• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై ఆరోపణలు : మీడియా, వామపక్ష భావజాలంపై అరుణ్‌ జైట్లీ దాడి !

23 Tuesday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Allegations against cji Ranjan gogoi, Arun jaitley attack on media and leftists, Arun jaitly, CJI India

Image result for ranjan gogoi

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చింది. వాటిని నాలుగు వెబ్‌సైట్లు ప్రచురించాయి. ఆరోపణలకు గురైన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 46వ ప్రధాన న్యాయమూర్తి. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ ఒక వుద్యోగిని చేసిన ఆరోపణల గురించి అసాధారణ రీతిలో సుప్రీం కోర్టు శనివారం నాడు విచారణ జరిపింది. దీనికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల బెంచ్‌లో ఆయన కూడా ఒకరుగా వుండటం కూడా విశేషమే. సుప్రీం కోర్టులో పని చేసి తరువాత వుద్వాసనకు గురైన ఒక మహిళ తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ఫిర్యాదు చేస్తూ 22 మంది న్యాయమూర్తులతో పాటు మీడియా సంస్ధలకు కూడా సదరు కాపీని పంపటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. విచారణ ప్రారంభించిన తీరును పలువురు విమర్శిస్తున్నారు. సమర్ధించేవారు కూడా వున్నారు. ఈ విచారణ వుదంతం ఎలా ముగుస్తుందన్నది మరింత ఆసక్తికరంగా తయారైంది. వచ్చిన ఆరోపణలను ప్రచురించటం సరైందా కాదా అన్నదానిని తాము మీడియాకే వదలి వేస్తున్నామని రంజన్‌ గొగోయ్‌ పరోక్షంలో బెంచి పేర్కొన్నది.(నిర్ణయించే సమయంలో ఆయన బెంచ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు).

న్యాయ వ్యవస్ధకు మద్దతుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రధాన న్యాయమూర్తి నైతిక నిష్ట తిరుగులేనిదని స్వయంగా న్యాయవాది అయిన కేంద్ర ఆర్ధిక మంత్రి చౌకీదార్‌ అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. విచారణ శనివారం జరిగితే ఆదివారం నాడు తన బ్లాగ్‌లో జైట్లీ వ్యాఖ్యలు చేశారు. రంజన్‌ గొగోయ్‌ న్యాయ సంబంధ వైఖరులను ఆయన విమర్శకులు సమర్ధించకపోవచ్చుగానీ వ్యక్తిగత మర్యాద, విలువలు, నైతిక నిష్టను ఎంతో గౌరవిస్తారని, ఆయన విలువల వ్యవస్ధను ఎవరూ ప్రశ్నించలేరని, గత చరిత్ర అంతగొప్పగా లేని అసంతృప్తి చెందిన ఒక వ్యక్తి నిరూపితంగాని ఆరోపణలు చేసినపుడు ఆయనకు మద్దతు ఇవ్వాల్సి వుందని జైట్లీ పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా వ్యవస్ధలను అస్దిరం గావించేవారు పెద్ద ఎత్తున సంఘటితం కావటం విచారకరమని, వారికి ఎలాంటి ఆంక్షల హద్దులు వుండవని, తమ వైఖరులతో ఏకీభవించని న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వారు చేసిన అనేక దాడులను దేశం చూసిందని’ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి చౌకీదార్‌ జైట్లీ అంతరంగంలో రెండు ముఖాలు వున్నాయి. వర్తమాన అంశం మీద అనుకూలంగానో, ప్రతికూలంగానో, తటస్ధంగానో ఒక అభిప్రాయం చెప్పటానికి ఎవరికైనా లేదా ఏ విషయం మీదైనా అభిప్రాయాలు వెల్లడించేందుకు ఒక హక్కు వుంటుంది. కానీ ఒకదాని గురిపెట్ట్టి వేరొకదానిని పేల్చేందుకు చూడటమే అభ్యంతరం. ప్రధాన న్యాయమూర్తి మీద వచ్చిన అంశాలకే ఆయన పరిమితం కాలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని మీడియా, వామపక్ష భావజాలం మీద దాడికి పూనుకున్నారు. జైట్లీ మన్‌కీ బాత్‌లో ఒకటి ప్రధాన న్యాయమూర్తి పట్ల సానుభూతి ప్రదర్శన, రెండవది కాషాయ వైఖరి వెల్లడి. రెండవదాన్ని ఎలా వ్యక్త పరిచారో చూద్దాం.’ వ్యవస్ధలను అస్ధిరం గావించే వారిలో ఎంతో మంది వామపక్ష లేదా కుహనా వామపక్ష వాదుల వైఖరులకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారికి ఎన్నికల పునాది లేదా జనబాహుళ్య మద్దతు లేదు. అయినప్పటికీ వారు ఇప్పటికీ మీడియా, పండితీ ప్రకాండులలో విషమానుపాతంగా(వుండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ) వున్నారు. ప్రధాన స్రవంతి మీడియా వారిని బయటకు పంపితే డిజిటల్‌, సామాజిక మీడియాను ఆశ్రయించారు. వీరిలో ఎక్కువ మంది వులిపికట్టే భావజాలం, ఆలోచనలతో వుంటారు. బార్‌(లాయర్ల అసోసియేషన్‌) సభ్యులలో కాంగ్రెస్‌కు అనుబంధమైన సభ్యుల తరగతి ఇలాంటి వారితో చేతులు కలపటం విచారకరం. న్యాయమూర్తులు, చివరికి ప్రధాన న్యాయమూర్తిని కూడా ఫిర్యాదులకు తగని కారణాలతో అభిశంసించేందుకు పార్లమెంట్‌ సభ్యుల సంతకాలను కూడా సేకరించేందుకు ప్రయత్నించారు. అటువంటి వులిపికట్టెల ప్రచారచర్యలకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వటం తనకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటుంది’ అని పేర్కొన్నారు. ఈ రెండింటినీ చూసినపుడు ప్రధాన న్యాయమూర్తి గురించి జైట్లీ చేసిన సానుకూల వ్యాఖ్యను ఎవరైనా శంకిస్తే, శల్యసారధ్యమని అనుకుంటే తప్పు పట్టలేము.

జైట్లీ పేర్కొన్నట్లుగా దేశంలో వామపక్ష లేదా కుహనా వామపక్ష భావజాలం, ఆలోచనలు, వులిపికట్టె ధోరణులు గల వారే కాదు. అవినీతి పరులు,దోపిడీదారులు వారికి అనుకూలమైన భావజాలం, ఆలోచనలను ముందుకు తెచ్చేవారు, పచ్చి మితవాదులు, మతోన్మాదులు, ఫాసిస్టులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేందుకు పూనుకున్నవారూ, గూండాలు, మూఫియాలు, మత మాఫియాలు, మెజారిటీ, మైనారిటీ మత వుగ్రవాదులూ వున్నారు. బహుశా జైట్లీకి ఒకటే దృష్టి పని చేస్తున్నట్లు వుంది. ఓవైపే చూడగలుగుతున్నారు. క్షీరసాగర మధనంలో వెలువడిన అమృతం వామపక్ష భావజాలం-ఆలోచనలు అని ఎందుకు అనుకోకూడదు. మిగిలిన రాజకీయ పార్టీలు లేదా శక్తులను చూస్తే హాని కలిగించే హాలా హలం వంటి కుహనా వామపక్ష భావజాలం-ఆలోచనలతో పాటు పైన పేర్కొన్న ఇతర అవాంఛనీయ ధోరణులకు ప్రాతినిధ్యం వహించేవారే ఎక్కువగా వున్నారు. వారు వెల్లడించే అభిప్రాయాల మీద స్వేచ్చగా చర్చించండి, సరైన వైఖరిని అలవర్చుకోనివ్వండి. నా శాపానికి గురయ్యే ముంబై పేలుళ్ల సందర్భంగా పోలీసు అధికారి హేమంత కర్కరే మృతి చెందాడు, బాబరీ మసీదును కూల్చివేసేందుకు వెళ్లివారిలో నేనూ ఒకతెను, అక్కడే రామాలయం నిర్మిస్తామని చెప్పిన ప్రజ్ఞ ఠాకూర్‌ ఒక సాధ్వి ముసుగును ఆశ్రయించలేదా, ఇంకా అలాంటి వారెందరినో దేశం చూడటం లేదా. ఏకంగా దేశానికి జవాబుదారీ వహిస్తానని చెబుతున్న బిజెపి ఆమెను వేలాది సంవత్సరాల మత, తాత్వికచింతన, నాగరికతా విలువలకు ప్రతీకగా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీయే అభివర్ణించారంటే బిజెపి పెద్దలు ఆమెకు ఏ ముసుగు వేస్తున్నారో కనిపించటం లేదా ? ఆమె మీద ఏదో ఒక గొలుసు, చీరల దొంగతనం కేసులు కాదు, వుగ్రవాద కేసు వుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆ కేసులో బెయిలు తీసుకొని ఏకంగా ఎన్నికల బరిలో ప్రచారం చేస్తున్న ఆమె ఎలాంటి వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. కేసు విచారణ ముగిసి నిర్దోషిగా తేలిన తరువాత ఆంతటి మహోన్నత వ్యక్తిని అందలం ఎక్కించటమా లేదా అన్నది బిజెపి అంతర్గత వ్యవహారం.

దేశంలో రాజ్యాంగ వ్యవస్ధలను అస్ధిరపరుస్తున్నది, రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నది ఎవరో రోజూ ఏదో ఒక మూల నుంచి వింటూనే వున్నాం. సిబిఐ, ఆదాయపన్ను, ఇడి వంటి సంస్దలను ప్రత్యర్దుల మీద ప్రయోగిస్తున్నారు. గుడికి, ఇంటికి పరిమితం కావాల్సిన దేవుళ్లను వీధుల్లోకి లాగారు. రిజర్వుబ్యాంకును తన పని తాను చేసుకోనివ్వకుండా చేశారు. దాని దగ్గర వున్న నిల్వసొమ్ములాక్కొన్నారు. సరిహద్దులు, దేశ రక్షణకు పరిమితం కావాల్సిన భద్రతా దళాలను రాజకీయాల్లోకి తెచ్చారు. నిష్పాక్షికంగా వుండాల్సిన ఎన్నికల సంఘాన్ని గబ్బు పట్టించారు ఇవన్నీ చేసింది మీడియా, మేథావులుగా వున్న వామపక్ష భావాలు కలవారని జైట్లీ చెప్పదలచుకున్నారా ? గోబెల్స్‌ను అనుసరిస్తున్నవారే ఇలాంటి ప్రచారం చేయగలరు. మోడీ ఆయన భక్తులు ప్రాసకోసం కక్కుర్తి పడి కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిందీ లేదా చెయ్యలేని దానిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేశామని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని చెప్పటాన్ని వింటున్నాం కదా ? ఇక అసలు విషయానికి వస్తే ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల మంచి చెడ్డలు, విచారణ తీరుపై వెలువడుతున్న విమర్శలు లేదా అభిప్రాయాలను చూద్దాం.

విమర్శలు లేదా ఆరోపణలకు వాటిలోని, అంశాలకు వారు ఎంత పెద్ద పదవిలో వున్నా అతీతులు కారు. అలాగని వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలూ కాదు. తమ ప్రయోజనాలకు అడ్డుపడటం లేదా భవిష్యత్‌లో భంగం కలిగిస్తారని భావిస్తున్నవారికి వ్యతిరేకంగా ప్రయోజనాన్ని ఆశించే వారు అనేక ఆయుధాలతో దాడి చేస్తారు. వాటిలో ప్రలోభపెట్టటం, ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించటం ఇలా రకరకాలుగా వుంటాయి. అవి వ్యక్తిగత ప్రయోజనాలే అయివుండనవసరం లేదు. ఈ పూర్వరంగంలో జస్టిస్‌ గొగోయ్‌ మీద చేసిన ఆరోపణల మంచి చెడ్డలను చూడాల్సి వుంది.

ఇలాంటి ఆరోపణలు, ప్రలోభాలు ప్రపంచవ్యాపితంగా జరుగుతున్నవే. పశ్చిమ దేశాలలో జడ్జీలతో సహా రాజకీయ నేతలు, పలు రంగాలలో ప్రముఖుల మీద కోకొల్లలు. ఇజ్రాయల్‌లో తనను న్యాయమూర్తిగా నియమించేందుకు సాయపడవలసిందిగా ఒక మహిళ ఎంపిక కమిటీలోని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడితో పడక సుఖాన్ని పంచుకుంది. అమెరికాలో ఒక న్యాయమూర్తి తన దగ్గరకు విచారణకు వచ్చిన ఒక కేసులో ఫిర్యాదు చేసిన ఒక యువతిని ప్రలోభపరుచుకోవటమే కాదు, తన ఛాంబర్‌నే పడగ గదిగా మార్చివేశాడు. ఇక గత సంవవత్సరం అమెరికాలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ట్రంప్‌ సర్కార్‌ నియమించిన నియమించిన బ్రెట్‌ కవనాహ్‌ తమను లైంగికంగా వేధించినట్లు ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన నియామకాన్ని ఖరారు చేయటం కొద్ది రోజులు ఆలస్యమైంది. కవనాహ్‌ వయస్సు 54 సంవత్సరాలు. విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో (1983-04) ఒక రోజు తామందరం ఒక డార్మిటరీలో మద్యం సేవిస్తుండగా, కవనాహ్‌ తన పాంట్స్‌ జిప్‌ విప్పి మర్మాంగాన్ని తనకు చూపాడని ఒక మహిళ, అంతకు ముందు తనకు 15, అతనికి 17వయసపుడు ఒక హైస్కూలు పార్టీలో ఒక మంచం మీదకు తనను నెట్టి బట్టలు విప్పి నోరు మూసేందుకు ప్రయత్నించాడని ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నామె ఆరోపించింది. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఈ ఆరోపణల వెనుక వుందని రిపబ్లికన్లు ఆరోపించారు. మన దేశంలో కూడా ప్రతి వ్యవస్ధనూ దుర్వినియోగం చేయటం ప్రారంభమైన తరువాత ప్రతి నియామకాన్నీ రచ్చ చేయటం, రాజకీయంగా చూడటం, వాటి వెనుక ఎవరో ఒకరు వుండటం సహజం.

1973లో ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులను పక్కన పెట్టి నాటి ప్రధాని ఇందిరా గాంధీ జస్టిస్‌ ఎఎన్‌ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించటంలో కీలకపాత్ర వహించారు. దేశ న్యాయ వ్యవస్ధ చరిత్రలో ఇలా జరగటం అదే తొలిసారి. దానికి వ్యతిరేకంగా దేశంలో బార్‌ అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేశాయి. ఆ పెద్ద మనిషి ప్రతి చిన్న విషయానికి ఇందిరాగాంధీకి, చివరకు ఆమె కార్యదర్శికి కూడా ఫోన్‌ చేసి ఏం చేయమంటారో సలహాలు తీసుకొనే వారనే విమర్శలు వున్నాయి. రే పదవీ విరమణ తరువాత ఇందిరా గాంధీ మరోసారి సీనియారిటీని పక్కన పెట్టే అక్రమానికి పాల్పడ్డారు. హెచ్‌ ఆర్‌ ఖన్నా సీనియారిటీని తోసి పుచ్చి హెచ్‌ఎం బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా చేయటంతో నిరసనగా ఖన్నా రాజీనామా చేశారు. ఆయన చేసిన ‘తప్పిదం’ ఏమంటే ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితి, నియంతృత్వ పోకడలను అంగీకరించకపోవటమే. అక్రమంగా నిర్బంధించిన ఒక వ్యక్తి విషయమై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ విచారణ సందర్భంగా అత్యవసర పరిస్ధితిలో ప్రాధమిక హక్కులు అమలులో వుండవని చేసిన ప్రభుత్వ వాదనను బెంచ్‌లోని మిగతా న్యాయమూర్తులందరూ సమర్దిస్తే ఖన్నా మాత్రమే విబేధించారు. ఎప్పుడైనా ప్రాధమిక హక్కులకు హామీ వుండాల్సిందే అని స్పష్టం చేశారు. అందుకే ఆయన్ను పక్కన పెట్టారు. అంటే తమ కనుసన్నలలో వుండేవారిని అందలమెక్కించటం లేని వారిని అధ:పాతాళానికి తొక్కేయటం అన్ని వ్యవస్ధల్లోనూ వుంటుందని ఈ వుదంతం స్పష్టం చేసింది. ఇది సాధ్యం కానపుడు, తమకు ఇష్టం లేని వారు కొన్ని బాధ్యతల్లో వున్నపుడు ఏమి జరుగుతుంది? మరో రూపంలో వేధింపులకు, ఇతర చర్యలకు పాల్పడవచ్చు.

Image result for arun jaitley attack on media

గతేడాది పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా స్దానంలో సీనియర్‌గా వున్న రంజన్‌ గొగోయ్‌ను నియమిస్తారా అని మీడియాలో కూడా చర్చ జరిగింది. ఒక ప్రధాన న్యాయమూర్తి( దీపక్‌ మిశ్రా) పనితీరుపై విబేధించి సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తుల్లో గొగోయ్‌ ప్రధములు. ఆయనతో పాటు జాస్తి చలమేశ్వర్‌, మదన్‌లాల్‌ బి లోకూర్‌, కురియన్‌ జోసెఫ్‌ ఒక విధంగా తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ మరొక మార్గం లేని స్ధితిలో రంజన్‌ గొగోయ్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించక తప్పలేదు. నిజానికి మన దేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్‌ 124 పేర్కొన్నది తప్ప ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి లేదు. పదవీ విరమణ చేసే ప్రధాన న్యాయమూర్తే సీనియర్‌ పేరును సిఫార్సు చేయటం, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్రవేయటం ఒక ఆనవాయితీగా వుంది. దానికి ఇందిరా గాంధీ హయాంలో భంగం కలిగింది. తనతో వివాద పడిన సహచరుడిని దీపక్‌ మిశ్రా సిఫార్సు చేస్తారా, చేయకపోతే ఏమిటి అనే పద్దతుల్లో మీడియాలో వూహాగానాలు వచ్చాయి. వాటికి తెరదించి గోగోయ్‌ నియామకం సజావుగా జరిగింది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై ఒక తీవ్ర ఆరోపణ చేయటం అదీ నడత సరిగా లేదనే కేసులున్న ఒక సాధారణ స్ధాయి గుమస్తా సాహసం చేయటం వెనుక ఏ శక్తులున్నాయనే అనుమానాలు రావటం సహజం. పశ్చిమ దేశాలలో ప్రముఖులను బ్లాక్‌ మెయిల్‌ చేయటానికి, డబ్బుకోసం ఇలాంటివి చేయటం సర్వసాధారణం. అమెరికా అధ్యక్షుడిగా వున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మీద కనీసం 23 మంది మహిళలు లైంగికపరమైన ఆరోపణలు చేశారని, అనేక మంది నోరు మూయించటానికి పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. రంజన్‌ గొగోయ్‌ విషయానికి వస్తే ఫిర్యాదు చేసిన మహిళ గురించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి తనతో 2018 అక్టోబరు 10,11 తేదీలలో అనుచితంగా ప్రవర్తించినట్లు మహిళా వుద్యోగి ఆరోపించింది. ఆమె సుప్రీం కోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి నివాసానికి ఆగస్టు 27న బదిలీ అయింది. గొగోయ్‌ అక్టోబరు మూడవ తేదీన ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అది జరిగిన వారానికి ఈ సంఘటన జరిగినట్లు ఆమె ఆరోపించటాన్ని గమనించాలి. లోకజ్ఞానం ప్రకారం ఆలోచిస్తే ఇది జరిగే అవకాశం లేదు. సదరు వుద్యోగిని ప్రధాన న్యాయమూర్తికి అవాంఛనీయమైన వ్యక్తిగత వర్తమానాలు(మెసేజ్‌లు) పెడుతోందని, తనను తిరిగి సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతోందని కోర్టు జనరల్‌ సెక్రటరీకి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అక్టోబరు 12న రాసింది. పది రోజుల తరువాత సుప్రీం కోర్టులో ఒక విభాగానికి బదిలీ చేస్తే దానిలో చేరేందుకు నిరాకరించటమే కాదు, వుద్యోగ సంఘం నేతలతో కలసి ఆందోళన చేసింది. దాంతో శాఖాపరమైన విచారణ జరిపి డిసెంబరు 21న వుద్యోగం నుంచి తొలగించారు. 2011,12 సంవత్సరాలలలోనే ఆమె మీద, కుటుంబ సభ్యుల మీద క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తేలింది.ఆమె ఫిర్యాదు వెనుక దేశ న్యాయవ్యవస్ధను అస్ధిర పరచే పెద్ద కుట్రవుందన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ అనుమానానికి బలం చేకూరుతోంది. ప్రధాన న్యాయమూర్తిపై చేసిన ఆరోపణలను తన వద్దకు తీసుకు వచ్చిన ఒక వ్యక్తి తనకు 50లక్షల రూపాయలు ఫీజుగా ఇస్తానని ఆశచూపాడని, బాధితురాలు ఎవరంటే తన సోదరి అన్నాడని, కోర్టులో కేసు వేయటంతో పాటు ఇండియా ప్రెస్‌క్లబ్‌లో పత్రికా గోష్టి పెట్టి ఈ విషయాలను వెల్లడించాలని కోరినట్లు వుత్సవ్‌ సింగ్‌ బెయిన్స్‌ అనే సుప్రీం కోర్టు న్యాయవాది వెల్లడించారు. ఆశారాంబాపు కేసులో బాధితురాలి తరఫున బాగా వాదించారంటూ తనను పొగడుతూ మాట్లాడిన సదరు వ్యక్తి ఒక బ్రోకర్‌ అని అర్ధమైందని, కేసు నిలవదని, అనేక అంశాలను తాను ప్రస్తావిస్తే సరైన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. చివరకు కోటిన్నర రూపాయలు ఆశచూపాడని తెలిపారు.

ప్రధాన న్యాయమూర్తిగా రంజన్‌ గొగొయ్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు తగవని ఇచ్చిన తీర్పు విషయం తెలిసిందే. ఆ తీర్పును తాము ఆమోదించేది లేదంటూ బిజెపి, దాని అనుబంధ సంస్ధలు భక్తుల పేరుతో కేరళలో పెద్ద ఎత్తున ఆందోళన, విధ్వంసకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసు తీర్పును పునర్విచారణ చేయాలని దాఖలైన పిటీషన్లు కోర్టు ముందున్నాయి. అన్నింటికీ మించి రాఫెల్‌ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అందువలన గతంలో ఇచ్చిన తీర్పు మీద పునర్విచారణ జరపాలన్న పిటీషన్లను తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అపహరణకు గురైన పత్రాలను సాక్ష్యాలుగా పరిగణించకూడదన్న వాదనను తోసి పుచ్చి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పటం అంటే పాత తీర్పును పునర్విచారణ చేయటానికి అంగీకరించటమే. సుప్రీం కోర్టు రాఫెల్‌ లావాదేవీలలో అక్రమాలు లేవని ఇంతకాలం ప్రచారం చేస్తున్న బిజెపి, కేంద్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమే, బిజెపి బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఆర్టికల్‌ 370తో ముడి పడి వున్న ఆర్టికల్‌ 35ఏ చెల్లదని సవాలు చేసిన కేసు కోర్టు విచారణలో వుంది, ఇంకా ఇలాంటివే అధికార పక్షానికి ఇబ్బంది కలిగించే కొన్ని కేసులు సుప్రీం కోర్టులో వున్నాయి. బాబరీ మసీదు స్ధలవివాద కేసులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే శబరిమల తీర్పు మాదిరి వ్యతిరేకిస్తామని చెబుతున్న విషయం తెలిసిందే. బాబరీ మసీదుకు ముందు అక్కడ రామాలయం వుందన్నది తమ విశ్వాసమని, కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు ఎలా చెబుతాయని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్న విషయమూ తెలిసిందే.

తన మీద వచ్చిన ఆరోపణలను తాను కూడా బెంచ్‌లో వుండి విచారించకూడదు అన్నది ఒక విమర్శ. ఇది నైతిక పరమైనదా, నిబంధనలకు సంబంధించిందా అన్నది మొదటి విషయం.నిబంధనలకు సంబంధించిన వుల్లంఘన అయితే ఎవరైనా సవాలు చేసి వుండేవారు, అలాంటిదేమీ లేదు, అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు కనుక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక సాంప్రదాయం, నైతికత అంశాల విషయం చూద్దాం. ఒక పెద్ద ప్రమాదం జరిగితేనో, ఒక విధానపరమైన అంశానికి కోర్టులోనో మరో చోటో ఎదురు దెబ్బ తగిలితే స్వంతంగా బాధ్యత లేకపోయినా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన రాజకీయ నేతల వుదంతాలు వున్నాయి. హవాలా కేసులో ఇరుక్కున్న ఎల్‌కె అద్వానీ దాన్నుంచి బయటపడేంత వరకు తాను బాధ్యతల్లో వుండనని ప్రకటించి ప్రశంసలు పొందారు. కానీ అదే అద్వానీ బాబరీ మసీదు విధ్వంసం కేసులో ముద్దాయి అయినా ఆ తరువాత కేంద్రమంత్రిగా, ఎంపీగా వున్నారు. అలాగే ఎందరి మీదో కేసులు వున్నాయి. గుజరాత్‌లో గోద్రా అనంతర మారణహోమం సాగినపుడు రాజధర్మం పాటించి రాజీనామా చేయాలని వాజ్‌పేయి కోరితే అద్వానీ మద్దతుతో నరేంద్రమోడీ తిరస్కరించి ముఖ్య మంత్రిగానే కొనసాగారు. ఆయన మీద కేసులు నడిచిన సమయంలోనూ అదే జరిగింది. దేశంలో ఇంకా అనేక పార్టీల నేతల మీద కేసులు వున్నాయి. కేసులున్నంత మాత్రాన నైతికంగా రాజీనామా చేయాలా, పదవులు స్వీకరించకూడదా అని ఎదురుదాడులు చేస్తున్న రోజులి. అసలు ఫిరాయింపు నిరోధక చట్టం అమల్లో వుండగానే వేరే పార్టీలో చేరి పాత పార్టీ పేరుతో కొనసాగుతూనే మంత్రులుగా పని చేసిన వారిని చూశాము. ఈ అంశాలలో నిబంధనలూ లేవు నైతికతా ఎక్కడా కానరాలేదు. రాజకీయ ప్రత్యర్ధులు, స్వంతపార్టీల్లోనే ఏదో ఒక ఆరోపణ చేసి, చేయించి ఆ పేరుతో పదవుల నుంచి తప్పించటం ఒక కుట్ర.

న్యాయమూర్తులు, కోర్టుకు సంబంధించిన ఇతరుల మీద ఫిర్యాదులు వచ్చినపుడ అంతర్గత వ్యవహారాల కమిటీకి నివేదించాలని ఆ ప్రక్రియ లేకుండా నేరుగా బెంచ్‌కు నివేదించారన్న విమర్శ ఒకటి. ఈ కమిటీ అధ్యక్షురాలిగా జస్టిస్‌ ఇందు మల్హోత్రా వున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశం కేసులో మహిళలపై ఆంక్షలు కొనసాగించాల్సిందేనంటూ మెజారిటీ తీర్పుతో వ్యతిరేకించారు. ఆమె నోట్‌లోని అంశాలను ఆధారం చేసుకొనే బిజెపి, ఇతర సంస్ధలు అయ్యప్ప ఆలయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ శాంతి భద్రతల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ఒక వేళ దీనికి కూడా స్పష్టమైన నిబంధనలు వుంటే వాటిని రంజన్‌ గొగోయ్‌ వుల్లంఘించి వుంటే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, చర్యను కూడా కోరవచ్చు. ఫిర్యాదు చేసిన మహిళకు అవకాశం ఇవ్వలేదన్నది మరొక విమర్శ. అ అంశం మీద ఆసక్తి వున్నవారు ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే అదే బెంచ్‌ తన వివరణ ఇస్తుంది. ఆ పని చేయకుండా కేవలం విమర్శలకే పరిమితం అయితే వారిని శంకించాల్సి వుంటుంది. తీర్పులనే పునర్విచాలించాలని పిటీషన్లు దాఖలు చేస్తున్నపుడు దీని మీద ఎందుకు వేయకూడదు ?

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తన మీద వచ్చిన ఏమాత్రం పసలేని ఆరోపణలకు భయపడి రాజీనామా చేస్తే జరిగేదేమిటి? నిజంగా ఆయన చెప్పినట్లు రంజన్‌ గొగోయ్‌ చెప్పినట్లు దాని వెనుక వున్న పెద్ద శక్తి వలలో పడినట్లే . ఆయనకు వచ్చే మంచిపేరు సంగతి దేవుడెరుగు, ఏదో ఒక సాకుతో అసలు పదవి నుంచే తప్పించరన్న గ్యారంటీ ఏముంది? ఇందిరా గాంధీ హయాంలో మాదిరి తమకు అనుకూలడైన న్యాయమూర్తులను ఆ పదవిలో నియమించే అవకాశం లేదని ఎవరైనా చెప్పగలరా ? సిబిఐ వున్నతాధికారుల విషయంలో జరిగిందేమిటో ఒక్కసారి వెనక్కు చూడవచ్చు. అనేక ముఖ్యమైన కేసుల్లో అధికారపక్షానికి లేదా దాని వాంఛలకు అనుకూలంగా, వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన పూర్వరంగంలో వాటి మీద పునర్విచారణ జరిగే సమయంలో అరుణ్‌ జైట్లీ చెప్పినట్లు నైతిక నిష్టగల రంజన్‌ గొగోయ్‌ వంటి వారు బాధ్యతల్లో లేకపోతే ఎలా? జమ్మూ కాశ్మీర్‌లో ఎనిమిదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగితే నిందితులపై కేసులు పెట్టరాదని ప్రదర్శనలు చేసిన లాయర్లు చెలరేగిపోతున్న తరుణమిది. వారి మీద బార్‌ కౌన్సిల్‌ తీసుకున్న చర్యలేమున్నాయి?

ఇప్పటికే పుల్వామా దాడి సరిగ్గా ఎన్నికలకు ముందు సంభవించటం గురించి ఇదంతా ఒక పధకం ప్రకారమే జరిగిందని సామాజిక మాధ్యమంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.వాస్తవమో కాదో తెలియని వీడియోలు, ఆడియోలు కూడా తిరుగుతున్నాయి. ఆరునెలల క్రితం జరిగిందని చెబుతూ ఇప్పుడు సరిగ్గా ఎన్నికల మధ్యలో సదరు వుద్యోగిని రంజన్‌ గొగోయ్‌ మీద సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేయటం, దానిని మీడియాకు కూడా పంపటం అంటే అనుమానాలు రావటంసహజం. ఒక్కసారి మీడియా, ఓటర్ల దృష్టి ఎన్నికలు, పార్టీల మంచిచెడ్డలను వదలి ఎన్నికలు ముగిసే వరకు దీని గురించే చర్చించవచ్చు. కొందరికి కావాల్సింది కూడా అదేనా ? తాము కోరుకున్న విధంగా సుప్రీం కోర్టు తీర్పులు వుండవని పాలకపార్టీ, దాని అనుబంధ సంస్ధలు వూహిస్తున్నాయా, గతంలో ఇందిరా గాంధీ మాదిరి తీర్పులను తమకు అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాయా ? సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖల మాదిరి న్యాయవ్యవస్ధలను కూడా తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని వాంఛిస్తున్నాయా? ప్రస్తుతం చేసిన ఫిర్యాదు ఒక్క ప్రధాన న్యాయమూర్తి మీదే అయినప్పటికీ ఇతర న్యాయమూర్తులను కూడా భయపెట్టటానికి ఇలాంటివో మరొకటో రాబోయే రోజుల్లో రావని చెప్పలేము. ఈ ధోరణి రాజ్యాంగవ్యవస్ధల మీద వున్న విశ్వాసాలు మరింత దెబ్బతినటానికే దోహదం చేస్తుంది. తమ అజెండాను సులభంగా అమలు చేసేందుకు పాలకవర్గాలకు కావాల్సింది ఇదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యలోటు తగ్గిందా ? వాస్తవాలేమిటి ?

20 Saturday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

China, India’s Trade, India’s Trade Deficit, India’s Trade Deficit With China

Image result for India’s Trade Deficit With China 2019

ఎం కోటేశ్వరరావు

‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్‌,చైనాకు భారత్‌ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్‌ విత్‌ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.

దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్‌ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్‌ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.

Image result for India’s Trade Deficit With China 2019

2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్‌ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్‌-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్‌ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్‌-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్‌ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్‌ లైన్‌ జనవరి 4, 2019).

ఎకనమిక్‌ టైమ్స్‌ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్‌ లెగ్గా ఐరన్‌ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !

చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్‌ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్‌ 17వ తేదీన లైవ్‌ మింట్‌ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్‌ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్‌ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్‌ కథనాన్ని నిర్ధారించింది.

Related image

పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్‌ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్‌ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్‌ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్‌ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్‌ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్‌ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్‌ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్‌ నుంచి 728శాతం పెరిగాయి.లాన్‌ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్‌ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్‌ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్‌ డాలర్లు. దీనిలో భారత్‌ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్‌ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్‌ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి గురివింద తన నలుపు చూసుకుంటుందా !

20 Saturday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

All Modi's, Modi's, Narendra Modi, Rahul gandhi on Modi's, Soniya gandhi

Image result for modi bc  all modis are thieve  comments cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే రాజకీయ పార్టీలు ఇంతగా దిగజారుతాయనుకోలేదు అని పెద్ద తరం వారు నివ్వెరపోతున్నారు. చరిత్రలో నాటి ప్రముఖ రాజనీతిజ్ఞులకు, ఆచరణలో నేటి రాజకీయ నేతలకు ఇంత తేడా వుందా అని మెదళ్లలో గుజ్జు వున్న యువతరం అనుకుంటోంది. ‘ ముందు ఎల్‌కె అద్వానీ కాబోయే రాష్ట్రపతి గుసగుసలు వినిపించాయి. అయితే గుజరాత్‌లో అధికారం పోయే అవకాశం వుందని భయపడిన బిజెపి అద్వానీకి అవకాశాన్ని నిరాకరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక దళితుడిని రాష్ట్రపతిగా ఎంచుకుంది అని రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహలట్‌ చేసిన వ్యాఖ్య మీద బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఎన్నికలు గనుక భావోద్వేగాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలను కోవటం స్వచ్చ రాజకీయాలు కోరు కొనే వారికి నీచంగా కనిపిస్తుంది. తాము చేసింది అంతా సరైనదే ఎదుటి వారు చేస్తేనే తప్పు అన్నది అధికార రాజకీయ పార్టీలు లేదా కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పాలంటే బూర్జువా పార్టీల వైఖరి.

బిజెపి నేతలు తమ కింది నలుపును తాము చూసుకోగలిగితే ఇతరుల మీద దాడికి దిగరు, కనుక వారేం చెప్పారో నిర్దాక్షిణ్యంగా గుర్తు చేయకతప్పదు. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ జమాఖండిలో జరిగిన సభలో ఇలా చెప్పినట్లు ఆ పార్టీ ట్రోల్‌ సేన ట్వీట్‌ చేసింది.’ భారత రాష్ట్రపతిగా ఒక దళితుడిని ఎంచుకున్నారు, ఒక ఏడాది తరువాత కూడా సోనియా గాంధీ మర్యాద పూర్వకంగా ఆయను కలుసుకోలేదు.’ అదే రాష్ట్రంలో మరొక ఎన్నికల సభలో అదే నరేంద్రమోడీ 2018 మే మూడవ తేదీన బళ్లారి ఇలా చెప్పారు’ బిజెపి ఒక ముస్లిం, ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసింది, కాంగ్రెస్‌ దళితులను మోసం చేసింది. తమకు అధికారమిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ఓట్లడిగింది. అయితే ప్రముఖ దళిత నేత మల్లిఖార్జున ఖర్గే బదులు సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. దళితులను మోసం చేసింది. అబ్దుల్‌ కలాం ఒక ముస్లిం, బిజెపి ఆయనను రాష్ట్రపతిని చేసింది.ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ కూడా ఒక దళితుడే. బిజెపి అంటే బనియా,బ్రాహ్మల పార్టీ అని మమ్మల్ని ద్వేషించే వారు అంటారు. మేము ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశాము, ఒక ఓబిసి, ఓ చాయ్‌ వాలాను ప్రధాన మంత్రిని చేశాము’ అని చెప్పారు. అశోక్‌ గెహ్లట్‌ అన్నది తప్పు నరేంద్రమోడీ చెప్పింది ఒప్పంటారా ?ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా దిగజారి వ్యవహరించటం, గల్లీ స్ధాయి మాటలు మాట్లాడుతున్నారంటే తమ అడుగుజారుతోందన్న భయం పట్టుకున్నట్లే అన్నది మొత్తం మీద మెజారిటీ విశ్లేషకుల సారాంశం. వారెందుకీ అభిప్రాయానికి వచ్చినట్లు ? ఎన్నికల సర్వేలన్నీ బిజెపి పెద్ద పార్టీగా వస్తుంది తప్ప గతంలో మాదిరి తానే అవసరమైన మెజారిటీ తెచ్చుకోలేదు అని తేల్చాయి. చివరి దశ ఎన్నికలు కూడా ముగియక ముందే ఇది బిజెపికి తొలి ఓటమి. గత ఐదు సంవత్సరాలలో బిజెపి, దాని నేతలంతా చెప్పిందేమిటి? కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం అనే కదా ! రాజస్ధాన్‌, చత్తీస్‌ ఘర్‌, మధ్య ప్రదేశ్‌లో పదిహేనేండ్లుగా పాతుకుపోయిన బిజెపిని కాంగ్రెస్‌ పెకలించి వేసింది. ఇది వ్యక్తిగతంగా నరేంద్రమోడీ, బిజెపికి పెద్ద కుదుపు. ఆ తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి ఆ పదజాలాన్ని తగ్గించటం లేదా పూర్తిగా మానుకున్నారు. భారతీయలు కల్లాకపటం లేని వారు కావచ్చుగానీ, తెలివి తక్కువ వారు మాత్రం కాదు. బిజెపి వారసత్వ పాలన గురించి మాట్లాడుతుంది. కాంగ్రెస్‌లో కంటే బిజెపిలో వారసులు యూరియా, సూపర్‌ వేసిన పంటలు ఎదిగినట్లుగా ఎదుగుతున్నారు. అలా అతిగా ఎదిగిన పంటలు తుపాన్లు, వరదలకు ఏమాత్రం తట్టుకోలేక కుప్పకూలిపోతాయి. తమను వ్యతిరేకించే వారందరూ పాకిస్ధాన్‌ను సమర్ధించే వారే అనే ఒక కుహనా జాతీయవాదాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నించారు. తాము తిరిగి బిజెపి అధికారానికి రావాలని, మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు, వారు వస్తేనే పాక్‌-భారత చర్చలు ముందుకు పోతాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రకటించటంతో బిజెపి నేతలు ఏం మాట్లాలో తోచక గిలగిలలాడిపోతున్నారు. పాకిస్దాన్‌తో బిజెపి లవ్‌జీహాద్‌ సంగతి ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సైన్యాన్ని రాజకీయాల్లోకి తేవద్దని, రాజకీయ నేతలను నివారించాలని వందలాది మంది మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి నివేదించటం బిజెపిని అభిశంచించటం తప్ప మరొకటి కాదు. అయినా తరువాత కూడా ఆ పార్టీ వారు ఏదో ఒక రూపంలో ప్రస్తావన తెస్తూనే వున్నారు. బాలాకోట్‌ దాడికి ప్రధాని నరేంద్రమోడీయే ఆదేశాలు ఇచ్చారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చెబితే, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొనే వారు పుల్వామా మృతులకు తమ ఓట్లను అంకితం ఇవ్వాలని నరేంద్రమోడీ చెప్పారు. వీటిని శవరాజకీయాలని ఎవరైనా అంటే తప్పేముంది.

నోరు పారవేసుకోవటంలో ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. చౌకీదారు దొంగ అని రాహుల్‌ గాంధీ అనటానికి కారణం తాను వెనుబడిన తరగతికి చెందిన వాడిని కావటమే, వెనుకబడిన తరగతుల వారిని కాంగ్రెస్‌ ఎలా చూస్తోందో చూడండి అందరినీ దొంగలంటోంది అని ప్రధాని నరేంద్రమోడీ బిసి భావోద్వేగాలను రేపేందుకు ప్రయత్నించారు. బుధవారం నాడు మహారాష్ట్రలో ఒక ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ ‘ కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్నోసార్లు నన్ను నిందించాయి, కానీ ఈ సారి మొత్తం వెనుకబడిన తరగతి సామాజిక వర్గం అంతటినీ దొంగలుగా వారు ముద్రవేశారు ‘ అని ఆరోపించారు. ఇటీవలి రాహుల్‌ గాంధీ కూడా మహారాష్ట్ర ఎన్నికల సభలోనే మాట్లాడుతూ వాణిజ్యవేత్త నీరవ్‌ మోడీ, క్రెకెట్‌ నిర్వాహకుడు లలిత్‌ మోడీ ఇలా దొంగలందరి పేర్లలో మోడీ అని వుంది ఇంకా ఎంత మంది అలాంటి వారు బయటకు వస్తారో అని రాహుల్‌ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాలలో కొందరు పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటారు. వారిలో అనేక మంది రెడ్డి సామాజిక తరగతికి చెందిన వారు కాదు. గిరిజనులు, వెనుబడిన తరగతులు,కాపులు ఇలా ఎందరో వున్నారు. అలాగే మోడీ అని పేరున్న వారందరూ నరేంద్రమోడీ చెప్పినట్లు వెనుకబడిన తరగతులు కాదూ, వారందరినీ రాహులు గాంధీ దొంగలూ అనలేదు. లలిత్‌ మోడీ వైశ్యుడు, నీరవ్‌ మోడీ జైన్‌. దేశంలో జైనులను కొన్ని చోట్ల బిసిలుగా పరిగణిస్తే కొన్ని చోట్ల ముందుబడిన తరగతులుగా చూస్తున్నారు. అందువలన నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య వెనుక వెనుకబడిన తరగతులను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కనిపించటం లేదు. అసలు నరేంద్రమోడీ వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి కాదన్నది ఒక వివాదం వుంది. అంబానీ, మహాత్మాగాంధీలు జన్మించిన మోధ్‌ బనియా కులంలో ఒక వుపకులమైన మోధ్‌ గంచీకి చెందిన వ్యక్తి అని చెబుతారు. అయితే వుత్తర భారత్‌లో నూనె తీసే వృత్తి చేసే తేలీలు ఘంచిస్‌ కులానికి చెందిన వారని మోధ్‌ గంచీస్‌ తెలీస్‌ కాదని చెబుతారు. అందువలన వాటిలోకి పోతే ఒక దగ్గర తేలటం కష్టం. ఓట్ల కోసమే మోడీ కులాన్ని బయటకు తీశారన్నది స్పష్టం.

చివరగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ మాట్లాడిందేమిటో ఒకసారి చూద్దాం. ‘కాంగ్రెస్‌లో ఎవరైతే ఒక వితంతువు వున్నారో అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఆమె ఖాతాలో జమ చేశారు’ అంటే పేరు చెప్పకుండానే సోనియా గాంధీని వుద్దేశించి అన్నారన్నది స్పష్టం. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయిన తరువాత వున్నత పదవుల్లో వున్నవారి గురించి చెప్పుకోవాల్సింది ఏముంటుంది. ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాలలో చివరి క్షణంలో ఫలానా కులం వారిని ఫలానా అభ్యర్ది చులకనగా మాట్లాడాడు, ఫలనా తిట్లు తిట్టాడు అని పుకార్లు వ్యాపింప చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వుదంతాలు అనేక వున్నాయి. ఇప్పుడు అవి దేశవ్యాపితంగా విస్తరించాయి. ఎంత అభివృద్ధో కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొలి పత్రికా గోష్టిలో జర్నలిస్టులను అదరగొట్టిన నరేంద్రమోడీ !

19 Friday Apr 2019

Posted by raomk in BJP, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra modi maiden press conference

Image result for narendra modi  maiden press conference

7, లోక కల్యాణ్‌ మార్గ్‌ , న్యూఢిల్లీ నుంచి వర్తమానం ! ప్రధాని నరేంద్రమోడీ మాడ్లాడతారు మీడియా వారంతా రండి అన్నది దాని సారాంశం.

ఇంకే ముంది ఢిల్లీ, శివార్లలోని గురుగ్రామ్‌ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లి పోయిన మీడియా సంస్ధలలో ఎవరు కనిపించినా సరే ఎదుటి వారిని పట్టుకొని గిల్లటం, తమను గిల్లమని కోరటం. ఆడామగా తేడా లేదు,ఎడిటర్‌ నుంచి సబ్‌ ఎడిటర్‌ వరకు, సాధారణ రిపోర్టర్‌ నుంచి బ్యూరో చీఫ్‌ల వరకు ఎవరిని చూసినా అరిచేతుల్లో, ఎక్కడ చూసినా గిచ్చుళ్లతో ఎర్రగా కంది పోయి వున్నాయి. చివరకు ఎన్నడూ లేనిది అటెండరు నుంచి ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వరకు ఈ సమాచారంతో అందరూ విస్తుపోతున్నారు. అది ఆఫీసులకే పరిమితం కాలేదు, ఎవరైనా తమను ఆటపట్టించేందుకు అలా చేశారేమో అని ప్రతి ఒక్కరూ రెండు మూడు కార్యాలయాలకు ఫోన్లు చేసి నిర్ధారించుకుంటున్నారు. పట్టించుకోని వారెవరంటే పెయిడ్‌ న్యూస్‌, ఆర్టికల్స్‌ రాసే వారే బిజీగా వున్నారు. ప్రకటనల విభాగం, మేనేజిమెంట్‌ ఇచ్చిన సూచనల మేరకు వారంతా అనుకూల కధనాలను రాయటంలో బిజీగా వున్నారు. నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెడితేనేం పెట్టకపోతేనేం, మన పని మనకు తప్పదు కదా అని వారంతా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పూనుకున్నారు. పెయిడ్‌ న్యూసైనా, వ్యాసాలైనా స్వంత అభిప్రాయాల్లా వుండకపోతే ఫిర్యాదులొస్తాయని యాజమాన్యాలు హెచ్చరిస్తాయి కదా !

రెండు విడతల ఎన్నికలు చూసిన తరువాత మోడీ గాలి సూచనలు ఎక్కడా కనిపించకపోవటంతో సీనియర్‌ ఎడిటర్లందరూ మనం ఇక అటుతిప్పి ఇటు తిప్పి కష్టపడి విశ్లేషణలు రాయాల్సిన అవసరం లేదని తాపీగా వున్నారు. అలాంటి వారందరిలో ఒకటే ఆలోచన. ఏమై వుంటుంది? ఏమి జరిగి వుంటుంది. ఏమిటీ విపరీతం . పరిపరి విధాలా ఒకటే ఆలోచన, పట్టపగలే బాటిల్స్‌ మీద బాటిల్స్‌ ఖాళీ అవుతున్నాయి తప్ప మీడియాతో మాట్లాడాలని మోడీ ఎందుకు నిర్ణయించుకున్నారో ఎవరూ నిర్ధారణకు రాలేకపోతున్నారు. మోడీ మారు మనస్సు పుచ్చుకున్నారా? దేవతలెవరైనా అర్ధరాత్రి కలలోకి వచ్చి చివరి రోజుల్లో అయినా నారాయణా అనిపించమని అమిత్‌ షాకు నిర్దేశించారా !

క్షణ క్షణానికీ వుత్కంఠ పెరిగిపోతోంది. ఒక్కో సంస్ధ నుంచి ఎంత మంది రావచ్చని ప్రధాని పత్రికా కార్యాలయానికి ఫోన్లు. దివాలా తీయించిన ప్రభుత్వ రంగ సంస్ధ మాదిరి ఐదేండ్లుగా మూతపడి వుండటం, ఎన్నడూ పలకరించని విలేకర్లు మాట్లాడుతుండటంతో పరిమితంగా, పాడుబడిన ఇంట్లో బిక్కుబిక్కు మంటూ వుండే వారిలా వున్న సిబ్బందికి ఏం చెప్పాలో పాలుపోలేదు. మాక్కూడా ఆహ్వానాలు వచ్చాయి, నిజమేనా అని వుర్దూ, కాశ్మీరీ పత్రికల విలేకర్ల ప్రత్యేక విచారణలు. విలేకర్లకు, కార్యాలయ అధికారులు, సిబ్బందికి ఐదేండ్లుగా సంబంధాలు లేవు. అందువలన ఎవరెవరో తెలియదు, ఫోన్లు చేస్తున్నవారు విలేకరులా లేక మరెవరైనా అని అడుగడుగునా అనుమానాలు. కొద్ది సేపటి తరువాత ఒక్కో మీడియా సంస్ధనుంచి ఎందరైనా రావచ్చు, ఏర్పాట్లకు గాను ఎందరు వచ్చేది ఒక ఫోన్‌ నంబరుకు తెలియచేయమని కోరారు. దానికి ఎడతెగని ఫోన్లు రావటంతో లైను దొరక్క కొందరు నేరుగా కార్యాలయానికి వచ్చారు. ఐదేండ్ల కాలంలో అనేక మంది కొత్త విలేకర్లు వుద్యోగాల్లోకి రావటంతో చాలా మందికి కార్యాలయ చిరునామా కూడా తెలియలేదు. జిపిఎస్‌ సాయంతో వచ్చేసరికి కొండవీటి చాంతాడంత పొడవున క్యూ. అప్పటికే పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు వచ్చాయి. లేకపోతే విలేకర్లు అదుపులోకి వచ్చేట్లు లేరు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ తన తొలి పత్రికా గోష్టికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయలేదు.అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అంటే ఇదే అని బిజెపి లీకు వీరులు వూదరగొడుతున్నారు.

మరోవైపున పన్నెండెకరాల విస్తీర్ణంలో వున్న ప్రధాని నివాసం. కొంత మంది అధికారులు, పని వారు తప్ప మిగిలిన వారెవరూ గత ఐదు సంవత్సరాలుగా అటు అడుగు పెట్టలేదు. కాపురం చేసే ఇల్లయితే కదా ! అలాంటిది పదులకొద్దీ ట్రక్కుల్లో షామియానాలు, ఇతర సామాన్లు దిగుతున్నాయి.అవన్నీ విలేకర్ల సమావేశానికి అవసరమైన ఏర్పాట్ల కోసమట. అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియా వారు వుంటారు గనుక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎవరికి నచ్చిన వంటకాలకోసం వారికి ప్రత్యేకంగా వంటవారిని అప్పటికే పిలిపించారు. ఆయా రాష్ట్రాల భవన్లలోని కాంటీన్లు మూసి వేయించి వంటవారిని ఇక్కడకు తరలించారు. మోడీ పత్రికా గోష్టా మజాకానా !

ఇంకోవైపున ప్రతి మీడియా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాట్లు చేశారు. ప్రశ్నలు అడగటానికి ఎంత మందికి అవకాశం వస్తుంది, ఎన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఒక వేళ అడగాల్సి వస్తే ఏమి అడగాలి, ఎవరు అడగాలి, సంస్ధ ప్రతిష్టను పెంచే ప్రశ్నలు కొన్నింటిని తయారు చేయాలని నిర్ణయించారు. మొత్తానికి యావత్‌ మీడియాకు ఇదొక కొత్త పరిస్ధితి. తొలిసారిగా భారత ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రతి వారూ తమ కొత్త అనుభవం ఎలా వుంటుందో అనుకొనే శోభనపు దంపతుల్లా వున్నారు. మధ్య మధ్యలో తుళ్లి పడుతున్నారు. ఎలాగైతేనేం మొత్తానికి సీనియారిటీని బట్టి సంపాదకులు, తరువాత వరుసగా ఎవరెవరు అడగాలో నిర్ణయించుకున్నారు. కొన్ని చోట్ల అయితే నమూనా మీడియా గోష్టి నిర్ణయించారు.

ప్రధాని నరేంద్రమోడీ మీడియా సమావేశ సమయం దగ్గర పడుతోంది. కొందరైతే రెండు మూడు గంటల నుంచి అక్కడే తారట్లాడుతున్నారు. గేటు తీయగానే పొలో మంటూ పరుగులు తీశారు. తోపులాటలు, నెట్టుకోవటాలు, కెమెరాలు, ఫోన్లు, కళ్ల జోళ్లు కిందపడటాలు, చొక్కాలు, కోట్లు నలగటాలు, ఆడవాళ్లని కూడా చూడరా ఇదేం వరస అంటూ శాపనార్ధాలు. జర్నలిజంలో ఓనమాలు తెలియని వారి హడావుడే ఎక్కువగా వుందని సీనియర్ల పెదవి విరుపు. మొత్తానికి వేసిన వేలాది కుర్చీలు నిండిపోయాయి. అమిత్‌ షా గడ్డం సవరించుకుంటూ మెల్లగా వచ్చి ప్రధాని అత్యవసరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడుతున్నారు. ఈ లోగా అందరూ స్నాక్స్‌, టీ తీసుకుందాం రండి అంటూ తానే ముందుగా దారి తీయటంతో మీడియా వారంతా అటువైపు పరుగులు తీశారు. వెనుక బడితే తమ సీట్లు గల్లంతై వెనుక కూర్చోవాల్సి వస్తుందని ఎవరికి వారు కంగారు పడుతున్నారు. కొందరు తమ టీ తమమీదే ఒలకపోసుకుంటే మరికొందరు పక్కవారి మీద పోశారు. కొద్ది సేపటికి తిరిగి అందరూ వచ్చారు. నరేంద్రమోడీ గారు కొత్త కోటును సవరించుకుంటూ మిత్రోం అంటూ పలకరింపుగా అందరి వైపు చూశారు. ఆ మాత్రానికే కొందరు తమ జన్మ ధన్యమైందన్నట్లుగా పులకించిపోయారు.

ఇంతలో ఒక అధికారి వచ్చి ఒకరి తరువాత ఒకరు ఒక్కొక్క ప్రశ్న మాత్రమే అడగాలి, వచ్చిన వారందరికీ అవకాశం వుంటుందని ప్రకటించారు. దాంతో ప్రతి వారికీ అవకాశం వస్తుందన్న భరోసా వచ్చింది కనుక అందరూ తాపీగా వున్నారు. ముందు అందరూ ప్రశ్నలు అడగండి, ఒక ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతారు గనుక ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన ప్రధాని ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పటం కాకుండా ఒకే తరహా ప్రశ్నలన్నింటికీ తీరిగ్గా సమాధానం చెబుతారు, తరువాత వివరణ అడిగే అవకాశం కూడా వుంటుంది అని మరో అధికారి ప్రకటించారు.

భారత ప్రధాని ఐదు సంవత్సరాల తరువాత తొలిసారిగా నోరు విప్పుతున్నారంటే సహజంగానే అంతర్జాతీయ మీడియా సంస్ధలకు సైతం ఆసక్తి లేకుండా ఎలా వుంటుంది. పిల్లి గడ్డాల వారు, పొట్టి లాగుల వారు, పలు రంగుల వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొత్తం మీద న్యూఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సమావేశాలకు కూడా ఇంతగా విలేకర్లు పోటెత్తి వుండరు. ఢిల్లీ గల్లీ నుంచి వాషింగ్టన్‌ డిసి వరకు చైనా మాంజాల నుంచి అమెరికా చికెన్‌ దిగుమతుల వరకు ప్రపంచవ్యాపితంగా వున్న సమస్యలన్నింటినీ విలేకర్లు ఏకరువు పెట్టి దాని మీద ప్రధాని అభిప్రాయం చెప్పాలని కోరారు. ముందే హామీ ఇచ్చినట్లుగా అందరికీ అవకాశం ఇవ్వటంతో ఒకే ప్రశ్న అయినా చాంతాడంత పొడవున సాగదీసి అడగటంతో సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన కార్యక్రమం అర్దరాత్రి పన్నెండు కొట్టేదాకా సాగింది.

టీవీ ఛానల్స్‌కు ఇబ్బంది లేదు ఏదో ఒక చెత్త, చెప్పిందే చెప్పటం, చూపిందే చూపే సోది కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పత్రికలన్నీ ఎడిషన్లను కొద్ది గంటల పాటు వాయిదా వేసి ఆలశ్యమైనా పాఠకులకు ప్రధాని తాజా సందేశం అందించాలని నిర్ణయించాయి. కొందరైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఏజంట్లందరికీ పత్రికల కట్టలు ఎలా వస్తాయో ముందే తెలియచేశారు. అప్పటికే అరడజను సార్లు ఇంట్లోకి బయటకు తిరిగిన నరేంద్రమోడీ, అమిత్‌ షాలు పన్నెండు దాటగానే కొత్త దుస్తులు వేసుకొని వచ్చారు. క్రికెట్‌ స్డేడియంలో ఫ్లడ్‌ లైట్ల మాదిరి అంబానీ కంపెనీ నుంచి వచ్చిన లైటింగ్‌ అదిరి పోతోంది.ఇంతలో అదానీ కంపెనీ ప్రతినిధి వచ్చి విలేకర్లందరికీ తమ కంపెనీ ప్రత్యేక డిన్నర్‌ ఏర్పాటు చేసిందని, అందరూ ఆరగించి వెళ్లాలని సవినయంగా ఆహ్వానం పలికి వెళ్లారు.

నరేంద్రమోడీ ప్రత్యేక వేదిక వద్దకు వచ్చేందుకు వుద్యుక్తులై ఒక్కసారి అమిత్‌ షావైపు చూశారు. పదండి అంటూ షా ముసి ముసి నవ్వులు నవ్వారు. ఒక్కసారి నిశ్బబ్దం. అందునా అర్ధరాత్రి కావటంతో చీమ చిటుక్కుమన్నా వినిపించేట్లుగా వుంది. నరేంద్రమోడీ మాట్లాడబోతున్నారగానే యధావిధిగా టీవీ ఛానల్స్‌ కెమెరాల వారు తోపులాట ప్రారంభించారు. వెనుక కూర్చున్న ప్రింట్‌ మీడియా జర్నలిస్టులకు అడ్డంగా నిల్చున్నారు. ఇక్కడ కూడా మీ తీరు మారదా అంటూ వారు విసుక్కుంటున్నారు.

Image result for how narendra modi beats journalists in his maiden press conference

ఇంతలో నరేంద్రమోడీ గారు అటూ ఇటూ చూసి మిత్రోం మీరు ఎన్నో విలువైన, తెలివైన ప్రశ్నలు వేశారు. వాటిన్నింటికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే అదేమంటే మీరు లేవనెత్తిన అంశాలన్నింటికీ కారకుడు జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కుటుంబ వారసత్వం. అంటూ ముగించి కూర్చున్నారు. అది విన్న సీనియర్‌ జర్నలిస్టులు కొందరు కుర్చీల్లోనే మూర్ఛపోయారు. కొందరు పక్కవారి కుర్చీల మీద పడిపోయారు. కొందరు తలగోక్కున్నారు, కొందరు జుట్టుపీక్కున్నారు, వెనుకా ముందూ, కిందాపైనా చూసుకున్నారు. కొందరు కేకలు వేయబోయారు, కొందరు ఏడుపు లంకించుకున్నారు, కొందరు పిచ్చినవ్వులు నవ్వుతున్నారు. చిత్రం ఏమిటంటే టీవీ చర్చల్లో అందరి మీదా ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి ప్రధాని, అమిత్‌ షాలకు దగ్గరగా ముందు వరుసలో విధేయుడైన సేవకుడి మాదిరిగా నడుము, తలా వంచుకుని తాపీగా కూర్చున్నాడు, మధ్యమధ్యలో అమిత్‌ షా, ప్రధాని వైపు చూసి చిరునవ్వులు నవ్వుతున్నాడు. ఈలోగా ఇంకేమైనా అడిగేది వుందా సమావేశం ముగిద్దామా అని మరొక అధికారి ఎంతో వినమ్రంగా అడిగాడు. ఈ లోగా షాక్‌ నుంచి తేరుకున్న కొందరు వివరణలు అడగటం ప్రారంభించారు. తిరిగి ప్రధాని లేవగానే మరోసారి నిశ్శబ్దం. మరోసారి చెబుతున్నా దేశ సమస్యలన్నింటికీ కారణం నెహ్రూ, ఆయన కుటుంబ వారసత్వమే. ఏం అమిత్‌ షా అంటూ అటు తిరిగారు.

ఆయన అంతేగా మరి అంటూ తాను కూడా లేస్తూ గడ్డాన్ని సవరించుకున్నాడు. సిబ్బంది వెంటనే వారికి దారి సుగమం చేశారు. ఇంతలో ఏమిటా కలవరింతలు, ఏమిటా పిచ్చినవ్వులు అంటూ మా ఆవిడ ఒక్కటివ్వటంతో నా మధ్యాహ్ననిద్ర భంగమైంది. ఎన్నికలప్పుడే ఇల్లు ప్రశాంతంగా వుంది, ఇప్పుడు ఈ పగటి నిద్రలేమిటో, కలవరింతలేమిటో చిరాకు పుట్టిస్తున్నారు అంటూ కసురుకుంటోంది. ఇంటి పట్టున వుండని జర్నలిస్టులెవరైనా ఎప్పుడైనా ఇంట్లో వుంటే అంతేగా మరి !

సత్య

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామాన్యులే కాదు, కార్పొరేట్ల సంపాదనా తగ్గింది!

12 Friday Apr 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Commoners, India elections 2019, India Inc's earnings, Modi era

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ తొలి రోజుల్లో విమానాల్లో విహరించి గత ప్రధానుల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. విదేశాల వారికి మన పేదరికం లేదా పిసినారితనం ఎక్కడ కనపడుతోందో అని దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రతిపక్షాల విమర్శలను కూడా దిగమించి ఖరీదైన సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగారు, విదేశీ అతిధులు వచ్చినపుడు వారితో సమంగా వ్యవహరించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా విదేశీయులు మన దగ్గర వస్తువులన తయారు చేయించుకొనేందుకు ఎగబడే విధంగా చేయటం కోసమే అని బిజెపి నేతలందరూ సమర్ధించారు. ఐదేండ్ల పాలన తరువాత అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్‌ సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక వార్తను విడుదల చేసింది.

అసాధ్యం అనుకున్న వాటిని అయిదేండ్లలో సుసాధ్యం చేశానని ఎన్నికల ప్రచారంలో వూరూ వాడా ప్రచారం చేస్తున్నారు. తాను తీసుకున్న చర్యలన్నీ దేశంలో వర్తక,వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి కోసమే అని తద్వారా వుపాధి పెరుగుతుందని నరేంద్రమోడీ నాయకత్వం చెబితే జనం ఎలాంటి శషభిషలు లేకుండా నమ్మారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం రోజుల తరబడి తమ సొమ్మును తామే తీసుకొనేందుకు బ్యాంకుల ముందు రోజుల తరబడి నిలబడి ప్రదర్శించిన దేశ భక్తిని చూశాము. రాష్ట్రాల అమ్మకపు పన్ను అధికారాన్ని తొలగించి జిఎస్‌టి అంటే దానికీ సై అన్నారు. అయితే రాయిటర్స్‌ వార్త సారాంశం ఏమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య అనుకూల అజెండా ఎక్కువ కార్పొరేట్‌ సంస్ధల లాభాల పెరుగుదల ప్రతిబింబించటంలో విఫలమైంది. అయినా మదుపుదారుల్లో ఇంకా ఆశచావలేదు. వడ్డీ రేట్లు గణనీయంగా పడిపోయాయి. చిన్న మదుపుదార్లకు అవకాశాలు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మాడీ మార్కెట్లను వుత్సాహంతో వుంచారు అని అలాట్‌ మెంట్‌ కాపిటల్‌ అధికారి కృష్‌ సుబ్రమణ్యం చెప్పారు.

మోడీ తిరిగి ప్రధానిగా వస్తారనే ఆశలతో విదేశీ మదుపుదారులు వుత్సాహంతో వున్నారు.గతేడాది జనవరి-మార్చినెలల్లో 4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితే ఈ ఏడాది ఆ మొత్తం 6.7బిలియన్లకు పెరిగింది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిఫ్టీ 63శాతం పెరిగితే ఈ ఏడాది ఇంతవరకు ఏడు శాతం పెరిగింది. స్వల్ప మెజారిటీతో బిజెపి తిరిగి అధికారానికి వస్తుందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఒక వేళ మోడీ తిరిగి రాకపోతే కొంత మేర నీరసం ఆవహిస్తుందని యుబిఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఛోఛోరియా అన్నారు. ఆర్జన లేకుండానే స్టాక్‌ మార్కెట్‌ పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 399 కంపెనీల వివరాలను విశ్లేషించినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఐదేండ్ల పాలనలో ఒక ఏడాది పడిపోతే మోడీ హయాంలో ఐదేండ్లలో నాలుగేండ్లు పడిపోయాయి.

రీఫినిటివ్‌ అనే సంస్ధ సేకరించిన సమచారాన్ని విశ్లేషిస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా 11.94% ఆర్జన పెరగ్గా మోడీ హయాంలో అది 3.72%కు పడిపోయింది.పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదలను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో నిప్టీ 500 సూచిక కంపెనీల లాభం జిడిపిలో 2.8శాతం వుందని అది గత పదిహేను సంవత్సరాలలో కనిష్టమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. 2014లో మోడీ అధికారంలోకి రాగానే భారత ఆర్ధిక రూపురేఖలనే మార్చివేస్తారన్న ఆశాభావం వుండేది, అయితే ఆశించిన వేగంగా అభివృద్ధి లేకపోయినప్పటికీ సంస్కరణలు తమకు ప్రయోజనం చేకూర్చుతాయని పెట్టుబడిదారులు ఇంకా ఆశాభావంతో వున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సాంప్రదాయకంగా రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్లకు బదులు మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌కు మళ్లారు. మోడీ హయాంలో నిఫ్టీ 75శాతం పెరిగింది. అయితే అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలో ప్రతి ఐదేండ్లకు ఆ పెరుగుదల వందశాతం చొప్పున వుంది. అంటే మోడీ పాలన ఈ విషయంలో కూడా వెనుకపడే వుంది.

గతం కంటే ఆర్జన తక్కువగా వున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచిక పెరిగింది అంటే దాని అర్ధం కంపెనీల విలువలు ఎక్కువగా వుండటమే. స్టాక్‌ మార్కెట్‌ పరిభాషలో నిఫ్టీ 500 సూచిక కంపెనీలలో సగటు పియి గత ఐదు సంవత్సరాలలో 18 వుంది. అదే అంతకు ముందు ప్రభుత్వ హయాంలో 14.22 మాత్రమే. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు.ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక రూపాయి ఆర్జించాలనుకుంటే గత ఐదు సంవత్సరాలలో 18 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే అంతకు ముందు రూ. 14.22 మాత్రమే పెట్టారు. ఏది లాభమో వేరే చెప్పనవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించటం ఎన్నికల ముందు బిజెపికి ఒక ఎదురుదెబ్బ అనవచ్చు.పాకిస్ధాన్‌ అభివృద్ధి రేటును తగ్గించటం కొన్ని రాజకీయ పక్షాలకు వూరట కలిగిస్తే, ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు పెంచటం మింగుడు పడని విషయం అనవచ్చు. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన అభివృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న.

ఇక మన దేశంలో అనేక మంది అభివృద్ధి విషయంలో చైనా కంటే మనం ముందున్నామని పోల్చుకుంటారు. కానీ మిగతా విషయాలకు వచ్చే సరికి అబ్బే అది కమ్యూనిస్టు నియంతృత్వం మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం, దానికి దీనికి పోలిక పెట్టకూడదంటారు. ఈ ఏడాది దాని అభివృద్ధి 6.2 నుంచి 6.3శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. డిసెంబరులో 4.9శాతంగా వున్న నిరుద్యోగ రేటు జనవరిలో 5.3శాతానికి పెరిగింది. అభివృద్ధి రేటు పెరగనున్నందున నిరుద్యోగశాతం తగ్గనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యండమూరి చరిత్రకారుడు కాదు, వెనిజులా గురించి రాసింది చరిత్రా కాదు !

12 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Historian, History, populist schemes, Venezuela, Yandamuri, Yandamuri Veerendranath

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు.ఈ సందర్భంగా రాస్తున్న దిగువ అంశాలు యండమూరి వంటి వారిని మార్చేందుకో లేక వారికి తెలియచేసేందుకో కాదు, ఏడు పదులు నిండిన వారు నేర్చుకొనేదేమి వుంటుంది. ఆ పేరుతో రాసింది నిజం అని గుడ్డిగా నమ్మేవారిని భిన్న కోణంలో ఆలోచించమని కోరేందుకే ఇది. ఆసక్తి వున్నవారే ముందుకు పోండి. లేని వారు సమయం వృధా చేసుకోవద్దని మనవి.

వెనిజులా గురించి కానీ మరొకదాని గురించి గానీ రాసే హక్కు యండమూరికి వుంది. అది కాపీ చేసిందా, లేక వక్రీకరణలను గుడ్డిగా అనుసరించిందా అని చర్చ చేసే హక్కు దాన్ని చదివిన వారందరికీ వుంది. అలాగే ఒక రచన, ఒక కళారూప ప్రయోజనం ఏమిటన్నది అవి వెలువడిన నాటి నుంచీ చర్చ జరుగుతూనే వుంది. యండమూరి రచనలనూ అలాగే పరిశీలించాలి. అవి కాపీ కొట్టినవా లేక మిగిలిపోయిన ఇడ్లీలను పొడి చేసి ఘమఘమ లాడే తాలింపుతో తయారు చేసిన వుప్మా వంటివా అన్నది వేరే విషయం. మీడియాలో వచ్చిన వార్తల మేరకు ఆయన వయస్సులో వుండగా ఒక యువకుడు, ఒక యువతి ఆయన రచనలను చదివి ‘వుత్తేజం’ పొంది ఆత్మహత్య చేసుకున్నారని 1980దశకం పత్రికల్లో వచ్చింది. ఆ సమయంలోనే ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ ఆ రచనలను విమర్శించినందుకుగాను తన పరువు పోయింది, దాని వెల 20వేల రూపాయలంటూ యండమూరి ఒక లాయర్‌ ద్వారా నోటీసు ఇప్పిస్తే దానికి ఆమె తగిన సమాధానం ఇచ్చిందనుకోండి. బహిరంగంగా ఒక రచన చేసినా, చరిత్ర అంటూ చెత్తను కుమ్మరించినా వాటి మీద వచ్చే విమర్శలను హుందాగా స్వీకరించాలి. ఆసక్తి వుంటే అర్దవంతమైన చర్చ జరపాలి.

2019 ఫిబ్రవరి 19వ తేదీన జాన్‌ పిల్గర్‌ అనే జర్నలిస్టు గ్లోబల్‌ రిసర్చ్‌ అనే పత్రికలో ‘అబద్దాల ప్రాతిపదికగా వెనిజులా మీద యుద్ధం'(ది వార్‌ ఆన్‌ వెనిజులా బిల్ట్‌ ఆన్‌ లైస్‌) అందువలన అంతర్జాతీయంగా సాగుతున్న ప్రచారానికి (బహుశా వాట్సాప్‌ పరిజ్ఞానం అయివుండవచ్చు) యండమూరి ప్రభావితులై నేను సైతం అన్నట్లుగా ఒక అబద్దాన్ని వండి వడ్డించారనుకోవాలి.

‘ ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో …. ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికి, బీద కుటుంబాలకూ నెలనెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. ‘ ఈ మాటలకు ముందు ‘తీరాల్లో సమృద్ధిగా ఆయిల్‌ వుంది, 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాసిన యండమూరి అలాంటి దేశంలో ఖాళీగా ఇంట్లో కూర్చొనే వారు, బీద కుటుంబాలు ఎందుకున్నాయో, దానికి కారకులు ఎవరో,అలాంటి బీదలకు సాయం చేస్తే తప్పేమిటో, ఆ దేశ సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోయిందో, అదెలా సమర్ధనీయమో చెబుతారా ? చరిత్ర అంటూ చెప్పేటపుడు దానికి వున్న అన్ని కోణాలను చెప్పకపోతే చెప్పేది చరిత్ర కాదు, చెత్త అవుతుంది. యండమూరి రాత చదివిన వారు అదేమిటో నిర్ణయించుకోవచ్చు.

‘దేశ ఐశ్యర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, వుద్యోస్తుల జీతాలు ఐదు రెట్లు పెంచాడు. సింగిల్‌ పేరెంట్స్‌ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు ‘ అని యండమూరి తన అక్కసును వెళ్లగక్కారు. దేశ సంపదను అందరికీ గాక అద్వానీ, అంబానీల మాదిరి కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకే అప్పగించాలా? విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా సంపదలను విదేశాలకు తరలించి విదేశీ పెట్టుబడుల రూపంలో వాటినే తిరిగి తీసుకు వచ్చి లాభాల మీద లాభాలు ఆర్జిస్తున్నారు. వెనిజులా కార్మికులు, వుద్యోగులకు వేతనాలు పెంచితే అవి తిరిగి వెనిజులా ఆర్దిక వ్యవస్దలోకే తిరిగి వస్తాయి, వారేమీ డాలర్లుగా మార్చివిదేశాల్లో పెట్టుబడులుగా పెట్టేవారు కాదు. ఈ మాత్రం కూడా తెలియని మేథావి యండమూరి అనుకోలేము. ఇక సింగిల్‌ పేరెంట్స్‌ మహిళలకు అనూహ్యంగా కానుకలిచ్చాడట అంటూ తన అక్కసుసు వెళ్లగక్కారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా భర్తలు లేని ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్కసారి పెన్షన్‌ కార్యాలయం దగ్గరకు వెళ్లి మీకెందుకు ఇవ్వాలని వారిని ప్రశ్నిస్తే ఏ సమాధానం వస్తుందో, ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకుంటే మంచిది, చేయి తిరిగిన రచయిత కదా, కొత్త ఇతివృత్తం దొరుకుతుంది.

వెనిజులా గురించి పక్షపాతం అంటే తెలియని మీడియా సంస్ధగా కొందరు చెప్పే బిబిసి పదేండ్ల కాలంలో ఇచ్చిన 304 వార్తల గురించి వెస్ట్‌ ఇంగ్లండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చిందేమంటే వాటిలో మూడంటే మూడే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సానుకూల వార్తలు వున్నాయట. అక్కడి మానవహక్కుల చట్టం, ఆహార, ఆరోగ్య, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధన, మిలియన్ల మంది ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు మద్దతుగా చేసిన ప్రదర్శన కనిపించలేదు. ఏమ్మా మదురో వ్యతిరేక ప్రతిపక్ష ప్రదర్శన వార్తను మాత్రమే ఇచ్చావేమిటి అని బిబిసి రిపోర్టర్‌ ఓర్లా గుయెరిన్‌ను అడిగితే ఒకే రోజు రెండు ప్రదర్శనల వార్తలను ఇవ్వటం ఎంతో కష్టం అని సమాధానమిచ్చింది.

ఏ వాస్తవం ఆధారంగా వెనెజులా మీద యుద్ధం ప్రకటించారో వార్త ఇవ్వటం కూడా ఎంతో కష్టం. ప్రధానంగా వాల్‌స్ట్రీట్‌ నేరపూరితమైన యంత్రాంగం కారణంగా 2014 నుంచి చమురు ధరలు కుప్పకూలటం గురించి నివేదించటం కూడా కష్టమే, అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త ఇవ్వటం కూడా చాలా కష్టం, రెండు బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతి చేసుకున్న ఔషధాలతో సహా 2017 నుంచి వాషింగ్టన్‌ ఆంక్షలు, వాటి వలన కనీసంగా ఆరు బిలియన్‌ డాలర్లు వెనిజులా నష్టపోయిందని వార్త రాయటం ఎంతో కష్టం, వెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. వాటిని కాదనే ధైర్యం యండమూరితో సహా ఎవరికైనా వుందా, ఇది చరిత్రలో భాగం కాదా అని సవినయంగా అడగాలి.

‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఛావెజ్‌ గురించి యండమూరికి ఏబిసిడిలు కూడా తెలియవు లేదా ముందే చెప్పినట్లు వాట్సాప్‌ పరిజ్ఞానంతో రాశారనుకోవాలి. 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధ(మన దగ్గర నక్సల్స్‌)ను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. తన అజెండాను అమలు జరిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, రాజ్యాంగ సవరణలు చేసిన ప్రజాస్వామిక వాదిగా ఆయన చరిత్రకెక్కారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. అక్కడ పదవీ కాలం ఆరేండ్లు, దాని మేరకు తరువాత ఎండమూరి చెప్పినట్లు 2008లో అసలు ఎన్నికలు జరగలేదు, 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. 2008లో బ్లాక్‌మార్కెటీర్లు ధరలను విపరీతంగా పెంచేసిన పూర్వరంగంలో ‘ యండమూరి చరిత్ర ‘లోని రొట్టెల మీదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నింటి మీద నియంత్రణలో భాగంగా ఆంక్షలు విధించాడు.నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

ఇక యండమూరి చరిత్ర పేరుతో రాసిన చెత్త అంతటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెద్దమనిషికి నేరాల రేటును ఎలా లెక్కిస్తారో కూడా తెలిసినట్లు లేదు. వెనిజులాలో ప్రతి లక్షమంది జనాభాకు ప్రతి ఏటా 20వేల మంది హత్యలకు గురి అవుతున్నారట. ఇంతకంటే అతి శయోక్తి లేదు ప్రపంచంలో అత్యధికంగా హత్యల రేటు వున్న దేశాల వరుసలో ముందున్న ఎల్‌సాల్వెడార్‌లో లక్షమందికి 82.84 మంది హతులవుతుండగా వెనిజులాలో 56.33 వుంది. లాటిన్‌ అమెరికా దేశాలన్నింటా, అనేక ఆఫ్రికా దేశాలలో ఇలాంటి పరిస్ధితికి కారణం నియంతలు, వారిని బలపరిచిన అమెరికా, సిఐఏ అన్నది జగమెరిగిన సత్యం. వెనిజులా రాజధాని కారకాస్‌ అంటే జంతుకళేబరం అని సెలవిచ్చారు. అక్కడ హత్యల రేటు 111.19 వుంది. ప్రధమ స్ధానంలో వున్న మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ జంటనగరాల్లో అది 111.33 వుంది. లాస్‌ కాబోస్‌ అంటే సురక్షితమైన రేవు అని అర్ధం. మరి అక్కడెందుకు జరుగుతున్నట్లు, అక్కడేమీ ఛావెజ్‌ లేదా వామపక్ష పాలన లేదే. అంతెందుకు సెయింట్‌ లూయీస్‌ పేరుతో వున్న అమెరికా నగరంలో హత్యల రేటు 65.83తో అమెరికాలో ప్రధమ స్ధానంలో వుంది. మరి పవిత్రమైన పేరు పెట్టుకున్న అక్కడెందుకు అన్ని హత్యలు జరుగుతున్నట్లు ? అందుకే చరిత్ర తెలియకపోతే చౌకబారు వ్యాఖ్యానాలు వస్తాయంటారు.

ఇక ఒళ్లమ్ముకొనే బాలికలనీ, సగం తాగిన సిగిరెట్ల కోసం వెంపర్లాడే పెద్దలనీ ఇలా ఏవేవో అతిశయోక్తులు రాశారు. వెనిజులా ఆర్ధిక ఇబ్బందులతో వున్న మాట నిజం, తనకు లంగలేదన్న కారణం, చమురు సంపదలను జాతీయం చేసిందన్న వుక్రోషం వంటి అనేక అంశాల కారణంగా అమెరికా కక్ష తీర్చుకుంటున్న దేశాలలో వెనిజులా మొదటి స్ధానంలో వుంది. అవి కొన్ని సామాజిక సమస్యలను సృష్టిస్తాయి. భూతల స్వర్గం అమెరికాలో ఒళ్లు అమ్ముకుంటున్నవారు, అడుక్కొనే వారు కూడా సూటూ బూటూ వేసుకొని అడుక్కొనే వారెందుకు వున్నట్లు, ధాయ్‌లాండ్‌ మంచి దేశమే కదా రాజధాని బ్యాంకాక్‌, ఇతర నగరాల్లో ఒళ్లమ్ముకొనే బాలికల కోసం ఎగబడి పోతున్న జనం గురించి యండమూరికి తెలియదా?

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.

సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. అలాంటి వారిలో యండమూరి ఒకరు. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం. చరిత్ర పేరుతో కుమ్మరించిన చెత్త విషయాలలో పేర్కొన్న అంశాలు అనేక దేశాలలో అంతెందుకు మన దేశంలో ఏ పట్టణంలో లేవు. రూపాయి కోసం హత్యలు చేసే వారు, కడుపు ఆకలి తీర్చితే మానం పోగొట్టుకొనేందుకు సిద్దపడే అభాగినులు ఇక్కడెందుకు వున్నట్లు ? సమసమాజం మంచిదే అంటూ జనానికి కాస్త వుపశమనం కలిగించే చర్యలను కూడా వ్యతిరేకించే వారు నిజంగా దాన్ని కోరుకుంటారంటే నమ్మేదెవరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నందిగ్రామ్‌లో తిరిగి ఎగిరిన ఎర్రజెండా !

09 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CPI(M), Nandigram, West Bengal Lok sabha Elections 2019

Image result for nandigram, cpi(m)

ఎం కోటేశ్వరరావు

నందిగ్రామ్‌, పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన పేరు, ప్రాంతం. భూసేకరణకు వ్యతిరేకంగా అక్కడ జరిగిన వుదంతాల కారణంగా అప్పటికే సిపిఎం పాలనపై వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న మమతాబెనర్జీ కమ్యూనిస్టులను గద్దె దింపి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల క్రితం రెండవ సారి కూడా గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో పన్నెండు సంవత్సరాల తరువాత గత ఆదివారం నాడు తిరిగి సిపిఎం తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, ఆక్రమించుకోవటం, కార్యకర్తలను నివాస ప్రాంతాల నుంచి వేలాది మందిని తరిమివేసినట్లు గతంలో పలుసార్లు సిపిఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లోని సిపిఎం కార్యాలయం సుకుమార్‌ సేన్‌ గుప్తా భవనం గత పది సంవత్సరాలుగా మూతపడి వుంది. ఆదివారం నాడు కార్యాలయ ప్రారంభంతో పాటు తమ్లుక్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్ధి ఇబ్రహీం ఆలీకి మద్దతుగా పెద్ద ప్రదర్శన కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీనేత రబిన్‌దేవ్‌ మాట్లాడుతూ ఒకనాడు వామపక్ష వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా వున్న చోట తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించటానికి కారణం తృణమూల్‌ కాంగ్రెస్‌ దుష్పరిపాలనను గమనించిన జనం తిరిగి తమవైపు రావటమే కారణం అన్నారు.

అయితే తృణమూల్‌ వ్యతిరేకులందరూ తమ వైపు వచ్చిన కారణంగా ప్రతిపక్ష ఓట్లలో చీలిక తెచ్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ వారే సిపిఎంతో కుమ్మక్కై పార్టీ కార్యాలయ ప్రారంభానికి అవకాశమిచ్చారని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌ దాస్‌ ఆరోపించారు. దీన్ని తృణమూల్‌ అభ్యర్ధి దివ్యేందు అధికారి తోసి పుచ్చారు. బిజెపి పగటి కలలు కంటున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, మావోయిస్టు తదితర సిపిఎం వ్యతిరేకశక్తులన్నీ రైతులకు మద్దతు ఇచ్చి ఆందోళన చేయించాయి. ఆసందర్భంగా జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఆ తరువాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ ప్రతిపక్షాలు హింసాకాండను కొనసాగించాయి.

ఈ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్‌ మధ్య పరస్పర పోటీ నివారించుకొనేందుకు జరిగిన చర్చలు విఫలం కావటంతో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నందిగ్రామ్‌ ప్రాంతం వున్న తమ్లుక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మార్చిచివరి వారంలో బిజెపి నుంచి చేరిన లక్ష్మన్‌ సేథ్‌ను ప్రకటించారు. సేథ్‌ గతంలో సిపిఎం తరఫున మూడుసార్లు ఎంపీగా పని చేసి నందిగ్రామ్‌ వుదంతం తరువాత పార్టీ నుంచి వుద్వాసనకు గురయ్యాడు. తరువాత బిజెపిలో చేరాడు, ఈ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలిపేది లేదని ఆ పార్టీ స్పష్టం చేయటంతో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరాడు. రాష్ట్ర కాంగ్రెస్‌ అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా అధిష్టానవర్గం అభ్యర్ధిత్వాన్ని ప్రటించింది. తాను చెప్పిన అభ్యంతరాన్ని ఖాతరు చేయలేదని పార్టీ కార్యకర్తలు తగినన సమాధానం చెబుతారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అబ్దుల్‌ మన్నన్‌ వ్యాఖ్యానించారు. తాము చేయగలిందేమీ లేదని పిసిసి అధ్యక్షుడు సోమేన్‌ మిత్రా అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు పార్టీలు పోటీలో వున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం 42 స్ధానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు స్ధానాలు మినహా 38 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘటన పుంజుకుంటుందా, బిజెపి తన స్ధానాలను సంఖ్యను పెంచుకుంటుందా అన్నది ప్రధాన చర్చ నీయాంశంగా వుంది. పార్టీలన్నీ చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి.తృణమూల్‌ను పక్కకు నెట్టి వామపక్ష వ్యతిరేక శక్తిగా తాను ముందుకు రావాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంఘపరివార్‌ శక్తులు శ్రీరామనవమి, దుర్గాపూజ, వంటి మతపరమైన సందర్భాలన్నింటినీ వినియోగించుకొని ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు విమర్శలు వున్నాయి.

ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో కొల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ను అందుకు వేదికగా చేసుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన సభలను చూస్తే మోడీ పాల్గన్నది అత్యంత పేలవంగా వుంది, ఆ సభకోసం బిజెపి 32కోట్ల రూపాయలను ఖ ర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభకు రెండులక్షల మంది వరకు రాగా ఫిబ్రవరి మూడున వామపక్షాలు జరిపిన సభకు పదిలక్షల వరకు జనం హాజరయ్యారు. ఈ సభ వామపక్షాలలో ఎంతో ఆత్మస్ధైర్యాన్ని నింపింది.

నరేంద్రమోడీ ఒక వలస పక్షి వంటి వారు, ఎన్నికలపుడే వస్తారు, కాగానే వెళ్లిపోతారు, మాకు కావాల్సింది నిజమైన చౌకీదారు తప్ప మోసగాడు కాదు అని మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తుతున్నారు. తృణమూల్‌ శారద-నారద పార్టీ అని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. అయితే శారద-నారద- హవాలా లీడర్లందరూ ఇప్పుడు బిజెపి అవతారమెత్తారని మమతా బెనర్జీ తిప్పికొడుతున్నారు.

Image result for after 12 years red flags again unfurled in nandigram

గత పార్లమెంట్‌,అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాయిజం గురించి మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా పంచాయతీలన్నీ ఏక గ్రీవం అయ్యేట్లు చూశారన్న విమర్శలు వున్నాయి. ఎన్నికలు జరిగిన చోట్ల రిగ్గింగ్‌ చేశారు. అవినీతి కేసులు వున్న తృణమూల్‌ ఎంపీలు, నేతలు దాడుల భయంతో బిజెపికి ఫిరాయించారు. ప్రస్తుత ఎన్నికల్లో తృణమూల్‌ వ్యతిరేక ఓట్లను పొందేందుకు వామపక్ష సంఘటన, బిజెపి, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. వామపక్ష సంఘటనలో సిపిఎం 29, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ, ఆర్‌ఎస్‌పి మూడేసి సీట్లుకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ గెలిచిన నాలుగు సీట్లకు వామపక్ష సంఘటన అభ్యర్ధులను ప్రకటించలేదు.కాంగ్రస్‌ స్పందనను బట్టి వాటి మీద కూడా తాము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి. మొత్తం ఏడు దశలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల పరంగా చూస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ తరువాత వామపక్ష సంఘటనకే ఎక్కువ వున్నాయి. 2016లో వామపక్ష సంఘటన, కాంగ్రెస్‌ సర్దుబాట్లు చేసుకున్నాయి. అందువలన పొందిన ఓట్లు వాస్తవ బలాన్ని ప్రతిబింబించవు. ఆ సర్దుబాటును సిపిఎం కేంద్ర కమిటీ తప్పు పట్టింది. పార్టీ ఆమోదించిన విధానానికి వ్యతిరేకం అని పేర్కొన్నది.

2014లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం, సీట్లు

తృణమూల్‌    39.05     34

లెఫ్ట్‌ ఫ్రంట్‌     29.71     2

బిజెపి          17.02    2

కాంగ్రెస్‌         9.58      4

2016అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్లశాతం సీట్లు

తృణమూల్‌   44.9    211

లెఫ్ట్‌ ఫ్రంట్‌    25 .8   30

సిపిఎం       19.8    26

సిపిఐ          1.5    1

ఆర్‌ఎస్‌పి       1.7    3

ఫార్వార్డ్‌బ్లాక్‌   2.8     2

బిజెపి        10.2    3

కాంగ్రెస్‌      12.3    44

ఇతరులు      0      4

Share this:

  • Tweet
  • More
Like Loading...

అద్వానీ వూడగొట్టిన నాగటి కర్రు ?

07 Sunday Apr 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP, L K Adavani, Lal Krishna Advani's recent blog, LK Advani Comment, Narendra Modi, Rhul Gandhi on Advani, RSS

Image result for Adavani  an useless entity  In BJP

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో పిలుపు ఇచ్చారు. బిజెపి అగ్రనాయకుడు ఎల్‌కె అద్వానీ ఇప్పుడు వూడగొట్టిన నాగటి కర్రు. అది నాగలికి వుంటేనే దున్నటానికి పనికి వస్తుంది. ఒట్టి కర్రుతో పొలం దున్నలేరు. తాను ఏమి మాట్లాడినా తనకు ఇంతకు మించి పోయేదేమీ లేదన్నట్లుగా తొమ్మిది పదులు దాటిన బిజెపి కురువ ద్ధుడు ఎల్‌కె అద్వానీ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా ! బిజెపిలో అంత ధైర్యమూ లేదు, ఎవరికీ అంతసీన్‌ లేదు. అందుకే వుక్రోషంతో తన బ్లాగ్‌లో తన అంతరంగం ద్వారా నరేంద్రమోడీ తీరు తెన్నులపై పరోక్షంగా ధ్వజమెత్తారని కొందరి అభిప్రాయం.

తన బ్లాగ్‌లో అద్వానీ విప్పిన అంతరంగ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. బిజెపిలో వున్న మనమందరం పార్టీ వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా వెనుకా, ముందూ చూసుకోవటం, ఆత్మపరిశీలన చేసుకోవటం మంచిది అని చెప్పారు. పార్టీలోపలా, విశాలమైన దేశ వ్యవస్ధలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడు కోవటం బిజెపి ప్రమాణ చిహ్నంగా వుండాలి.మన ద ష్టిలో జాతీయ వాదం అంటే రాజకీయంగా మనతో ఏకీభవించని వారిని మనం ఎన్నడూ జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు, వ్యక్తిగతంగా రాజకీయ స్దాయిలో వ్యక్తులు ఎంచుకొనే స్వేచ్చకు బిజెపి కట్టుబడి వుంటుంది. ముందు దేశం, తరువాత పార్టీ,మన గురించి చివరిగా ఆలోచించాలన్న సూత్రం తనకు జీవిత మార్గదర్శిగా వుందని, జీవితాంతం దానికి కట్టుబడి వుంటానని అద్వానీ పేర్కొన్నారు.

బిజెపి నిజమైన స్వభావాన్ని అద్వానీ గారు పక్కాగా చెప్పారు. దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివర వుండాలనే మార్గదర్శక మంత్రం బాగా తెలిసిందే. బిజెపి కార్యకర్తగా గర్వపడుతున్నాను మరియు ఎల్‌కె అద్వానీ వంటి గొప్పవారు దాన్ని మరింత బలపరిచారు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ద్వారా వ్యాఖ్యానించారు. అద్వానీ ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఆయనకు పోయేదేమీ లేదు అంటూ ఒక పత్రికలో వ్యాఖ్యానం మొదలైంది. అద్వానీకి నోరు విప్పటానికి ఐదేండ్లు పట్టింది, అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు అని బిజెపి మిత్రపక్షం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ప్రశ్నించింది.

Image result for Advani , modi in different occasions

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు కిసుక్కున నవ్వటం తగని పని అన్నట్లు అద్వానీ గురించి రాహుల్‌ గాంధీ చేసిన వాటి కంటే చౌకీదారు పంగనామాలు పెట్టుకున్న బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ ఎన్నికల సభలో మాట్లాడిన రాహులు ఇలా అన్నారు.’ బిజెపి హిందూయిజం గురించి మాట్లాడుతుంది, హిందుస్దాన్‌లో గురువు అధిపతి. పార్టీ గురుశిష్య సంబంధాల గురించి మాట్లాడుతుంది. మోడీ గురువు ఎవరు? అద్వానీ, అద్వానీని ప్రజాజీవన వేదిక మీది నుంచి తోసివేశారు’ అన్నారు. గురువును అవమానించటం హిందూ సంస్క తి కాదంటూ నరేంద్రమోడీని వుద్దేశించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యా నించారు. హిందూ సంస్క తి గురించి మాట్లాడే హక్కు తమకే వుందని, పేటెంట్‌ తీసుకున్నామన్నట్లుగా చెప్పుకొంటుంది బిజెపి. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు హిందూత్వను హిందూత్వతోనే దెబ్బతీయాలి అన్నట్లుగా రాహుల్‌ గాంధీ మాట్లాడారా ? లేక తామూ హిందూ సంస్కృతి గురించి చెప్పగలమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్లుగా వుంది. అదే హిందూ సంస్క తిలో గురువు తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన ఒక శిష్యుడి కోసం తనను పరోక్షంగా గురువుగా భావించిన మరొక శిష్యుడి బొటనవేలిని కానుకగా కోరిన దారుణం కూడా తెలిసిందే. దాని మంచి చెడ్డలను మరోసారి చూడవచ్చు.

Image result for Advani , modi in different occasions

అసలు విషయం ఏమంటే బిజెపి వ్యవస్దాపక నేతలలో ఒకరైన ఎల్‌కె అద్వానీ పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పటం మినహా మిగిలిన అవమానాలన్నీ జరిగాయి. వాటన్నింటినీ దిగమింగుతూ ఏప్రిల్‌ ఆరున బిజెపి వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా ఎవరూ కోరకుండానే పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు తన బ్లాగ్‌ ద్వారా అద్వానీ ఈనెల నాలుగు ఒక సందేశాన్ని పంపారు. గత ఐదు సంవత్సరాలలో ఒక బ్లాగ్‌ పోస్టు పెట్టటం ఇదే ప్రధమంట. నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ పేరుతో రేడియోలో ప్రతి నెలా తన అంతరంగాన్ని బయట పెడితే, అంతకు ముందే అద్వానీ తన ఇంటర్నెట్‌ బ్లాగ్‌లో తన అంతరంగాన్ని అభిప్రాయాల రూపంలో అప్పుడు రాస్తుండేవారు. ఏమి రాస్తే, ఏమి మాట్లాడితే ఎవరికేమి కోపం వస్తుందో అన్నట్లుగా గత ఐదేండ్లుగా బ్లాగులో రాయట మానుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా లోక్‌సభకు హాజరు కావటం, అలవెన్సులు తీసుకోవటం తప్ప ఒక్కసారి కూడా నోరు విప్పని సభ్యుల జాబితాలో ఆయన కూడా చేరిపోయారనే విమర్శలకు గురయ్యారు. ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం 365పదాలను మాత్రమే మాట్లాడారని, అది కూడా 2014లో అని ఇండియా టుడే పత్రిక పేర్కొన్నది, బహుశా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అయి వుండవచ్చు.

ఆరు సార్లు గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి ఎంపీగా వున్న అద్వానీని వయసు మీరిందనే సాకు చూపి ఈ సారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోగా ఆయనే పోటీ చేయటం లేదని చెప్పారంటూ బిజెపి నేతల నుంచి మీడియాకు వుప్పందించారు. ఈ చర్య ఆయనను అవమానించటంగా మీడియా, ప్రతిపక్షాలు వర్ణించాయి తప్ప బిజెపి ప్రముఖులెవరూ నోరు విప్పలేదు. రాహుల్‌ గారూ మీ మాటలు మమ్మల్ని ఎంతగానో గాయపరిచాయి, అద్వానీ మాకు బిజెపిలో తండ్రితో సమానుడు . మీ వుపన్యాసాల్లో కాస్త ఔచిత్యం ప్రదర్శించండి’ అని సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

నిజానికి రాహులు గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించారు గానీ నరేంద్రమోడీ గురువుకు పంగనామాలు పెట్టారని ఐదు సంవత్సరాల క్రితమే జనానికి అర్దమైంది. అనుమానాస్పద స్దితిలో జరిగిన గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మారణ కాండ సమయంలో నరేంద్రమోడీయే ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో ప్రధానిగా వున్న వాజ్‌పేయి పదవి నుంచి తప్పుకోవాలని మోడీని ఆదేశించారని, అద్వానీ మద్దతుతో మోడీ తిరస్కరించి ముఖ్యమంత్రిగా కొనసాగారని, చేసేదేమీ లేక రాజధర్మం పాటించాలన్న వుద్బోధతో వాజ్‌పేయి సరిపెట్టారని అప్పుడే వార్తలు వచ్చాయి. నాడు అద్వానీ మద్దతు లేకపోతే నేడు ప్రధానిగా నరేంద్రమోడీని వూహించలేము.

ప్రధాని పదవిపై ముందునుంచీ కన్నేసిన నరేంద్రమోడీ పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి కోసం 2013లోనే పావులు కదిపి విజయం సాధించారు. ఆయన పేరును పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించగానే అద్వానీ మౌనంగా వుండటం తప్ప మరేమీ చేయలేని స్దితిలో పడ్డారు. అద్వానీకి పదవి నిరాకరించితే సమస్యలు వస్తాయని వూహించి 75 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదని ఒక నిబంధను ముందుకు తెచ్చారు. దానికి అనుగుణంగా అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారితో మార్గదర్శక మండలి ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామంటూ మండలి ఏర్పాటు గురించి ప్రకటించారు. అది ఐదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదు, నరేంద్రమోడీ సర్కార్‌ సలహా ఇమ్మని ఒక్కసారి కూడా కోరలేదు.ఇది పొమ్మన కుండా పొగపెట్టటమే అని అందరూ అప్పుడే వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని అస్త్రాలను నరేంద్రమోడీ ప్రయోగిస్తున్న దశలో అధికారం కోసం ఏం చేసినా తప్పులేదనే ఒక అభిప్రాయాన్ని దిగువ స్దాయి కేడర్‌ వరకు బిజెపి ఎక్కించింది. దేశంలో హిందూత్వ, హిందూ మతాన్ని కాపాడాలంటే నరేంద్రమోడీ తప్ప మరొకరి వల్ల కాదనే అభిప్రాయాలు నిత్యం సామాజిక మాధ్యమంలో వెల్లడి అవుతున్నాయంటే దాని అర్దం అదే. అందువలన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల గురించి బిజెపి కార్యకర్తలకు ఎంత మేరకు ఎక్కుతాయనేది ప్రశ్న. నరేంద్రమోడీ గోరక్షకులు హద్దులు మీరవద్దంటూ అనేక సుభాషితాలు పలికారు. అలా హద్దులు మీరి, హత్యలు చేసిన నిందితులు అనేక మంది వుత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న బిజెపి ఎన్నికల సభల్లో ముందువరుసల్లో కూర్చున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అలాంటి వారికి విద్వేషం వద్దు ప్రేమే ముద్దు అంటే ఎక్కుతుందా ?

భిన్నాభి ప్రాయం చెప్పిన వారందరినీ దేశద్రోహులుగా సంఘపరివార్‌ సంస్ధలూ, వాటికి వంత పాడిన మీడియా గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంచిత్రీకరిస్తోంది.గతంలో అనేక మంది ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేసి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని దేశం ఇంకా మరచి పోలేదు. ఇప్పుడు చెప్పిన మాటలను అద్వానీ అప్పుడు చెప్పివుంటే వాటికి ఎంతో విలువ వుండేది. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్ధలను, స్వతంత్ర అధికార వ్యవస్దలను నాశనం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వెలువడిన సమయంలో అద్వానీ ఎందుకు నోరు విప్పలేకపోయారు, పార్లమెంటులో ఒక్కసారి కూడా నోరు విప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు. నక్కబోయిన తరువాత బక్కపూడ్చినట్లు ఇప్పుడు చెప్పారు అనే వారిని తప్పు పట్టలేము. తనకు తిరిగి సీటు ఇచ్చి వుంటే ఇలా మాట్లాడేవారా అనే వారు కూడా లేకపోలేదు. దేశమంతటికీ ముఖ్యంగా బిజెపికి ఎన్నికల, మరోసారి అధికార జ్వరం తీవ్ర స్దితికి చేరిన సమయంలో చెబితే ఎంత మంది వినిపించుకుంటారు అన్నది ప్రశ్న.

దేశంలో అత్యవసర పరిస్దితి విధించి నాలుగు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా 2015లో అద్వానీ మాట్లాడుతూ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నలిపివేశే శక్తులు బలంగా వున్నాయని వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరుతో పశువుల వ్యాపారులు, మైనారిటీల మీద దాడులు ప్రారంభమైన సమయ మది. దేశంలో హిందూత్వ పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభమైనపుడే ఇలాంటి వాటిన్నింటికీ బీజాలు పడ్డాయి. అవి పెరిగి పెద్ద వ క్షాలుగా ఎదగటానికి తోడ్పడిన వారిలో అద్వానీ పాత్ర లేదా అని ప్రశ్నించే వారు లేకపోలేదు.1980లో బిబిసితో మాట్లాడుతూ బిజెపిని హిందూ పార్టీ అని పిలవటం తప్పేమీ కాదు అన్నారు. తరువాత కొన్ని సంవత్సరాలకు దేశ లౌకిక విధానం హిందువుల ఆకాంక్షలపై సహేతుకంగాని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. ఎవరైతే హిందువుల ప్రయోజనాలకోసం పోరాడతారో ఇక నుంచి వారే దేశాన్ని ఏలుతారు అన్నారు. కుహనా లౌకిక వాదం అనే పదాన్ని ప్రయోగించటం, ప్రాచుర్యంలోకి తేవటంలో అద్వానీ చేయాల్సిందంతా చేశారు.

Image result for Advani , modi in different occasions

అయితే అద్వానీకి అలా హితబోధ చేసే హక్కు లేదా అని ఎవరైనా అనవచ్చు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి వుద్బోధలు మోడీ, బిజెపికి హాని కలిగిస్తాయి కనుక అద్వానీ అయినా సరే అలా మాట్లాడటాన్ని సహించం అని హిందూత్వ పులినెక్కిన వారు హూంకరించవచ్చు. అద్వానీకి ఆ హక్కు, అవకాశం వుందని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే చరిత్ర నిర్దాక్షిణ్యమైనది. గాంధీని మోసిన రైలేే గాడ్సేను కూడా అనుమతించింది. అద్వానీ వుద్బోదధలను నమోదు చేసి సానుభూతి కలిగేట్లు చేసినట్లుగానే ఆయన విద్వేష పూరిత రాతలు, ప్రసంగాలను కూడా జనం ముందుంచి ఆయన మీద ద్వేషం, వ్యతిరేకతను కలిగేట్లు చేసింది.

ప్రస్తుతం మీడియాలో, జన వాడకంలో వున్న కుహనా లౌకిక వాదం అనే పదాన్ని వుపయోగించి హిందువుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ బహుళ ప్రచారం తెచ్చింది అద్వానీయే. ఆ పదం మరింత ముదిరి బిజెపి నేతలు,అనుచరులు లౌకికవాదులంటే దేశాన్ని ముక్కలు చేసే గాంగ్‌ అని నిందిస్తున్నది.1997 ఆగస్టులో బిజెపి టు డే అనే పత్రికలో అద్వానీ రాసిన దానిలో ఇలా వుంది.’ హిందుత్వ లేదా సాంస్క అతిక జాతీయ వాదం మతపరమైనది కాదు,(ముస్లింలు) రాముడు, క అష్ణుడు ఇతరులను జాతీయ సంస్క అతికి చిహ్నాలుగా అంగీకరించాలి మరియు అయోధ్యలో రామాలయానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే రాముడు భారత సంస్క అతి మరియు నాగరికతకు చిహ్నం’ అని రాశారు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

Image result for Advani , modi in different occasions

రధయాత్ర పేరుతో అద్వానీ దేశంలో ఎలాంటి రాజకీయాలకు తెరలేపారో, ఎంతటి మారణకాండకు ఆద్యుడయ్యారో తెలిసిందే. ఆయన కళ్ల ముందే బాబరీ మసీదు కూల్చివేత, దాన్ని ఆపేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. తనకు రాజకీయ భిక్షపెట్టిన అద్వానీని ప్రధాని నరేంద్రమోడీ విస్మరించారని, అవమానించారని అంటున్నారంటే వూరికే కాదు. 2008లో అద్వానీ తన ఆత్మకథను ప్రచురించారు.దానిలో ఇలా రాశారు.’ గోద్రాలో కరసేవకుల సామూహిక హత్యల అనంతరం గుజరాత్‌లో మతహింసాకాండ చెలరేగింది. ఆ దారుణమైన సంఘటన గురింఎతీ గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తీవ్ర ఖండనలకు గురయ్యారు. మోడీని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారు. నా అభిప్రాయంలో జరిగిన దానికంటే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకున్నారు.’ అలావెనకేసుకు వచ్చిన పెద్దమనిషి ఇప్పుడు మోడీ చేశారని చెబుతున్నదానిని ఎలా ఖండించగలరు, ప్రత్యక్షంగా మోడీని ఎలా విమర్శించగలరు.

దేశంలో 1990దశకలో తలెత్తిన మత హింసాకాండకు అద్వానీ రధయాత్ర ఎంతగానో దోహదం చేసింది. బాబరీ మసీదు కూల్చివేత కుట్రలో అద్వానీ, మురళీ మనోహర జోషి, వుమా భారతి(బిజెపి లేదా నరేంద్రమోడీ పక్కన పెట్టిన జాబితాలోని వారు) తదితరుల ప్రమేయం గురించి రోజువారీ విచారణ జరిపి 2019 ఏప్రిల్‌ 19లోగా రెండు సంవత్సరా వ్యవధిలో పూర్తి చేయాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది.

బాబరీ మసీదుకు ముందు రామాలయం వుండేదని రుజువు అవుతుందని సంఘపరివార్‌ సంస్ధలు చెబుతుండేవి. అయితే క్రీస్తుపూర్వం పదకొండవ శతాబ్దిలో అయోధ్యలో మానవ ఆవాసాలు వున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని రామాయణ స్ధల ప్రాజెక్టు నివేదికలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఎఎస్‌ఐ) తెలిపింది. దాంతో రామాలయ వాదుల నోట్లో వెలక్కాయపడింది. సరిగ్గా ఆ సమయంలో అద్వానీ వారిని ఆదుకున్నారు. రాముడు ఒక నమ్మకం దానికి సాక్ష్యాలు ఎలా వెతుకుతారంటూ అద్వానీ వాదించారు.అప్పటి నుంచి కోర్టులు విశ్వాసాల మీద తీర్పులు చెప్పలేవంటూ సంఘపరివార్‌ వాదించటం మొదలు పెట్టింది. అంటే కోర్టు తీర్పును తాము అంగీకరించేది లేదని చెప్పేందుకు వేసిన ప్రాతిపదిక ఇది. శబరిమల ఆలయంలో కూడా అదే వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయోధ్యలో రామాలయ నిర్మాణమే తమ లక్ష్యం అని చెప్పేవారు. దానికి సాంస్కృతిక జాతీయవాదాన్ని పైన చేర్చింది అద్వానీ మహాశయుడే అన్నది తెలిసిందే.

మసీదు కూల్చివేత కేసులో అద్వానీని ప్రభుత్వ సకల వసతి గృహంలో నిర్భందించారు. ఆ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన వ్యాసాలలో డిసెంబరు ఆరు తన జీవితంలో విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఇలా చెప్పటం మసీదును కూల్చివేసినందుకు క్షమాపణగా భావించవచ్చా అన్న ప్రశ్నకు కాదని సమాధానమిచ్చారు. తరువాత స్మృతులలో అద్వానీ మరొక కధనాన్ని వినిపించారు. బాబరీ మసీదు వద్ద చేరిన జనాన్ని అదుపు చేయటంలో విఫలమైనందుకు తాను విచారపడుతున్నానని,వ్యక్తిగతంగా తనకు పరువు నష్టమని, ఆ స్ధలంలోని కట్టడానికి ఎలాంటి నష్టం కలిగించకుండా నామ మాత్రంగా రామాలయ నిర్మాణ కార్యక్రమం చేపడతారని అనుకున్నానని పేర్కొన్నారు. కూల్చివేత పట్ల విచారం ప్రకటించినందుకు సంఘపరివార్‌లో, బయటి లౌకికవాదులు కూడా తనను విమర్శించారని, తన వ్యక్తిగత విశ్వసనీయత కరిగిపోయిందని చెప్పుకున్నారు.

Image result for Advani , modi in different occasions

అద్వానీ గళం అప్పుడేమైంది? భిన్నాభిప్రాయం కలిగినంత మాత్రాన వారిని జాతి వ్యతిరేకులు అనాల్సిన అవసరం లేదని అద్వానీ ఇప్పుడు అంటున్నారు. అసలు నోరు మూసుకోవటం కంటే ఎప్పుడో ఒకప్పుడు తెరవటం మంచిదే కదా అనే అరగ్లాసు సంతృప్తి జీవులుంటారు. ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి జరిగిన తరువాత మార్చిమూడవ తేదీన బీహార్‌లో మోడీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాని వారందరినీ పాకిస్దాన్‌కు మద్దతుదార్లుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెలవిచ్చినపుడు మార్గదర్శక మండలి సభ్యుడిగా అద్వానీ నోరు మెదపలేదు. ఈ వైఖరితో విబేధించే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారినే కదా ఇప్పుడు దేశద్రోహలు అని నిందిస్తున్నది. మరి ఇప్పుడు అదే అద్వానీ గతంలో తాను చెప్పిన దానికి భిన్నంగా బోధ చేస్తే బిజెపిలో వినే వారుంటారా ?

స్వాతంత్య్ర వుద్యమ సమయంలోనే కమ్యూనిస్టులు మహాత్మా గాంధీ వైఖరితో విబేధించారు, వ్యతిరేకించారు. తరువాత కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు, బిజెపి మత పోకడలు చూసి కనీసం గాంధీ చెప్పిన అంశాలకైనా కట్టుబడండని అదే కమ్యూనిస్టులు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్దితి తలెత్తింది. దేశమంటే బిజెపి,బిజెపి అంటే దేశం, బిజెపిని విమర్శించటమంటే దేశాన్ని విమర్శించటమే అనే ఒక వున్మాద వాతావరణం దేశంలో నెలకొన్న స్దితిలో అద్వానీ మంచి మాటలు ఎందరికి ఎక్కుతాయన్నది ఒక ప్రశ్న. ప్రపంచ చరిత్రలో అనేక మంది నియంతలను చూశాము. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మనీలో హిట్లర్‌ను చూసిన తరువాత వాడి కంటే పూర్వపు నియంతలే మెరుగు అనిపించాడు. బాబరీ మసీదును కూలదోస్తున్న సమయంలో స్వయంగా అక్కడే వున్న ఎల్‌కె అద్వానీ నాడు ఒక పెద్ద మతోన్మాది, పచ్చిమితవాదిగా కనిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు బిజెపిని విమర్శించిన తెలుగుదేశం వంటి పార్టీలు ఆ పార్టీకే కేంద్రంలో ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగితే వాజ్‌పేయిని చూసి తప్ప బిజెపిని చూసి కాదని చెప్పుకున్న విషయాన్ని మరచి పోరాదు. ఇప్పుడు అలాంటి అద్వానీయే మెరుగని నరేంద్రమోడీ తీరుతెన్నులు జనం చేత అనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలు చెప్పింది వినకపోతే పాయే మీ అద్వానీ చెప్పింది అయినా పాటించమని జనం గళం విప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతకు ముందుంది మరింత కష్ట కాలం !

04 Thursday Apr 2019

Posted by raomk in Congress, Current Affairs, Economics, employees, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

gloomy jobs scenario in india, jobs for machines in india, jobs scenario in india, Machines Vs humans

Image result for gloomy jobs scenario in india

ఎం కోటేశ్వరరావు

కాంగ్రెస్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను నమ్మి జనం ఓటేసి గెలిపిస్తే తరువాత దాని అమలు విషయానికి వస్తే జుమ్లా (ఏదో అవసరానికి అలా చెబుతాం) అవుతుందా ? ఏమో ! నరేంద్రమోడీ వాగ్దానం చేసిన మేరకు నల్లధనాన్ని వెలికి తీసి ఆ మొత్తం నుంచి ప్రతి ఒక్కరికి వేస్తామన్న పదిహేను లక్షల రూపాయల సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే అమాయకులు ఇంకా వున్నారు కదా ! ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలకు అచరణకూ పొంతన వుండదని ఏడు దశాబ్దాల అనుభవం చెబుతోంది. రానున్న పది సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానుంది. అందువలన యువత, వారి భవిష్యత్‌ను కోరే వారు ఆలోచించి తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి వుంది.

తాము అధికారంలోకి రాగానే 2020 నాటికి నాలుగు లక్షల కేంద్ర వుద్యోగాలను భర్తీ చేస్తామని ఇవిగాక రాష్ట్రాలలో వున్న మరొక ఇరవై లక్షల వుద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ పేర్కొన్నది. ఇవి గాక ఏటా 22లక్షల కొత్త వుద్యోగాల కల్పన కూడా చేస్తామని చెప్పారు. స్ధానిక సంస్దలలో పదిలక్షల సేవామిత్రల ఏర్పాటు గురించి కూడా వాగ్దానం వుంది. 2013 మార్చినెల నాటికి ఆరులక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ వుద్యోగ ఖాళీలు వుండగా 2014 మార్చి ఒకటి నాటికి అవి 4లక్షల 21వేల వుద్యోగాలు ఖాళీగా వుండగా గత ఐదు సంవత్సరాలలో కూడా దాదాపు అదే స్దాయిలో ఖాళీలు వున్నాయి.గత ఏడాది పార్లమెంటులో వివిధ సందర్భాలలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను క్రోడీకరించగా కేంద్ర, రాష్ట్రాలలో, ప్రభుత్వ రంగ సంస్ధలలో మొత్తం 24లక్షల మేరకు ఖాళీలు వున్నాయి. విద్యా రంగంలో పదిలక్షలు, పోలీసుశాఖల్లో 5.4, రైల్వేల్లో 2.5, రక్షణ రంగంలో 1.2లక్షలు, పారా మిలిటరీలో 61వేలు ఖాళీలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వశాఖలలో మంజూరైన పోస్టుల సంఖ్య 36,33,935 కాగా వున్న సిబ్బంది 32,21,183 మాత్రమే.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలలో (సిపిఎస్‌ఇ) 2013-14లో 13.49లక్షల మంది సిబ్బంది వున్నట్లు నమోదు కాగా మోడీ అధికారానికి వచ్చాక 2016-17 నాటికి ఆ సంఖ్య 11.31లక్షలకు పడిపోయిందని తాజా ప్రభుత్వ రంగ సంస్దల సర్వే వెల్లడించింది. ఈ అంకెలు చెబుతున్న వాస్తవాలేమిటి? ఖాళీగా వున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్దల వుద్యోగాల గురించి కాంగ్రెస్‌ ఏమీ చెప్పలేదు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కూడా నాలుగు లక్షల ఖాళీలు వున్నాయి. పదేండ్లు అధికారంలో వున్నపుడు చేయలేని పనిని రేపు వస్తే గిస్తే ఎలా చేస్తారో చెప్పాలా లేదా ?

India-automation-jobs-layoffs

దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, వునికిలో వున్నవాటి నవీకరణ వలన మనుషుల కంటే యంత్రాలకే ఎక్కువగా వుపాధి దొరుకుతోంది. విల్స్‌ టవర్‌ వాట్సన్‌ కంపెనీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పశ్చిమ భారత్‌లో అంటే మహారాష్ట్ర, గుజరాత్‌ వస్త్ర,నూలు మిల్లుల్లో కార్మికుల కంటే యంత్రాలే ఎక్కువగా వుండబోతున్నాయి. కార్ల తయారీలో నలుగురు కార్మికులు చేసే పనిని ఒక రోబో చేస్తోంది.ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుతం 13శాతం పనిని యంత్రాలు చేస్తుండగా రానున్న మూడు సంవత్సరాలలో అది 23శాతానికి పెరగనుంది. అదే మన దేశంలో 14 నుంచి 30శాతానికి పెరగనుంది. అందువలన అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు ఎన్ని కబుర్లు చెప్పినా వుద్యోగాలు రోబోట్లకు తప్ప అనంతపురం జనానికి కాదు.ఈ పరిశ్రమను తమ రాష్ట్రానికి తీసుకురాలేదని తెలంగాణా యువత నిరాశ చెందనవసరం లేదు.

పశ్చిమ దేశాలతో పోల్చితే మన దేశంలో ప్రస్తుతం యువతరం ఎక్కువ శాతం వున్నారు. ఈ కారణంగా రానున్న దశాబ్దిలో వుద్యోగాలు లేదా వుపాధి అవసరమైన వారు లేబర్‌ మార్కెట్‌లో 13.8కోట్ల మంది తోడు కానున్నారు. దేశంలో వున్న శ్రామిక శక్తిలో కేవలం 18.5శాతమే ఇంటర్‌ లేదా అంతకు మించిన విద్యతో నైపుణ్యం కలిగిన కార్మికులు వున్నారు. యాంత్రీకరణ కారణంగా దిగువ తరగతి కార్మికులే ఎక్కువగా వుద్యోగాలను కోల్పోతారని సర్వేలు తేల్చాయి. రాజకీయ పార్టీలు, నాయకులు వుపాధి గురించి ఎన్ని కబర్లు చెప్పినప్పటికీ రానున్న పది సంవత్సరాలలో యాంత్రీకరణ మరింత పెరిగి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రం కానున్నదని నిపుణులు చెబుతున్నారు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే వుపాధి రహిత అభివృద్ది, వేతన వృద్ధి లేని వుపాధి పెరుగుతుంది. ఈ పరిణామం కొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం.

కేంద్ర ప్రభుత్వ వుద్యోగులకు కనీస వేతనంగా నెలకు 18వేలు వుండాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడు ఖాళీగా వున్న నాలుగులక్షల ఖాళీలను నింపితే ఏడాదికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వేతనం పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన నుయంతమ్‌ ఆయ యోజన(న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పధకం కింద ఏటా ఇరవై శాతం పేదలు ఐదు కోట్ల కుటుంబాలకు 72వేల రూపాయలు నేరుగా బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. అందుకు గాను తొలి ఏడాది 3.6లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, మరుసటి ఏడాది ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు. సార్వత్రిక కనీస ఆదాయ పధకం గురించి 2016-17 ఆర్ధిక సర్వేలో నాటి ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం ప్రతిపాదించారు. దాని అమల్లో వున్న సమస్యల గురించి ఆయనే చెప్పారు. ప్రస్తుతం వున్న దారిద్ర నిర్మూలన పధకాలను రద్దు చేసి దాన్ని అమలు జరపకపో అదనపు భారం అవుతుందన్నారు. అందువలన కాంగ్రెస్‌ గానీ ఇలాంటి వాటి గురించే చెబుతున్న ఇతర పార్టీలుగానీ ముందుగా ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. వున్న పధకాలను కొనసాగిస్తూనే దీన్ని అమలు జరుపుతారా లేక వాటిని రద్దు చేసి ఈ కొత్త పధకాన్ని పెడతారా ? రెండవదే అయితే పేదలకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదు. లేదూ రెండూ అమలు జరుపుతామంటే అందుకు అవసరమైన వనరులను ఎలా సమకూర్చుతారో వివరించాలి. ఇండియా రేటింగ్స్‌ సంస్ధ ప్రధాన ఆర్దికవేత్త దేవేంద్రకుమార్‌ పంత్‌ రెండూ ఒకేసారి అమలు సాధ్యం కాదని ఆర్ధికంగా ఎంతో వత్తిడి పెరుగుతుందన్నారు. విద్యమీద జిడిపిలో ఖర్చును ఆరుశాతానికి పెంచుతామన్నారు. గతంలో మోడీ సర్కార్‌ మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పిన మేరకు విద్యకు 4.6శాతం అంటే 8.76లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ చెప్పినదాని ప్రకారం ప్రతి ఏడాది మరొక 2.66లక్ష కోట్ల రూపాయలు కావాలి, ఏటా 11.4లక్షల కోట్ల రూపాయలు అవసరం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చు జిడిపిలో మూడు శాతానికి పెంచుతామన్నది ఒకటి. ఇప్పుడు 1.3శాతంగా వున్న ఖర్చుకు ఏటా 2.47లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మూడుశాతానికి పెంచితే 5.71లక్షల కోట్లు కావాలి. ఇలా కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను అమలు జరపాలంటే ఏటా కనీసం పదిలక్షల కోట్లరూపాయలు అవసరం అని అంచనా వేస్తున్నారు.2018-19 బడ్జెట్‌ 24.57లక్షల కోట్ల రూపాయలు, 2023-24 నాటికి 45లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. వాగ్దానాల అమలుకు అదనపు నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మరోవైపున జిఎస్‌టిని తగ్గిస్తామని వాగ్దానం చేసింది. జనానికి తగిన ఆదాయం లేనందున ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దాని అర్ధం జిఎస్‌టి వసూళ్ల మీద పడుతుంది.

గతంలో రైల్వేకు వున్న మాదిరి రైతాంగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రతి తరగతి తనకు ప్రత్యేక బడ్జెట్‌ కోరుతున్న నేపధ్యంలో ఇది చెప్పటానికి ఆకర్షణీయంగా వుంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులకు వుప ప్రణాళికలు వున్నాయి. అయినా వారి స్ధితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని గమనించాలి. రైతాంగానికి అలాంటి ప్రణాళిక ఆచరణ సాధ్యమా ? వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. రైతాంగం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూటికి 76 మంద సాగుదార్లు వ్యవసాయం మానుకొని అంతకంటే మెరుగైన వుపాధికి మరలాలని కోరుతున్నట్లు గతేడాది సిఎస్‌డిఎస్‌ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే తరువాత దేశంలో వ్యవసాయ సంక్షోభం ఇంకా పెరిగింది. రైతుల్లో 62శాతం మందికి కనీస మద్దతు ధరల గురించి అవగాహన లేదని, వాటి గురించి తెలిసిన వారిలో 64శాతం మంది మద్దతు ధరలు సంతృప్తికరం లేవని చెప్పారు.

జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దేశంలో రైతాంగ సంఖ్య తగ్గిపోతుండగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతున్నదని 2011 జనాభా వివరాలు తెలిపాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుదల కారణంగా వ్యవసాయ కార్మికుల పని దినాలు తగ్గిపోతున్న పూర్వరంగలో ఆ మేరకు వారికి పని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. కనుక అది సమర్ధనీయమే.

2001లో దేశంలో రైతులు 12,73,12,851 మంది వుండగా 2011 నాటికి 11,87,00,000కు తగ్గిపోయారు. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 10,67,75,330 నుంచి 14,43,00,000కు పెరిగారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరుగుదల కారణంగా అనేక చేతి వృత్తులు నశించి వాటిలో వున్న వారు వ్యవసాయ కార్మికులుగా మారుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరల ప్రాతిపదిక ఆశాస్త్రీయంగా వుంటోంది. వ్యవసాయ ఖర్చులను పూర్తిగా పరిగణనలోకీ తీసుకోవటం లేదు. అన్ని పంటలకు ప్రకటించటం లేదు పోనీ ప్రకటించిన మేరకైనా అమలు జరిపే యంత్రాంగం రాష్ట్రాలలో లేదు. తెలంగాణాలో గతం కంటే ఎర్రజన్నలు, పసుపు ధరలు గణనీయంగా పడిపోవటం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అచేతనంగా వుండటంతో రైతాంగం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. చివరకు చేసేదేమీ లేక నిజామాబాద్‌ ఎన్నికల బరిలో 178 మంది రైతులు నామినేషన్లు వేసి కొత్త రూపంలో నిరసన తెలుపుతున్నారు. తమిళనాట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అక్కడి అన్నాడిఎంకె, కేంద్ర సర్కార్‌ విఫలం కావటంతో వారణాసిలో నరేంద్రమోడీ మీద పోటీ చేసేందుకు వంద మంది రైతులు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. చివరి దశలో ఎన్నికలు జరగనున్నందున నామినేషన్లకు ఇంకా గడువు వుంది.

నిజామాబాద్‌ రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన రైతు బంధు నగదు తీసుకున్నా, పడిపోయిన ధరలతో పోల్చితే ఆ మొత్తం ఏమాత్రం చాలకనే ఆందోళనలకు దిగారు. అందువలన వివిధ పార్టీలు ఇప్పుడు ప్రకటిస్తున్న నగదు బదిలీ పధకాలు సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించేవి కాదు, ఇప్పుడున్న వాటితో పాటు అమలు జరిపితే కాస్త వుపశమనం మాత్రమే దొరుకుతుంది.

Image result for jobs scenario in india

దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరుస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో జిడిపి రీత్యా ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వుంది. ఏడుశాతానికి అటూ ఇటూగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి వున్నా దానికి అనుగుణంగా వుపాధి ఎందుకు పెరగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వేసిన ప్రశ్నకు ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవారంగాలలో యాంత్రీకరణ, ఐటి కారణంగా ఆయా సంస్ధల ఆదాయాలు, లాభాలు పెరగటం తప్ప వుద్యోగాల వుపాధి తగ్గిపోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోలన్‌ గుట్టలకు ట్రంప్‌ గుర్తింపు భారత్‌కు ఆందోళన కరం !

04 Thursday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Golan Heights, Israel, Syria

Image result for golan heights

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. సరిగ్గా అలాంటి సాకులతోనే అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌కు అమెరికా తాన తందాన అంటోంది. అది ఆక్రమించుకున్న సిరియాకు చెందిన గోలన్‌ గుట్టల ప్రాంతం ఇజ్రాయెల్‌దే అని ప్రకటించింది. ప్రపంచం యావత్తు వ్యతిరేకిస్తున్నా దాని అడ్డగోలు వాదనలను సమర్ధిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత పొడిగింపు, సంక్లిష్టం చేయటమే కాదు, ప్రపంచంలో పలుచోట్ల కొత్త సమస్యలు, సంఘర్షణలు తలెత్తటానికి నాంది పలికింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్ధ ఐక్యరాజ్యసమితి ఈ ధోరణిని అడ్డుకోవటంలో విఫలమైంది. ఇది మానవాళి శాంతికే ముప్పు. అనేక ప్రాంతీయ ఒప్పందాల వుల్లంఘన మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికితే, నానాజాతి సమితి వైఫల్యం రెండవ ప్రపంచ యుద్ధానికి బాటలు వేసింది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా వైఫల్య పరంపరలో వుంది. ఇది ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో ?

పాలస్తీనా అరబ్బులకు చెందాల్సిన జెరూసలెం పట్టణాన్ని ఇజ్రాయెల్‌ రాజధానిగా గత ఏడాది గుర్తించిన అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 1967 దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న సిరియా భూ భాగం గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌ అంతర్భాగంగా తాను గుర్తిస్తున్నట్లు గత వారంలో నిర్ణయించింది. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్‌, తాజాగా అరబ్‌ లీగ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే అమెరికా వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు చేసింది అంటే ఇజ్రాయెల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార పక్షానికి ఓట్లు వేయించటం తక్షణ ప్రయోజనం తప్ప పశ్చిమాసియా వివాదాన్ని కొనసాగించే ఎత్తుగడలో భాగమే ఇది. ట్యునిస్‌లో ఆదివారం నాడు జరిగిన లీగ్‌ వార్షిక సమావేశంలో కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయానికి రానప్పటికీ గోలన్‌ హైట్స్‌ సిరియా అంతర్భామనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

1947 నవంబరులో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం మేరకు బ్రిటీష్‌ వలసగా వున్న పాలస్తీనా దేశాన్ని రెండు మ్కులుగా చేశారు. అప్పటికే ముందస్తు కుట్రకు తెరలేపిన ఇజ్రాయెల్‌ సాయుధదళం బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాకు మిగిల్చిన ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు దాడులకు పూనుకుంది. దానికి ప్రతిగా పరిసర ప్రాంతాలలో వున్న అరబ్‌ దేశాలన్నీ వాటి రక్షణకు నడుంకట్టాయి. దీనిని 1948 ఇజ్రాయెల్‌-అరబ్బు యుద్దంగా పిలుస్తున్నారు. అదే ఇజ్రాయెల్‌ 1967లో మరోసారి పశ్చిమ దేశాల అండతో మరికొన్ని ప్రాంతాల ఆక్రమణకు పూనుకుంది. ఈ సారి పక్కనే వున్న సిరియా దక్షిణ ప్రాంతం గోలన్‌ గ్టులను చేజిక్కించుకుంది.1974 కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి శాంతి సేనల ఆధీనంలోకి వచ్చింది.1981లో ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది, అయినప్పటికీ ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగుతున్నాయి. నాటి ఇజ్రాయెల్‌ నిర్ణయాన్ని తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు గత సోమవారం నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగటానికి దీనికి సంబంధం లేదని, అవి అక్కడే వుండవచ్చని అమెరికా నమ్మబలుకుతోంది. 1974నుంచి ప్రతి ఆరునెలలకు ఒకసారి గోలన్‌ గుట్టలలో శాంతి పరిరక్షక దళాల కొనసాగింపు నిర్ణయం తీసుకుంటున్నారు. జూన్‌ 30వ తేదీతో తాజా ఆరునెలల గడువు ముగుస్తుంది. అమెరికా నిర్ణయ నేపధ్యంలో మరోసారి పొడిగింపు వుంటుందా, అమెరికా అందుకు సహకరిస్తుందా అన్నది సందేహాస్పదంగా మారింది.

గోలన్‌ గుట్టలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్నట్లు చేసిన ప్రకటన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ఐరాస నిబంధనలకు విరుద్దం కనుక చెల్లదని 1981లోనే భద్రతా మండలి తీర్మానించింది. దానికి అమెరికా తూట్లు పొడిచినందున వెంటనే చర్చించాలన్న సిరియా కోరిక మేరకు గత వారంలో భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది. అమెరికా తప్ప అన్ని దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సేనలు వున్న ప్రాంతానికి పక్కనే నిత్యం సిరియా సాయుధ దళాలు కొనసాగుతున్నాయని, అది 1974 ఒప్పందానికి వ్యతిరేకమని అమెరికా వాదించింది. సిరియా సరిహద్దులో హిజబుల్లా సాయుధులు కూడా వున్నారనే వార్తలు వుద్రిక్తతలు పెరగటానికి దోహదం చేస్తున్నాయని కూడా ఆరోపించింది. మొత్తం మీద శాంతి నెలకొన్న గోలన్‌ గుట్టలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఇటీవలి పరిణామాలను సాకుగా తీసుకోవద్దని, ఆ సమస్య విషయంలో భద్రతా మండలి, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాల్లో ఎలాంటి మార్పు లేదని, కట్టుబడి వుంటాయని ఐరాస వుప ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రోజ్‌ మేరీ డికార్లో స్పష్టం చేశారు. ఆత్మరక్షణకు తాము చేసిన యుద్దంలో విజయం సాధించామని, దురాక్రమణలను నిరోధించేందుకు చేసే యుద్దాలు, కొన్ని ప్రాంతాలను కలిగి వుండటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దం కాదని, అమెరికా తమ నిర్ణయాన్ని సమర్ధించటం తప్పు కాదని ఇజ్రాయెల్‌ వాదించింది.అయితే ఈ వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా నిపుణులతో సహా ప్రపంచవ్యాపితంగా అందరూ తప్పు పట్టారు.

ఇజ్రాయెల్‌ ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలకు ముందే యూదు దురహంకారులు యూదు రాజ్య పున:స్ధాపన ప్రతిపాదనలు చేశారు. వాటి ప్రకారం పాలస్తీనా ప్రాంతాలేగాక బైబిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలతో కూడిన ఇజ్రాయెల్‌ ఏర్పడాలి. వాటిలో గోలన్‌ గుట్టలు వున్న దక్షిణ సిరియా ప్రాంతం కూడా వుండాలని ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. దానిలో భాగంగా ఆక్రమించుకున్నారే తప్ప సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ఎలాంటి ముప్పు లేదు. బెన్‌ గురియన్‌ అనే యూదు దురహంకారి 1918లో రూపొందించిన ఒక పధకంలో తొలి దశలో ఏ ప్రాంతాలను, తరువాత వేటిని ఆక్రమించుకోవాలన్నది బహిరంగంగా పేర్కొన్నాడు. దాని ప్రకారమే సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్‌ గిల్లికజ్జాలు పెట్టుకుంది. చివరికి 1967లో ఆక్రమించుకుంది. అయితే సిరియాలో పశ్చిమ దేశాల అనుకూల ప్రభుత్వాలు వున్న సమయంలో గోలన్‌ గుట్టలను సిరియాకు వదలి, జోర్డాన్‌ నది, టిబ్రెయాస్‌ సరస్సులో ఇజ్రాయెల్‌కు నీటి వాటా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే గుట్టలతో పాటు నీరు కూడా తమకు కావాల్సిందేనని,దాని గురించి చర్చలు కూడా లేవని ఇజ్రాయెల్‌ అడ్డగోలుగా వాదించింది. ఆ తరువాత వివాదాన్ని కొనసాగించేందుకు, నీటిని మళ్లించేందుకు నిరంతరం రెచ్చగొట్టే చర్యలకుపూనుకుంది. సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు వుందనేది ఒక సాకు మాత్రమే. ఇటీవల సిరియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పశ్చిమ దేశాల మద్దతుతో చెలరేగుతున్న ఐఎస్‌ మూకలకు ఇజ్రాయెల్‌ అన్ని విధాలుగా సహకరిస్తోంది.

Image result for golan heights

1973 యుద్దం తరువాత మిలిటరీ బలంతో గోలన్‌ గుట్టలను తిరిగి పొందలేమని, సంప్రదింపులే మార్గమని సిరియా నిర్ణయించుకుంది. ఇటీవలి కాలంలో సిరియా-ఇరాక్‌ సంబంధాలు బలపడటం, రాజకీయంగా సిరియన్లు రష్యాకు దగ్గర కావటంతో అమెరికన్లు రెచ్చిపోయి గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌వే అని గుర్తించిందని చెప్పవచ్చు. సిరియాతో అరబ్‌ లీగ్‌ సంబంధాలు సజావుగా లేకున్నా అరబ్‌ పౌరుల మనోభావాల కారణంగా ఆదివారం నాడు ట్యునీసియా రాజధాని ట్యునిస్‌లో జరిగిన శిఖరాగ్రసమావేశం అమెరికా చర్యను ఖండించాల్సి వచ్చింది. దీనికి అమెరికా అనుంగు దేశం సౌదీ అరేబియా చొరవ తీసుకోవటం విశేషం. రాజు సల్మాన్‌ స్వయంగా అమెరికా వైఖరిని ఖండించారు. తూర్పు జెరూసలెం పట్టణం పాలస్తీనా రాజధాని అన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. అయితే పనిలో పనిగా దీనికి ఆ ప్రాంతంలో ఇరాన్‌ జోక్యమే కారణమని దాని మీద ఒక రాయి వేశాడు.

యాభై రెండు సంవత్సరాల క్రితం 1,250చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వున్న గోలన్‌ గుట్టలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. రెండు పట్టణాలు, 340 గ్రామాల నుంచి సిరియన్‌ అరబ్బులను ఇజ్రాయెలీ మిలిటరీ తరిమి వేసింది ఆ సమయంలో లక్షా 28వేల మంది సిరియన్‌ పౌరులు వున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణలోకి పోగానే వారంతా తమ ఆస్ధులు, ఇండ్లను వదలి సిరియా ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. ఆరువేల మంది డ్రజే అనే మతశాఖకు చెందిన వారిని మాత్రమే అక్కడ వుండేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించింది. వారు ఇజ్రాయెల్‌కు అనుకూలురు. 1981లో ఆ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా ప్రకటించుకున్న ఇజ్రాయెల్‌ అక్కడి వారికి తమ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. అది చెల్లదని ఐరాస పేర్కొన్నది. 1967లో సిరియాకు వెళ్లిన వారి వారసుల సంఖ్య ఇప్పుడు ఐదులక్షలకు పెరిగింది. వారంతా తమ స్వస్ధాలలకు రావాలని కోరుకుంటున్నారు.

Image result for golan heights

అమెరికా చర్యను దాని నాయకత్వంలోని నాటో కూటమి దేశాలు కూడా అంగీకరించటం లేదు. ఇది అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించటమే, ఆ ప్రాంతంలో వుద్రిక్తతలను పెంచుతుందని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా చర్య ఆ ప్రాంత సమస్యకు ఒక పరిష్కారం కాదని ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధికారి మోఘెరినీ అన్నాడు. గోలన్‌ గుట్టల ఆవలి సిరియా నుంచి ఇరాన్‌ సేనలు తమ మీదకు క్షిపణులు ప్రయోగిస్తున్నాయని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంత పాడుతూ ఇరాన్‌తో పాటు అనేక వుగ్రవాద బృందాలు కూడా ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌పై దాడులకు వుపయోగించుకుంటున్నాయన్నాడు. అమెరికా వైఖరి ఇలాంటి అన్ని సమస్యల పట్ల ఒకే విధంగా లేదు. దాని ప్రయోజనాలకే పెద్ద పీట వేసింది. దాని సమర్దన ఒక్క గోలన్‌ గుట్టలకే పరిమితం అవుతుందని అనుకోరాదు. మన దేశాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రేపు తన ఆధీనంలోని ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్ధాన్‌ తన అంతర్భాగంగా ప్రకటించుకొంటే అమెరికా దానికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అన్నింటికీ మించి బలమైన దేశాలు తమ సరిహద్దుల రక్షణలను సాకుగా చూపి బలహీనమైన ఇరుగు పొరుగుదేశాల భూ భాగాలను ఆక్రమించుకొనే అవకాశాలు పెరుగుతాయి. గతంలో ఇరాక్‌ అధినేత పొరుగునే వున్న కువాయిట్‌ తమ ప్రాంతంలోని చమురును అక్రమంగా తోడుకుంటోందని, దొంగతనం చేస్తోందని ఆరోపించి సైన్యాన్ని పంపి ఏడు నెలల పాటు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అదే ఇరాక్‌లో అమెరికా జోక్యానికి నాంది పలికింది. అదే అమెరికా మరో వైపు రష్యా ఆక్రమణలోని క్రిమియా ప్రాంతం విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేయటం రాజకీయం మాత్రమే. తమ భద్రతకు క్రిమియా అవసరమని రష్యా వాదిస్తున్న విషయం తెలిసినదే. ఏదో ఒక సాకుతో ఒక దేశ ప్రాంతాన్ని మరొకటి ఆక్రమించుకోవటం, దాడులను సమర్ధించే అమెరికా వైఖరి ప్రపంచానికే ముప్పు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d