ్రాంటుగా తీసుకొనేందుకు ముందుకు రాగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గొటబయ సోదరులు వ్యతిరేకించారు. ఈ మొత్తంతో కొలంబో నగరంలో ట్రాఫిక్‌, బస్‌ సర్వీసులు, దేశంలో కొన్ని రోడ్లను మెరుగుపరిచేందుకు పూనుకుంటామని అప్పుడు చెప్పారు. ఈ గ్రాంటు తీసుకుంటే దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగులుతుందని, ఈ పేరుతో ఎంసిసి ప్రాజెక్టులకు అనేక పన్ను రాయితీలు ఇచ్చే ప్రమాదకరమైన షరతు దాగుందుని ప్రతిపక్షం పేర్కొన్నది. తరువాత అధికారానికి వచ్చిన గొటబయ సర్కార్‌ ఎంసిసితో ఒప్పందంపై సంతకాలను జాప్యం చేసింది. 2021 నవంబరులో సంతకాలు చేసేది లేదని చెప్పగా ఆ పధకాన్ని రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆ సొమ్ము గనుక తీసుకొని ఉంటే ఇప్పుడు వచ్చిన విదేశీమారకద్రవ్య సంక్షోభాన్ని కొంత మేరకు అధిగమించి ఉండేవారమని అమెరికా మద్దతుదారులు చెబుతున్నారు.


తాజాగా గొటబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గంముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగపరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్ధిక లబ్ది లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. మన దేశం చేసిన నగదు, వస్తు సహాయానికి గాను ప్రతిఫలంగా అదానీ కంపెనీకి ఒక విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించే విధంగా స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు వచ్చిన అంశం తెలిసినదే. ఇక అమెరికా షరతులకు సంబంధించి వచ్చిన వార్తల ప్రకారం ఐఎంఎఫ్‌ షరతులను లంక సర్కార్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌లను తెరవెనుక నుంచి నడిపించే ధనికదేశాల్లో అమెరికాది నాయకత్వ స్థానం అన్నది తెలిసిందే. సంస్కరణల పేరుతో వాటి పెత్తనాన్ని రుద్దటం అనేక దేశాల్లో చూస్తున్నాము. లంకలో కూడా అదే జరగనుంది. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30నాటికి పదిరోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో జూన్‌ నాటికి పన్నెండు నెలల్లో ద్రవ్యోల్బణం 54.6శాతానికి, ఆహార వస్తువుల ధరలు 80.1శాతం పెరిగాయి. చమురును సరఫరా చేయాలంటే తమకు ముందుగానే డబ్బు చెల్లించాలని లేదా శ్రీలంకేతర దేశాల బాంకుల నుంచి హామీ ఇప్పించాలని అమ్మకందారులు అంటున్నారు.


చమురును ఏదో విధంగా సంపాదించాలనే వత్తిడి కారణంగా గతంలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టినదాన్ని దిగమింగి అప్పుగా ముడిచమురు, గాస్‌ ఇప్పించాలంటూ కతార్‌కు గొటబయ సర్కార్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. కతార్‌ను మంచి చేసుకొనేందుకు లంకలో పనిచేస్తున్న కతార్‌ ఛారిటీ అనే కతార్‌ ప్రభుత్వ సంస్థ మీద నిషేధాన్ని వెనక్కు తీసుకుంది.2019లో జరిగిన ఉగ్రవాద చర్యలకు ముస్లింలే కారణమని, వారికి కతార్‌ ఛారిటీ నిధులు అందచేసిందని ప్రభుత్వం విమర్శించింది. సదరు సంస్థ నిధులను ప్రభుత్వం స్థంభింపచేసింది. అంతే కాదు కరోనా కారణంగా మరణించిన ముస్లింల శవాలను ఖననం చేస్తే భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని గొటబయ సర్కార్‌ నిషేధం విధించింది.


శ్రీలంక ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ కతార్‌ సర్కార్‌ కరుణించలేదు. ఐఎంఎఫ్‌తో చేసుకొనే ఒప్పందాన్ని బట్టి తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్‌ ప్రభుత్వం కూడా సాయానికి సిద్దం అంటూనే తమ సంగతి కూడా తేల్చాలని మెలికపెట్టింది. తాము చమురు సరఫరాకు అవసరమైన 360 కోట్ల డాలర్లు ఇస్తామని, దానికి గాను చెల్లించే వడ్డీ బదులు చమురు తవ్వకాలకు గాను లంకలో కొంత ప్రాంతాన్ని తమ అప్పగించాలని షరతు పెట్టగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. నెలకు 30 కోట్ల డాలర్ల చొప్పున 12నెలల్లో రుణం ఇస్తామని, దాన్ని ఐదు సంవత్సరాల విరామం తరువాత పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలని ఒమన్‌ ప్రతిపాదించింది. దీని సంగతి కూడా తేలిస్తే తాము చమురు కొనుగోలుకు రుణం ఇస్తామని లంకలో ఒమన్‌ రాయబారి స్పష్టం చేశారు.ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవటమా లేదా అన్నది లంక సర్కార్‌ ఇష్టమని దాని కంటే ముందు ఇప్పటికే రుణాలు ఇచ్చిన దేశాలు, సంస్థల రుణాల చెల్లింపుల పునర్వ్వస్థీకరణ సంగతేమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. తమ రుణాల చెల్లింపుల గడువులో ఎలాంటి మార్పుకు అంగీకరించేది లేదని చైనా చెబుతున్నట్లు వార్తలు. ఐఎంఎఫ్‌, అమెరికా ప్రభావంలోకి లంక వెళ్లిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది సహజంగానే చైనా లేదా మరొక దేశానికి అనుమానాలు తలెత్తుతాయి.మన దేశం రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు కొనుగోలు చేసి శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇబ్బందుల నుంచి ఆదుకొనేందుకు నాలుగు వందల కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. అందువలన భారత్‌ కూడా అప్పు తీర్చమని గట్టిగా అడుగుతుందా లేక వాయిదా వేయాలంటే అదానీ, అంబానీల వంటి వారికి దొడ్డిదారిన మరికొన్ని ప్రాజెక్టులను అప్పగించాలని డిమాండ్‌ చేస్తుందా అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వంటగాస్‌ ధరల పెంపు, గాలి వాటు పన్ను – సామాన్యులకు సబ్సిడీల కోత, ధరల మోత !

08 Friday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, LPG Price in India, Narendra Modi Failures, windfall tax


ఎం కోటేశ్వరరావు


ధరలు ఎంత పెంచినా జనం ఆమోదిస్తున్నారు, ఎక్కడా నిరసన తెలపటం లేదు. విశ్లేషకులు, జర్నలిస్టులకు ఎందుకు ? ఇదీ ఇటీవల బిజెపి నేతలు వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఎదురుదాడి. శ్రీలంక పరిణామాలు ఇక్కడా పునరావృతం అయ్యేంతవరకు అలానే మాట్లాడతారు అది వేరే అనుకోండి. 2022 జూలై మొదటి వారంలో సాధారణ వంటగాస్‌ ధరను మరో రు.50 పెంచారు. దీంతో హైదరాబాదులో రు.1,105కు చేరింది. అంతకు ముందు ఎంత పెంచినా జనాలు కిక్కురు మన లేదు, ఇప్పుడూ అంతే. పార్టీల పిలుపుల్లో కారకర్తలు తప్ప ఇతర జనాలు కనిపించరు. మంచం ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకొని నిద్రించటం అలవాటైన వారం కదా ! సర్దుకు పోవటంలో మన తరువాతే ఎవరైనా ! కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా జనానికి లేనిది ఎవరికైనా ఎందుకు మరి ! అయినా సరే కొన్ని అంశాలను చెప్పక తప్పదు. ఆసక్తి ఉన్న వారు చదవండి మరి !


జూలైలోనే ప్రభుత్వం విండ్‌ ఫాల్‌ టాక్సు పేరుతో చమురు సంస్థల మీద పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మామూలుగా విధించే పన్నుకు అదనం, తాత్కాలికం. దాని వలన కేంద్ర ప్రభుత్వానికి లక్ష నుంచి లక్షా 30వేల కోట్ల వరకు వస్తుందని కొందరు చెబుతుండగా ఇంకా ఎక్కువ ఉండవచ్చని కొన్ని అంచనాలు. సరే ఎంతైనా అది సెస్‌ గనుక వాటిలో రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అమ్మకపు పన్ను, జిఎస్‌టి, మరొక పన్ను గురించో విన్నాం గానీ విండ్‌ఫాల్‌ టాక్సు గురించి పెద్దగా తెలియదు. దీనికి తెలుగులో సరైన పదాన్ని నిఘంటువులేవీ చూపటం లేదు. గాలి వాటు (ఆదాయంపై ) పన్ను అందాం. ఒక కంపెనీకి దాని ప్రమేయం లేకుండా ఆర్ధికంగా పెద్ద మొత్తంలో లాభాలు, లబ్ది పొందటాన్ని విండ్‌ ఫాల్‌ అంటున్నారు. నదులకు భారీగా వరదలు వచ్చినపుడు లంకల్లో ఉన్న పొలాలకు సారవంతమైన ఒండ్రు మట్టి చేరి పంటలు బాగా పండుతాయి. కొత్తగా కొన్ని లంకలు ఏర్పడి భూమిగా అందుబాటులోకి కూడా రావచ్చు. దీనికి రైతుల ప్రమేయం లేదా ప్రయత్నాలుగానీ ఉండవు. అలాగే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు అలాంటి లాభాలు వస్తాయి.ఉక్రెయిన్‌ వివాద ఫలితంగా మన దేశంలోని చమురు కంపెనీలకు అలాంటి అపరిమిత లాభాలు వస్తున్నందున వాటి మీద కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు గాలివాటు పన్ను ఇలా ఉంది. మన దేశం నుంచి ఎగుమతి చేసే పెట్రోలుకు రు.6, డీజిలు మీద రు.13, విమాన ఇంథనానికి లీటరుకు ఒక రూపాయి, దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురు మీద టన్నుకు రు.23,250 చెల్లించాల్సి ఉంటుంది.


కొన్ని దేశాల్లో గాలివాటు లాభాలపై పన్ను విధిస్తుంటే జర్మనీలో ఇంథన సంస్థలను ఆదుకొనేందుకు వినియోగదారుల మీద భారాలు మోపేందుకు అక్కడి సర్కారు ఆలోచిస్తున్నది. పెరుగుతున్న ఇంథన ధరల మేరకు అదనంగా వసూలు చేసేందుకు చట్టసవరణకు పూనుకుంది. రష్యా ప్రభుత్వం కూడా ఇంథన రంగ సంస్థ గాజ్‌ప్రోమ్‌ గాలి వాటు లాభాలపై 20బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను విధించింది. సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు నెలకు 6.5బి.డాలర్ల చొప్పున పన్ను వసూలు చేస్తారు. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు చేరుతుంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపాకు, చమురు, గాస్‌ సరఫరాను తగ్గించినప్పటికీ ఈ సంస్థ రోజుకు పది కోట్ల డాలర్లకు పైగా సంపాదిస్తున్నది. సరఫరాలు తగ్గినా గత ఏడాది వచ్చిన దానికి సమంగా సంపాదిస్తున్నది. ఇటలీలో ఇంథన ధరలు పెరిగిన కారణంగా ప్రభావితులైన వినియోగదారులు, వాణిజ్య సంస్థలను ఆదుకొనేందుకు అక్కడి చమురు సంస్థల లాభాలపై 25శాతం పన్ను విధించినట్లు ప్రకటించారు.బ్రిటన్‌లో 2022 మే26 వతేదీ తరువాత వచ్చిన లాభాలపై పన్నును 40 నుంచి 60శాతానికి పెంచారు. దీనికి ఇంథన ధరల లెవీ అని పేరు పెట్టారు.2025 తరువాత దాన్ని తొలగిస్తారు. మనం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఈ పన్ను ఎందుకు విధించారు. ఆ వచ్చిన రాబడితో వంటగాస్‌, పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాల్సి ఉండగా గాస్‌ ధరను రు.50 ఎందుకు పెంచినట్లు ? ఎవరి కోసం ఈ పన్ను ఆదాయాన్ని ఖర్చు చేస్తారు ? ప్రశ్నించకుండా నోరు మూసుకున్నవారు దేశభక్తులు, అడిగినవారు దేశద్రోహులు !


దేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో వంటగాస్‌ను ప్రోత్సహించారు.ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నందున దానికి గాను సబ్సిడీలు కూడా ఇచ్చారు. దీంతో వినియోగదారులు గణనీయంగా పెరిగారు. కరోనా లాక్‌డౌన్‌ విధించిన 2020లో పెట్రోలు కంటే దేశంలో తొలిసారిగా గాస్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. తరువాత తిరిగి పెట్రోలు పెరిగిందనుకోండి. సబ్సిడీలను ఎత్తివేసేందుకు గాను వేసిన ఎత్తుగడ ఏమంటే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలో వేస్తామంటూ గాస్‌ ధర మొత్తాన్ని ముందుగా చెల్లించే అలవాటు చేశారు. తరువాత స్వచ్చందంగా సబ్సిడీ వదులు కోవాలన్న తతంగం నడిపారు. బిజెపి దేశభక్తులు కూడా వదులుకోకపోవటంతో క్రమంగా సబ్సిడీ ఎత్తివేశారు. ఐదుశాతం మంది స్వచ్చందంగా వదులు కున్నట్లు చెప్పగా కాగ్‌ సదరు అంకెలతో అంగీకరించలేదు. 2014లో గాస్‌ ధర రు.414 కాగా తాజా పెంపుదలతో అది రు.1,105(హైదరాబాదు)కు పెరిగింది. 2014 తరువాత నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో గాస్‌ ధర ముడిచమురుతో పాటు గణనీయంగా తగ్గింది.


అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) 2021 డిసెంబరు నాలుగవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.2013-14 నుంచి 2019-20 కాలంలో అంతర్జాతీయ ఎల్‌పిజి(వంటగాస్‌) ధర 48శాతం తగ్గింది. అదే 2020-21తో పోల్చితే తగ్గుదల 31శాతం ఉంది.2014 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు వరకు మన దేశంలో ధరను 110శాతం పెంచారు. కరోనా లాక్‌డౌన్ల ఎత్తివేత తరువాత మాత్రమే అంతర్జాతీయ ధర పెరిగింది.అంతకు ముందు ఆరు సంవత్సరాలు తగ్గింది. ఈ కారణంగానే ప్రభుత్వం మీద సబ్సిడీ భారం తగ్గింది.2013-14 నుంచి 2015 – 16 మధ్య ప్రభుత్వం భరించిన సబ్సిడీ భారం 64శాతం తగ్గింది. అంకెల్లో 746.1 నుంచి 263 బిలియన్ల రూపాయలకు( మన కోట్లలో చెప్పుకుంటే 74,610 నుంచి 26,300 కోట్లకు) తగ్గింది. ఇదే కాలంలో చమురు కంపెనీలు భరించిన సబ్సిడీ మొత్తం 98శాతం అంటే రు.69,128 నుంచి రు.1,268 కోట్లకు తగ్గింది.వినియోగదారులకు నేరుగా చెల్లించిన సబ్సిడీ మొత్తం 2015-16 నుంచి 2020-21 కాలంలో రు.27,570 కోట్ల నుంచి రు.3,658 కోట్లకు తగ్గింది.

ధనికులకు సబ్సిడీని తగ్గించి పేదలకు పెంచామంటూ ప్రచార ఆర్భాటం చేసి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) పధకం పేరుతో మంజూరు చేసిన గాస్‌ కనెక్షన్ల ప్రచారాన్ని అనేక మంది ప్రశ్నించారు. సబ్సిడీల గురించి అనుసరించిన లెక్కల పద్దతిని కాగ్‌ ప్రశ్నించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్ల కోసం ఈ పధకాన్ని ప్రారంభించారు.2015-16లో ఈ పధకం కింద ఇచ్చినట్లు చెప్పిన సబ్సిడీ రు.2,990 కోట్లు కాగా 2019-20కి అది రు.1,293 కోట్లకు తగ్గింది. ఈ పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన వారి ఆదాయం పెరగని కారణంగా, సబ్సిడీ కోత వలన సిలిండరును తీసుకోలేకపోయారు.


పిఎంయువై పధకం కింద గాస్‌ కనెక్షను ఉన్నవారికి సిలిండర్‌కు రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది.2022 మే 12వ తేదీన హిందూ పత్రిక వార్తలో వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో 90 లక్షల మంది ఉజ్వల లబ్దిదార్లు గాస్‌ను తీసుకోలేదు. కోటి మంది ఒక సిలిండరు మాత్రమే తీసుకున్నారు. 2016 మే ఒకటవ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పధకాన్ని ప్రారంభించారు.2020 మార్చి నాటికి ఎనిమిది కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు, తరువాత మరొక కోటి పెంచారు. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత ఆర్ధిక సంవత్సరంలో (2021 మార్చి నాటికి) ఇచ్చిన కనెక్షన్లలో ఐఓసిలో ఒకసారి మాత్రమే సిలిండర్లు తీసుకున్నవారు 65, హెచ్‌పిసిలో 9.1, బిపిసిలో 15.96లక్షల మంది ఉన్నారు. 2019 సెప్టెంబరు వరకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి బిపిసి ప్రత్యేకంగా పేర్కొన్నది. ఐఓసిలో ఒకసారి మాత్రమే తీసుకున్నవారు 52,హెచ్‌పిసిలో 27.58, బిపిసిలో 28.56లక్షల మంది ఉన్నారు.ఈ ఏడాది మార్చి నెలలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఏటా ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు సగటున ఒక్కొక్కరు 3.6 సిలిండర్లు మాత్రమే తీసుకున్నారు. 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఈ పధకం తీసుకున్న సిలిండర్ల సంఖ 14.17కోట్లని మరొక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపిందని హిందూ పత్రిక పేర్కొన్నది. తొమ్మిది కోట్ల మంది మూడు చొప్పున తీసుకుంటే 27 కోట్లు కావాలి, అంటే కరోనాలో కూడా ఉచితంగా ఇచ్చినా తీసుకొనే స్థితి లేదన్నది స్పష్టం. అలాంటపుడు కేవలం రెండువందల సబ్సిడీ ఇచ్చి తాజాగా పెంచిన రేటు ప్రకారం రు.900 పెట్టి కొనుగోలు చేసేందుకు ఎందరు ముందుకు వస్తారన్నది ప్రశ్న.వంటగాస్‌ ధరలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సగటున ఒక లీటరు ధర జూలై నాలుగవ తేదీ నాటికి 80 సెంట్లు ఉంది. మన కరెన్సీలో రు.63.39 కాగా మన దేశంలో 87 సెంట్లు, రు.68.94 ఉంది. మన కంటే ఆస్ట్రేలియాతో సహా 28 దేశాలలో ధర తక్కువగా 22 చోట్ల ఎక్కువగా ఉంది. విశ్వగురువుగా అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు ?


గాలి వాటు లాభాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వ రంగ ఓఎన్‌జిసి 2020-21లో సంపాదించిన మొత్తం రు.1,10,345 కోట్లకు గాను దానికి వచ్చిన లాభం రు.40,306 కోట్లు. మన దేశంలో ఓఎన్‌జిసితో పాటు చమురును వెలికి తీసే వేదాంత ప్రైవేటు కంపెనీకి సైతం పెద్ద మొత్తంలో లబ్ది కలిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన గాలివాటు పన్నుతో ఈ రెండు కంపెనీల నుంచే కేంద్రానికి 69వేల కోట్ల మేరకు రాబడి ఉంటుందని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. రిలయన్స్‌ కంపెనీ జామ్‌నగర్‌లోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులపై ఆ కంపెనీ అపరిమిత లాభాలు ఆర్జిస్తున్నది. గాలివాటు పన్ను విధించిన తరువాత కూడా దానికి గణనీయ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. జూన్‌ చివరి వారంలో కంపెనీ జిఆర్‌ఎం ఒక పీపాకు 24 నుంచి 26 డాలర్లవరకు ఉందని మోర్గన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఈ కంపెనీ శుద్ధి చేసిన ఉత్పత్తుల్లో 58శాతం ఎగుమతి చేస్తున్నట్లు జఫరీస్‌ సంస్థ తెలిపింది. గాలి వాటు పన్ను వలన జిఆర్‌మ్‌ ఒక పీపాకు 7 నుంచి 12 డాలర్లు తగ్గుతుందని అంచనా.2021లో పీపాకు 5.9, 2022లో 9.7 డాలర్లు రాగా రష్యా చమురు కారణంగా 2023లో 16.5 డాలర్లు ఉండవచ్చని నొమురా పేర్కొన్నది. గతంలో కేవలం ఐదు శాతం దిగుమతి చేసుకోగా ఇప్పుడు రష్యా చమురు 25శాతానికి పెరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గినపుడు ఆ మేరకు జనాలకు తగ్గించకుండా సెస్‌లను విపరీతంగా పెంచి లక్షల కోట్లు తన ఖజనాకు మళ్లించింది. చమురు ధరలను తగ్గించలేదు. ఇప్పుడు చమురు కంపెనీలకు వస్తున్న అపరిమిత లాభాల నుంచి కొంత వసూలు చేయటం సమర్ధనీయమే. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కేంద్రం ఆత్మనిర్భర్‌ పేరుతో వాటికే మరికొంత లబ్ది చేకూర్చింది.గాలి వాటు పన్ను ద్వారా వచ్చే అదనపు రాబడిని ఎవరికోసం ఖర్చు చేస్తారు.కార్పొరేట్లగా సామాన్య జనాలకా ? గాస్‌, చమురు ధరల పెంపుదల ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నది. పరిశ్రమల వృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం పేరుతో కంపెనీలకు ఇస్తున్న పలు రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి, మరి సామాన్యులకు సబ్సిడీల కోత – ధరల మోత ఎందుకు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా కూటమి మల్లగుల్లాలు : అనుకున్నదొకటి అవుతున్నది మరొకటి !

06 Wednesday Jul 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

European Union, G7 summit 2022, NATO, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పతనం : వంచనకూ ఒక హద్దుంటుంది :నరేంద్రమోడి , ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా మిత్రోం !

04 Monday Jul 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, Joe Biden, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


” గతంలో భారత ప్రధానులు అమెరికా అధ్యక్షులను కలుసుకొనేందుకు వారి దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన ప్రధాని దగ్గరకు వస్తున్నారు. అదే నరేంద్రమోడీ గొప్పతనం ” ఇది ఇటీవలి జి7 దేశాల సమావేశం తరువాత సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న ఒక పోస్టులోని అంశం. నిజమే ఆ దృశ్యాన్ని చూసి యావత్‌ నరేంద్రమోడీ భక్త జనులు ఆనందపారవశ్యంతో ఆ బొమ్మ ముందు పొర్లు దండాలు కూడా పెట్టి ఉండవచ్చు. ఎవరిష్టం వారిది. ప్రపంచ నేతలతో అందునా అమెరికా నేతలతో కౌగలించుకొనే చనువు మన ప్రధానికి ఉంది గనుక మరొకటి కూడా జరిగి ఉండవచ్చు. ” ఏమిటి మోడీ గారు మా డోనాల్డ్‌ ట్రంప్‌నైతే కౌగలించుకొని చెట్టపట్టాలు వేసుకొని మరీ మధుర భాషణలు జరిపారు. నన్ను చూసి కూడా చూడనట్లు అటు తిరిగి మాట్లాడుతున్నారేం ” అంటూ వెనుక నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నరేంద్రమోడీ భుజం తట్టి మరీ పలకరించి ఉండవచ్చుగా ! వసుదేవుడు అంతటి వాడు తన పని జరిపించుకొనేందుకు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న పురాణ కధ చదివాము. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో తన అవసరం కోసం గత ఐదునెలల్లో బెదిరింపులు-బుజ్జగింపులతో మన దేశాన్ని తనవైపు తిప్పుకొనేందుకు అమెరికా చూస్తున్నదనేది కూడా జగమెరిగినదే. దానిలో భాగంగా కూడా జో బైడెన్‌ వెనుక నుంచి తట్టి మరీ నరేంద్రమోడీని పలుకరించి ఉండవచ్చు మీ వైఖరిని మార్చుకున్నారా అని అడిగి ఉండవచ్చు. అవసరం వారిది కదా ! ఏదైనా దాన్ని వదలివేద్దాం, దీనితో దేశానికి ఒరిగిందేమిటి, జనాలకు దక్కిందేమిటి ?


నరేంద్రమోడీని విశ్వగురువుగా మన జనాలకు చూపేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి వారి సలహాలతో మద్దతుదారులు ఇలాంటివి ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. గతంలో చాయవాలా బ్రాండ్‌,ఎన్నికల సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి కూర్చోబెట్టటం, బిజెపి నేతలు టీ అమ్మటం వంటి జిమ్మిక్కులన్నీ దానిలో భాగమే కదా ! చాయవాలా తరువాత చౌకీదారు బ్రాండ్‌తో ముందుకు వచ్చారని తెలిసిందే ! ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. ప్రపంచానికి పాఠాలు చెబుతున్న విశ్వగురువు తన కార్యస్థానంలో చెప్పిందేమిటి చేస్తున్నదేమిటి ? అన్నింటినీ ఒకేసారి చెప్పుకోలేం గనుక రూపాయి గురించి మోడీ, బిజెపి నేతలు చెప్పిందేమిటో చూద్దాం ? ఇప్పుడు జరుగుతున్నదేమిటో చూద్దాం. దాని గురించి వారు మరిచినట్లు నటిస్తున్నా జనానికి మతిమరుపు వచ్చినా అవసరం గనుక చెప్పుకోక తప్పదు. భజన తప్ప మరొకటి మాకు పట్టదని భక్తులు అంటారా ? వారిని వదలివేద్దాం ! తమ అవసరాల కోసం నరేంద్రమోడీని విదేశాలు – కార్పొరేట్‌లు మునగచెట్టు ఎక్కించవచ్చు, మీడియాలో గొప్పతనాన్ని గుప్పించవచ్చు. దానికి అనుగుణంగానే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ మోడీ గారు సుభాషితాలను వల్లిస్తున్నారు. ఒకటి మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి జనాన్ని ఆకట్టుకోవటంలో నరేంద్రమోడీకి ప్రస్తుతం దేశంలో మరొకరు సాటిరారు. అందునా వేషం-భాషల్లో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.


” యుపిఏ నిర్వాకం రూపాయి పతనానికి దారి తీసింది : బిజెపి ” 2013 నవంబరు 21న పిటిఐ వార్తకు శీర్షిక. ” ఎఫ్‌డిఐల ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఐల పెట్టుబడులతో నడపాలన్న యుపిఏ విధానం వలన ఈ దుస్థితి ఏర్పడింది. రూపాయి రికార్డు పతనం చెందింది.( ఆరోజు ఒక డాలరుకు 60.15 రూపాయలు)” ఆ రోజు విలేకర్లతో మాట్లాడింది నాడు రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవిశంకర ప్రసాద్‌. ప్రభుత్వం మీద జోకులు పేలుస్తూ ” యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్‌ గాంధీ వయసుతో సమానం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం ” అన్నారు.


రవిశంకర ప్రసాద్‌ కంటే ముందు, 2013 ఆగస్టు 20న గాంధీనగర్‌ నుంచి పిటిఐ వార్తా సంస్థ సిఎంగా ఉన్న నరేంద్రమోడీ వ్యాఖ్యల గురించి ఒక వార్తను ఇచ్చింది. ఆరోజు రూపాయి విలువ 64.11కు దిగజారింది.” ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి పట్టలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాం, కానీ జరిగిందేమీ లేదు. ” అని బిజెపి ప్రచార కమిటీ నేతగా కూడా ఉన్న మోడీ చెప్పారు.


2018 సెప్టెంబరు మూడున ద క్వింట్‌ పత్రిక జర్నలిస్టు మేఖలా శరణ్‌ రాసిన విశ్లేషణ ” రూపాయి ఆసుపత్రిలో ఉంది, మృత్యువు ా ప్రాణాలతో పోరాడు తోంది ” అని 2013లో నరేంద్రమోడీ చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత ప్రధాన మంత్రి, సెప్టెంబరు మూడున తొలిసారిగా రు. 71.11గా ఉంది అంటూ ప్రారంభమైంది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. 2012లో నరేంద్రమోడీ గట్టిగా ఇలా చెప్పారు.” నేను పరిపాలనలో కూడా ఉన్నాను. నాకు రూపాయి విలువ గురించి తెలుసు అది ఇంతవేగంగా పతనం కాకూడదు.ఈ విధంగా పతనం కావటానికి గల కారణాలేమిటి ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఈ దేశం జవాబును డిమాండ్‌ చేస్తోంది” అన్నారు. మరుసటి ఏడాది బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ఇలా చెప్పారు. ” ఈ విధంగా రూపాయి విలువ పడిపోవటాన్ని గత రాత్రి చూస్తూ భయపడి టీవీ కట్టేశాను.” బిజెపి నేతల ఈ ప్రకటనలను ఉటంకించిన ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ ” ఇప్పుడు రోజులు మారాయి. నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు డాలరుతో రూపాయి విలువ పతనమైంది. ఆయన దేన్నిగురించీ చెప్పటం లేదు.” అని ముక్తాయింపు ఇచ్చారు. ఎన్‌డిటీవి యాంకర్‌ రవీష్‌ కుమార్‌ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం మాట్లాడిందీ చూపారు. ” ఈ పతనం(2018) గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు.” గార్గ్‌ మాటల తరువాత ” వంచనకూ ఒక హద్దు ఉంటుంది ” అన్న నరేంద్రమోడీ చెప్పిన ఒక మాటను చూపి రవీష్‌ కుమార్‌ ముగించారు. నరేంద్రమోడీ ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినా నిత్య సత్యం. కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల గురించే చెప్పి ఉంటారు. తరువాత కాలంలో అది తనకూ వర్తిస్తుందని ఊహించి ఉండరేమో !


. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29. చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, ఇప్పుడు 79 దాటింది. పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. దీని గురించి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం చెబుతారు ? రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోందా లేదా ?


2022 జూలై ఒకటవ తేదీన 79.20తో రూపాయి పతనం కొత్త రికార్డు నెలకొల్పింది. నరేంద్రమోడీ వయస్సును దాటి బిజెపి మార్గదర్శక మండలిలో ఉన్న అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారి వయస్సులను అధిగమించేందుకు పోటీ పడుతోంది. త్వరలో 80 దాట నుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్రమోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31నాటికి 633.6 బి.డాలర్లుండగా జూన్‌ 24న 593.3 బి.డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో 77-81 మధ్య రూపాయి విలువ కదలాడవచ్చని కొందరి అంచనా. అది ఇప్పుడున్న ముడిచమురు ధరలు అలా ఉంటే అన్న ప్రాతిపదికన అన్నది గమనించాలి.2022లో 95.6 బి.డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. పతనమౌతున్న రూపాయి గురించి ఎవరూ మాట్లాడరేం. మరక మంచిదే అన్నట్లు పతనం మంచి రోజుల్లో భాగమే అని బిజెపినేతలైనా చెప్పాలి కదా మిత్రోం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !

02 Saturday Jul 2022

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

APSRTC, Narendra Modi, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టి) డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. 2022 జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ” పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు మరియు పాస్‌ల ధరలు 9.6.2022 నుంచి పెంచటం జరిగినది ” అని సమర్ధించుకుంది.ఎదుటి వారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది ఒక సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా ! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక లీటరు పెట్రోలు, డీజిలు ధరలు దిగువ విధంగా ఉన్నాయి.
పట్టణం ×××× పెట్రోలు××× డీజిలు
విజయవాడ×× 111.66 ××× 99.43
హైదరాబాదు × 109.66 ××× 97.82
బెంగలూరు ×× 101.94 ××× 87.89
చెన్నై ×××××× 102.63 ××× 94.24
భువనేశ్వర్‌ ××× 103.19 ××× 95.28
ఆర్‌టిసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ మరి ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు ? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా ! అడ్డగోలు సమర్ధనకు ఒక తర్కం-పద్దతీ పాడూ ఉండదు. ఆర్‌టిసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీజిలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు.అలాగే ఎపిఎస్‌ఆర్‌టిసి ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగుతుంది కదా ! సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ తిష్టవేసిన సలహాదారులకు, అధికారులకు గానీ ఈ చిన్న అంశం తట్టలేదా ! గతంలో కూడా డీజిలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్‌టిసి చరిత్రలో దొడ్డిదారిన డీజిల్‌ సెస్‌ పేరుతో భారం మోపలేదు.


నవరత్నాలలో భాగంగా గత మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ది చేకూర్చినట్లు వైసిపి ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటున్నారు. ఆర్‌టిసి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 2019-20లో రు.1,222.96 కోట్లు, 2020-21లో రు.2,982.32 కోట్లు, 2021-22లో రు.2,698.86 కోట్లు. ఆర్‌టిసిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.ఇది మిగిలిన ప్రభుత్వశాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్‌టిసిలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసికి ఎందుకు చెబుతున్నట్లు ? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు,అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తిలేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్దులు, స్కూలు విద్యార్దులు, బస్‌పాస్‌లు, ఆర్‌టిసి మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవత్సరాల్లో డీజిలు ధర లీటరుకు రు.40 పెరిగిందని ఆర్‌టిసి తన ప్రకటనలో చెప్పింది. డీజిలు మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 22.25శాతం పన్ను విధిస్తున్నది అంటే, అంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చినిజం. ఆ మేరకు ఆర్‌టిసి కొనుగోలు చేసే డీజిలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా !


పెద్ద మొత్తంలో డీజిలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రు.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోడీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్‌టిసి ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి కూడా అదే పద్దతిని అనుసరించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపివేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోడీ-జగన్‌ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్‌టిసి బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం.


ఆర్‌టిసిలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీజిల్‌ భారం వెనుక పాలకపార్టీ పెద్దలు-ప్రయివేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేము. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీజిలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టిసి పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చే అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టిసిలో పెంపుదల వారికి మరింత లాభం ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ ఛార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టిసిలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసేపనే తప్ప మరొకటి కాదు

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !

02 Saturday Jul 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures, nupur sharma fringe comments, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి ó(ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూర్తిగా తొలగించలేదు గనుక ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్‌ శర్మకు జూలై ఒకటవ తేదీన సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వివిధ రాష్ట్రాలలో దాఖలైన కేసులన్నింటినీ ఒక్కటిగా చేసి ఢిల్లీలో విచారించాలని ఆమె చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, జెపి పార్దీవాలాతో కూడిన వేసవి సెలవుల బెంచ్‌ నూపుర్‌ వినతిని విచారించింది. ఆమె నోటి దూల దేశమంతటా నిప్పు రాజేసింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తతలకు ఆమెదే పూర్తి బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశంలో మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలతో దేశంలో రగిలించిన ఆవేశాలకుగాను దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పాలన్నది. సుప్రీం కోర్టు నుంచి ఇలాంటి ప్రతిస్పందనను ఎవరూ ఊహించి ఉండరు. నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనేట్లు ఆదేశించాలని అజయ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణకు దరఖాస్తు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆమెకు న్యాయం జరగకపోవచ్చని ఆరోపించారు. తన పిటీషన్‌ కాపీని రాష్ట్రపతికి కూడా పంపుతానని అతను పేర్కొన్నాడు.


గ్యానవాపి మసీదు అంశం కోర్టు విచారణలో ఉన్నందున ఒక అజెండాను ముందుకు తేవాలని తప్ప దాని మీద టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ ఎందుకు నిర్వహించింది అని కోర్టు ప్రశ్నించింది. మే 27వ తేదీన సదరు ఛానల్‌ చర్చలో నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ” చౌకబారు ప్రచారం కోసం, రాజకీయ అజెండా లేదా దుర్మార్గమైన కార్యకలాపాల కోసం ఆమె మాట్లాడి ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? దేశమంతటా ఆవేశాలను రగిలించేందుకు ఆమె మాట్లాడిన తీరు కారణం, దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళదే ఏకైక బాధ్యత. ఆమె ఎలా రెచ్చగొట్టిందీ చర్చను మేము చూశాము. తరువాత లాయర్నని ఆమె చెప్పుకుంది ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ” అని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్‌ సూర్య కాంత్‌ అన్నారు.


నూపుర్‌ శర్మ తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ చర్చ సందర్భంగా నవికా కుమార్‌ మాట్లాడిన దానికి స్పందనగా నూపుర్‌ శర్మ మాట్లాడినట్లు చెప్పగా అయితే చర్చను నిర్వహించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అన్నది.అలాంటి ఉద్దేశ్యం యాంకర్‌కు లేదు. చర్చలో మరొకరు పదే పదే శివలింగం కాదు కేవలం ఫౌంటెన్‌ చెప్పారు అని మణిందర్‌ సింగ్‌ అన్నారు. తన కక్షిదారుకు ప్రాణహాని ఉన్నందున కేసులన్నింటినీ ఒకేచోట విచారించాలని మణీందర్‌ సింగ్‌ కోరారు. ” అమెకు ముప్పు ఉన్నదా లేక దేశ భద్రతకే ఆమె ముప్పు తెచ్చారా ? ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యకు ఆమె మాటలే కారణం ” అని జస్టిస్‌ పార్దీవాలా అన్నారు. నూపుర్‌ శర్మ తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారని, వెనక్కు తీసుకున్నారని న్యాయవాది చెప్పగా ” దేశానికి క్షమాపణ చెప్పేందుకు ఆమె టీవీ స్టూడియోకు వెళ్లాలి. వెనక్కు తీసుకోవటం కూడా చాలా ఆలస్యమైంది. అది కూడా మనోభావాలు గాయపడితే అనే షరతులతో కూడి ఉంది. రెచ్చగొట్టేందుకు వీరేమీ మతపరమైన వారు కాదు.” అని కోర్టు పేర్కొన్నది.


నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం గురించి జస్టిస్‌ సూర్య కాంత్‌ మాట్లాడుతూ ” నూపుర్‌ పిటీషన్‌ ఆమె పొగరును వెల్లడిస్తున్నది. దేశంలోని మెజిస్ట్రేట్‌లు ఆమెకు చాలా చిన్నవారిగా కనిపిస్తున్నారు. ఆమె ఒక పార్టీ అధికార ప్రతినిధైతే ఏమిటి ? తన వెనుక అధికారం ఉందని, దేశంలోని చట్టాలతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడగలనని ఆమె అనుకుంటున్నారు. కేవలం ఒక జాతీయ పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన క్షోభను కలిగించే అంశాలు మాట్లాడేందుకు లైసన్సు ఇవ్వరాదు. కోర్టులో ఉన్న అంశం గురించి ఆమె ఎందుకు మాట్లాడారు ” అని జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో ఢిల్లీ పోలీసుల తీరును కూడా కోర్టు ప్రశ్నించింది.పోలీసులు ఏమి చేశారు ? మా నోరు తెరిపించవద్దు అని సున్నితంగా కోర్టు మందలించింది.వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వస్తున్న బెదిరింపులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్‌ శర్మ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.


దేవుడు నైవేద్యం ఆరగించడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే ఎక్కడో ఒక చోట జరిగిన దాని మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఏండ్లతరబడి తిప్పే అంశం బిజెపికి చెందిన నూపుర్‌ శర్మకు, అందునా లాయర్‌ గనుక ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.కాషాయ దళాలు ప్రత్యేక శిక్షణతో ఉంటాయి.నీవు నేర్పిన విద్యఏనీరజాక్షా అన్నట్లుగా మిగతావారూ ప్రారంభించారు. బహుశా ఆ దృశ్యాలు కనిపించి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరి ఉండవచ్చు. నూపుర్‌ శర్మ గురించి సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపధ్యంలో కట్టుకథలకు, వక్రీకరణకు మారుపేరైన కాషాయదళాల నిర్వహణలోని వెబ్‌సైట్‌ ఓపి ఇండియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నూపుర్‌ శర్మ దరఖాస్తును విచారించి తిరస్కరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు జెబి పార్దీవాలా. సదరు న్యాయమూర్తి గతంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా, 1980-90లో గుజరాత్‌ స్పీకర్‌గా పని చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నది. నిజానికి ఆ పదవిలో ఉన్నది పార్దీవాలా తండ్రి బి పార్దీవాలా. పదవిలో ఉన్నది 1990 జనవరి 19 నుంచి మార్చి 16వరకు మాత్రమే, 86 ఏండ్ల వయస్సులో 2015లో మరణించారు. ఉద్రేకపడితే విచక్షణ ఎగిరిపోతుంది. జెబి పార్దీవాలా 2022 మే 9వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇప్పుడున్న వారిలో సీనియారిటీ ప్రకారం 2028 మే నెలలో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల మూడు నెలలపాటు కొనసాగుతారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినపుడు ఇచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించిన అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వాటిని వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే న్యాయమూర్తి శుక్రవారం నాడు నూపుర్‌ శర్మ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం వచ్చే రీతిలో ఒపిఇండియా కథనం ఉంది.


దానిలో పేర్కొన్నదాని ప్రకారం పటేల్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్లు కల్పించాలన్న పిటీషన్‌ విచారణ సందర్భంగా ” ఈ దేశాన్ని నాశనం చేసింది లేదా సరైన దారిలో ముందుకు పోయేందుకు ఆటంకం కలిగించిన రెండు అంశాల పేర్లు చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే రిజర్వేషన్లు, అవినీతి అని చెబుతా. ఆరున్నర దశాబ్దాల తరువాత రిజర్వేషన్లు కావాలని అడిగితే ఏ పౌరుడికైనా సిగ్గు చేటు. మన రాజ్యాంగాన్ని రూపొందించినపుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. కానీ దురదృష్టం కొద్దీ స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్నట్ల ” పార్దీవాలా అన్నట్లు, దాంతో జడ్జి పదవి నుంచి తొలగించాలని 58 మంది రాజ్యసభ ఎంపీలు 2015లో పిటీషన్‌ దాఖలు చేసినపడు తన పదజాలాన్ని వెనక్కు తీసుకున్నట్లు పేర్కొన్నది. ఇక్కడ గమనించాల్సింది నిజంగా ఓపి ఇండియా రాసినట్లే జరిగిందా మరొకటా అన్నది కాదు. నూపుర్‌ శర్మ మీద సుప్రీం కోర్టు బెంచ్‌ జడ్జీలు చేసిన వ్యాఖ్యలు కూడా రిజర్వేషన్ల మీద చేసిన అంతటి తీవ్రమైనవైతే ఇప్పుడు కూడా బిజెపి, భుజాలు మార్చుకోకుండా దాన్ని మోస్తున్న పార్టీల ఎంపీలందరూ అలాంటి పిటీషన్‌ పెట్టమనండి.


నూపుర్‌ శర్మ నోటి దూల కలిగించిన పరిస్థితి గురించి దేశంలో ఉన్న అనేక మంది మనస్సులో ఉన్న మాటలనే సుప్రీం జడ్జీలు చెప్పారు.దాంతో బిజెపి, దాని అభిమానులకు అన్నింటికీ మించి నూపుర్‌ శర్మ చేసింది సరైనదే అని వాదించే, నమ్ముతున్నవారికి శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వా ఖ్యల మీద ” మీడియా నేడు మౌనంగా ఉంది. వారి నోళ్లు మూసుకున్నారు.నూపుర్‌ శర్మ కేసులో ఎవరూ న్యాయమూర్తుల మాటల మీద బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇది నిజంగా చెడురోజు ” అంటూ ఒపి ఇండియా సంపాదకులలో ఒకరైన నూపుర్‌ జె శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం నూపుర్‌ శర్మకు బరితెగించి మద్దతు ఇవ్వటం తప్ప వేరు కాదు.ఆమె నోటి దూల పర్యవసానాలే ఉదయపూర్‌లోని ఒక సాధారణ దర్జీ ప్రాణాలు తీసేందుకు దారి తీసిందని సుప్రీం కోర్టే చెప్పింది. ఇలా చెప్పటమంటే హంతకులను సమర్ధించినట్లు కాదు. దర్జీ ఉదంతం మర్చిపోక ముందే మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో మరొకరు ఆమె నోటి దూలకు బలైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు దాన్ని నిగ్గుతేల్చాల్సి ఉంది. అమిత్‌ మెడికల్‌ స్టోర్స్‌ దుకాణదారు ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లే (54) జూన్‌ 21 రాత్రి 10-10.30 మధ్య హత్యకు గురైనాడు. ఆ వెనుకే వస్తున్న కుమారుడు సంకేత్‌, కోడలు ఉమేష్‌ను ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు చెబుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ఉమేష్‌ వాట్సాప్‌ గ్రూపులో నూపుర్‌ శర్మకు మద్దతుగా పెట్టిన లేదా ఫార్వర్డ్‌ చేసిన పోస్టు తన ఖాతాదారులైన ముస్లింలు ఉన్న గ్రూపులో కూడా పెట్టాడు. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఒకడు మహమ్మద్‌ ప్రవక్తను కించిపరిచిన వారు చావాల్సిందే అని పోలీసులతో చెప్పినట్లు ఒక అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి అలాంటి వాడు కాదని తాను కూడా అదే కథనాన్ని విన్నట్లు, డబ్బుకోసమైతే తన తండ్రిని చంపలేదని మాత్రం తాను చెప్పగలనని కుమారుడు చెబుతున్నాడు. పోలీసులు స్పష్టంగా దేన్నీ చెప్పలేదు.


న్యాయమూర్తుల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించాలన్న దరఖాస్తు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంది. దాన్ని ఏమి చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఒక వేళ దరఖాస్తు దారు కోరికను మన్నిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మౌఖికంగా ఏమీ మాట్లాడేందుకు వీలుండకపోవచ్చు. దీన్ని అంగీకరిస్తే గతంలో సుప్రీంతో సహా వివిధ కోర్టులలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొత్త పిటీషన్లు, కేసులు దాఖలు కావచ్చు.


పాత కేసుల పేరుతో ఎలా వేధించవచ్చో ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ ఉదంతం వెల్లడించింది. 2018లో చేసిన ఒక ట్వీట్‌ మీద దాఖలు చేసిన కేసులో గతనెలలో జుబేర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపారు. ఒక ట్వీట్‌ మీద ఢిల్లీ పోలీసులు నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారట. ఒక వేళ అరెస్టు చేయాల్సినంత పెద్ద నేరమైతే అప్పుడే చేసి ఉండాలి. ఇంతకూ మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు ఆరోపించిన జుబేర్‌ ట్వీట్‌లో ఉన్నదేమిటి ? ఒక పాత హిందీ సినిమాలో ఒక హౌటల్‌ మీద హనుమాన్‌ హౌటల్‌ అని రాసి ఉన్న ఉన్న చిత్రాన్ని తీసుకొని దాని కింద ” 2014కు ముందు హనీమూన్‌ హౌటల్‌ 2014 తరువాత హనుమాన్‌ హౌటల్‌ ” అని ట్వీట్‌ చేశారు. దాని మీద హనుమాన్‌ భక్త అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారట. హనుమంతుడు బ్రహ్మచారి, ఇలా రాయటం హిందువులను నేరుగా అవమానించటమే కనుక చర్యతీసుకోవాలని సదరు ట్వీట్టర్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడట. అసలు ఫిర్యాదీ చిరునామా లేకుండా కేసు ఎలా పెడతారని జుబేర్‌ కోర్టులో ప్రశ్నిస్తే చిరునామా లేకుండా ట్వీటర్‌ సంస్థ ఖాతా తెరవదు కదా అని ప్రభుత్వ ప్లీడర్‌ సమాధానం. అది ఊరూపేరులేని ట్విటర్‌ ఖాతా కావచ్చు. ప్రపంచమంతటా అలాంటి నకిలీ ఖాతాలు ఉన్నపుడు ఆ సాకుతో కేసు పెట్టవచ్చు. తమకు నచ్చని లేదా లొంగని వారిని ఎలా వేధించే పరిస్థితి దేశంలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. అంతే కాదు ఒక చిన్న కేసును సంవత్సరాల తరబడి పరిష్కరించలేని అసమర్ధత మన పోలీసు శాఖలో ఉందని ఎవరన్నా అన్నా ఉడుక్కోనవసరం లేదు. అనేక పాత సినిమాలు, విమర్శనాత్మక గ్రంధాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవి మా మనోభావాలను దెబ్బతీశాయని కేసులు పెడతారా ? వాటన్నింటినీ విచారిస్తారా ? ఎక్కడికి పోతున్నదీ అసహనం ? దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని పాలకులు చెప్పేదానికి అర్ధం ఇదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d