• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

సైన్సు పరిశోధనలు : అవని చుట్టూ ఇతర జనం – ఆవు చుట్టూ మనం !

22 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Education, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

(R&D) expenditure -India, pseudo-scientific claims, research and development (R&D) expenditure


ఎం కోటేశ్వరరావు


ఉన్నత స్ధాయిలో ప్రామాణికంగా పేర్కొన్న పరిశోధకుల పేర్లతో లండన్‌లోని శాస్త్ర సమాచార సంస్ద, క్లారివేట్‌ రూపొందించిన 6,602 మంది వివరాలను పరిశీలించినపుడు అమెరికా ప్రధమ స్థానంలో, తరువాత చైనా ఉంది. డెబ్బయి దేశాలకు చెందిన వారితో 2021నవంబరు 16న ఈ వివరాలను ప్రకటించారు. తొలి ఐదు దేశాలకు చెందిన వారు 71.4శాతం మంది కాగా, మొదటి పది దేశాలను తీసుకుంటే 82.9శాతం ఉండటాన్ని బట్టి కేంద్రీకరణను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 2,622, చైనాలో 935 మంది ఉన్నారు. గత పది సంవత్సరాలలో తమ పరిశోధనలతో గణనీయ ప్రదర్శన, ప్రచురించిన పత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వీరిలో 3,774 మంది ఒక నిర్ణీత రంగంలో, 2,828 మంది ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పరిశోధనలు చేస్తున్నవారు ఉన్నారు. మూడవ స్ధానంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన వారు గత మూడు సంవత్సరాల్లో తగ్గి 492 లేదా 7.5శాతంగా ఉన్నారు. జర్మనీని అధిగమించి ఆస్ట్రేలియన్లు 332 మంది నాలుగో స్ధానంలో, 331 మందితో జర్మనీ ఐదవ, నెదర్లాండ్స్‌(207, కెనడా(196), ఫ్రాన్స్‌ 146) స్పెయిన్‌(109), స్విడ్జర్లాండ్‌(102)తో తొలి పదిస్దానాల్లో ఉన్నాయి.

గతంతో పోల్చితే అమెరికన్లు 2014లో 55శాతం, 2018నాటికి 43.3, 2021కి 39.7శాతానికి తగ్గారు. చైనీయులు 2018లో 7.9శాతం కాగా 2021కి 14.2కు పెరిగారు.చైనాలో 2014లో కేవలం 122 మంది మాత్రమే ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనీయుల పెరుగుదల, అమెరికన్ల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్‌ విశ్లేషకుడు డేవిడ్‌ పెండెల్‌బరీ అన్నాడు. బ్రిటన్‌లో పరిశోధన తగ్గుతున్నది. హాంకాంగ్‌లో ఒక ఏడాది కాలంలోనే పరిశోధకుల సంఖ్య 40 నుంచి 79కి పెరిగింది.తొలిసారిగా బంగ్లాదేశ్‌, కువైట్‌, మారిషస్‌, మొరాకో, జార్జియా ఈ జాబితాకు ఎక్కాయి. క్లారివేట్‌ సంస్ధ దేశాల జనాభా సంఖ్య-శాస్త్రవేత్తలతో పోల్చింది.నూట ముఫ్పై ఎనిమిది కోట్ల మంది ఉన్న భారత్‌లో 22 మంది,22.1 కోట్ల మంది ఉన్న పాకిస్ధాన్‌ నుంచి ఐదుగురు, 27.3 కోట్ల మంది ఉన్న ఇండోనేషియా నుంచి ఒక్కరు ఉన్నట్లు పేర్కొన్నది. ఇండోనేషియా నుంచి ఉన్న ఒక్కరు కూడా మహిళ కావటం విశేషం.ఆమె బయోఫ్యూయల్‌ మీద పరిశోధనలు చేస్తున్నారు. సంస్ధల వారీగా చూస్తే 1,300లో శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 214 మందితో అగ్రస్ధానంలో ఉంటే చైనా సైన్స్‌ అకాడమీ 194 మందితో రెండవ స్ధానంలో, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 122 మందితో తృతీయ స్ధానంలో ఉంది. యాభై అగ్రశ్రేణి సంస్ధలలో 28 అమెరికాలో, ఐదు బ్రిటన్‌, నాలుగేసి చైనా,ఆస్ట్రేలియాలో సింగపూర్‌, సౌదీ అరేబియాలో రెండేసి, హాంకాంగ్‌, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్‌, బెల్జియంలలో ఒక్కొక్కటి ఉన్నాయి.


పరిశోధనారంగంలో వివిధ దేశాలు పోటీ పడుతున్నతీరును చూశాము.ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లుగా మనం ఉన్నాం.నరేంద్రమోడీ సర్కార్‌ గత ఏడున్నర సంవత్సరాల్లో ఈ రంగానికి అందించిన ప్రోత్సాహంతో మనంపైన పేర్కొన్న పరిశోధకుల్లో 22 మందైనా ఉన్నారని భక్తులు భజనకు దిగవచ్చు.పరిశోధనలు, నవకల్పనల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. దేశీయ ఆవుల అద్వితీయత,వాటి పాలు, పేడ, మూత్రంలో ఉన్న రోగనిరోధకత లేదా కాన్సర్‌తో సహా రకరకాల వ్యాధులను నయం చేసే గుణాల గురించి పరిశోధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అశాస్త్రీయం, నిధులను దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐదు వందల మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వెనక్కు తగ్గలేదు. విశ్వాసాల ప్రాతిపదికన ముందుకు తెస్తున్న కుహనా సైన్సును సక్రమమైనదిగా చెల్లుబాటు చేసే యత్నమని పేర్కొన్నారు. హౌమియోపతి, అల్లోపతి, నేచురోపతి వంటి వాటి సరసన కౌపతిని చేర్చేందుకు పూనుకున్నారు. ఆవు మూత్రం, పాలు, పేడలతో చీడపీడల నివారణ మందులు, షాంపూలు, తలనూనెలు, నేలను శుభ్రం చేసే ద్రవాల వంటి వాటి తయారీకి పరిశోధనలు జరపాలని కేంద్రం నిధులు కేటాయించింది. పుక్కిటి పురాణాల్లో రాసిన ఊహాజనితమైన వాటిని రుజువు చేసేందుకు డబ్బు దుర్వినియోగం తప్ప మరొకటి కాదు.దీనికి ”సూత్రా-పిక్‌ అని పేరు పెట్టారు ఆవు మూత్రంతో తన కాన్సర్‌ మాయమైందని బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కేంద్రం వెనక్కు తగ్గలేదు సరికదా ఆవు శాస్త్ర పధకాలను వేగంగా అమలు జరిపి 2021 ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందే పురోగతిని చూపాలని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అనుమతులు, నిధుల మంజూరులో ఎందుకు జాప్యం చేశారంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఆలస్యానికి సాకులు చెబితే కుదరదని హెచ్చరించారు.ప్రధాని నరేంద్రమోడీకి దేశీయ ఆవులు ఎంతో ముఖ్యమని కూడా చెప్పారు. ఢిల్లీ ఐఐటి రూపొందించిన ఈ పధకంలో 2016 నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు.2017లో తొలుత పంచగవ్య సుగుణాలను శాస్త్రీయంగా నిరూపించాలని ఆదేశించారు. తరువాత 2020లో దాన్ని మరింత విస్తరించి కొత్త పధకంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెట్రోలు లేకుండా పైకీ కిందికీ, ఎందరెక్కినా ఒకరికి జాగా ఉండే పురాణాల్లోని విమానాలు,వినాయకుడు పాలు తాగాడు వంటి నమ్మకాలు, ఇతర ఊహలన్నింటినీ 2024 ఎన్నికల నాటికి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజక్టులుగా చేపట్టి నిర్ధారించమని నిధులు కేటాయించినా ఆశ్చర్యం లేదు.


పిండికొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు దుడ్డుగా ఉండాలి అంటే కుదరదని కూడా అదే పెద్దలు అన్నారు. వీటిని ఎవరు ఎలా వర్తింప చేస్తున్నారు ? చైనాతో పోటీ పడాలని, దేవుతలు కరుణిస్తే అధిగమించాలని మనం కోరుకోవటం తప్పుకాదు. స్టాటిస్టా డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2021లో పరిశోధన-అభివృద్ధికి గాను చైనా పెట్టుబడి 621.5బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా 598.7, జపాన్‌ 182.36, జర్మనీ 127.25, భారత్‌ 93.48 బి.డాలర్లు. ఈ మొత్తం నుంచే ఆవు పాలు, పేడ, మూత్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మన జనాలకు తెలివితేటలేమైనా తక్కువా, సోమరిపోతులు మరొకటి కాదే. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి అదృష్టం కోసం ఎదురు చూసే బాపతు కూడా గణనీయంగా ఉన్నందున కాళ్లు, చేతులూ చూసే, జోశ్యాలు చెప్పే రకరకాల మోసగాండ్లు తామర తంపరగా పెరిగిపోతున్నారు. మన అప్పును నరేంద్రమోడీ 55 లక్షల కోట్ల నుంచి 130లక్షల కోట్లకు పెంచటం పట్ల చూపిన శ్రద్ద పరిశోధనకు కేటాయింపుల్లో లేదు. ఈ అంశంలో అంతకు ముందున్న వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌ సర్కార్లు కూడా ఇంతకు మించి పొడిచిందేమీ లేదు.

గేట్‌వేహౌస్‌ డాట్‌ఇన్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో జిడిపిలో మన పరిశోధన ఖర్చు 0.7శాతం ఉంటే 2012 నాటికి 0.8శాతం, ఇదే కాలంలో చైనా 0.9 నుంచి 1.8కి పెరిగింది. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2018లో చైనా 2.14శాతం, మన దేశం 0.65శాతం ఖర్చు చేసింది. రూపాయల్లో పెరుగుదల చూడండి అని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. వాటి విలువ సంగతేమిటని అడగాల్సి వస్తుంది. దేశభక్తి దేశభక్తి అని అరిస్తే,వేషాలు వేస్తే, ఇరుగు పొరుగుదేశాల గురించి కుట్ర సిద్దాంతాలతో జనాలను భయపెడితే, ఆ సాకుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే, గంజాయి దమ్ముకొట్టి ప్రగల్భాలు పలికినట్లు వారిని అధిగమిస్తాం వీరిని దాటిపోతాం, మా గత ఘనం చూడండి అంటే సరిపోతుందా ? కృత్రిమ మేథలో కొన్ని రంగాల్లో ఇప్పటికే అమెరికాను అధిగమించి, మొత్తంగా సవాలు విసురుతున్న చైనాతో పోల్చుకుంటే మనమెక్కడ ? నేచర్‌ ఇండెక్సు డాట్‌కామ్‌ ప్రకారం 2015-19 సంవత్సరాలలో అమెరికన్లు 7,020,బ్రిటీషర్లు 2,073, జర్మన్లు 1,756, చైనీయులు1,446 ఆర్టికల్స్‌ను ప్రచురిస్తే మొదటి 25లో 20వ స్దానంలో ఉన్న మనవారికి 192 మాత్రమే. మనం గొప్పగా చెప్పుకొనే ఆంగ్ల భాషా జ్ఞానం, సంస్కృత పరిజ్ఞానం ఏమైనట్లు ? ఆ రెండింటిలోనూ మనకంటే వెనుకబడిన చైనా శాస్త్ర పరిశోధనలో ఎందుకు ముందున్నట్లు ? ఇతర దేశాల జనం ప్రపంచాన్ని చుట్టి వస్తుంటే మనం ఆవుచుట్టూ తిరుగుతున్నాం ?తీవ్రంగా ఆలోచించాలా వద్దా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీలో వామపక్ష చారిత్రక విజయం – ఎదురయ్యే సవాళ్లు !

21 Tuesday Dec 2021

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Apruebo Dignidad, Chile Presidential Elections 2021, Gabriel Boric, Latin American left



ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19 పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్ధానిక సంస్దల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ పడిలో ప్రవేశిస్తాడు.


1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగపరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో గాబ్రియెల్‌ బోరిక్‌ విజయం సాధించాడు. పార్లమెంటు ఎన్నికల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.


నయా ఉదారవాద విధానాలు లాటిన్‌ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్ధిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే-సమర్ధించేశక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది.గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్ధలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్ధిగా కమూనిస్టు డేనియల్‌ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్‌ నేతగా ఉన్న కన్వర్జన్స్‌ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ” మర్యాదకు మన్నన” అనే అర్దం ఉన్న అప్రూవ్‌ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్ధిగా బోరిక్‌ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్ధితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.


సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు.ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు.


అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది.1973లో సాల్వెడోర్‌ అలెండీ మీద అమెరికా సిఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు.పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవిధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్‌ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.


తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్ధితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్ది జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్దానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్‌ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్‌ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్‌ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్‌ తిప్పి కొడుతూ ప్రత్యర్దుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.


చిలీ ఆర్ధిక స్ధితి సజావుగా లేదు. బోరిక్‌ విజయవార్తతో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్‌, తదితర కారణాలతో లాటిన్‌ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్‌ ఆర్ధిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్‌ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని చెప్పాడు. పెన్షన్‌ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకు ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి.2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది.అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్‌ బోరిక్‌ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి.ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్‌ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు.తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్‌ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్‌ ముందుకు పోవాలని యావత్‌ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీజింగ్‌ ఒలింపిక్స్‌-అమెరికా కపట రాజకీయం!

15 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Sports, UK, USA

≈ Leave a comment

Tags

Beijing Olympics, US imperialism, US-Beijing Boycott, US’s diplomatic boycott


ఎం. కోటేశ్వరరావు


బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలితీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికాలోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.


నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిధ్యదేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగువేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రంలోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.


రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోచూడటం గర్హనీయం. చైనాలోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక బలాత్కారం పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచారదాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

దొంగే దొంగని అరచినట్లుగా అమెరికా చేస్తున్న ఆర్థిక బలాత్కారాలకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. దానికి తన మన పర బేధాలు లేవు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగుపరచేందుకు సముద్రంలో వైర్లద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచబాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా వత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమానకంపెనీ ఎయిర్‌బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు మన నరేంద్రమోడీ కౌగిలించుకున్నా మరొకటి చేసినా మన ఎగుమతులపై రద్దు చేసిన పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్దరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు మన నరేంద్రమోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.

లివర్‌పూల్‌లో జరిగిన జి7దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవహక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలున్నాయి, అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23శాతం, మరణాల్లో 18శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.

చైనాను గుర్తించకుండా తైవానే అసలైనా చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక బలాత్కారం కాదా? తనకంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులను వెతుకుతోంది. మానవహక్కుల పరిరక్షణ అన్నది తన డీఎన్‌ఏలోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవహక్కుల హరణమే దాని డీఎన్‌ఏ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆమొత్తం ఇప్పుడు 97లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66వేల మందిని హిరోషిమాలో, 39వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంతపాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవహక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో దాడిచేసి పదిలక్షల మందిని, ఉగ్రవాదం మీద పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో రెండున్నర లక్షలు, ఎమెన్‌లో నాలుగు లక్షలు, సిరియా, సోమాలియా, లిబియాల్లో మరికొన్ని లక్షల మందిని హతమార్చిన అమెరికా అండ్‌కో హంతక ముఠా చైనాలో షిన్‌జాంగ్‌లోని ముస్లింల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది. మన కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది అమెరికా, దానికి సాధనంగా పని చేసింది పాకిస్థాన్‌. అదే మాదిరి చైనాలో చిచ్చుపెట్టేందుకు షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో రెచ్చగొట్టింది. అక్కడి ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాల ద్వారా ఆయుధాలు, డబ్బు అందచేసింది అమెరికా. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల నుంచి అక్రమంగా వలసలను ప్రోత్సహించి వారిని ఎక్కడా అధికారికంగా నమోదు చేయకుండా సామాజిక రక్షణ కల్పించకుండా తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్న అమెరికా మానవత నిజస్వరూపం తెలియందెవరికి? లాటిన్‌ అమెరికాలో నిత్యం ఏదో ఒక దేశంలో మానవహక్కులను హరించే శక్తులకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామ్య బండారం తెలిసిందే. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.

క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పనిచేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్రదేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నాడు.


అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే వాటిని బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

11 Saturday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హొండురాస్‌లో తొలిసారి వామపక్ష జయకేతనం !

02 Thursday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Honduras elections 2021, Latin American left, Manuel Zelaya, Xiomara Castro


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌లో ఆదివారం నాడు జరిగిన ఎన్నికలలో వామపక్ష లిబరల్‌ రీఫౌండేషన్‌ పార్టీ అభ్యర్ధి గ్జియోమారో కాస్ట్రో ఆధిక్యతలో ఉన్నారు. రెండు రోజుల తరువాత ప్రతిపక్షం తన ఓటమిని అంగీకరించటంతో ఆమె విజయం ఖరారైంది. దేశకాలమానం ప్రకారం సోమవారం నాడు నిలిపివేసిన ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. రాత్రి పన్నెండు గంటల సమయానికి 59.22శాతం ఓట్లు లెక్కించగా గ్జియోమారోకు 52.25శాతం, ప్రత్యర్ధికి 34.95శాతం, మూడో స్దానంలో ఉన్న మరో అభ్యర్ధికి 9.39శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 52లక్షలకు గాను 68.78శాతం మంది ఓటువేశారు. సగం ఓట్ల తరువాత లెక్కింపు నిలిపివేత, గత ఎన్నికల్లో లెక్కింపులో జరిగిన అక్రమాలు, అమెరికా జోక్యనేపధ్యం, లెక్కింపు ప్రారంభం కాగానే తామే గెలిచినట్లు అధికార పార్టీ ప్రకటించటం వంటి పరిణామంతో ఈసారి కూడా గతాన్ని పునరావృతం చేయనున్నారా అన్న అనుమానాలు తలెత్తాయి. లెక్కింపు నిలిపివేసిన ఒక రోజు తరువాత మంగళవారం నాడు పాలకపార్టీ ఒక ప్రకటన చేస్తూ తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామంటూ ప్రకటన చేసింది. దీంతో పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లైంది. గ్జియోమారో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కనున్నారు. మీడియా ఆమె విజయం సాధించినట్లే అంటూ వార్తలిచ్చింది. ఓట్ల తేడా చాలా ఎక్కువగా ఉండటం, ఫలితాలపై సర్వత్రా చర్చ జరగటంతో విధిలేని పరిస్ధితిలో అధికారపార్టీ ఓటమిని అంగీకరించినట్లు కనిపిస్తోంది. పార్లమెంటులోని 128 స్ధానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా పద్దతిలో కేటాయిస్తారు.


పన్నెండు సంవత్సరాల తరువాత హొండురాస్‌లో మరోసారి వామపక్షనేత అధికారంలోకి రావటం లాటిన్‌అమెరికాను తన పెరటితోటగా భావిస్తున్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ.2005లో జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ సతీమణే గ్జియోమారో. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నవంబరు చివరి ఆదివారం నాడు అధ్యóక్ష, పార్లమెంట్‌, స్ధానిక సంస్ధల, సెంట్రల్‌ అమెరికన్‌ పార్లమెంట్‌ సభ్యుల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఎన్నికైన వారు మరుసటి ఏడాది జనవరి 27న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు 2006 జనవరిలో అధ్యక్షుడిగా అధికారానికి వచ్చిన జెలయా మిలిటరీ కూలదోసే వరకు (2009 జూన్‌ 28) అధికారంలో ఉన్నాడు. జెలయా పురోగామి విధానాలను అనుసరించినప్పటికీ మితవాద లిబరల్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు గెలిచిన గ్జియోమారో వామపక్ష పార్టీ తరఫున, పురోగామి అజెండాతో పోటీ చేశారు. అందువలన ఒక వామపక్షవాదిగా దేశంలో గెలిచిన తొలినేతగా పరిగణించాలి. ఇది అమెరికా సామ్రాజ్యవాదులకు మరో పెద్ద దెబ్బ-వామపక్ష శక్తులకు ఎంతో ఊపునిచ్చే పరిణామం.


ఒక సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన, మితవాద లిబరల్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి జెలయా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొన్నాడు. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. ఇది మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. కత్తిగట్టిన ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.


రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత రాజీనామా ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చింది. ఎన్నికలలో జెలయాను పోటీకి అనర్హుడిగా ప్రకటించారు మితవాదశక్తులే అధికారానికి వచ్చాయి.


2011లో లిబరల్‌ పార్టీ నుంచి జెలయా మద్దతుదారులు విడిపోయి లిబరల్‌ రీఫౌండేషన్‌ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ ఏర్పడిన నేషనల్‌ పాపులర్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (జాతీయ ప్రజాప్రతిఘటన కూటమి) దీనిని ఏర్పాటు చేసింది. 2013 ఎన్నికల్లో గ్జియామారో అధ్యక్ష పదవికి పోటీ చేసి చతుర్ముఖ పోటీలో రెండవ స్ధానంలో నిలిచి 29శాతం ఓట్లు తెచ్చుకున్నారు.2017 ఎన్నికల్లో రీఫౌండేషన్‌ పార్టీతో మరోవామపక్షం జతకట్టింది, ఆ పార్టీ నేత సాల్వడోర్‌ నసరల్లా పోటీ చేశారు. అధికారపక్షం అక్రమాలకు పాల్పడి ఓటర్ల తీర్పును తారు మారు చేసింది. ఓట్ల లెక్కింపుపేరుతో రోజుల తరబడి కాలయాపన చేసి చివరకు అధికారపక్షం గెలిచినట్లు ప్రకటించారు.విజేతకు 42.95శాతం నసరల్లాకు 41.42శాతం వచ్చినట్లు చెప్పారు.అక్రమాలకు నిరసన తలెత్తటంతో దేశంలో పది రోజుల పాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు అమలు జరిపారు.Û ఎన్నికలు జరిగిన 21 రోజుల తరువాత ఫలితాన్ని ప్రకటించారు.నెల రోజుల పాటు సాగిన నిరసనల్లో 30 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తిరిగి ఓటింగ్‌ నిర్వహించాలని సూచించినా ఖాతరు చేయలేదు. కోటి మంది జనాభా ఉన్న హొండూరాస్‌లో 2021 ఎన్నికల్లో తాము అధికారానికి వస్తే ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలు జరిపేందుకు పని చేస్తామని, నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తామని లిబరల్‌ రీఫౌండేషన్‌ ప్రకటించింది.


ఓటింగు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే తామే విజయం సాధించినట్లు అధికార నేషనల్‌ పార్టీ ప్రకటించుకుంది. బహుశా అవసరమైతే గత అక్రమాలనే పునరావృతం గావించే ఎత్తుగడ దానిలో ఉండవచ్చు. మరోవైపు మనం విజయం సాధించామని గ్జియోమారో కాస్ట్రో మద్దతుదార్లతో మాట్లాడుతూ ప్రకటించారు. రాజధాని తెగుసిగల్పాలో సంబరాలు ప్రారంభమయ్యాయి. త్రిముఖ పోటీలో అధికారపక్షం చాలా వెనుకబడి ఉంది. దాంతో ఎలాంటి ప్రకటన లేకుండానే లెక్కింపు నిలిపివేశారు. నేషనల్‌ పార్టీని అధికారంలో కొనసాగించేందుకు అక్రమాలకు పాల్పడవచ్చని పోలింగుకు ముందే ప్రతిపక్షం హెచ్చరించింది. ఓట్ల లెక్కింపు నిలిపివేసినా జనం సంయమనం పాటించారు.అడ్డదారిలో గెలిచేందుకు అధికారపక్షం పాల్పడని అక్రమాలు లేవు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగాయి. ఓటర్లను బెదిరించారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు అందించారని. అధికార మీడియా పాలక పార్టీ, అధó్యక్ష అభ్యర్ధికి అనుకూలంగా పని చేసిందని ఐరోపా దేశాల కమిషన్‌ చెప్పింది. ప్రయివేటు మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు.


అధికారపక్ష అభ్యర్ధి నసిరీ అస్ఫురా ప్రస్తుతం రాజధాని తెగుసిగల్పా నగర మేయర్‌గా ఉన్నాడు. ఏడులక్షల డాలర్ల మేరకు ప్రజల సొమ్ము మింగేసినట్లు విమర్శలున్నాయి, పండోరా పత్రాల్లో కూడా అతని అవినీతి ప్రస్తావన ఉంది. మూడో అభ్యర్ధి లిబరల్‌ పార్టీకి చెందిన యానీ రోసెంథాల్‌ నిధుల గోల్‌మాల్‌ కేసులో మూడు సంవత్సరాలు అమెరికా జైల్లో ఉండి వచ్చాడు. అబార్షన్‌ నేరం కాదంటూ చట్టసవరణ చేస్తానని, బాంకుల్లో నిధులు జమచేసేందుకు వసూలు చేసే చార్జీలను తగ్గిస్తానని, అవినీతి అక్రమాల విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని గ్జియోమారో ప్రకటించారు. నయా ఉదారవాదం మనల్ని పాతాళంలో పూడ్చిపెట్టిందని దాన్నుంచి బయటకు లాగి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలును తాము గట్టిగా నమ్ముతున్నట్లు ప్రకటించారు.సమస్యలపై సంప్రదింపులు, ప్రజాభిప్రాసేకరణ వంటి భాగస్వామ్య ప్రజాస్వామిక మార్పులను తీసుకువస్తామన్నారు. భర్త జెలయా అధికారంలో ఉన్న రెండున్నర సంవత్సరాలలో పేదల సంక్షేమ చర్యల పధకాలను రూపొందించటంలో గ్జియోమారో కాస్ట్రో కీలక పాత్ర పోషించారు. సైనిక కుట్రకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు కుటుంబ వ్యవసాయ, కలప వ్యాపారాల నిర్వహణ చూశారు. తాజా ఎన్నికల్లో జెలయా పార్టీ సమన్వయకర్తగా ఉన్నారే తప్ప ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు.


గ్జియోమారో అధికారానికి వస్తే తీవ్ర చర్యలు తీసుకుంటారని, దేశం అమెరికాతో సంబంధాల్లో ఉన్నందున ఒకవేళ తెగతెంపులు చేసుకుంటే నెల రోజులు కూడా గడవదని ఆమె మీద ప్రచారం చేశారు. చైనాతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉంటారన్న ప్రశ్నకు తైవాన్‌తో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో ఏర్పాటు చేసుకుంటామని ఆమె చెప్పారు. అమెరికా వత్తిడి, ప్రభావంతో తైవాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న పదిహేను దేశాల్లో హొండూరాస్‌ ఒకటి. ఆ దేశ వ్యవహారాల్లో తమకు వ్యతిరేకంగా అమెరికా వత్తిడి చేస్తోందని చైనా పేర్కొన్నది. గ్జియోమారో ఎన్నిక అమెరికాకు, అక్కడి మీడియాకు ఏ మాత్రం మింగుడు పడదు. అందువలన అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు పూనుకుంటారని వేరే చెప్పనవసరం లేదు. నిరుద్యోగం, నేరాలు, అవినీతి, అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాల కేంద్రంగా ఉంది. వాటిని ఎదుర్కొనే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టు పార్టీపై నోటి తుత్తర -తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన జెపి మోర్గాన్‌ సిఇఓ !

01 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Jamie Dimon joke, JP Morgan CEO's China apology, JPMorgan, JPMorgan Chase Jamie Dimon


ఎం కోటేశ్వరరావు


అది అమెరికాలో అతి పెద్ద బ్యాంకు, స్టాక్‌ మార్కెట్లో వాటాల విలువ ప్రకారం ప్రపంచంలో అతి పెద్దది. బ్యాంకులకున్న ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో ఐదవది.(మొదటి నాలుగు చైనావి) అమెరికా వాల్‌స్ట్రీట్‌లో రారాజుగా పేరు గాంచిన జెపి మోర్గాన్‌ సంస్ధ సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీకి ఒకే రోజు కొద్ది గంటల వ్యవధిలో రెండు సార్లు క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకున్నాడు. వినోద ఉత్పత్తులు అందించే అమెరికాలోని బడా కంపెనీలలో డిస్నీ ఒకటి. అది 2005లో ఒక టీవీ సీరియల్‌ నిర్మాణం చేసింది. దానిలో ఒక పాపను దత్తత తీసుకొనేందుకు ఒక కుటుంబం వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆ క్రమంలో చైనాలోని తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంది. దానిలో ” తియన్‌ ఎన్‌ మెన్‌ స్క్వేర్‌ : ఈ ప్రాంతంలో 1989లో ఏమీ జరగలేదు ” అనే బోర్డు అక్కడ ఉన్నట్లు ఆ సీరియల్‌లో చూపారు. అది చైనాను కించపరిచే లేదా పరిహసించేది తప్ప మరొకటి కాదు. హాంకాంగ్‌ ప్రాంతంలో ఆ సీరియల్‌ను ప్రసారం చేయాలంటే అలాంటి దృశ్యాలను చైనా సెన్సార్‌ నిబంధనలు అంగీకరించవు. దాంతో డిస్నీ కంపెనీ వాటిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. లాభాల కోసం మార్కెట్‌ కావాలని వెంపర్లాడుతూనే చైనాను కించపరుస్తూ వ్యవహరించే వారికి ఈ రెండు ఉదంతాలు కనువిప్పు కలిగిస్తాయా ?


అమెరికాలోని బోస్టన్‌ కాలేజీలో కంపెనీల సిఇఓలతో నిర్వహించే ఒక కార్యక్రమంలో జామీ డైమన్‌ మాట్లాడుతూ ” నేను ఇటీవల హాంకాంగ్‌లో ఒక జోక్‌ వేశాను. జెపి మోర్గాన్‌ మాదిరే చైనా కమ్యూనిస్టు పార్టీ వందవ వార్షికోత్సవం జరుపుకుంటోంది, అయితే దాని కంటే మా బ్యాంకు ఎక్కువ కాలం మనగలుగుతుందని పందెం అన్నాను ” అని చెప్పాడు. అంతే కాదు, ఈ మాటలను నేను చైనాలో చెప్పలేను, వారు ఏదో విధంగా వింటూ ఉండవచ్చు అని కూడా అన్నాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయనే భావంతో చేసిన ఈ వ్యాఖ్యలతో అమెరికన్‌ మీడియా పండగ చేసుకుంది. పెద్ద ఎత్తున ప్రచారమిచ్చింది. బ్లూమ్‌బెర్గ్‌ మరీ రెచ్చిపోయింది. తమ బ్యాంకు, దేశానికి హాని చేస్తున్నామనే అంశం ఆ క్షణంలో తట్టలేదు గానీ కొద్ది గంటల్లోనే తెలిసి వచ్చింది. ” నేను అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదు. మా కంపెనీ దీర్ఘకాలంగా ఉండటాన్ని, అదెంత బలమైనదో వక్కాణించటానికి అలా చెప్పాల్సి వచ్చింది అని జామీ డైమన్‌ ఒక ప్రకటనలో తెలిపాడు. తరువాత మరి కొద్ది గంటల్లోనే మరొక ప్రకటన చేశాడు. చైనాలో తొలిసారిగా పూర్తిగా ఒక విదేశీ బ్యాంకు స్వంతంగా స్టాక్‌మార్కెట్‌లో బ్రోకర్‌గా పని చేసేందుకు ఆగస్టు నెలలో జెపి మోర్గాన్‌ అనుమతి పొందింది. తద్వారా తన లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించాలని పధకాలు రూపొందించుకుంటోంది. ఈ దశలో అధికార కమ్యూనిస్టు పార్టీని కించపరుస్తూ డైమన్‌ నోరుపారవేసుకున్నాడు.” ఎవరి మీదా అది ఒక దేశం, దాని నాయకత్వం, లేదా సమాజంలోని ఒక భాగాన్ని, సంస్కృతి మీద జోకులు వేసేందుకు, కించపరిచేందుకు హక్కులేదు. ఆ విధంగా మాట్లాడటం ఎప్పటి కంటే మరింత అవసరమైన సమాజంలో నిర్మాణాత్మక, ఆలోచనా పూర్వకమైన సంప్రదింపులను హరించటమే అవుతుంది.” అని డైమన్‌ రెండవ ప్రకటనలో పేర్కొన్నాడు.


చైనాకు విదేశీ బాంకుల అవసరం ఉన్నప్పటికీ అక్కడ లావాదేవీలు నిర్వహించే పశ్చిమ దేశాల కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందని జామీ డైమన్‌ ఉదంతంపై పరిశీలకులు హెచ్చరించారు. 2019లో స్విస్‌ బాంకు యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్ధకు చెందిన పాల్‌ డోనోవాన్‌ చైనా గురించి నోరు పారవేసుకున్నాడు. చైనాలో స్వైన్‌ ప్లూ కారణంగా తలెత్తిన ద్రవ్యోల్బణ ప్రభావాల గురించి రాసిన నివేదికలో మీరు ఒక చైనా పంది లేదా చైనాలో పంది మాంసం తినాలనుకుంటేనే మీకు సమస్యలు అవగతం అవుతాయని పేర్కొన్నాడు.దీనిపై తీవ్ర ఆగ్రహం తలెత్తటంతో ఆ కంపెనీతో చైనా సంస్ధలు లావాదేవీలు నిలిపివేశాయి. నష్టనివారణ చర్యగా సదరు కంపెనీ అతగాడిని సస్పెండు చేసింది. హాంకాంగ్‌లోని బ్రిటన్‌కు చెందిన విమాన సంస్ధ కాథే పసిఫిక్‌ సిఇఓ 2019లో హాంకాంగ్‌ వేర్పాటువాద నిరసనలను సమర్ధించాడు.చైనా అభ్యంతరం తెలపటంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో స్వీడిష్‌ ఫాషన్‌ సంస్ధ హెచ్‌ అండ్‌ ఎం, అమెరికాకు చెందిన నైక్‌ కంపెనీ చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో బలవంతంగా ముస్లింలతో పని చేయించి పత్తి సాగు చేస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించి చైనా మీడియా, వాణిజ్య సంస్ధల విమర్శలకు గురయ్యాయి.


తమ ప్రభుత్వాన్ని నేరుగా లేదా పరోక్షంగా సవాలు చేసినప్పటికీ అవసరమైతే విదేశీ కంపెనీల వాణిజ్య లావాదేవీలను పరిమితం చేసేందుకు లేదా మూసివేసేందుకైనా సిద్దమే అని చైనా స్పష్టంగా వెల్లడించిందని కార్నెల్‌ కంపెనీ ప్రతినిధి ప్రసాద్‌.ఏ చెప్పారు. డైమన్‌ విషయానికి వస్తే హాంకాంగ్‌ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించి పర్యటనకు అనుమతించింది. అక్కడి నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారు తమ స్వంత ఖర్చుతో రెండు నుంచి మూడు వారాల పాటు హౌటల్‌ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అలాంటిది 32 గంటల డైమన్‌ రాకకు మినహాయింపు ఇచ్చారు.” తన మనసులో ఉన్నదాన్ని మాట్లాడటమే జామీ డైమన్‌లో ఉన్న ఉత్తమ-చెత్త విశిష్టలక్షణం.అదొక ఆనవాలుగా అతనికి బాగా పని చేస్తుంది. మదుపుదార్లు అభినందిస్తారు, సాధికారికమైనది భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోకి నెడుతుంది. ” అని వెల్స్‌ ఫార్గో విశ్లేషకుడు మేయో అన్నాడు.


ఈ అంశాన్ని మరింతగా పెద్దది చేయటాన్ని మీడియా ఆపితే మంచిది అని చైనా ప్రతినిధి అన్నాడు. డైమన్‌ వ్యాఖ్యలు కంపెనీ అవకాశాలను సంకటంలో పడవేశాయని ఐతే వెంటనే క్షమాపణ చెప్పినందున పెద్దగా నష్టం జరగకపోవచ్చని కొందరు చెప్పారు.గతంలో జరిగిన వాటిని చూసి డైమన్‌ భయపడ్డారని చైనా నిపుణుడు రాబర్ట్‌ లారెన్స్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పారు.చైనా జనాలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇష్టపడరన్న ఒక సాధారణ అభిప్రాయం వాస్తవం కాదు పెద్ద మెజారిటీ మద్దతు ఇస్తారు, సమస్యలు ఉండటాన్ని గుర్తించారు. కానీ తలసరి జిడిపి 50 రెట్లు పెరగటాన్ని వారు చూశారు.ఎనభై కోట్లకుపైగా జనాన్ని దారిద్య్రం నుంచి బయటపడవేశారు. ప్రపంచమంతటా కలిపి చూసినా వాటి కంటే ఎక్కువగా ఉన్న వేగవంతమైన రైళ్లను చూశారు. కాబట్టే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారు ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తితో ఉన్నారని లారెన్స్‌ చెప్పాడు.


జామీ డైమన్‌ ఇలా నోరుపారవేసుకోవటం, అహంకార ప్రదర్శన వెనుక ఏముంది అనే చర్చ కూడా జరిగింది.గత పదహారు సంవత్సరాలుగా జెపి మోర్గాన్‌ సిఇఓగా కొనసాగుతున్నాడు.2008లో తలెత్తిన ద్రవ్యసంక్షోభం నుంచి సంస్ధను కాపాడాడు, మంచి సమర్ధకుడిగా వాల్‌స్ట్రీట్లో పేరు తెచ్చుకున్నాడు, ప్రస్తుతం 65 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పటికీ మరో ఐదు సంవత్సరాలు సారధిగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇతగాడి నిర్వాకాలు వాటి మీద పడిన మచ్చలేమీ చిన్నవి కాదు. 2012లో లండన్‌ బ్రాంచి ద్వారా నిర్వహించిన లావాదేవీల్లో అక్రమాలకు గాను ఆరుబిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. ఒక బి.డాలర్ల మేర జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో ఏడాదికి అతడి 23మిలియన్‌ డాలర్లవేతనాన్ని సగానికి కోత పెట్టారు.తరువాత తన పదవిని కాపాడుకొని అర్ధికంగా ఎంతో లబ్ది పొందాడు. నోరు ఒక్క చైనా మీదనే కాదు, డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా వదల్లేదు.2018లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి మాట్లాడుతూ తాను ట్రంప్‌ కంటే తెలివిగలవాడినని, వారసత్వంగా పొందినది గాక తెలివితేటలతో ఆస్తి సంపాదించుకున్నానని అన్నాడు. వెంటనే ఒక ప్రకటన చేస్తూ తానలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తాను మంచి రాజకీయవేత్తను కాదని తన మాటలు రుజువు చేశాయన్నాడు.


జామీ డైమన్‌ ఉదంతం దక్షిణ కొరియాలో చర్చను రేపింది. చైనాతో వాణిజ్యమిగులు ఉన్న దేశాలలో అది ఒకటి. ఇటీవల అక్కడి షిన్‌సెగే గ్రూపు ఉపాధ్యక్షుడు చంగు యాంగ్‌ జిన్‌ చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక వ్యాఖ్యను వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించటం రానున్న దినాల్లో సమస్యలు తేవచ్చని భావిస్తున్నారు. నవంబరు 15న ఒక పీజా దుకాణం వద్ద ఇద్దరు సిబ్బందితో కలసి ఒక ఫొటో తీసుకున్నాడు, దాని మీద తనపైత్యాన్ని జోడించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. పీజా బాక్సుమీదు ఎరుపు రంగులో ముద్రించిన లోగో ఉంది. సిబ్బంది కూడా ఎరుపు దుస్తులు ధరించి ఉన్నారు.” కొన్ని కారణాలతో ఫొటోను చూస్తుంటే అది కమ్యూనిస్టు పార్టీ సంబంధితంగా ఉంది. అపార్ధం చేసుకోవద్దు. నేను కమ్యూనిజాన్ని ద్వేషిస్తాను ” అని వ్యాఖ్యానించాడు. ఉత్తర కొరియాను కించపరచటం, అపహాస్యం చేస్తూ చిత్రించిన స్వికిడ్‌ గేమ్‌ అనే సీరియల్‌ను ఒక స్మగ్లర్‌ ఉత్తర కొరియాలోని వారికి అందించాడని, అందుకుగాను అతడిని ఉరితీసినట్లు వచ్చిన వార్తల మీద నవంబరు 24న స్పందిస్తూ కమ్యూనిజాన్ని ద్వేషిస్తానని పేర్కొన్నాడు. యాభై మూడు సంవత్సరాల చుంగ్‌ తన చిన్నతనంలో ప్రచ్చన్న యుద్దవాతావరణంలో కమ్యూనిస్టు వ్యతిరేకిగా పెరిగానని తన చర్యలను సమర్ధించుకున్నాడు. ప్రతివారికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందని అయితే చుంగ్‌ ఒక కంపెనీ బాధ్యతలో ఉన్నందున అపార్ధం చేసుకొనే లేదా తప్పుడు భాష్యం చెప్పటానికి వీలున్న వ్యాఖ్యలను చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని జుంగ్‌ యోన్‌ సంగ్‌ అనే ప్రొఫెసర్‌ చెప్పాడు.


చైనాలో లావాదేవీలు నిర్వహించాలనుకొనే వారికి కమ్యూనిస్టు పార్టీ, దేశం గురించి కొన్ని పాఠాలు నేర్చుకొని రావాలని చైనా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ ఝాంగ్‌ టెంగ్‌జున్‌ అన్నాడు. అమెరికా కంపెనీల విజయం వెనుక చైనా మార్కెట్‌ ఉందని, చైనా విజయం వెనుక కమ్యూనిస్టు పార్టీ వెన్నుదన్నుగా ఉందని, రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని వారు చూడరా అని ప్రశ్నించాడు. నిజం ఏమిటంటే వారు ఇప్పటికీ చైనాను అర్ధం చేసుకోవటం లేదు. వారు చైనా నుంచి లాభాలను మాత్రమే చూస్తున్నారని అన్నాడు. ఇంటి వారు మాంసంతో పెట్టిన భోజనం చేసిన వాడు తరువాత వారినే దూషించినట్లు అనే ఒక సామెత చైనాలో ఉంది.(తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు, పెట్టిన చేతినే కొట్టాడు లేదా తిట్టాడు అన్న మన సామెతలు కూడా అలాంటివేే) సిఇఓ, బిలియనీర్లైన వాణిజ్యవేత్తలు అర్ధం చేసుకోవాలని, బహుశా జామీ డైమన్‌ దాన్ని మరచి ఉంటాడు, తరువాత వెంటనే గుర్తుకు తెచ్చుకొని ఉంటాడని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ఆగస్టులో చైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో జెపి మోర్గాన్‌ బాంకు చైనాలో 20బి.డాలర్ల మేరకు లావాదేవీలు జరిపే వీలుందని, ఇంకా పెరగవచ్చని అంచనా.ఇంతటి మేలు చేకూర్చిన చైనా పాలకపార్టీ మీద ఇంత త్వరలోనే నోరు పారవేసుకున్న నేపధ్యంలో చైనా సామెతను గుర్తు చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు !

28 Sunday Nov 2021

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

History, Joseph v Stalin, Russia's Communist Party, statues of Stalin, Thomas Jefferson


ఎం కోటేశ్వరరావు

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు అనే శీర్షికతో అమెరికాలోని అగ్రపత్రికల్లో ఒకటైన లాస్‌ ఏంజల్స్‌టైమ్స్‌ నవంబరు 20న ఒక విశ్లేషణను ప్రచురించింది. ఇదే సమయంలో ఒక స్మారక చిహ్నానికి ఉన్న చట్టబద్దతను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటీషన్‌పై రష్యా సుప్రీం కోర్టు విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. పూర్వపు సోవియట్‌లో జరిగినట్లు చెప్పే మానవహక్కుల ఉల్లంఘనకు బలైన వారి పేరుతో స్టాలిన్‌, కమ్యూనిస్టు పార్టీ మీద బురద చల్లేందుకు ఏర్పాటు చేసినదే సదరు స్మారక చిహ్నం. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ ప్రభుత్వానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల మీద ప్రేమ పుట్టుకువచ్చి ఈ కేసు దాఖలు చేశారా ?
చరిత్ర నిర్మాతలు జనం, వారికి మద్దతుగా నిలిచిన నేతలు అన్నది తిరుగులేని సత్యం.బ్రిటన్‌ మాజీ ప్రధాని వినస్టన్‌ చర్చిల్‌ చరిత్రను రాసేది విజేతలు అని చెప్పారు. అంతకు ముందు కారల్‌ మార్క్స్‌ చరిత్ర గురించి చెబుతూ చరిత్ర పునరావృతం అవుతుంది, తొలుత అది విషాదకరంగా తరువాత ప్రహసనంగా అన్నారు. చర్చిల్‌ చెప్పినట్లు దేశంలో పూర్తి అధికారాన్ని సాధించిన విజేతగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) తనకు అనుకూలంగా చరిత్రను తిరగరాసేందుకు పూనుకుంది.కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు అది విషాదకరమే, రెండవది ఆ పరివారంతో ప్రభావితమై దేశానికి 1947వచ్చింది భిక్ష తప్ప నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌ చెప్పటం ప్రహసన ప్రాయమే.( కారల్‌ మార్క్స్‌ ఏ సందర్భంలో,ఏ అంశాల ప్రాతిపదికన అలా చెప్పారని విశ్లేషకులు తలలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు)


అనేక దేశాల్లో చరిత్ర గురించి చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.అమెరికాలో కూడా అదే జరుగుతోంది. లాస్‌ఏంజల్స్‌టైమ్స్‌ విశ్లేషణ రచయిత నికోలస్‌ గోల్డ్‌బెర్గ్‌ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను రాశారు. మరోసారి అమెరికన్లు చరిత్ర గురించి పోట్లాడుకుంటున్నారు అనే వాక్యంతో ప్రారంభించారు. తాజమహల్‌ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించినట్లే అమెరికా నిర్మాతలెవరు, ఏ పునాదులమీద నిర్మించారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యాన్ని ప్రస్తావిస్తూ అమెరికా నిర్మాతగా పరిగణించే థామస్‌ జఫర్సన్‌ – నాజీల పీచమణచిన కమ్యూనిస్టు నేత స్టాలిన్ల గురించి రాశారు. స్టాలిన్ను నియంతగా వర్ణిస్తూ మే నెలలో జరిగిన సర్వేలో 56శాతం మంది రష్యన్లు స్టాలిన్ను గొప్పనేతగా పరిగణించటం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ తన రాజకీయ అవసరాల కోసం స్టాలిన్‌కు పునరావాసం కల్పిస్తున్నారని, గత తరాలు ధ్వంసం చేసిన విగ్రహాల స్ధానంలో కొన్ని పట్టణాలలో తిరిగి ప్రతిష్ఠిస్తున్నారని రచయిత వాపోయాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ప్రధాన రచయిత ధామస్‌ జఫర్సన్‌ ఆరువందల మంది బానిసలను కూడా కలిగి ఉన్నాడని, అలాంటి వ్యక్తి విగ్రహం తమ సిటీ హాల్‌లో ఉండటం అవమానకరమంటూ దాన్ని తొలగించాలని న్యూయార్క్‌ నగరపాలక సంస్ధ ఏకగ్రీవంగా తీర్మానించటం గురించి గగ్గోలు పెట్టాడు. అందుకే జఫర్సన్‌ విగ్రహాలను తొలగిస్తుంటే స్టాలిన్‌ విగ్రహాలను కొత్తగా పెడుతున్నారంటూ విశ్లేషణ చేశాడు.


సోవియట్‌ను కూల్చిన తొలి రోజుల్లోనే స్టాలిన్‌ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు.2016లో దాన్ని విదేశీ ఏజంట్‌గా ప్రకటించారు.దాని ప్రకారం మానవహక్కుల సంస్దల పేరుతో దాన్ని నిర్వహిస్తున్నవారి మీద చర్య తీసుకోవచ్చు. రాజకీయంగా తమను అణచివేసేందుకే పుతిన్‌ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసేందుకు పూనుకుందని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా స్టాలిన్‌ మీద జనంలో పెరుగుతున్న సదభిప్రాయం కారణంగానే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు పుతిన్‌ కూడా ఎత్తులు వేస్తున్నాడన్నది స్పష్టం. రష్యాకోర్టులో తమ కేసు వీగిపోతే ఐరోపా కోర్టుకు వెళతామని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ ఏజంట్లనే ముద్రవేసి పుతిన్‌ తన రాజకీయ ప్రత్యర్దులను దెబ్బతీస్తున్నాడు. కమ్యూనిస్టు ఎంపీ మీద కూడా తప్పుడు కేసు పెట్టించాడు.


2010లో స్టాలిన్‌ విగ్రహాలకు మద్దతు ఇచ్చిన వారు 25శాతం, వద్దన్నవారు 36శాతం కాగా ఈ ఏడాది ఆగస్టులో అవి 48 – 20శాతాలుగా ఉన్నట్లు లెవడా కేంద్రం సర్వే వెల్లడించింది.2005-21 మధ్యకాలంలో 18-24 ఏండ్ల వయసులో ఉన్న వారిలో స్టాలిన్‌ పట్ల అభిమానం ఐదు రెట్లు పెరిగింది. స్టాలిన్‌ గొప్పనేత అని చెప్పిన వారు ఈ ఏడాది మేనెల సర్వేలో 56శాతం మంది ఉన్నట్లు, 2016తో పోల్చితే రెట్టింపు అని లెవడా తెలిపింది. ద్వితీయ ప్రపంచ యుద్దంలో సోవియట్ల చర్యలను నాజీలతో పోల్చటాన్ని నిషేధిసూపార్లమెంట్‌ చేసిన తీర్మానానికి ఈ ఏడాది జూలైలో పుతిన్‌ ఆమోద ముద్రవేశాడు.యుద్దంలో పౌరుల నిర్ణయాత్మక పాత్రను తోసిపుచ్చటాన్ని కూడా నిషేధించారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ పతనంలో స్టాలిన్‌ పాత్ర చెరిపితే చెరిగేది కాదు. స్టాలిన్‌ మరణం తరువాత నాటి పార్టీనేతలు చేయని తప్పుడు ప్రచారం లేదు, మసోలియం నుంచి భౌతిక కాయాన్ని తొలగించి క్రెమ్లిన్‌లో సమాధి చేశారు. సోవియట్‌ పతనం ముందు తరువాత కూడా తప్పుడు ప్రచారం సాగినా ఇటీవలి కాలంలో స్టాలిన్‌ పట్ల రోజు రోజుకూ జనంలో అభిమానం పెరుగుతోంది. స్టాలిన్‌ గురించి ఇతర దేశాల్లో సాగించిన తప్పుడు ప్రచార నేపధ్యంలో అనేక మందికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు గానీ రష్యన్లు ఆ విధంగా భావించటం లేదు. తమ దేశ ఔన్నత్యం నిలిపిన నేతగా పరిగణిస్తున్నారు.


స్టాలిన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా నాజీలు ఆకస్మికంగా దాడి చేసినపుడు ఎర్రసైన్యం పసిగట్టలేకపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారణంగా 2005 సర్వేలో స్టాలిన్‌ తగిన సన్నాహాలు చేయలేదనే అభిప్రాయం 40శాతం కలిగి ఉండగా 2021లో 17శాతానికి తగ్గింది. స్టాలిన్‌ గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలిపేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని మాస్కోకు 450 కిలోమీటర్ల దూరంలోని నోవోగోర్డ్‌ కమ్యూనిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధినేత జుగనోవ్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని కుప్పకూల్చి జన సంపదలను దోచుకున్న వారు ఎల్సిన్‌ పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినపుడు స్టాలిన్‌ పేరుతో ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించకూడదని జుగనోవ్‌ సహాయకుడు అలెగ్జాండర్‌ యుషి చెంకో అన్నారు. గతంలో ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదని, సోవియట్‌ పతనం తరువాత పుట్టిన, పెరిగిన యువతరం ఇప్పుడు సానుకూల వైఖరితో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి.


వివిధ సర్వేలలో స్టాలిన్‌ పట్ల సానుకూల వైఖరి వెల్లడి కావటం అంటే నూతన తరంలో సోషలిజం, కమ్యూనిజం పట్ల ఆసక్తి పెరగటం, కూల్చివేసిన సోషలిస్టు సమాజంతో ప్రస్తుత పరిస్ధితులను పోల్చుకోవటం సహజంగానే జరుగుతుంది. అది ఇప్పుడున్న పుతిన్‌ లేదా ఇతర అధికార బూర్జువా పార్టీలకు అంగీకారం కాదు. రెండవది రోజు రోజుకూ పుతిన్ను సమర్ధించేవారు తగ్గుతున్నారు. సర్వేల ఫలితాలు జనంలో చర్చకు దారి తీస్తున్నాయి. దీంతో సర్వేలు రష్యా సమాజాన్ని ప్రతిబింబించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.కొందరైతే సర్వేల్లో అసలు స్టాలిన్‌ గురించి అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రష్యన్‌ చరిత్రలో స్టాలిన్‌ పాత్ర గురించి జనం 70శాతం మంది సానుకూలంగా స్పందిస్తున్నపుడు పండితులు దాన్ని ఎలా కాదో చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు, లెవడా సర్వేలు అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి, స్టాలిన్‌ యుద్ధ విజేత, తెలివిగల నేత అని భావిస్తున్నారు. స్టాలిన్ను అభిమానించే వారు పెరగటం అంటే పాలకపార్టీ పట్ల అసంతృప్తి పెరగటంగా భావించవచ్చని కొందరు సూత్రీకరిస్తున్నారు. గతంలో స్టాలిన్ను ఒక నియంత, బూచిగా ఒక పధకం ప్రకారం చూపారు, చరిత్రను చూస్తే మహత్తర పోరాటం సాగించిన స్టాలిన్‌ మీద ఎల్లకాలం బురదచల్లటం కొనసాగించలేని స్ధితిలో జనాలు నిజాలు తెలుసుకుంటున్నారు. వాటిని పుతిన్‌ సహిస్తాడా ? చరిత్రలో వ్యక్తుల పాత్ర తక్కువేమీ కాదు. కానీ చరిత్ర అంటే వ్యక్తులు కాదు. వ్యక్తి ఆరాధనలకు పురోగామి వాదులు, కమ్యూనిస్టులు వ్యతిరేకం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పట్టువీడని జీ జింపింగ్‌ – మెట్టు దిగిన జో బైడెన్‌ !

17 Wednesday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Joe Biden, Xi Jinping, Xi-Biden virtual summit


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌, అమెరికా అధినేత జో బైడెన్‌ మధ్య మంగళవారం నాడు ( వాషింగ్టన్‌లో సోమవారం రాత్రి) మూడు గంటల 24నిమిషాల సేపు వీడియో కాన్ఫరెన్సుద్వారా రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. వెలువడిన ప్రాధమిక సమాచారం మేరకు అధినేతలిద్దరూ అనేక అంశాల గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య 1979లో దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత తొలిసారిగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, వివాదాల నడుమ అసలు భేటీ కావటమే ఒక విశేషం. బైడెన్‌ అధికారానికి వచ్చిన 300వ రోజు ఈ భేటీ జరిగింది. సుహృద్భావ సూచికగా రెండు దేశాల నేతలు సమావేశానికి హాజరైన సమయంలో బైడెన్‌ చైనా ఎర్రజెండాకు చిహ్నంగా ఎర్ర రంగు టై ధరించగా, అమెరికా అధికారపార్టీ రంగైన నీలి రంగు టై ధరించి గ్జీ జింపింగ్‌ పాల్గొన్నారు.


రెండు దేశాల సంబంధాలలో ఒక నిశ్చయాన్ని లేదా విశ్వాసాన్ని ఈ సమావేశం నింపిందని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. పరస్పరం సహకరించుకోవాలనే అభిలాష వ్యక్తం కావటం ప్రపంచానికి సానుకూల సూచికగా పరిగణిస్తున్నారు. సహజంగా ఇలాంటి సమావేశాలలో మాట్లాడే అగ్రనేతలెవరూ సానుకూల వచనాలే పలుకుతారు. ఇక్కడా అదే జరిగింది. తరువాత ఎవరెలా ప్రవర్తించేదీ చూడాల్సి ఉంది. రెండు దేశాలూ పరస్పరం గౌరవించుకోవాలి, శాంతితో సహజీవనం చేయాలి, ఉభయ తారకంగా సహకరించుకోవాలని, సానుకూల మార్గంలో ముందుకు వెళ్లేందుకు రెండు దేశాలూ చురుకైన అడుగులు వేయాలని జింపింగ్‌ చెప్పాడు.దాపరికం లేకుండా నిర్మొగమాటం లేకుండా చర్చల కోసం చూస్తున్నానని, రెండు దేశాల మధ్య ప్రస్తుత మార్గాన్ని ఘర్షణవైపు మళ్లించవద్దని, రెండు దేశాల మధ్య ఉన్న పోటీ బాటను పోరువైపు మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరుదేశాల అగ్రనేతల మీద ఉందని, ఇరుపక్షాలూ పరిస్ధితి చేజారకుండా తగిన జాగ్రత్తలు(గార్డ్‌ రెయిల్స్‌ – మెట్లు, గోడల మీద నడిచేటపుడు పడకుండా పట్టుకొనేందుకు ఇనుప రాడ్లు, కర్రలు, తాళ్లవంటివి ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ఇరు దేశాల వైఖరులు కుప్పకూలిపోకుండా జాగ్రత్తలు) తీసుకోవాలని జోబైడెన్‌ చెప్పాడు. దానికి ప్రతిగా జింపింగ్‌ కూడా స్పందించాడు.చైనా -అమెరికాలు సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు పెద్ద ఓడల వంటివి.ఒకదానినొకటి ఢకొీట్టుకోకుండా ఉండాలంటే అలలను ఛేదించుకుంటూ ముందుకు పోవాలంటే ఒకే వేగం, దిశ మారకుండా సాగేందుకు చుక్కానుల మీద అదుపు కలిగి ఉండాలి అన్నారు.


చైనా తరఫున కమ్యూనిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డింగ్‌ గ్జూఎక్సియాంగ్‌, ఉప ప్రధాని లి హె, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా వైపు నుంచి ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, ఇతరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు ఫిబ్రవరి, సెప్టెంబరు నెలల్లో ఫోన్‌ ద్వారా అధినేతలు మాట్లాడుకున్నారు. వాటిలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ భేటీ కావాలని నిర్ణయించారు. ముఖాముఖీ సమావేశం కావాలని బైడెన్‌ కోరినప్పటికీ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా గ్జీ జింపింగ్‌ విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నందున వీడియో సమావేశం జరిగింది.


ఈ సమావేశానికి ముందు జరిగిన పరిణామాలను బట్టి అమెరికా జో బైడెన్‌ ఒక మెట్టు దిగినట్లుగా సంకేతాలు వెలువడ్డాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విధించిన కొన్ని సుంకాలను ఎత్తివేసేందుకు సముఖంగా ఉన్నట్లు అమెరికా నేతలు సూచన ప్రాయంగా వెల్లడించారు. వాణిజ్య యుద్దాన్ని 2018లో ట్రంప్‌ ప్రారంభించిన తరువాత చైనా కూడా అదే మాదిరి స్పందించింది. అందువలన ముందుగా అమెరికన్లే స్పందించాలనే వైఖరిని చైనా ప్రదర్శిస్తోంది. అహం అడ్డువచ్చిన అమెరికా ఇతర విధాలుగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌, జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో ముస్లింలను అణచివేస్తున్నారని, భారీ సంఖ్యలో చైనా అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నదంటూ చేస్తున్న ప్రచారం, చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం(క్వాడ్‌), అకుస్‌ పేరుతో చేస్తున్న సమీకరణల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.


అమెరికా ఒక మెట్టుదిగటానికి అక్కడి పరిస్ధితులు, జోబైడెన్‌పై సాధారణ జనం, వాణిజ్యవేత్తల నుంచి వస్తున్న వత్తిడి, జోబైడెన్‌ పలుకుబడి దిగజారుతున్నట్లు వెలువడుతున్న సర్వేలు, వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు బైడెన్‌ యంత్రాంగం మీద వత్తిడిని పెంచుతున్నాయి.ఇరునేతల భేటీకి ఒక రోజు ముందు ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ అమెరికాలోని సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ చైనా సరకుల మీద విధించిన దిగుమతి పన్నులు స్దానికంగా ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు. పన్నులను రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు వాటిని తొలగిస్తే కొంత తేడా ఉంటుందని ఆమె అంగీకరించారు. రెండు దేశాల మధó పన్నులు తగ్గించాలని ఒక ఒప్పందం కుదిరినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు, పన్నుల తగ్గింపు కోరికలను తాము గుర్తించామని అమెరికా వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారు.


ప్రస్తుతం అమెరికాలో 31 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 6.2శాతంగా నమోదైంది.సరఫరా వ్యవస్ధలు చిన్నాభిన్నమై అనేక దుకాణాలు సరకులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం ఆర్ధిక రంగం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ ఎప్పుడు కోలుకుంటుందో తెలియటం లేదు. ఈ నేపధ్యంలో సామాన్యులతో పాటు తామూ ప్రభావితులం అవుతున్నామని 24వాణిజ్య సంఘాల ప్రతినిధులు పన్నులను రద్దు చేయాలని కోరారు. అమెరికా-చైనా వాణిజ్య మండలి కూడా అదే కోరింది. సెక్షన్‌ 301పేరుతో విధించిన పన్నుల కారణంగా వందల బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతిదారులు చెల్లించారు, ఆమేరకు వినియోగదారుల మీద భారం పడింది. పన్నులను రద్దు చేస్తే చైనా కంటే అమెరికాకే ఎక్కువ ఉపయోగం కనుకనే బైడెన్‌ మెట్టుదిగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా చైనా కూడా కొన్ని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వెంటనే కోలుకొని వృద్ధి రేటుతో ముందుకు పోతున్నది.చైనాలో ధరలు స్ధిరంగా ఉంటేనే అమెరికాలో కొంత మేరకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలుగుతారని భావిస్తున్నారు. జో బైడెన్‌ విధానాలను సమర్ధిస్తున్నవారు 41శాతం మందే అని ఆదివారం నాడు ఎబిసి సర్వే ప్రకటించింది. ఈగ్రాఫ్‌ క్రమంగా తగ్గుతున్నది. ట్రంప్‌తో పోలిస్తే కాస్తమెరుగ్గా ఉన్నప్పటికీ ఏడాది కూడా గడవక ముందే ఇలా పడిపోవటం అధికార డెమోక్రటిక్‌ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నతీరును 39శాతం మంది మాత్రమే సమర్ధించారు.క్రిస్మస్‌, ఇతర పండుగల సీజన్‌లో ఆహారపదార్ధాలు, ఇతర వస్తువులకు కొరత ఏర్పడవచ్చని జనం భావిస్తున్నారు.


అమెరికన్లు ఒక్క చైనా మీదనే కాదు చివరికి మిత్రదేశాలుగా ఉన్న జపాన్‌, దక్షిణకొరియాల మీద కూడా పన్నుల దాడి చేస్తున్నారు. ఒకవైపున బైడెన్‌-జింపింగ్‌ భేటీ జరుగుతుండగా అమెరికా వాణిజ్యమంత్రి గినా రైమోండో, వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి జపాన్‌, ఇతర ఆసియాల పర్యటనకు వచ్చారు.ఉక్కు, అల్యూమినియంలపై పన్ను తగ్గించాలని కోరుతున్నారు.తనకు దక్కనిది ఇతరులకూ దక్కకూడదన్నట్లుగా అమెరికా తీరు ఉంది. చైనాలో చిప్‌ల తయారీ పరిశ్రమను పెట్టవద్దని ఇంటెల్‌ కంపెనీని బైడెన్‌ అడ్డుకున్నాడు. చైనాకు వాటి సరఫరా నిలిపివేయాలని తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా కంపెనీల మీద వత్తిడి తెస్తున్నాడు. ఇది చైనాతో ఆ దేశాల సంబంధాల మీద కూడా ప్రభావం చూపనుంది.చైనా వస్తువులపై పన్నులను ఎత్తివేయటం చైనాకు ఎంత లాభమో అమెరికాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది.చైనాలో ఆర్ధిక రంగం వేగం తగ్గితే పర్యవసానాలు ప్రపంచం మొత్తం మీద పడతాయని అమెరికా ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ చెప్పారు.


అక్టోబరు నెలలో అనేక చైనా విమానాలు తమ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వైపు పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా ఇటీవలి కాలంలో దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడటమే గాక ఒక వేళ విలీనానికి చైనా బల ప్రయోగం చేస్తే తాము జోక్యం చేసుకుంటామని ప్రకటించి రెచ్చగొట్టింది.తన నౌకలను ఆ ప్రాంతానికి పంపింది. చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం జరిపిందని ప్రచారం చేయటమే గాక 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు సమకూర్చుకోనుందని తప్పుడు ప్రచారం మొదలెట్టింది. ఇప్పటికిప్పుడు అమెరికాలో ఎన్నికలు జరిగితే మెజారిటీ ఓటర్లు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఓటు వేస్తారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఉభయ సభల్లో మెజారిటీని కోల్పోతే రానున్ను మూడు సంవత్సరాల్లో బైడెన్‌ సర్కార్‌ను రిపబ్లికన్లు అటాడుకుంటారు. అదిరింపులు, బెదరింపులు పని చేయకపోతే తమ అవసరాల కోసం అమెరికన్లు దిగి వస్తారని గతంలో అనే సార్లు రుజువైంది. ఇప్పుడు చైనా విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా స్ధానిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని బైడెన్‌ పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.


ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అమెరికా కాస్త వెనక్కు తగ్గుతోందనేందుకు సూచికగా చెప్పవచ్చు. తైవాన్‌ విలీనానికి బలవంతంగా పూనుకుంటే జోక్యం చేసుకుంటామని ప్రకటించి బైడెన్‌ నోరు జారాడు. అది దశాబ్దాల కాలంగా అమెరికా అనుసరిస్తున్న ఒక చైనా వైఖరికి విరుద్దం. వెంటనే అధ్యక్ష భవనం ఒక ప్రకటన విడుదల చేసి తమ ఒక చైనా విధానంలో ఎలాంటి మార్పు లేదని వివరణ ఇచ్చింది. తైవాన్‌ తనను తాను రక్షించుకొనేందుకు సాయం పేరుతో ఆయుధాలు విక్రయిస్తూ సాయుధం గావిస్తోంది. చైనా టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీ హువెయి ఉన్నత అధికారిణి మెంగ్‌ వాన్‌ ఝౌ మీద ఆంక్షలు విధించిన అమెరికా ఆమె మెక్సికో వెళుతుండగా కెనడా విమానాశ్రయంలో అరెస్టు చేయించిన అంశం తెలిసిందే. ఇరాన్‌ మీద తాము విధించిన ఆంక్షలను సదరు కంపెనీ ఉల్లంఘించిందంటూ కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఇద్దరు కెనడియన్లను చైనా అదుపులోకి తీసుకుంది. ఈ ఉదంతంలో అమెరికా దిగివచ్చి కేసు ఎత్తివేసేందుకు అంగీకరించి వాంగ్‌ విడుదలకు చొరవ చూపింది.తైవాన్‌ సమస్యలో అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని, దానితో ఆడుకుంటే ఆ నిప్పుతోనే కాలిపోతుందని గ్జీ జింపింగ్‌ మంగళవారం నాడు మరోసారి హెచ్చరించాడు. కీలక అంశాల మీద ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేయటమే ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా గ్రామాల నిర్మాణం నిజానిజాలేమిటి : మీడియా పాత్ర దేశభక్తా – దేశ ద్రోహమా ?

12 Friday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, CDS Rawat, China- India dispute, Line of Actual Control, Narendra Modi, Pentagon on China military, RSS


ఎం కోటేశ్వరరావు


” భారత భూభాగాల్లో అరుణాచల్‌ సమీపంలో చైనా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తున్నది ” అమెరికా పార్లమెంట్‌కు అక్కడి రక్షణ శాఖ పెంటగన్‌ ఇటీవల వార్షిక నివేదికలో చేసిన వ్యాఖ్యలలో ఒకటి. ఇంకేముంది దున్న ఈనిందని చెప్పగానే గాటన కట్టేయమన్నట్లుగా మీడియా మన జనాలకు ఆ వార్తను అందించింది. ఇంత ఘోరమా అని అనేక మంది ఆగ్రహించారు. చైనాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది, ఏదో ఒకటి చేయాలని జనాలు కొందరు ఊగి ఊగిపోయారు. చుట్టుముడుతున్న సమస్యల నుంచి జనాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అని నిరంతరం మార్గాలు వెతికే పాలకులకు కాగల పని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టి పెంటగన్‌, మీడియా తమ పాత్రలను తాము చక్కగా పోషించాయి. నివేదిక, వార్తలు వెలువడిన కొద్ది రోజుల తరువాత తాపీగా ప్రభుత్వం, మిలిటరీ అధికారి రంగంలోకి దిగారు. ఆ చెప్పేదేదో మరుసటి రోజే చెబితే జనాలకు అనవసర ఆయాసం తప్పేది కదా ! బుర్రలు ఖరాబు చేసుకొని ఉండేవారు కదా కదా !! ఎందుకు ఆలశ్యం చేసినట్లు ?


కావాలనే ఆలశ్యంగా స్పందించారన్నది స్పష్టం. పెంటగన్‌ ప్రచారాన్ని కొనసాగనిస్తే చైనా వారు ఏకంగా గ్రామాలనే నిర్మిస్తుంటే మన ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నది అని ఆవేశం నుంచి తేరుకున్న జనం ప్రశ్నిస్తారు, వాడెవడో అమెరికా వాడు చెప్పేంతవరకు మన సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న సంగతులే తెలియకుండా లేదా తెలుసుకోకుండా మన ముసలి జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు ? దేశ రక్షణ బాధ్యత తనదే అని పదే పదే ప్రకటించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవద్దా అని జనం అడుగుతారు. రెండోవైపు నుంచి పెంటగన్‌ చెప్పినదాని మీద మీరు మాట్లాడలేదంటే అది నిజమే అని మీరు నమ్మినట్లే అని మేం భావించవచ్చా అని చైనా వారు కూడా అడుగుతారు. అందుకే స్పందించారు. ఏమన్నారు ?


భారత భూభాగంలో చైనా వారు గ్రామాలు నిర్మిస్తున్నారన్నది వాస్తవం కాదు అని మన రక్షణ దళాల ప్రధాన అధికారి (సిడిఎస్‌) బిపిన్‌ రావత్‌ గురువారం నాడు అన్నీ పుకార్లే అని చెప్పారు. వాస్తవాధీన రేఖ అన్న దానికి మన ప్రస్తుత అవగాహనకు విరుద్దంగా ఎలాంటి చొరబాట్లు లేవు, గ్రామాల నిర్మాణం కోసం రేఖను దాటి రాలేదు, ఆ వార్తలు వాస్తవం కాదు, నిర్మించారని చెబుతున్న గ్రామాలు వాస్తవాధీన రేఖకు చైనా వైపే ఉన్నాయి అని రావత్‌ చెప్పారు. మాకు తెలిసినంత వరకు అలాంటి గ్రామ అభివృద్ధి వాస్తవాధీన రేఖకు మన వైపున జరగలేదు. కొత్త గ్రామాన్ని నిర్మించేందుకు చైనా వారు రేఖను దాటి మన ప్రాంతంలోకి వచ్చి నిర్మాణం చేశారన్న వార్తమీద ప్రస్తుత వివాదం తలెత్తింది. బహుశా ప్రత్యేకించి ఇటీవల మనతో తలపడిన తరువాత వాస్తవాధీన రేఖ వెంట వారి సైనికులు, పౌరుల కోసం లేదా భవిష్యత్‌లో మిలిటరీ అవసరాల కోసం గ్రామాలను నిర్మిస్తుండవచ్చు అని కూడా రావత్‌ చెప్పారు. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖ వెంట దళాలను నియమిస్తున్నాయి. చైనీయులు తమవైపు కొత్త పోస్టులను ఏర్పాటు చేసినపుడు అక్కడ కొన్ని శిధిలమైన, పాత గుడిసెలను మనం చూస్తున్నాము. కాబట్టి కొన్ని దెబ్బతిన్నపుడు కొత్త వాటిని నిర్మించవచ్చు, ఆధునిక నిర్మాణాలు జరుపుతుండవచ్చు, వాటిలో కొన్ని గ్రామాలు కూడా ఉండవచ్చు, ఉన్నవాటిని విస్తరించి ఉండవచ్చు, చైనా సైనికులు తమ ప్రధాన ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, మన సైనికులు సంతోషంగా ఉండటాన్ని వారు చూస్తున్నారు, మన పౌరులు ఆప్రాంతాలకు వెళతారు, మన కుటుంబాలు ఆప్రాంతాలను సందర్శిస్తాయి, వీటన్నింటినీ వారు చూస్తారు. అందువలన వారి సైనికుల కుటుంబాలు ఆ ప్రాంతాలకు వచ్చేందుకు కూడా వాటిని నిర్మిస్తుండవచ్చు, మన సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు తమ కుటుంబాలను చూసేందుకు స్వస్ధలాలకు వెళతారు, చైనీయులకు అలాంటి అవకాశం లేదు అని రావత్‌ అన్నారు.


వాస్తవాధీన రేఖ అంటే అనేక అవగాహనలు ఉన్నాయి. మన సైనికులకు వాస్తవాధీన రేఖ ఎక్కడ ఉందో తెలుసు ఎందుకు అంటే ఇది రేఖ, ఈ ప్రాంతాన్ని మనం రక్షించాలి అని వారు నిర్విహించాల్సిన విధుల గురించి వారికి చెబుతాము కనుక వారికి తెలుసు. ఒక అవగాహన ఉంది. చైనా వారికి కొన్ని ప్రాంతాల గురించి అవగాహన ఉందని మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే వారికి వాస్తవాధీన రేఖ గురించిన అవగాహనను వారికి చెప్పకపోవచ్చు.వాస్తవాధీన రేఖ వెంట గ్రామాల నిర్మాణం కండబల ప్రదర్శన అన్నదాన్ని కచ్చితంగా కాదంటాను, బలప్రదర్శన అని నేను వర్ణించను, ఈ గ్రామాల ద్వారా వారు తమ సరిహద్దులకు సులభంగా చేరుకొనేట్లు చూసుకుంటున్నారు, మనం కూడా అదే చేయాల్సి ఉంది, మన ప్రభుత్వం కూడా సరిహద్దు ఏరియా అభివృద్ది కార్యక్రమ పధకానికి (బిఏడిపి) నిధులు విడుదల చేసింది. నిజానికి మనం సరిహద్దు ప్రాంతాలకు తిరిగి వెళ్లండి అని పౌరులను మనం ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే వాస్తవాధీన సరిహద్దు రేఖ వెంట అనేక గ్రామాలవారు ఖాళీ చేశారు అని రావత్‌ వెల్లడించారు. ఎందుకు వారు ఖాళీ చేస్తున్నారంటే లోపలి ప్రాంతాలలో వారికి మరింతగా విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రావత్‌ చెప్పారు.


మన విదేశాంగశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిందేమిటి ? ” దశాబ్దాల క్రితం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో సహా కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా నిర్మాణకార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవటాన్ని గానీ లేదా చైనా చెబుతున్న అంశాలను గానీ భారత్‌ అంగీకరించలేదు. దౌత్యపద్దతుల్లో ఎప్పుడూ అలాంటి కార్యకలాపాలకు నిరసన తెలుపుతూనే ఉన్నాము. భవిష్యత్‌లో కూడా అదే కొనసాగిస్తాము.భారత భద్రత, భూభాగాన్ని కాపాడుకొనేందుకు నిరంతరం పరిణామాలను గమనిస్తూనే ఉంటాము, తగిన చర్య తీసుకుంటాము. అమెరికా పార్లమెంట్‌కు ఆ దేశ రక్షణశాఖ సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రత్యేకించి తూర్పు రంగంలోని అంశాలను గమనంలోకి తీసుకున్నాము. చైనాతో ఉన్న సరిహద్దు ఆప్రాంతాన్ని కలుపుతూ రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నాము” అని చెప్పారు.


పెంటగన్‌ నివేదిక, బిపిన్‌ రావత్‌, అరిందమ్‌ బాగ్చీ చేసిన ప్రకటనల్లో తేడా గురించి, ఏది వాస్తవమో ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలంటూ కాంగ్రెస్‌ స్పందించింది. ఈ నివేదిక గురించి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం లేదా పార్టీ ప్రతినిధులుగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.చైనా అక్రమ ఆక్రమణలను అంగీకరించేది లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెబుతారు, సైనికదళాల సిడిఎస్‌ చైనా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటారు, గతంలో అఖిలపక్ష సమావేశంలో మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీనిలో ఏది వాస్తవమో జనానికి మోడీ సర్కార్‌ చెబుతుందా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నిజానికి రావత్‌-అరిందమ్‌ బాగ్చీ చెప్పిందాన్లో పరస్పర విరుద్దతేమీ లేదు. ఎప్పటి నుంచో చెబుతున్న అంశాలను అరిందమ్‌ చెప్పారు. అక్కడి వాస్తవ పరిస్ధితి గురించి బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్యసరిహద్దు వివాదం బ్రిటీష్‌ వారు సృష్టించింది. వారు గీసిన గీతలకు భిన్నంగా మన దేశానికి చెందినవిగా చూపినవి చైనా ఆధీనంలో, చైనాలో భాగంగా చూపినవి మన ఆధీనంలో ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో ఆక్సాయిచిన్‌, మరికొన్నింటిని మనవి అని మన దేశం చెబుతోంది. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా అంటోంది. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను అనుసరిస్తున్నాయి. ఈ వివాదాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప మరొక పద్దతిలో సాధ్యం కాదు. దీన్ని మరింతగా రాజేయాలని అమెరికా చూస్తోంది.


ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే అజెండాతో ముందుకు పోతున్న అమెరికా ఎక్కడిక్కడ దేశాల మధ్య తంపులు పెట్టేందుకు చేయని తప్పుడు పనులులేవు. తప్పుడు నివేదికలను రూపొందించటం, వాటి మీద మీడియాలో కట్టుకథలు-పిట్టకథలు రాయించటం దాని నిరంతర కార్యక్రమం. వాటిని పట్టుకొని మన మీడియా రెచ్చిపోతోంది.ఏ దేశంతో అయినా సమస్యలు వచ్చినపుడు జనాలకు వాస్తవాలను వివరించేందుకు భిన్న అభిప్రాయాలతో అంశాలను అందించటం తప్పుకాదు. ఇరుగుపొరుగు దేశాలతో నిరంతరం గిల్లికజ్జాలు పెట్టుకొనే ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖల్లాలేవు. ఆ దిశగా రెచ్చగొట్టే మీడియా ఏ విధంగానూ దేశానికి మేలు చేసేది కాదు. అమెరికా తన గోతిని తానే తవ్వుకొని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఎంత అవమానకరంగా బయట పడిందీ తెలిసిందే, అది ఆడించినట్లు ఆడే దేశాలన్నీ సర్వనాశనం అయ్యాయి. అందుకు ఇరాన్‌-ఇరాక్‌లే పక్కా నిదర్శనం. అక్కడి చమురు సంపదలపై కన్నేసిన అమెరికా రెండు దేశాలకూ ఆయుధాలు అమ్మి పదేండ్ల పాటు తలపడేట్లు చేసిన చరిత్ర, చివరకు ఇరాక్‌ను ఆక్రమించిన దుర్మార్గం, లొంగని ఇరాన్‌పై ఆంక్షల అమలు తెలిసిందే. అలాంటి ప్రమాదకరమైన అమెరికా తప్పుడు నివేదికలను ఆధారం చేసుకొని తప్పుడు వార్తలను జనాల మెదళ్లకు ఎక్కించటాన్ని మీడియా దేశభక్తిగా భావిస్తోందా ? ఇంతకు మించి సంచలనాలు, రేటింగ్‌లు పెంచుకొనే సత్తా లేదా ? మీడియాను గుడ్డిగా నమ్మి రెచ్చిపోకూడదని జనం గ్రహించాలి.

పరిస్ధితులు బాగోలేవు, నరేంద్రమోడీ గారు చెప్పిన మంచి రోజుల గురించి ఇంకా భ్రమలతో జనం ఎదురు చూస్తున్నారు. లక్షలాది కుటుంబాలు కరోనా కల్లోలం నుంచి కోలుకోలేదు.పూర్వపు స్ధాయికి ఆదాయాలు రాలేదు.ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినపుడు మానసిక బలహీనతకు లోనుకావటాన్ని ఆసరా చేసుకొని పాలకపార్టీలకు చెందిన మరుగుజ్జు దళాలు వాట్సప్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే మరమ్మతు చేయటానికి కూడా వీల్లేనంతగా ఎందరో బుర్రలను ఖరాబు చేశాయి.ఇలాంటి ప్రచారానికి పాల్పడేందుకు ఇప్పుడు సాంప్రదాయ మీడియా-సామాజిక మాధ్యమం పరస్పర ఆధారితంగా మారుతున్నాయి. వాస్తవాల కంటే సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది దేశభక్తా, దేశద్రోహమా ? దేశమంటే మట్టికాదోయి-దేశమంటే మనుషులోయి అని మహాకవి గురజాడ చెప్పిందాని ప్రకారం జనాలను తప్పుదారి పట్టించి ఉన్మాదానికి లోను చేయటం ప్రజాద్రోహం- దేశద్రోహం కాదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడిన్‌ ఇండియా : అమెరికాకు ” అగ్రహారాలు ” ఎగుమతి !

08 Monday Nov 2021

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

Agraharam Valley, caste discrimination, caste system, dalits, Equality Labs


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్‌ వివక్ష వ్యతిరేక చర్యల్లో భాగంగా కుల వివక్షను గుర్తించేందుకు పూనుకుంది. కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. ఇప్పటి వరకు దీని తెలియని వారు కూడా తెలుసుకొని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.ప్రస్తుతం నడుస్తున్న జైభీమ్‌ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌ తన సినిమాలో గిరిజనులపై పోలీసు కస్టడీలో చిత్ర హింసల గురించి చెబుతూ అవి పదే పదే జరగటం కంటే వాటి మీద సమాజం మౌనం పాటించటం తీవ్ర అంశమని చెప్పారు. కులవివక్ష కూడా అలాంటిదే. అనేక మంది తాము పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఏమనాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు. రెండు లక్షల మంది దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్దులు అమెరికాలో ఉన్నట్లు అంచనా.


గతేడాది జూన్‌లో అమెరికాలో వివక్ష కేసు ఒకటి దాఖలైంది. సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్నది ఫిర్యాదు. సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెలువడిన తరువాత అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది తప్ప కేవలం బ్రాహ్మణ సామాజిక తరగతిని లేదా అగ్రకులాలు అని భావిస్తున్న సామాజిక తరగతులందరినీ తప్పు పట్టటంగా భావించకూడదు)

తమిళనాడులోని ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్దులను బ్లడీ బాస్టర్డ్‌ అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం తెలిసిందే. అమెరికాలోని హిందూమతానికి చెందిన స్వామినారాయణ సంస్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్ధలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్ధ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పది మందిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


ఇటీవలి కాలంలో అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా అనేక మంది భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని కరాఖండితగా చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది కనుక ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆర్గనైజ్‌ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. ముందుగా వాటి గురించి మాట్లాడుకోవాలి, అర్ధం చేసుకోవాలని సెల్వి చెప్పారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్దులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన అంశం తెలిసినదే. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్ధి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్ధలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్ధలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d