• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Religious Intolarence

370 ఆర్టికల్‌పై కాషాయ సేన అబద్ద ప్రచారాలు- వాస్తవాలు !

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

370 article, Article 370, BJP, Indian constitution, saffron trolls lies- facts

Image result for 370 article,saffron trolls

-కె ఎల్‌ కాంతారావు

ఈ మధ్యన భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలను, వాటికి సంబంధిం చిన వాస్తవాలను తెలుసుకుందాం.

మొదటి అబద్ధం : ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం.
వాస్తవం : ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.

రెండవ అబద్ధం : భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు.
వాస్తవం : రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయా లు ఆర్టికల్‌ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కల్పించారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్‌ లోని కచ్‌ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి. అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్‌ కు, 371-ఎఫ్‌ సిక్కింకు, 371-హెచ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.
ఇక స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్‌ 370 జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్‌ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్‌ 371ఎ, ఆర్టికల్‌ 371-జి ప్రకారం నాగాలాండ్‌, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు. అంతెందుకు? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇలా 370, 371-ఎ, 371-జి, 1/70 చట్టాలను రాజ్యాంగం లో ఎందుకు పొందుపరచారు? ఎందుకు అమలు చేస్తున్నారు? ఎందుకంటే ఆయా ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి వున్నాయి. అక్కడ కొనుగోళ్లకు భారతీయుల లోనే వేరే ప్రాంతాల వారికి అవకాశమిస్తే, వెనుకబడిన ఆయా ప్రాంతాల వాళ్లను వేరే ప్రాంతాల వాళ్లు మోసం చేస్తారనే సందేహంతో, ఆ ప్రాంతాల వారి ఆస్తులకు ప్రత్యేక రక్షణ నిమిత్తం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్‌లు, కొన్ని ప్రత్యేక చట్టాలు చేశారు. వాస్తవం ఇది కాగా, ఆర్టికల్‌ 370 ఒకటే ప్రమాదకరమనీ, దానిని ఎత్తివేయాలనీ ప్రచారం చేయడం వాస్తవాన్ని వక్రీకరించడమే.

అబద్ధం 3 : ఆర్టికల్‌ 370 మూలంగా జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలు భారత దేశ సార్వభౌమాధి కారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదు.
వాస్తవం : ఇది శుద్ధ అబద్ధం. ఆర్టికల్‌ 370 లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం స్వాతంత్య్ర సమర యోధులైన రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. స్వాతంత్య్ర పోరాట వీరులైన రాజ్యాంగ నిర్మాతలు తమ జాతీయ పతాకాన్ని అవమానిస్తే నేరం కాదని రాజ్యాంగం లోని ఒక ఆర్టికల్‌లో రాశారని ప్రచారం చేయడం అబద్ధాలకు పరాకాష్ట!

అబద్ధం 4 : సుప్రీం కోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవు.
వాస్తవం : ఇదో పెద్ద అబద్ధం. ఉదాహరణకు 2016లో ‘జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం ఆర్టికల్‌ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం’ అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీం కోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి. ఉదాహరణకు 11-2-56, 19-2-94ల మధ్య జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి 47 ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

అబద్ధం 5 : జమ్మూ-కాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్‌ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే, పాకిస్తాన్‌ యువకుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం కూడా అబద్ధమే. ఇలాంటి అంశమేదీ ఆర్టికల్‌ -370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఎ ఆర్టికల్‌ అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్‌ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతనానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతేకాని, పాకిస్తాన్‌ పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తకు కాశ్మీర్‌ పౌరహక్కులు లభిస్తాయనడం పూర్తిగా తప్పుడు ప్రచారం.

అబద్ధం 6 : కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగ బద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
వాస్తవం : ఇది కూడా అబద్ధ ప్రచారమే. రాజ్యాంగం భారత దేశం మొత్తంలోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించ బడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్‌, మిజోరాం, లక్షద్వీప్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కాని రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీ లుగా పరిగణించబడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో సిక్కులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా, రాజ్యాంగం ఆ రాష్ట్రంలో కూడా సిక్కులను మైనారిటీగానే గుర్తిస్తోంది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌ లోని కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా, లెహ్ ప్రాంతంలో బౌద్ధులు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా రాజ్యాంగం ఆ రాష్ట్రంలో ఆ రెండు మతాల వారినీ మైనారిటీలు గానే గుర్తిస్తోంది. ఇదీ వాస్తవం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంకూర్‌ శర్మ అనే న్యాయవాది జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించమని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ వేస్తే, సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, ‘జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తిస్తారా?’ అని. దానికి ఆ రాష్ట్రంలోని పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ‘హిందువులను మైనారిటీ లుగా గుర్తించం’ అని స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదు. దానిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు రూ.15 వేల జరిమానా వేసింది. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం గానే ఉంది (ది పయనీర్‌ 7-2-17). ఇంత స్పష్టంగా ఆ రాష్ట్ర వైఖరీ, మౌనాన్ని ఆశ్రయించిన కేంద్ర వైఖరీ వుంటే, రాజ్యాంగ బద్ధంగా రావలసిన రిజర్వేషన్లు జమ్మూ-కాశ్మీర్‌లోని హిందువులకు అందడం లేదనే ప్రచారం ఎంత మోసపూరితం?

ఇలా ఆర్టికల్‌-370 ద్వారా హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ అబద్ధ ప్రచారాలు చేసి, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోన్న వారి పట్ల దేశ భక్తులందరూ అప్రమత్తంగా ఉండి, వారి విద్వేష ప్రచారాన్ని, విద్రోహ చర్యలను అరికట్టడమే నేటి తక్షణ కర్తవ్యం.

కెఎల్‌ కాంతారావు పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేనెందుకు బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నాను ? ఒక మేథావి ఆత్మశోధన

19 Tuesday Jun 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP activist, BJP leaders lies, Naredra Modi, Shivam Shankar Singh, Shivam Shankar Singh Political Consultant

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, శివం శంకర్‌ సింగ్‌

శివం శంకర్‌ సింగ్‌

(బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ నాయకత్వంలోని బృందంలో అనేక ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో శివం శంకర్‌ సింగ్‌ పని చేశారు. రచయిత, ఇండియా ఫౌండేషన్‌లో సీనియర్‌ పరిశోధకుడు అయిన సింగ్‌ బిజెపి రాజకీయ ప్రచారాల సమాచార విశ్లేషకుడిగా పనిచేశారు. అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్‌. ఒక పార్లమెంట్‌ సభ్యుని వద్ద సహాయకునిగా కూడా పని చేశారు )

దేశంలో రాజకీయ చర్చ, కనీసం నా జీవిత సమయంలో అత్యంత నీచమైన స్ధానంలో వుంది.భాగస్వామ్యం అనూహ్యం. తమ పక్షాన వున్న రుజువు ఏమిటి అనేదానితో నిమిత్తం లేకుండా జనాలు మద్దతు కొనసాగిస్తున్నారు. తాము కుహనా వార్తలను వ్యాపింప చేస్తునాసషశ్రీతీయత్నీమని రుజువు అయిన తరువాత కూడా వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు. ఇది ప్రతివారిలో వుంది, పార్టీలు మరియు ఓటర్లు లేదా మద్దతుదార్లందరూ దీనికి బాధ్యులే అని చెప్పాల్సి వుంది. నమ్మశక్యం గాని విధంగా అత్యంత శక్తివంతమైన ప్రచారం ద్వారా కొన్ని ప్రత్యేక సందేశాలను వ్యాపింప చేయటంలో భారతీయజనతా పార్టీ ఎంతో చేసింది. ఆ పార్టీకి ఇంకేమాత్రం మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకోవటానికి ప్రాధమిక కారణాలు ఆ సందేశాలే. అయితే అవేమిటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఏ పార్టీ కూడా పూర్తిగా మంచిదీ కాదు పూర్తిగా చెడ్డదీ కాదు అని అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలన్నీ ఎంతో కొంత మంచి చేశాయి, కొన్ని రంగాలలో మురికిగా వ్యవహరించాయి.ఈ ప్రభుత్వం దీనికి మినహాయింపేమీ కాదు.

మంచి పనులు

1.గతంతో పోలిస్తే రోడ్ల నిర్మాణం వేగంగా వుంది. రోడ్డు పొడవును లెక్కించే పద్దతిలో తేడా వుంది, దానిలో కారణాంకనాలున్నప్పటికీ అది వేగంగానే జరిగినట్లు కనిపిస్తుంది.

2.విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయి. అన్ని గ్రామాలు విద్యుదీకరించబడ్డాయి, జనానికి ఎక్కువ గంటలు విద్యుత్‌ లభిస్తోంది.( కాంగ్రెస్‌ ఐదులక్షల గ్రామాలను విద్యుదీకరించింది. చివరి 18వేలకు పైగా వున్న గ్రామాలను మోడీ పూర్తి చేశారు. ఈ సాధనను మీరు కోరుకున్న విధంగా పరిగణించవచ్చు. ఇదే విధంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విద్యుత్‌ సరఫరా పెరుగుతూనే వుంది, కానీ మనకు బిజెపి హయాంలోనే పెద్ద పెరుగుదల వున్నట్లు మనం చూడవచ్చు) 3. వున్నత స్ధాయిలో అవినీతి తగ్గింది- ఇప్పటి వరకు మంత్రుల స్ధాయిలో పెద్ద కేసులేమీ లేవు( అయితే యుపిఏ ఒకటి హయాంలో కూడా ఇలాగే వున్నమాట నిజం. దిగువ స్ధాయిలో అలాగే వున్నాయి, చెల్లించాల్సిన మొత్తాలు పెరిగాయి, పోలీసులు, పట్వారీలు తదితరుల ను అదుపు చేయగలవారెవరూ కనిపించటం లేదు.) 4. స్వచ్చభారత్‌ కార్యక్రమం నిస్సందేహంగా విజయవంతమైంది. గతం కంటే ఎక్కువగా మరుగుదొడ్లు నిర్మించారు ఇప్పుడు జనాల మనస్సులో స్వచ్చత భావన నెలకొన్నది. 5. వుజ్వల యోజన ఒక గొప్ప చొరవ అయితే రెండవ సిలిండర్‌ను ఎంత మంది కొన్నారో చూడాల్సి వుంది. మొదటిది, స్టవ్‌ వుచితం, అయితే జనాలు ఇప్పుడు వాటికి డబ్బు చెల్లించాల్సి వుంది, ప్రభుత్వం కార్య క్రమం చేపట్టినప్పటి నుంచి సిలిండర్‌ ఖర్చు రెట్టింపైంది, ఇప్పుడు ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలకంటే ఎక్కువ వుంది. 6. ఈశాన్య భారత్‌తో సంబంధాలు నిస్సందేహంగా పెరిగాయి. రైళ్లు, రోడ్లు, విమానాలు పెరిగాయి. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే ప్రధాన స్రవంతి న్యూస్‌ ఛానళ్లలో ఈ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది. 7. ప్రాంతీయ పార్టీల పాలనతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్ధితి మెరుగ్గా వుంది.

చెడ్డ పనులు

జాతులు, వ్యవస్ధలను నిర్మించాలంటే దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. బిజెపి పాలనలో నేను చూసిన అతి పెద్ద వైఫల్యం ఏమంటే చాలా దుర్బలమైన కారణాలను చూపి కొన్ని గొప్పవాటిని నాశనం చేయటం.

1. ఎలక్ట్రరల్‌ బాండ్లు ా ఇది అవినీతిని చట్టబద్దం చేస్తుంది, మన రాజకీయపార్టీలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లు, విదేశీశక్తులకు అవకాశమిస్తుంది. ఈ బాండ్లు అజ్ఞాతమైనవి. కాబట్టి ఒక కార్పొరేట్‌ సంస్ధ మీరు గనుక ఒక నిర్ణీత విధానాన్ని ఆమోదిస్తే వెయ్యి కోట్ల విలువైన ఎలక్ట్రొరల్‌ బాండ్లు ఇస్తాను చెబుతుంది, దానిని శిక్షించేవారుండరు. దీని వలన ఒక అజ్ఞాత సాధనం ద్వారా నీకిది నాకది అని నిరూపించే అవకాశం వుండదు. ఇది మంత్రిత్వస్ధాయికి అవినీతిని ఎలా దించిందో కూడా వివరిస్తోంది. దీనికి ఫైలు లేదా వుత్తరువులతో పని లేదు. ఇది అమెరికాలో మాదిరి విధాన స్ధాయిలోనే జరుగుతోంది. 2. ప్రణాళికా సంఘ నివేదికలు :సమాచార ప్రధాన వనరులుగా వీటిని వినియోగించుకోవచ్చు.ప్రభుత్వ పధకాలను అవి ఆడిట్‌ చేస్తాయి, ఎలా జరుగుతున్నదీ చెబుతాయి. అది పోయిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని నమ్మటం తప్ప మరొక మార్గం లేదు.(కాగ్‌ నివేదికలు చాలా కాలం తరువాత వస్తాయి) నీతి అయోగ్‌కు ఈ బాధ్యత లేదు, అది మౌలికంగా సలహాలిచ్చే మేథావులతో నిండిన, ప్రజా సంబంధాల సంస్ధ మాత్రమే. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకుండానే ప్రణాళిక లేదా ప్రణాళికేతరానికి తేడా లేకుండా చేయవచ్చు.3. సిబిఐ, ఇడిల దుర్వినియోగం: నేను చూసినంత వరకు వీటిని రాజకీయ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. ఒక వేళ అలాంటిదేమీ లేదనుకుంటే మోడీ లేదా అమిత్‌ షాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈ సంస్ధల ద్వారా వారిమీద దాడిచేయిస్తారనే భయం వున్న మాట నిజం. ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన భిన్నాభిప్రాయాన్ని హతం చేయటానికి ఇది చాలు. 4. కాలిఖో పాల్‌ ఆత్మహత్య నోట్‌, జడ్జి లోయా మరణం, సొహ్రబుద్దీన్‌ హత్యల దర్యాప్తులో విఫలం, వున్నావోలో ఒక రేప్‌ కేసులో నిందితుడైన ఎంఎల్‌ఏను వెనకేసుకురావటం, అతని బంధువు ఆ బాలిక తండ్రిని హత్యకేసులో నిందితుడు కావటం, ఒక ఏడాది పాటు ఎఫ్‌ఐర్‌ నమోదు చేయకపోవటం.5. పెద్ద నోట్ల రద్దు: ఇది విఫలమైంది, అంతకంటే దారుణం ఏమంటే ఆ వైఫల్యాన్ని బిజెపి అంగీకరించలేకపోవటం. ఈ చర్య ద్వారా వుగ్రవాదులకు నిధులు నిలిచిపోతాయని, నగదు లావాదేవీలు తగ్గుతాయని, అవినీతి అంతమౌతుందని చేసిన ప్రచారమంతా అసంబద్దమైనది. ఇది వాణిజ్యాన్ని అంతం చేసింది. 6. జిఎస్‌టి అమలు: దీన్ని హడావుడిగా అమలు జరిపారు, వ్యాపారానికి హాని చేసింది. వ్యవస్ధను సంక్లిష్టం గావించింది. వివిధ వస్తువుల మీద అనేక రేట్లు, పన్నుల దాఖలులో సంక్లిష్టత. కొంత వ్యవధిలో స్ధిరపడుతుందని అనుకున్నారు, కానీ అది హాని చేసింది. ఈ వైఫల్యాన్ని అంగీకరించేందుకు బిజెపి ఎంతో దురహంకారంతో వ్యవహరించింది.7.కేవలం చప్పట్లు కొట్టించుకొనేందుకు విదేశాంగ విధానాన్ని గందరగోళపరచటం: శ్రీలంకలో చైనాకు ఒక రేవు వుంది, బంగ్లాదేశ్‌, పాకిస్ధాన్లలో పెద్ద ప్రయోజనాలున్నాయీభారత్‌ను చుట్టుముడుతోంది, మాల్దీవులలో వైఫల్యం( భారత విదేశాంగ విధాన వైఫల్యం కారణంగా అక్కడ ఇంకే మాత్రం భారతీయ కార్మికులకు వీసాలు దొరికే అవకాశం లేదు) మోడీగారు విదేశాలు తిరుగుతూ 2014కు ముందు విదేశాలలో భారతీయులంటే గౌరవం లేదని ఇప్పుడు ఎంతగానో గౌరవిస్తున్నారని చెబుతున్నారు.( ఇదొక చెత్త మన ఆర్ధిక వ్యవస్ధ మరియు ఐటి రంగంలో పురోగమనం కారణంగా విదేశాలలో భారత్‌కు గౌరవం ప్రత్యక్ష ఫలితం, మోడీ కారణంగా అది ఒక్క ఔన్సు కూడా మెరుగుపడలేదు, బీఫ్‌ పేరుతో వధించటాలు, జర్నలిస్టులకు బెదిరింపుల వంటి వాటితో అదింకా దిగజారి వుండవచ్చు) 8. పధకాల వైఫల్యం, వాటిని గుర్తించటంలో లేదా సరిచేయటంలో వైఫల్యం : సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన, మేకిన్‌ ఇండియా, నైపుణ్య అభివృద్ధి, ఫసల్‌ భీమా( తిరిగి చెల్లింపులను చూస్తే బీమా కంపెనీల జేబులు నింపటం కనిపిస్తుంది.) నిరుద్యోగం, రైతాంగ సంక్షోభాలను గుర్తించటంలో వైఫల్యం, ప్రతి వాస్తవ సమస్యను ప్రతిపక్ష నాటకంగా వర్ణించటం. 9. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల : కాంగ్రెస్‌ అధికారంలో వుండగా మోడీ, బిజెపి మంత్రులు మరియు మద్దతుదార్లందరూ వాటి ధరలు ఎక్కువగా వున్నాయని విమర్శించారు. అప్పటితో పోలిస్తే అప్పుడు ముడిచమురు ధర తక్కువగా వున్నప్పటికీ ఎక్కువగా ధరలు వుండటాన్ని ఇప్పుడు సమర్ధిస్తున్నారు. ఇదేమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. 10. అత్యధిక మౌలిక సమస్యల విషయాలపై పని చేయటంలో వైఫల్యం : విద్య, ఆరోగ్య సంరక్షణ. విద్యారంగంలో చేసిందేమీ లేదు, జాతీయంగా అది అతి పెద్ద వైఫల్యం.దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గిపోయింది(ఎఎస్‌ఇఆర్‌ నివేదికలు) ఎలాంటి చర్య తీసుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణకు వారు చేసిందేమీ లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రకటించారు. చేసిందేమీ లేకపోగా ఆ పధకం నన్ను మరింత భయపెడుతోంది.బీమా పధకాలు భయంకర బాటలో నడుస్తున్నాయి అవి అమెరికా బాటలో నడుస్తున్నాయి.అది ఆరోగ్య రక్షణలో భయంకరమైన గమ్యం(మైఖేల్‌ మూర్‌ సినిమా సికో చూడండి)

మీరు కొన్నింటిని జోడించవచ్చు, సమస్యను మీ స్వంత అవగాహన మేరకు మరికొన్నింటిని తీసివేయవచ్చు, కానీ ఇది నా మదింపు. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ సమస్య పెద్దది, సుప్రీం కోర్టు దానిని రద్దు చేయవచ్చని అనుకుంటున్నాను. ప్రతి ప్రభుత్వానికి కొన్ని వైఫల్యాలు, కొన్ని చెడులు వుండవచ్చు గానీ అన్నింటికంటే పెద్ద సమస్య నైతికవిలువలకు మించి లేదు.

వికారమైనది

ఈ ప్రభుత్వ నిజమైన ప్రతికూలత ఏమంటే ఎంతో యోచించిన పధకం ప్రకారం జాతీయ చర్చను అది ఎలా దెబ్బతీసిందనేదే. ఇది వైఫల్యం కాదు, ఇదొక పధకం.

1. ఇది మీడియాను నమ్మరానిదిగా చేసింది. దాంతో ఇప్పుడు ప్రతి విమర్శ వెనుక ఒక జర్నలిస్టు బిజెపి లేదా కాంగ్రెస్‌ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు చిత్రితమౌతున్నది. అనేక మంది జర్నలిస్టుల విషయంలో అది వాస్తవం కాదని నాకు తెలుసు. అంతకంటే ముఖ్య మైన అంశమేమంటే ఏ ఒక్కరూ ఆరోపణలు లేదా ఫిర్యాదుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు కేవలం సమస్యను ముందుకు తెచ్చి వ్యక్తుల మీద దాడిచేయటం, తరువాత సమస్యను కూడా విస్మరిస్తున్నారు. 2.గత డెబ్బయి సంవత్సరాలలో ఏమీ జరగలేదనే ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దారు. ఇది పూర్తిగా అనుచితం, ఫలితంగా తలెత్తే మానసిక ప్రవృత్తి దేశానికి హానికరం. ప్రభుత్వం ప్రకటనల మీద నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, ఇప్పుడది ఒక ధోరణిగా మారింది. చిన్న పనులు చేసినా పెద్దగా ప్రచారం చేసుకోవటం. మొదటిసారిగా రోడ్లను మోడీ నిర్మించలేదు. మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ల మానసపుత్రికల వంటి పధకాల ద్వారా నిర్మించిన కొన్ని మంచి రోడ్ల మీద నేను ప్రయాణించాను. 1990 దశకం నుంచి భారత్‌ ఐటి శక్తి కేంద్రంగా మారింది. నేడున్న పరిస్ధితులను బట్టి గత పని తీరును అంచనా వేస్తూ గత నాయకులను దూషించటం సులభం. వుదాహరణకు ఎవరైనా కాంగ్రెస్‌ 70 సంవత్సరాలుగా మరుగుదొడ్లను ఎందుకు నిర్మించలేదని అడగవచ్చు. వారు కొన్ని మౌలికమైనవి కూడా చేయలేకపోయారు. ఈ వాదన ఎంతో తర్కబద్దంగా వినిపించవచ్చు, దేశ చరిత్రను చదవటం ప్రారంభించే వరకు నేను కూడా నమ్మాను. 1947లో మనం స్వాతంత్య్రం సంపాదించుకొనే నాటికి మనది చాలా పేద దేశం. మనకు ఒక రాజధాని లేదు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులు లేవు. దీన్ని అధిగమించేందుకు నెహ్రూ సోషలిస్టు మార్గం పట్టి ప్రభుత్వరంగ సంస్ధలను ఏర్పాటు చేశారు. మనకు వుక్కు ఫ్యాక్టరీ నిర్మించుకొనే సామర్ధ్యం లేకపోతే రష్యన్ల సాయం తీసుకున్నారు. దేశంలో యంత్రాలు, వుక్కు తయారీకి రాంచీలో హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇవి లేకుండా మనకు వుక్కు వుండేది కాదు, ఇతర మౌలిక సదుపాయాలూ వుండేవి కావు. మనకు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కరవులు వచ్చేవి,పెద్ద సంఖ్యలో జనం మరణించేవారు. జనానికి తిండి పెట్టటం ప్రాధాన్యత, అప్పుడు మరుగుదొడ్లు విలాసం దానికోసం ఎవరూ చూడలేదు. హరిత విప్లవం వచ్చి 1990దశకం నాటికి ఆహార కొరత అదృశ్యమైంది. ఇప్పుడు మనం మిగులు సమస్యను ఎదుర్కొంటున్నాము. మరుగుదొడ్ల మాదిరే పాతికేండ్ల తరువాత నరేంద్రమోడీ అన్ని ఇండ్లకు ఎసి ఎందుకు పెట్టించలేదని అడుగుతారు. అది ఈ రోజు ఒక విలాసంగా కనిపించినట్లే ఒక రోజు మరుగుదొడ్లు కూడా విలాసమే. ఈ పరిణామం త్వరలో జరగవచ్చు లేదా పదిపదిహేనేండ్ల క్రితమే జరిగి వుండవచ్చు. కానీ 70ఏండ్లలో ఏమీ జరగలేదని చెప్పటం బలవంతంగా రుద్దే ఒక భయంకరమైన అవాస్తవం. 3. కుహనా వార్తల వ్యాప్తి, వాటిపై ఆధారపడటం : బిజెపి వ్యతిరేక కుహనా వార్తలు కూడా కొన్ని వున్నాయి, కానీ బిజెపి అనుకూల, ప్రతి పక్ష వ్యతిరేక కుహనా వార్తలు జనానికి చేరటంలో మైళ్ల దూరం ముందున్నాయి. వాటిలో కొన్ని మద్దతుదార్లవి, అయితే ఎక్కువ భాగం పార్టీ నుంచే వస్తున్నాయి. తరచూ అవి విద్వేషపూరితంగానూ జన సమీకరణ వైఖరి అంతకంటే నీచమైనవిగా కూడా తయారవుతున్నాయి. ఈ ప్రభుత్వ మద్దతు వున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ మనకు తెలిసినదాని కంటే సమాజానికి ఎక్కువ హాని చేస్తున్నాయి. 4. హిందూయిజం ప్రమాదంలో వుంది: హిందువులు, హిందూయిజం ప్రమాదంలో వుందనే భావనను, మనల్ని రక్షించాలంటే మోడీ మాత్రమే దిక్కు అని జనాల బుర్రలోకి నూరిపోశారు. వాస్తవంలో జనాల భావంలో మార్పు తప్ప ఈ ప్రభుత్వం రాకముందు హిందువులు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే వున్నారు, మారిందేమీ లేదు. హిందువులమైన మనం 2007లో ప్రమాదంలో పడ్డామా? నావరకైతే దాని గురించి రోజూ వినలేదు, మరింత భయం, విద్వేషం తప్ప హిందువుల స్ధితిగతులలో నాకైతే మెరుగుదల కనిపించలేదు. 5. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశవ్యతిరేకులు, ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ఈ విధమైన ముద్రవేయటం ద్వారా న్యాయమైన విమర్శను బయటకు రాకుండా చేస్తున్నారు. మీ జాతీయతను రుజువు చేసుకోండి, ప్రతిచోటా వందేమాతరం పాడండి( బిజెపి నేతలకు దానిలో వుండే పదాలేమిటో కూడా తెలియనప్పటికీ దానిని పాడాలని మిమ్మల్ని బలవంతం చేస్తారు.) నేను జాతీయవాదిగా గర్వపడతాను, అయితే దాన్ని బహిరంగంగా ప్రదర్శించమని ఏవరైనా బలవంతం చేయటాన్ని నా జాతీయవాదం అనుమతించదు. అవసరమైనపుడు లేదా నాకు పాడాలని అనిపించినపుడు జాతీయ గీతాన్ని జాతీయ పాటను నేను పాడతాను. అయితే ఇతరుల వెర్రులకు అనుగుణ్యంగా పాడాలని ఎవరైనా బలవంతం చేస్తే నేను పాడను.6. బిజెపి నేతలు నిర్వహిస్తున్న వార్తా ఛానళ్ల ఏకైక కార్యక్రమం హిందూ-ముస్లిం, జాతీయవాదం-జాతి వ్యతిరేకులు, భారత్‌-పాకిస్ధాన్‌, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే, విడిపోయే సమీకరణలను రెచ్చగొట్టే చర్చలు మాత్రమే. అవి ఏవో మీ అందరికీ తెలుసు, నీచమైన ప్రచారాన్ని వెదజల్లే చర్చలు జరిపేవారికి నజరానాలు అందచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 7. సమీకరణ : అభివృద్ధి సందేశం గతించింది. వచ్చే సాధారణ ఎన్నికలకు బిజెపి వ్యూహం ఏమిటంటే విభజించే సమీకరణలను, కుహనా జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం. మోడీగారు స్వయంగా తన ప్రసంగాల్లో చెప్పారు. జిన్నా, నెహ్రూ, భగత్‌ సింగ్‌ జైల్లో వున్నపుడు కాంగ్రెస్‌ నేతలు ఆయనను పరామర్శించలేదు( ఆ నకిలీ వార్త స్వయంగా ప్రధాని నోటి నుంచి వెలువడింది). గుజరాత్‌లో మోడీని ఓడించేందుకు కాంగ్రెస్‌ నేతలు పాకిస్ధాన్‌లో సమావేశమయ్యారు. అక్బర్‌ కంటే మహారాణా ప్రతాప్‌ గొప్పవాడని అని యోగి గారు చెబుతారు. జెన్‌యు విద్యార్ధులు జాతి వ్యతిరేకులు, వారు దేశాన్ని ముక్కలు చేస్తారు. ఈ ప్రచారమంతా విడదీయండి, ఎన్నికల్లో గెలవండి అనే ఒక ప్రత్యేక లక్ష్యంతో రూపొందించినది. ఇటువంటి దానిని మా నేతల నుంచి వినాలని కోరుకోవటం లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాటలతో దేశం తగుల బడాలని కోరుకొనే ఎవరినైనా అనుసరించేందుకు నేను వ్యతిరేకిస్తాను.

జాతీయ చర్చను ఒక చీకటి కోణంలోకి బిజెపి ఎలా నెడుతోందో చెప్పేందుకు కొన్ని వుదాహరణలు మాత్రమే ఇవి. దీని కోసం నేను బిజెపిలో చేరలేదు, వీటన్నింటికీ నేను మద్దతు ఇవ్వలేను, అందుకే నేను బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నా.

గమనిక: భారత ఆశాకిరణం మాదిరి నరేంద్రమోడీ గారు కనిపించటంతో నేను 2013 నుంచి  బిజెపిలో పని చేస్తున్నాను, అభివృద్ధి  సందేశాన్ని నమ్మాను. ఆ సందేశం, ఆశ ఇప్పుడు పూర్తిగా పోయాయి. నావరకైతే నరేంద్రమోడీ మరియు అమిత్‌ షా ప్రభుత్వంలోని సానుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా వున్నాయి.అయితే ప్రతి ఓటరు స్వంతంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాన్ని, చరిత్రను ఎలా సంక్లిష్టం గావిస్తున్నారో తెలుసుకోండి. ప్రచారాన్ని తేలికగా తీసుకోవటం, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆరాధించటం హీనమైన అంశాలు. ఇది ఈ దేశం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి.

ఎన్నికలు దగ్గరపడుతున్నందున మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దాంతో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఏ భావజాలాన్ని లేదా ఏ పార్టీ అని కాదు, అది మెరుగైన, బలమైన, దారిద్య్రం లేని, అభివృద్ధి చెందిన భారత్‌ను నడిపించేదిగా వుండేదానికి మనం మద్దతు ఇవ్వాలి. నా ఏకైక ఆశ ఏమంటే మనమందరం సామరస్యతతో పని చేస్తామన్నదే. రెండు వైపులా మంచి వారుంటారని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. వారు భిన్న పార్టీలలో వున్నప్పటికీ వారికి ఓటరు మద్దతు, వారి మద్దతు ఓటర్లకు వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాక్‌ ఎన్నికలు-కమ్యూనిస్టుల పునరుజ్జీవనం !

02 Saturday Jun 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

IRAQ ELECTIONS, Iraqi Communist Party, Muqtada al-Sadr, non-religious parties, Sadrist-Communist alliance, Sairoun Alliance, Shi’ite cleric Muqtada al-Sadr

టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా నజఫ్‌ నియోజక వర్గం నుంచి ఎన్నికైన తొలి పార్లమెంట్‌ సభ్యురాలు

ఎం కోటేశ్వరరావు

ఇరాక్‌లో అంతరించి పోయిందనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుజ్జీవనం పొందిందా? అవునంటే సహజంగానే కమ్యూనిస్టులకు వుత్సాహం కలిగించే అంశమైతే, వ్యతిరేకులకు దడపుట్టించే పరిణామమే. అన్నింటికీ మించి అసలు కమ్యూనిస్టులేమిటి ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో జతకట్టటం ఏమిటి, అధికారంలో కూడా పాలుపంచుకొనేందుకు సిద్దపడటం ఏమిటి అని అనేక మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతేనా, తాజా ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున అదీ ఒక మహిళ, షియా ముస్లింల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడే నజఫ్‌ పట్టణ నియోజకవర్గం నుంచి విజయం సాధించటమేమిటి? ముస్లిం ఛాందసులు కమ్యూనిజం మీద వ్యతిరేకత వదులుకున్నారా అని ఆశ్చర్యంతో తలమునకలు అవుతున్నవారు కూడా లేకపోలేదు. ఇంతకీ అసలక్కడేం జరిగింది. దాని గురించి పరిశీలకులేమంటున్నారు?

ఇరాక్‌ మరోసారి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. గత నెల పన్నెండున అక్కడ జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో అల్‌ సదర్‌-కమ్యూనిస్టు పార్టీ కూటమి ‘సంస్కరణల కోసం పదండి మ ముందుకు ‘ అనే నినాదంతో అనూహ్యంగా పెద్ద కూటమిగా ఎన్నికైంది. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు వారు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. సంక్లిష్టమైన తీర్పు రావటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అనుమతించిన మూడునెలల వ్యవధిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి రావటం ఇష్టం లేని శక్తుల ప్రోద్బలంతో పార్టీ కార్యాలయం మీద బాంబు దాడి జరిగింది.ఎన్నికలకు ముందు ఇరాన్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త అయిన అలీ అక్బర్‌ వెలాయతీ ఇరాక్‌ సందర్శనకు వచ్చి వుదారవాదులు, కమ్యూనిస్టులను ఇరాక్‌ పాలనకు తాము అనుమతించేది లేదని చేసిన ప్రకటన ఇరాన్‌ ప్రభుత్వ ఆలోచనా ధోరణికి ప్రతిబింబం. అమెరికా సరేసరి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పెంపుడు చిలక. ‘పదండి ముందుకు’ పేరుతో ఎక్కువ స్ధానాలు సాధించిన కూటమి గురించి ఆ ఏముంది అవసాన దశలో వున్న కమ్యూనిస్టులు, సున్నీ వ్యాపారులు, ఆధ్యాత్మిక కార్యకర్తలతో కూడిన కూటమి అంటూ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఆ కూటమిలో ఆల్‌ సదర్‌ పార్టీతో పాటు, కమ్యూనిస్టుపార్టీ, మార్పుకోసం యువజనోద్యమ పార్టీ, పురోగామి మరియు సంస్కరణల పార్టీ, ఇరాకీ రిపబ్లికన్‌ గ్రూప్‌, జస్టిస్‌ పార్టీ వంటివి వున్నాయి. జనంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిరూపంగా ఇరాక్‌లో జరుగుతున్న సమీకరణలకు ప్రతిబింబం ఈ ఎన్నికలని చెప్పవచ్చు. ఈ ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదు, దేశవ్యాపితంగా 44శాతం మంది పాల్గంటే బాగ్దాద్‌లో అది 33శాతమే వుంది. ఈ నగరంలో సాదరిస్టు కూటమి 23శాతం ఓట్లు తెచ్చుకుంది. మిగతా పార్టీలలో దేనీకీ పదిశాతానికి మించి రాలేదు. ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజుల తరువాత కొన్నివేల పోలింగ్‌ కేంద్రాలలో అక్రమాలు జరిగాయని అక్కడి ఓటింగ్‌ను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన అక్కడేం జరుగుతుందో ఫలితాన్ని ఎటువైపుగా తిప్పుతారో తెలియదు.

ఇరాన్‌ాఇరాక్‌ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాల దాడి, దురాక్రమణ తరువాత, సద్దామ్‌ హుస్సేన్‌ హత్య అనంతరం ప్రపంచ వార్తల్లో ఇరాక్‌ వాటా బాగా తగ్గిపోయింది. అలాంటిది తాజా ఎన్నికలతో పశ్చిమ ఆసియా, పాశ్చాత్య దేశాల మీడియాలో ఈ ఎన్నికలు ఒక కుదుపు మాదిరి ఇరాక్‌ పరిణామాలు ముందుకు వచ్చాయి. ఇవి టీకప్పులో తుపానులా సమసిపోతాయా లేక సరికొత్త పరిణామాలకు నాంది అవుతాయా అన్నది చూడాల్సి వుంది.

మక్తాడా ఆల్‌ సదర్‌

ఎన్నికలలో గెలిచిందెవరన్నది సాధారణ వార్త, అయితే ‘ఇరాక్‌ ఎన్నికలలో ఓడిందెవరు? ఇరాన్‌ మరియు అమెరికా’ అనే శీర్షికతో ఒక వ్యాఖ్యానం వెలువడింది. ఇది అసాధారణం. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా వున్న ఒక మతాధికారి ఇరాక్‌ను స్వాతంత్య్రం వైపుగా నడిపించాలని కోరుకుంటున్నారు అని సారాంశాన్ని రాశారు. సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన తరువాత ఇరాక్‌ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు 2003 నుంచి అమెరికాతో పాటు ఇరాన్‌కూడా చేయాల్సిందంతా చేసింది. ఆ రెండింటి మద్దతుదార్లను పక్కన పెట్టిన ఇరాకీ ఓటర్లు తమ అస్ధిత్వాన్ని, స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలనే ధోరణి వైపు మొగ్గుతున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాక్‌ పార్లమెంట్‌లో 329 స్ధానాలున్నాయి.వాటిలో షియా మతనాయకుడు మక్తాడా ఆల్‌ సదర్‌, కమ్యూనిస్టులతో కూడిన నాయకత్వంలోని రాజకీయ సంఘటన 54 స్ధానాలతో మొదటి స్ధానంలో వుంది. వీరిలో కమ్యూనిస్టులు ముగ్గురే అయినప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన వుదంతంగా మారింది. ఇరాన్‌ అనుకూల షియా పార్టీల కూటమికి 47, అమెరికా అనుకూల ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ నాయకత్వంలోని కూటమికి 42 స్ధానాలు వచ్చాయి. మిగిలినవి అనేక చిన్న పార్టీలు, ప్రాంతీయ, మత, గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహించే వారికి దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 165 మంది మద్దతు కావాల్సి వుంది.కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటింగ్‌ను రద్దు చేసి కొన్ని ఫలితాలను తారు మారు చేస్తారా, చేసినప్పటికీ బలాబలాల్లో పెద్ద మార్పు వుండే అవకాశం లేదు. సదర్‌ కూటమి లేకుండా ఇరాన్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడినా, సదర్‌ ప్రమేయంతో అమెరికా వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పడినాఅమెరికాతో లడాయి తప్పుదు. రెండవది జరిగితే అది ఇరాన్‌ ప్రభావం, ప్రమేయాన్ని కూడా అంగీకరించే అవకాశం వుండదు.పశ్చిమాసియాలో కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రభావం కలిగించే అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికాతో సంబంధాలు బెడిసిన పూర్వరంగంలో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే జరిగితే అమెరికా చూస్తూ వూరుకుంటుందా? పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికాతో జతకట్టిన సౌదీ అరేబియాలో ఆ ప్రాంతంలో ఇరాన్‌ పలుకుబడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అది సదర్‌ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వం ఏర్పడినా దాని సుస్ధిరత అన్నది ప్రశ్నార్ధకమే.

ఇరాక్‌, అక్కడి కమ్యూనిస్టు పార్టీ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి? షియా తెగకు చెందిన మక్తాదర్‌ అల్‌ సదర్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఇరాకీ జాతీయవాద వుద్యమం సున్నీ తెగవారిపై అమెరికా సైన్యం జరిపిన అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ చర్యలు కూడా జరిపింది. షియాల్లోని మితవాదులు,పేదలు కూడా ఇది ఇరాన్‌ అనుకూల వైఖరిగా పరిగణించారు. ఇప్పటివైఖరిని చూస్తే అమెరికా వ్యతిరేకత, ఇరాన్‌ వైఖరిని కూడా వ్యతిరేకించే ఒక జాతీయ రాజకీయ వుద్యమంగా అది మారింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సున్నీ అరబ్బులు కూడా నేడు గణనీయంగా సదర్‌కు మద్దతు ఇస్తున్నారని తాజా ఎన్నికలు వెల్లడించాయి. ఇరాక్‌ ప్రయోజనాలకే పెద్ద పీట, అమెరికా, ఇరాన్‌కు వ్యతిరేకం అనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌ పీడ వదిలింది, ఇరాక్‌ స్వేచ్చ పొందింది అని కూటమి మద్దతుదార్లు బాగ్దాద్‌ వీధుల్లో నినాదాలు చేశారు.

మత ప్రమేయం కలిగిన సదరిస్టులు, మతాన్ని అంగీకరించని కమ్యూనిస్టులు ఎందుకు కలిశారు అన్న ప్రశ్నలకు పరిశీలకులు చెబుతున్నదేమిటి? ముందు దేశంపై ఇరాన్‌ ప్రభావాన్ని అంతం చేయాలి అన్నది ఒకటి.దేశంలో అది ఇరాన్‌ లేదా అమెరికా అనుకూల ప్రభుత్వమైనా అవినీతిని పెంచి పోషించటంలో ఎలాంటి తేడా లేదు, అందువలన అవినీతి నిర్మూలనకు, అభివృద్ధికోసం పనిచేసేందుకన్నది మరొక కారణంగా చెబుతున్నారు. సదరిస్టులు షియా మతభావాలతో ప్రారంభమైనప్పటికీ షియా-సున్నీ తెగలలోని కార్మికులు, ఇతర పేదలను ఐక్యం చేయటంలో జయప్రదమయ్యారని పేదల వాణిగా మారారన్నది కొందరి అభిప్రాయం. కమ్యూనిస్టులు చేతులు కలపటానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు. ప్రపంచమంతటా కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న ప్రచారం బలంగా జరుగుతున్న కాలంలో, ముస్లింలు- కమ్యూనిజానికి చుక్కెదురు అని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మరొకవైపు జరుగుతున్న పూర్వరంగంలో ఇరాక్‌, ఇతర అరబ్బు దేశాలలో కమ్యూనిజానికి జనం ఆకర్షితులౌతారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఛాతమ్‌ హౌస్‌ అనే ఒక సంస్ధలో పని చేస్తున్న డాక్టర్‌ నసైబా యూనిస్‌ ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.’ సద్దామ్‌ హుస్సేన్‌ (2003) అనంతర కాల రాజకీయాలను తిరస్కరించే వారికి ఒక వాహనంగా ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీ తయారైంది. ప్రభుత్వాల అవినీతి, పేదల సంక్షేమాన్ని విస్మరణ కారణంగా అలసిపోయిన ఇరాకీలను ఒక విశాల సామాజిక న్యాయ అజెండాతో ఆకర్షించి మద్దతును కూడగట్టుకున్నది. కష్టజీవులకు సేవ చేయాలనే ఒక వుమ్మడి సైద్ధాంతికపరమైన కేంద్రీకరణ, యధాతధ స్ధితిని మార్చాలనే ఒక వుమ్మడి అభిప్రాయం సాదరిస్టులు మరియు కమ్యూనిస్టులకు వుంది. ఇదే సమయంలో నాయకత్వ స్ధాయిలలో వుదారవాదులైన సాదరిస్టులు వున్నప్పటికీ మత విలువలను రుద్దకుండా స్వేచ్చ, స్వాతంత్య్రాలకు సాదరిస్టులు ఎంత మేరకు కట్టుబడి వుంటారు ప్రత్యేకించి ఈ కూటమిలో కమ్యూనిస్టులు ఒక చిన్న భాగస్వామిగా గట్టిగా వున్నపుడు అన్న ఒక ఆతృత కూడా ఇరాకీ వామపక్ష శక్తులలో గణనీయంగా వుంది. మహిళల హక్కుల వంటి విషయాలలో పక్షపాతం లేని వైఖరిని, మద్దతును సాదరిస్టులు విస్తరించకపోవచ్చు ‘ అని నసీబా చెప్పారు.

జోయల్‌ వింగ్‌ అనే మరొక విశ్లేషకుడు ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ గురించి ఇలా చెప్పారు.’ ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. సాంప్రదాయక మార్క్సిజం-లెనినిజాన్ని అనుసరిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నపుడు దానికి అనుకూలంగా వుండేది. గతంలో మధ్యప్రాచ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఇతరులతో ప్రత్యేకించి అరబ్‌ ప్రాంతంలో విస్తరించిన పార్టీలైన నాజరైట్స్‌, బాతిస్టుల వంటివాటితో పోటీపడేవి. 1958 వరకు కమ్యూనిస్టులను రాజరికం నిరంతరం హింసించినప్పటికీ దేశంలోని కార్మికవర్గం, విద్యార్ధులలో కమ్యూనిస్టులు పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. వారికి సైద్ధాంతిక మద్దతుదారులు వుండేవారు, వారిలో ప్రధానంగా జనరల్‌ అబ్దల్‌ కరీమ్‌ ఖాశిం తిరుగుబాటుద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత 1968లో బాత్‌పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఖాశిం ప్రభుత్వాన్ని కూలద్రోసి ఆయనను హత్య చేశారు. కమ్యూనిస్టుపార్టీని దాదాపు నాశనం చేశారు. తరువా వారు ఎక్కువ భాగం రహస్యంగా పని చేశారు. 2003 తరువాతనే పార్టీ చాలా పరిమితంగా పనిచేస్తూ బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.అయితే అది చాలా చిన్నది. వంతుల వారీ రాజకీయ అధికార పద్దతి, తెగలవారీ దామాషా పద్దతిలో పదవుల పంపిణీ విధానం, అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజ బృందాలు ఆందోళనకు వుపక్రమించినపుడు కమ్యూనిస్టు పార్టీ వారితో కలసి గత ఐదు సంవత్సరాలలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక నిరసనల ద్వారా సాదరిస్టులతో కమ్యూనిస్టుపార్టీ జతకట్టింది. అదే మే నెలలో సాదరిస్టు కూటమిలో భాగంగా పోటీ చేసేందుకు దారి తీసింది. రక్షణ కల్పిస్తామని సాదరిస్టులు చెప్పటం, ఇరాకీ రాజకీయ ప్రముఖులలో చేరేందుకు ఒక దారిగా కమ్యూనిస్టులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ కమ్యూనిస్టు శ్రేణులలో ఒక అనిశ్చితి వుంది. తమకు నచ్చని విధానాలను సాదరిస్టులు రుద్దుతారా అని అనేక మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఆలోచిస్తున్నారు. సాదరిస్టు పార్టీ అధికారంలో చేరటాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవటం లేదు, ఒకవేళ అదే జరిగితే ఆ కూటమి నుంచి బయటపడాలని కొంత మంది ఆలోచిస్తున్నారు.’ అని జోయెల్‌ వింగ్‌ పేర్కొన్నారు.

‘ గత పదిహేను సంవత్సరాలుగా నడచిన ప్రభుత్వ వ్యవస్ధను తిరస్కరించటంలో, సంస్కరణ, అవినీతి, వంతుల వారీ అధికార స్వీకరణ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రతిధ్వనించారు. అయితే ఇవి వైఖరులు తప్ప విధానాలు కాదు, వాస్తవ సంస్కరణల అజెండాలో అవెలా వాస్తవ రూపం దాల్చుతాయో తెలియదనుకోండి ‘ అని సింగపూర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫనర్‌ హదాద్‌ పేర్కొన్నారు. వంతుల వారీ పద్దతిలో అధికారాన్ని పంచుకోవటం కంటే ప్రతిపక్షంలోనే వుండటం మేలని ఎన్నికల ఫలితాల అనంతరం సాదర్‌ కూటమిలోని కొన్ని పార్టీల నేతలు పేర్కొన్నారు. టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా అక్కడ ఎన్నికయ్యారు.

జాతీయవాది, కమ్యూనిస్టు అభిమాని అయిన మాజీ ప్రధాని జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం హయాంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికోసం బాగ్దాద్‌ శివార్లలో విప్లవ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఆవాసం తరువాత కాలంలో సాదర్‌ నగరంగా మారింది. దాని జనాభా ప్రస్తుతం 35లక్షలు. బాగ్దాద్‌లో సగం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1999లో షియా మతనాయకుడు అయాతుల్లా మహమ్మద్‌ సాదిక్‌ అల్‌ సదర్‌ను హత్య చేసిన తరువాత ఆ నగరం సాదర్‌ సిటీగాను, ప్రస్తుతం సాదర్‌ పార్టీ కేంద్రంగా మారింది.ఆయన కుమారుడే ప్రస్తుతం సాదరిస్టు పార్టీ నేత మక్తాదా అల్‌ సదర్‌. సాదర్‌ పార్టీ నాయకత్వంలోని సాయుధ విభాగం అమెరికా సైన్యాన్ని ఎదిరించటంలో ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని పోరాడిన చరిత్ర వుంది.

2003లో ఇరాక్‌ను ఆక్రమించినప్పటి నుంచి అమెరికా అధికారుల కనుసన్నలలో నడిచిన ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు. వివిధ సేవలను అందించటానికి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలలో మునిగిపోయారు. 2010 వేసవిలో తీవ్ర ఎండలు, విద్యుత్‌ కోత కారణంగా జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. దాంతో జనం నిరసనలకు దిగారు. 2011 వసంత గర్జన పేరుతో మధ్యప్రాచ్యంలో ప్రారంభమైన నిరసనలు ఇరాక్‌ను కూడా తాకాయి.ఇరాకీ వసంత గర్జన పేరుతో వుద్యోగాలు, విద్యుత్‌ తదితర డిమాండ్లపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.ప్రభుత్వం అణచివేతకు దిగటంతో 45 మంది మరణించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం దేశమంతటా అనేక సమస్యలపై ప్రదర్శనలు జరగటం పరిపాటి అయింది. 2015 నుంచి మరింత సంఘటితంగా జరిగాయి. ఈ క్రమంలోనే సాదరిస్టులు, కమ్యూనిస్టులు దగ్గరయ్యారు. మత, తెగల ప్రాతిపదికన ప్రభుత్వంలో పదవుల పందేరాన్ని ఈ ప్రదర్శనల్లో నిరసించారు. ఇరాక్‌ పార్లమెంట్‌, ఇస్లామిక్‌ మత రాజ్యం ఒకే నాణెపు బమ్మా బరుసు వంటివని యువత బ్యానర్లు ప్రదర్శించేవారు.

సద్దామ్‌ హుస్సేన్‌ అమెరికాను వ్యతిరేకించి దాని కుట్రకు బలైన యోధుడిగా లోకం ముందు కనిపించేది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కరడు గట్టిన కమ్యూనిస్టు, కార్మిక వ్యతిరేకత వుంది. అమెరికా సిఐఏతో చేతులు కలిపిన ఇరాక్‌ బాతిస్టు పార్టీనేతలు కమ్యూనిస్టు అనుకూల జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆయనను హతమార్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కుట్రలో సద్దామ్‌ హుస్సేన్‌ ఒక ప్రముఖుడు. బాతిస్టు పార్టీ, సద్దామ్‌ హయాంలో కమ్యూనిస్టులను అణచివేశారు.కార్మిక సంఘాల ఏర్పాటును కూడా నిషేధించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌ను తయారు చేయటంలో అమెరికా పాత్ర అందరికీ తెలిసిందే. ఆ రెండు దేశాలూ యుద్ధానికి తలపడిన సమయంలో అమెరికా సద్దామ్‌ హుసేన్‌కు మద్దతు ఇచ్చింది. ఆయుధాలు కూడా అందచేసింది. తరువాత సద్దాం వ్యతిరేకిగా మారటంతో అదే అమెరికా చివరకు ఇరాక్‌ను ఆక్రమించి హతం చేసింది. సద్దాం మరణం తరువాతే విదేశాలలో, స్వదేశంలో వున్న ఇరాకీ కమ్యూనిస్టులు బహిరంగ కార్యకలాపాలలోకి వచ్చారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి వుంది. అమెరికా వ్యతిరేకిగా మారిన సద్దామ్‌ హుస్సేన్‌ను బయటి ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులు గతంలో బలపరిచారు. ఇరాక్‌ దురాక్రమణను, సద్దాం వురిని కూడా నిరసించారు. సద్దామ్‌ అణచివేతకు గురైన ఇరాకీ కమ్యూనిస్టులు ఈ వైఖరిని ఆమోదించరనేది స్పష్టం. అలాగే ఇప్పుడు మన దేశంలో వున్న మతోన్మాదశక్తులు, అవి చెలరేగిపోతున్న పూర్వరంగంలో వాటికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులకు ఇరాకీ కమ్యూనిస్టుల వైఖరి మింగుడుపడకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో ఎలా కలుస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మన దేశంలోని మతోన్మాదులు కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తున్నారు, కేరళ వంటి చోట్ల హతమార్చేందుకు వెనుకాడటం లేదు.ఇరాష్‌ షియా మతనాయకుడి ఆధ్వర్యంలోని పార్టీ సున్నీ తెగ ముస్లింల మద్దతు కూడా కూడగట్టుకున్నది. కమ్యూనిస్టుల విషయం తెలిసి కూడా అనేక పోరాటాలలో వారితో భుజం కలిపింది. అయితే అది శాశ్వతంగా అలాగే వుంటుందా? అధికారం వచ్చేంత వరకు కమ్యూనిస్టులను వుపయోగించుకొని తరువాత వ్యతిరేకిగా మారితే ఏమిటి అన్న సందేహాలు తలెత్తటం సహజం. తాము స్వయంగా అనేక ప్రపంచ అనుభవాలు చూసిన తరువాత ఇరాకీ కమ్యూనిస్టులు అంత గుడ్డిగా లేదా భ్రమలతో ఒక మత నేత సారధ్యంలోని పార్టీతో చేతులు కలుపుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. పదండి ముందుకు పేరుతో ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల కార్యక్రమంలో మతపరమైన అంశాలు లేదా కమ్యూనిస్టులు చెప్పే సోషలిజం వంటి అంశాలేమీ లేవు. అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, ఇరాన్‌, అమెరికా జోక్యానికి వ్యతిరేకమైన ఒక జాతీయవాద అజెండాతో వారు జనం ముందుకు వెళ్లారు. అనూహ్యంగా ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వచ్చి ఎన్నికల ప్రణాళికు భిన్నంగా ఏ పార్టీ వ్యవహరించినా మిగతా పార్టీలు వ్యతిరేకించి బయటకు వస్తాయి. కమ్యూనిస్టులు కూడా అదే చేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక అంకెల ఆటలో బిజెపికి భంగపాటెందుకు కలిగింది !

19 Saturday May 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Congress party, jds, karnataka votes 2018, karnataka votes facts, numbers game in karnataka, Yeddyurappa

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దళితుల ఇండ్లలో భోజనం చేస్తే వారు పునీతులు కారు అన్న వుమా భారతి

03 Thursday May 2018

Posted by raomk in BJP, Communalism, History, INDIA, NATIONAL NEWS, Opinion, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP motor mouths, Dalit, discrimination against dalits india, motormouths, Uma Bharti

Image result for Uma Bharti

ఎం కోటేశ్వరరావు

ఏదో అయింది, లేకపోతే నరేంద్రమోడీ అంతటి పెద్ద మనిషి వివాదాస్పద, మసాలా మాటలు మాట్లాడి పార్టీకి ఇబ్బంది తేవొద్దు అని హెచ్చరించిన తరువాత కూడా తమ నేతల నేతల నోళ్లు ఇంకా వాగుతూనే వున్నాయని కొందరైనా బిజెపి అభిమానులు అంతరంగంలో అయినా అనుకోకుండా వుండజాలరు. నేతల నోళ్లు పని చేస్తుండటమే కాదు, పార్టీ మరుగుజ్జు యోధుల సేన(ట్రోల్స్‌) తమ ఎత్తుగడలతో ఇంకా ముందుకు పోతూనే వుంది. మోడీ అంటే వీరికి లెక్క లేదా లేక మోడీ అదుపులో వీరు లేరా లేక నేను పెద్దమనిషిగా సుద్దులు చెబుతుంటాను మీరు చేసేది చేయండి అన్న మార్గదర్శక సూత్రాలేమైనా వున్నాయా అని అనుమానించక తప్పటం లేదు. ఒకటి మాత్రం స్పష్టం. పులినెక్కిన వారు ఆకస్మికంగా స్వారీని మధ్యలో ఆపలేరు. దాన్ని వారు అదుపులోకి తీసుకొని దిగాలి లేదా దానికి బలి కావాలి. బిజెపి మతోన్మాద, విద్వేష ప్రచార పులి స్వారీ చేస్తోంది. మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వుమా భారతి తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసిన తరువాత మోడీ సలహా నేపధ్యంలో బిజెపి వారెంత తెలివిగా తమ నోళ్లను వుపయోగిస్తున్నారో తెలుస్తోంది.

పిటిఐ అందచేసిన వార్త ఇలా వుంది. మంగళవారం నాడు కేంద్ర మంత్రి వుమా భారతి దళితులను అవమానించిన తీరు కొంతకాలంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులను దువ్వేందుకు చేస్తున్న యత్నాలను గాలికిపోయేట్లు చేసిందంటే అతిశయోక్తి కాదు. వుమా భారతి మధ్య ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌ సమీపంలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా దళితులతో సహపంక్తి భోజనానికి గైరు హాజరయ్యారు. వారితో కలసి భోంచేసి వారిని పునీతులను చేయటానికి తానేమీ భగవంతుడు రాముడిని కాదని వ్యాఖ్యానించారు. తరువాత ఆమె క్షమాపణలు చెప్పారు. వారితో కలసి భోజనం చేయాలనే విషయం తనకు తెలియదన్నారు. రెండు రోజుల క్రితం (మే ఒకటవ తేదీ) దాద్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ‘ఇలాంటి కార్యక్రమాలను (షెడ్యూలు కులాల వారితో కలసి సహపంక్తి భోజనాలు చేయటం) నేను సమర్ధించినప్పటికీ దళితులతో కలసి భోజనం చేసేందుకు నేను వారి ఇండ్లకు వెళ్లను’ అని చెప్పారు. దానికి బదులు వారిని తానే తన ఇంటికి ఆహ్వానిస్తానని అన్నారు. ‘ నేను మీతో ఒక రహస్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను సహపంక్తి భోజనాలలో పాల్గనను, ఎందుకంటే ఎవరైతే శబరి ఇంటికి, దళితుల వద్దకు వారిని పునీతులను చేసేందుకు వెళ్లిన భగవంతుడు రాముడిని నేను అనుకోవటం లేదు. వారితో కలసి కూర్చోవటానికి, పునీతులను చేసేందుకు నేనేమీ భగవంతుడు రాముడిని కాదు. దానికి బదులు వారు మా ఇంటికి వచ్చి వంట ఇంట్లో కూర్చుంటే మేము పునీతులం అవుతాం. మా ఇంట్లో నా భోజన బల్లమీద దళితులకు నేను వడ్డిస్తే నా ఇల్లు, పాత్రలు కూడా పునీతం అవుతాయి. ఢిల్లీ రండి, మా మేనల్లుడి భార్య మీకు భోజనం తయారు చేస్తుంది. నేను మీకు వడ్డిస్తాను, మా మేనల్లుడు మీరు తిన్నతరువాత కంచాలను తీసి శుభ్రం చేస్తాడు. నేను మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను మీతో కలిసి భోజనం చేయలేను, ఎందుకంటే ఇప్పటికే తిన్నాను, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నా, ఎల్లవేళలా మీతోనే వుంటా ‘ అన్నారు.

Image result for Uma Bharti

తరువాత ఒక ప్రకటన చేస్తూ తన అనుచరుడైన హర్షు మహరాజ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భోజనం చేయవలసిన అంశం వుందని నాకు తెలియదు అని వేదికమీదనే చెప్పాను. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వున్న టికమ్‌ ఘర్‌ జిల్లా పాపోడాకు వెళ్లి అక్కడ విద్యాసాగర్‌ మహరాజ్‌ను కలవాల్సి వుందని, అందువలన వారితో కలసి భోజనం చేయలేనని వారికి క్షమాపణ చెప్పాను. సామరస్యత సాధించాలంటే దళితులతో కలసి భోజనం చేయాలన్న ఒకప్పటి కాలం గతించింది. దానికి బదులు వారిని రాజకీయంగా, సామాజికంగా, ప్రభుత్వంలోనూ, యంత్రాంగంలోనూ, ఇతర వాటిలోనూ సామరస్యత సాధించాలంటే వారిని సమానత్వంతో తీసుకుపోవాలి. రాజకీయాలలో దళితులు, వెనుకబడిన తరగతుల మధ్య సామరస్యం సాధించేందుకు ఇప్పుడు వివక్షను అధిగమించాలి. సామాజిక సామరస్యతను సాధించాలంటే ఆర్ధిక సాధికారత, సామాజిక గౌరవం, ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో సమాన భాగస్వాములను చేయటం మాత్రమే మౌలిక అవసరాలు.’ అన్నారు. కార్యక్రమం తరువాత దళితులతో భోజనం చేయాలనుకోవటం లేదని చెప్పటం గురించి విలేకర్లు అడగటం ఆశ్చర్యంగా వుందని వ్యాఖ్యానించారు.

సామాజిక సామరస్యత, కుల తత్వానికి వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు, దళితుల ఇండ్లలో భోజనం చేయటం వంటి కార్యక్రమాలను గత కొద్ది నెలలుగా బిజెపి పెద్ద ఎత్తున ప్రచారంతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో ఒక కేంద్ర కాబినెట్‌ మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వుమా భారతి వ్యవహరించిన తీరు బిజెపి నేతల అంతరంగాన్ని తెలియచేస్తున్నది. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని బిజెపితో గట్టి స్నేహం చేసిన చంద్రబాబు నాయుడు గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు వుత్తర ప్రదేశ్‌ మంత్రి సురేష్‌ రాణా అలీఘర్‌లోని ఒక దళితుని ఇంట బయటి నుంచి తెచ్చిన భోజనం చేసి విమర్శల పాలయ్యాడు.

విలేకర్లతో ప్రత్యక్షంగా మాట్లాడకూడదన్న దీక్షలో వున్నారు కనుక తమ పార్టీ నేతలునోటి తుత్తరను అదుపులో వుంచుకోవాలని మోడీ చెప్పటం వరకు బానే వుంది. కానీ ఇతర నేతలకు ఎలా సాధ్యం అవుతుంది. కాశ్మీరులో ఎనిమిదేండ్ల బాలిక అసిఫాపై జరిగిన అత్యాచారాన్ని లండన్‌ భారత సంతతి వారి సభలో ప్రధాని నరేంద్రమోడీ సూటిగా ఖండించకుండా కుండా అత్యాచారం అత్యాచారమే దాన్నెలా సహిస్తాం అని ఎదురు ప్రశ్నవేస్తూ రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించారు. అత్యాచార వుదంతం ప్రపంచవార్తగా తయారైంది. నిందితులపై కేసు నమోదు చేయవద్దని జమ్ము బార్‌ అసోసియేషన్‌ అడ్డుకుంది. నిందితులు నిర్దోషులంటూ హిందూ ఐక్య వేదిక పేరుతో జరిగిన సభలో ఇద్దరు కాశ్మీరు మంత్రులు, ఎంఎల్‌ఏలు పాల్గన్నారు. నష్ట నివారణ చర్యగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయాలని బిజెపి ఆదేశించింది. ఇంత జరిగాక ఆ సభలో పాల్గన్న ఒక ఎంఎల్‌ఏకు మంత్రి పదవి కట్టబెట్టారు. కవీందర్‌ గుప్తా అనే ఎంఎల్‌ఏను వుప ముఖ్యమంత్రిగా చేశారు. ఇంత జరిగిన తరువాత సదరు కవీందర్‌ అసిఫా హత్యాచార సంఘటన చాలా చిన్నదని వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. దోషులకు మద్దతుగా పాల్గన్న ఎంఎల్‌ఏకు మంత్రి పదవి ఇవ్వటం ఏమిటని అడిగితే అది ఇప్పటి నిర్ణయం కాదు, మూడు సంవత్సరాల నాడే మంత్రి వర్గమార్పులు చేయాలని నిర్ణయించినదానిలో భాగమే అని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ సమర్ధించుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అయితే నారదుడు ఇంటర్నెట్‌ గూగుల్‌ వంటి వాడని సెలవిచ్చారు. అంతకు ముందు మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుండబట్టే సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ వార్తలను ఎప్పటికప్పుడు తెలియచేశాడని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్‌ చెప్పిన విషయమూ తెలిసిందే. జ్ఞానపరంగా బిఆర్‌ అంబేద్కర్‌, నరేంద్రమోడీ ఇద్దరూ బ్రాహ్మలే అని గుజరాత్‌ స్పీకర్‌ రాజేంద్ర త్రివేదీ వర్ణించాడు. గుణాన్ని బట్టి కులం వుంటుందని, జ్ఞానం వున్న ప్రతి వారూ బ్రాహ్మలేనని శ్రీకృష్ణుడే చెప్పాడని, అందుకే తాను అంబేద్కర్‌, మోడీ ఇద్దరూ బ్రాహ్మలే అన్నానని సమర్ధించుకున్నాడు.

కేంద్ర మంత్రి అనంత కుమార హెగ్డే కర్ణాటక ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ దేవాలయాలకు వెళ్లినపుడు కావి(కాషాయ) దుస్తులు, మఠాలకు పోయినపుడు రుద్రాక్షలు, కోడి ఈకలతో మసీదులకు, శిలువ ధరించి చర్చ్‌లకు వెళతాడు, ఇప్పుడు ఆయన శ్రావణ బెళగొళ వెళతాడు అంటూ ఎద్దేవా చేశాడు. ఎలాంటి దుస్తులు ధరించని జైన్‌ దిగంబర ఆలయం అది అన్న విషయం తెలిసిందే. తమ మనోభావాలను కేంద్ర మంత్రి కించపరిచాడంటూ జైనులు ఇప్పుడు నిరసన తెలుపుతున్నారనుకోండి. ఇలా నోరుపారవేసుకోకపోతే కార్యకర్తలకు కిక్కు ఎక్కదు, మీడియాలో ప్రచారం రాదని బిజెపి నేతలకు బాగా తెలుసు. అయితే ఇలాంటి వాటిని వుపయోగించుకొని పార్టీలో ప్రతీకారం తీర్చుకొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కథువా(అసిఫా) అత్యాచారం వెనుక పాకిస్ధాన్‌ హస్తం వుందని వ్యాఖ్యానించిన బిజెపి మధ్యప్రదేశ్‌ అధ్యక్షుడు నంద కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ పార్టీ వుద్యోగం పొగొట్టుకున్నాడు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటానికి ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి కనుక ఈ వ్యాఖ్యలను చూపి ఇంటికి పంపించారనే వార్తలు కూడా వచ్చాయి. సదరు నేతకు నోరు పారవేసుకోవటం సాధారణం. రాజకీయ నేతలు నేరగాళ్లకు విధిగా మద్దతు ఇవ్వాలని గతంలో ప్రకటించాడు. తమ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా నాలుక కోస్తా అని బిజెపి ఎంఎల్‌ఏ చేసిన వ్యాఖ్యలు ఒక వుప ఎన్నికలో బిజెపిని దెబ్బతీశాయి. అదే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరీ శంకర్‌ బిసేన్‌ తమ గ్రామంలో తాగటానికి మంచి నీళ్లు లేవంటే అయితే మీకు బిస్లరీ వాటర్‌ సరఫరా చేస్తాంలే అని వ్యంగోక్తితో ఆగ్రహం తెప్పించాడు. ఫ్రెంచి విప్లవ సమయంలో తినటానికి రొట్టెలు దొరకటం లేదని జనం ఆగ్రహంతో వున్నారు మహరాణీ అంటే అయితే వారు కేకులు తినవచ్చు కదా అన్న మారీ అంటోనియెట్‌ను ఈ మంత్రి గుర్తుకు తెచ్చారు. తమకు ఓటు వేయని వారంతా పాకిస్తానీలే అని సహకారశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ నోరుపారవేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలు డబ్బుకోసం, ఒక ఫాషనైపోయింది అన్న వ్యాఖ్యలు చేసిన అనేక మంది గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి తమకు ఎదురు లేదనే అధికార దురహంకారం ఒక కారణమైతే, అడుగుజారుతున్న సమయంలో వ్యక్తమయ్యే అసహనానికి కూడా ఇవి చిహ్నమే. అంతేకాదు, వారి అంతరంగాన్ని కూడా ఇవి బయటపెడతాయి. మేకతోలు కప్పుకున్న పులులు, గోముఖ వ్యాఘ్రాలు కూడా ఇలాగే వుంటాయి.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాల్లోనే అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు ?

30 Monday Apr 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

If everything lies in veda’s only, Indian science, vedas

ఎం కోటేశ్వరరావు

వేదాల్లోనే అన్నీ వున్నాయష అని ముందుగా ఏ మహానుభావుడు సెలవిచ్చాడో నాకైతే వివరాలు దొరకలేదు గానీ తెలుగు జాతి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తన మహత్తర రచన కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనిపించి దాన్ని గ్రంధస్ధం చేశారు. అది నిజమే అంటూ నేడు వున్నత చదువులు చదివిన వారెందరో అతని కంటే ఘనులు అన్నట్లు ఆధునిక అగ్నిహోత్రావధానులుగా తయారయ్యారు. శనివారం నాడు మధ్య ప్రదేశ్‌లోని వుజ్జయిని పట్టణంలో జరిగిన గురుకుల సంస్ధల సమావేశంలో గురుకుల వ్యవస్ధను పునరుద్ధరించాలని, వాటికి తగిన విధంగా బోధనాంశాలను మార్చాలని, సైన్సు మరింత ముందుకు పోవాలంటే వేదాలను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సూచించారు. తల మీద ఒకవైపు పిలక, మరొక వైపు ఆధునిక క్రాఫ్‌ చేయించుకోవాలన్నట్లుగా వుంది. కుర్రకారు తేల్చుకోవాలి. గురుకుల, ఆధునిక విద్యలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సెలవిచ్చారు. ఇప్పటికే ఆవు పేడ, మూత్రంలో ఏముందో చూడాలంటూ శాస్త్రవేత్తలను వాటిలో ముంచేందుకు పూనుకున్నారు. ఇలాంటి తిరోగామి శక్తులను ఇంకా అధికారంలో కొనసాగనిస్తే ఎలాంటి విపరీత ప్రయోగాలు చేయటానికైనా వెనుదీయరు. తస్మాత్‌ జాగ్రత్త.

వేదాలను బట్టీయం వేసి ఘనపాఠీలు, చదివిన వారు పండితులయ్యారు తప్ప ఒక్కరూ శాస్త్రవేత్త ఎందుకు కాలేదో మోహన్‌ భగవత్‌ చెబుతారా అని ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఒక చర్చను ప్రతిపాదించాను. ఒక గ్రూపులో భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నామని నిజంగా నమ్ముతున్న భగవత్‌ అభిమానులంతా పచ్చిబూతులతో ప్రతిస్పందించటం చూసి భరతమాతా చివరకు నీకు ఎంత దుర్గతి పట్టింది ఇలాంటి నీ బిడ్డలను సరిదిద్దుకుంటావో, లేక బూతులు తప్ప మరొకటిరాని ఈ సంతును ఇలాగే వదలి వేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలమ్మా అని చెప్పాను. వదిలేస్తే తరువాత బూతులు నీవంతే నమ్మా అని కూడా చెప్పాను. (అదేమిటి నీకు భరత మాత కనిపించిందా అని కొందరు నన్నడిగినపుడు మిగతా వారికి నిత్యం ప్రత్యక్షం అవుతున్నపుడు నాకు అప్పుడపుడన్నా కనపడదా అని జవాబిచ్చాననుకోండి. ) చర్చలో వెల్లడైన అభిప్రాయాలను చూస్తే గుడ్డి అనుసరణ, నమ్మకం తప్ప ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు అనే ప్రశ్నలను వారు తమ దగ్గరకు రానివ్వరని తేలింది. నిజంగా వారిని చూస్తే జాలేసింది, ఎంతైనా వారు కూడా మనుషుల్లానే వున్నారు కదా అనిపించింది. అదే సమయంలో వారి బూతులు గుర్తుకు తెచ్చుకుంటే జాలి స్ధానంలో ఆగ్రహం కలిగింది. బూతులను ప్రస్తావించటం సంస్కారంకాదు కనుక అలాంటి పోస్టులను, వాటిలోని బూతులను మినహాయించి సారాంశం ఇస్తున్నాను.

వేదాల రిసెర్చే ఘనాపాఠీ అంటే, శాస్త్రవేత్త అంటెనే ఘనాపాఠీ, ఎందుకు కావాలి ఎవరి మార్గం వారిది, మీరెందుకు కాలేదు శాస్త్రవేత్తగా, ఆ వేదాలను ఆ పండిత పామరులను రీసెర్చ్‌ చేసినవారు శాస్త్రజ్ఞులు అయ్యారు, అట్లా బట్టీ పట్టక పోతే మీలాంటి వారు వాటిని ఎప్పుడో అంతం చేసేసి ఉండేవారు. ఇప్పటికైనా ఏదైనా కొద్దిగా ఉందీ అంటే అది బట్టీ కొట్టడం వలననే. ఆ స్వరాలు లో కొద్దిగా మార్పు వచ్చినా అర్థం మారిపోతుంది. అది బట్టీ కొట్టేది అందుకే, మొత్తం ప్రపంచానికి అందించిందే హిందువులు. టెక్నాలజీని అప్పుడు హిరణ్యకశిపుడు దొంగలించాడు. ఇప్పుడు ఈ హిరణ్యకసిపుళ్ళు దొంగిలించారు అందుకే వాళ్ళను రాక్షసులూ అంటారు, ఇప్పటికి వాళ్ళు కొన్నిటిని తెలుసుకోలేకఉన్నారు తెలుకోలేరు హిందువులు వాళ్లకు తెలనివ్వరు ఎందుకంటే ప్రక తి ని నాశనము చేవాళ్లకు ఇవ్వకూడదు సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ప్రయోగించాలో అపుడు ప్రయోగించడం జరుగుతుంది చివరిగా ఒక్కవిషయం ఏఏ దేశాలు అయితే మనదేశానికి వచ్చాయో ఇపుడు ఆదేశాలు నెంబర్‌ 1 స్తానం లో ఉన్నాయి స్వామి వివేకానంద, ఎంతో మంది మేధావులు,, శాస్త్రవేత్తలు జన్మించిన దేశం ,భారతదేశం.. నీకు తెలవదు,ఎందుకంటే నీకు మెదడు లేదు..ఓసారి చరిత్ర చూడు, భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు కలిగిన దేశంగా ప్రపంచం చూస్తుంది. విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం అంతగాలేని దేశంగా చూస్తారు, ప్రపంచమే కాదు మనదేశ ప్రజలకు కూడా తెలియదు. ఐతే ఈ మధ్య కాలాలలో ప్రపంచం కూడా ప్రాచీన భారతదేశం గొప్ప విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం ఉందని మనదేశ ప్రజలు, విదేశీయులు గుర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నో ప్రాచీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో ఎంతోమంది దేశ విదేశీయులు విధ్యనభ్యసించేవారు. అవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి. భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు ప్రాచీన భారతదేశ విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం వాటిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వారు ఏకాలనికి చెందిన వారు అనే విషయం అంతగా లేదు అది తెలుసుకోవడం ఎంతో అవసరం. 1 శుశ్రుత క్రీ.పూ 600 వైద్య శాస్త్రం, 2 చరక క్రీ.పూ 300 వైద్య శాస్త్రం.

3. బౌదాయన్‌ క్రీ.పూ 8-7 గణిత శాస్త్ర వేత్త.4 కన్నడ (ఆళుక్యుడు) క్రీ.పూ 8-7 ఖగోళ మరియి గణిత శాస్త్రవేత్త. 5. నాగార్జున క్రీ.శ 150-250 ఖనిజ శాస్త్రవేత్త.

ఇంతవరకూ సైన్సు వేదం లో తెలిపిన దానిలో 10% కూడా కనుక్కోలేదు. అక్షర సత్యం, సున్నా 0 లేకపోతే కంప్యూటరైజేషన్‌ అనేది ఉంది ఉండేది కాదని తెలుసుగా, హిందువుల మీద ఏడ్చి ఏడ్చి ఏప్పుడో పోయేట్టున్నావు లే, నువ్వు నమ్మే నీ దొంగ మతం..పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెంట్రుకతో సమానం..

ఇంకా వేదాలు పండితులు అవసరం లేదు, అంతేలే అన్యమతాల వారి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడి

ఈ రకమైన పనులు చేస్తున్నారు, హిందూ ధర్మం మీద ఎంత విషం చిమ్మినా కానీ, మన మన్నెం కోటేశ్వరరావు వలన మంచే జరుగుతోంది. అతను రెచ్చగొట్టడం వలన హిందువులు ఏకమౌతున్నారు, తిక్కల ప్రశ్న. పిహెచ్‌డి చేసిన ప్రతివాడు సైంటిస్ట్‌ ఎందుకు కావడంలేదు… ప్రొఫెసర్‌లుగా ఎందుకు మారుతున్నారు.. ఇదీ అంతే, భారత్‌ను ఏలుతున్న సమయంలో ఫ్రెంచి, బ్రిటీష్‌ పాలకులు మనవేదాలను తీసుకెళ్లి అధ్యనం చేసి వాటిఆధారంగా ప్రయోగాలు చేసి విధ్యుత్‌,రేడియో,విమానం లాంటి అనేక వస్తువులను రూపొందించారనేది కాదనలేని యదార్థం. శాస్త్రవేత్తలు కాలేదని వారు చెప్పారు అల్జెబ్రా ట్రిగ్నోమెట్రీ లాంటివి చాలా కనుక్కున్నారు మేము లీలావతి భస్కర్‌ అని ఆల్జీబ్రాలో శ్లోకాలని చదివేము ఆ రోజుల్లో ఈ దేశం గురించి వాళ్లకి తెలియదు వాళ్ళగురించి మనకి తెలియదు వాళ్ళ మ్యాగజిన్‌ లో ప్రచురించకపోతే విజ్ణాన శాస్త్రమే లేదంటే ఏళ్ళ అగస్త్యుడి కా లంలోనే విమానం ఎలానడపాలి అన్నవిషయం ఉండేది నలందా విశ్వవిద్యాలయంలో కొన్ని వేల గ్రంధాలు కాల్చేసేరు మనం మనల్ని కించపరుచుకునే దుస్థితి దాపురించింది. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు ఎవర్రా…… కళ్లు దొబ్బాయా. ఆధ్యాత్మిక ప్రపంచం లో సైన్స్‌ అనేది ఒక చిన్న ముక్కమాత్రమే.అధ్యాత్మికవేత్త అనే సముద్రం ముందు సైంటిస్ట్‌ అనే పిల్ల కాలువ పరవళ్లు తొక్కుతూ సముద్రం లో కలవాల్సిందే.పాచీనకాలంలో భారత దేశమే విజ్ఞాన భాండాగారం,నీకు ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే కనిపెట్టినవి కావాలా,లేక భారతీయులు అయినా పర్వలేదా, ఎర్ర పకోడీ గాళ్లరా మీరు భారతీయులేన లేదా?? మీరు శాస్త్రజ్ఞులు కాదనుకొనేవారికి తెలిసిన శాస్త్రాలు మీరు శాస్త్రజ్ఞులనుకొనేవారిలో ఎంతమందికి ఎన్ని తెలుసు, అసలు శాస్త్రం అంటే ఏమిటి ? శాస్త్రవేత్త

వేత్త అనగా ఎవరు? ముందు దీనిని తెలుసుకొని ప్రశ్న వేయండి. మన పుష్పక విమానం ఫార్ములాతోనే రైట్‌ సోదరులు విమానం రూపకల్పనకు పూనుకొంది. స్ధూలంగా ఇదీ ధోరణి. వీటన్నింటినీ ఎప్పటి నుంచో మెదళ్లకు ఎక్కించుకొని ఒక పిచ్చిలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. అందువలన దాన్ని పోగొట్టాలంటే కొన్ని ఆసుపత్రులు చాలవు. పెద్దఎత్తున చర్చల కౌన్సిలింగ్‌ చేయకపోతే రాబోయే తరాలను కూడా చెడగొడతారు, మన దేశాన్ని మరింతగా వెనక్కు నెడతారు, నగుబాట్ల పాలు చేస్తారు.

తమకు నచ్చని, తెలియని అంశాన్ని ఎవరైనా చర్చకు పెడితే బూతులు తిట్టి నోరు మూయించేందుకు ప్రయత్నించటం ఒక చౌకబారు ఎత్తుగడ. తాలిబాన్లు వారికి ఆదర్శం. విమర్శకుల నోరు మూయించటానికి మేకిన్‌ ఇండియా చౌకబారు తయారీ. చిత్రం ఏమిటంటే ఆ బూతుల్లో కూడా వైవిధ్యం వుండదు. వారి భావ దారిద్య్రానికి నిదర్శనం ఇది. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించటానికి సిద్దపడిన వారికి బూతులు, అవమానాలు ఒక లెక్క కాదు. తిట్టినంత మాత్రాన విమర్శలు ఆగిపోయేట్లయితే ఈ పాటికి అది ఎప్పుడో జరిగి వుండేది. ఇంతకు మించి ఏమి తిడతారు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదేముంది అని అనేక మంది ఇప్పటికే రాటు తేలారు. ఇప్పటి వరకు తమను వ్యతిరేకించిన వారినే తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందువు కాదా, నువ్వు ముస్లిం కాదా, నువ్వు క్రైస్తవుడికాదా అని రెచ్చగొడుతున్నారు.బూతులు తిట్టకపోవటం సంస్కారం, తిట్టే వారిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో మాతో కలసి ఎందుకు తిట్టటం లేదని మౌనంగా వున్నవారి మీద కూడా తెగబడతారని గ్రహించటం మంచిది.

ఇక వేదాలలో అన్నీ వున్నాయష అంటూ ఇంకా టెక్నాలజీని బయటకు తీయని దేశ ద్రోహుల గురించి చూద్దాం. వేదాలను వెక్కిరించే వారిని వెధవలని ఒక పత్రిక సంపాదకుడిగా పనిచేసిన ఒక కాషాయ తాలిబాన్‌ నిందించాడు. విమర్శ రూపాలలో వెక్కిరింత ఒకటి. విమర్శకులను వెధవలు అనటం సరైనదే అయితే గుడ్డిగా సమర్ధించే వారు కూడా విమర్శకులకు బంధువులే.

వేదాలను వెక్కిరించే లేదా విమర్శించే వారు వుద్భవించటానికి కారకులు ఎవరు ? వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పిన వెధవలే. 1760లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పెద్ద మలుపు తిప్పింది. వివిధ దేశాలలోని వారు ఒకరిని చూసి మరొకరు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు పోటీ పడ్డారు. అందుకు విరుద్ధంగా మన దేశంలో మన కంటే గొప్ప మేధావులు ప్రపంచంలో లేరని, ఎవరైనా కొత్త వస్తువును కనుగొంటే అవన్నీ మన వేదాల్లో, పురాణాల్లో ఎప్పుడో వున్నాయని తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పారిశ్రామిక విప్లవాన్ని మరో మలుపు తిప్పిన పరిణామం 1900 శతాబ్ది ప్రారంభ దశకంలో రైట్‌ సోదరులు కనిపెట్టిన విమానం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినపుడే మన వేద పారంగతులు, విజ్ఞానవేత్తలు మేల్కొని వుంటే అరే మన పురాణాల్లో వున్న పుష్పక విమానాలను పునరుద్దరించేందుకు పూనుకొని వుండేవారు. నిజంగా ఆ పని చేసి వుంటే మనకు ఎన్ని ప్రయోజనాలు సమకూరి వుండేవో.

ప్రపంచంలో అసలు పెట్రోలుతో పనిలేని విమానాలను మనమే తయారు చేసి మేకిన్‌ ఇండియా అని గొప్పగా చెప్పుకొని మనువాదులు చెబుతున్నట్లు కాలర్‌ చొక్కాలు వేసుకోవటం భారతీయం కాదు గనుక పిలకలు ఎగరేసి వుండేవారం. మన పుష్పక విమాన , కీలు గుర్రాలు, ఎగిరే కార్పెట్ల టెక్నాలజీని బయట పెట్టి వుంటే కార్లు, స్కూటర్లు, లారీల వంటి వాటితో పని వుండేది కాదు, అన్నింటికీ మించి ముస్లిం దేశాల నుంచి చమురు కొనుక్కోనే ఖర్మ పట్టేది కాదు, ఇప్పుడు వారి దగ్గర చమురు కొని, దానికి చెల్లించాల్సిన డాలర్ల కోసం కిరస్తానీ దేశాలను దేబిరించే దుర్గతి పట్టించింది కచ్చితంగా మన వేద విజ్ఞానాన్ని బయటికి తీసేందుకు ముందుకు రాని వెధవలే అన్నది స్పష్టం.

వేదాలను ప్రామాణిక సూత్రాల ప్రకారం సక్రమంగా చదవకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని సెలవిచ్చారు. మన దేశంలో కొన్ని భాషాలలో కొన్ని పదాలు పలకవు. వుదాహరణకు బెంగాలీలకు వ, బ మాదిరి. ఇలా ప్రతి భాషకు వున్నాయి. దీని ప్రకారం వుచ్చారణ సరిగా లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా వుంటాయనుకోవాలి. మరి దీన్ని పరిష్కరించటం ఎలా అందువలన ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. డార్విన్‌, న్యూటన్‌ల సిద్ధాంతాలు, సూత్రాలు వద్దూ, వేదాలే ముద్దు అనే పాలకులే నేడు గద్దెల మీద వున్నారు. ఇప్పటికే మేకిన్‌ ఇండియా జయప్రదానికి ఆవుపేడ, మూత్రాలలో ఏముందో కనుగొనేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పరిశోధనలు చేయిస్తున్నారు. వేదాలలో వున్న టెక్నాలజీని అందరికీ అర్ధం అయ్యేలా ఘనాపాఠీలకే పేటెంట్‌ హక్కులిచ్చి చమురుతో పైలెట్లు, డ్రైవర్లతో పనిలేని విమానాలు, కార్లు,ఇతర వాహనాలను తయారు చేయించండి, విమర్శకుల లేదా వెక్కిరించే వారి నోరు మూయించండి. అదేమీ లేకుండా ఎవడో కిరస్తానీవాడు కనిపెట్టిన ఫేస్‌బుక్‌లో సొల్లు కబుర్లు చెబితే లేదా విమర్శి ంచేవారిని తిడితేనో ప్రయోజనం వుండదు. అంతులేని మన టెక్నాలజీని బయటకు తీసి దేశాన్ని ముందుకు నడిపించకపోతే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారని మనవి.

మన సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తమై వున్న అనేక సంస్కృత గ్రంధాలను ఇస్లామిక్‌, క్రైస్తవులు నాశనం చేశారని ఒక నోటితో చెబుతూ దానిలోని విజ్ఞానాన్ని దొంగిలించారని మరో నోటితో చెబుతారు. వినేవారు నోట్లో వేలేసుకొని చెవులప్పగిస్తున్నారు. దేన్నయినా ఎందుకు అని ప్రశ్నించిన సమాజమే ముందుకు పోతుంది. ఎందుకు అని నువ్వు పెద్ద ప్రశ్నిస్తున్నావు మన పూర్వీకుల కంటే నువ్వు గొప్పవాడివా మానాన్నకు మాతాత చెప్పారు, మానాన్న నాకు చెప్పారు, నేను నీకు చెబుతున్నాను , నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ తరతరాలుగా జిజ్ఞాసను అణచివేసిన ఆధిపత్య సమాజం మనది. అది వేదాలు, పురాణాలు, వుపనిషత్తులు, హిందూ ధర్మం ఏదైనా కావచ్చు. దేన్నీ ప్రశ్నించకుండా అణచివేశారు.

పురాతన కాలంలోనే అంటే క్రైస్తవం,ఇస్లామ్‌ మతాలు పుట్టక ముందే మన దేశంపై విదేశీయులు దండయాత్రలు చేశారు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌, క్రీపూ 200ల తరువాత శకులు, యవనులు, పహ్లవులు, క్రీస్తుశం 50లో కుషాణులు, క్రీశ 400లలో హూణులు దండయాత్రలు చేశారు. వారు మన వేద విజ్ఞానాన్ని నాశనం చేశారని ఎవరూ చెప్పలేదు. అలెగ్జాండర్‌ దాడి సమయంలోనే మన దేశానికి ప్రమాదం వుందని అర్ధమైంది. మరొకరు దాడికి పూనుకోకుండా ఎవరైనా ఏం చేయాలి, అందులోనూ దేశభక్తులు, అలెగ్జాండర్‌ నుంచి హూణుల వరకు మధ్యకాలం ఏడు వందల సంవత్సరాలలో ఏ ఒక్క సమయంలోనూ మన వేద విజ్ఞానులు విమానాలు లేదా అస్త్రాలను బయటకు తీసి సంధించి దురాక్రమణదారులను తరిమివేసి వుంటే తరువాత ముస్లింలు, క్రిస్టియన్లు దాడులు చేసి వుండేవారు కాదు. మహమ్మద్‌ ఘజనీ , ఘోరీలు అన్ని సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే మన అస్త్రాలను బయటకు తీయకుండా మన హిందూ ధర్మ పరిరక్షకులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతూ కూర్చున్నట్లు ?

మన నలంద విశ్వవిద్యాలయాన్ని ముస్లింలు తగుల బెట్టి మన విజ్ఞాన గ్రంధాలన్నింటినీ తగుల బెట్టారన్నది ఒక ప్రచారం. అనేక మంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం తగులబెట్టింది వాస్తవం. ఎవరు తగులబెట్టారు ? పాట్నా హిందుస్తాన్‌ టైమ్స్‌ 2014 సెప్టెంబరు ఒకటిన రాసిన దాని ప్రకారం క్రీస్తుశకం 455-467 మధ్య స్కంధగుప్తుని కాలంలో మిహిరకులుడనే హూణ రాజు నాయకత్వంలో విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు. తరువాత గౌడాస్‌ నాయకత్వంలో ఏడవ శతాబ్ది ప్రారంభంలో మరోసారి నాశనం చేశారు. దాన్ని తరువాత హర్షవర్ధనుడనే రాజు పునరుద్దరించాడు.1193లో భక్తియార్‌ ఖిల్జీ సేనలు మరోసారి నాశనం చేసిన తరువాత దాని పునరుద్దరణ జరగలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు నడిపే పయనీర్‌ పత్రిక 2014 సెప్టెంబరు 20న రాసినదానిలో 1193లో టర్కీ సైన్యం దాడి చేసి విశ్వవిద్యాలయాన్ని తగుల పెట్టినట్లు పేర్కొన్నారు.

కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఖిల్జీ దాడుల నాటికే నలంద విశ్వవిద్యాలయం శిధిలమైంది. బౌద్ధంలో హీనయాన, మహాయాన శాఖల మధ్య వైరమే దీనికి కారణం అన్నది వారి వాదన. ఖిల్జీ సేనలు దాడి చేసింది నలంద జిల్లాలోనే వేరొక చోట వున్న మహావీర ఓదాంతపురి (నేటి బీహార్‌ షరీఫ్‌) కోటపై అన్నది ఒక అభిప్రాయం, నాటి చారిత్రక రచనల్లో అసలు నలంద ప్రస్తావన లేదని చెబుతున్నారు. డిల్లీ నుంచి బెంగాల్‌ వెళ్లే ప్రధాన మార్గంలో నలంద లేదని కూడా వాదించేవారున్నారు. చరిత్రకారులు ఎవరి భాష్యం వారు చెబుతున్నపుడు వాటి అధ్యయనానికి పరిమితం కావాలే తప్ప నిర్ధారణలకు రాకూడదు. ఇక్కడ సమస్య నలంద అనేది బౌద్ధ క్షేత్రం, బౌద్ధ విశ్వవిద్యాలయం అనేది నిర్వివాదం. బౌద్దులు వేద ప్రామాణ్యాన్ని నిరాకరించారు. అందువలన అక్కడున్నది వారి సాహిత్యం తప్ప వేద సంబంధిత సాహిత్యం ఎంత మాత్రమూ కాదు. ఒక వేళ వేద సాహిత్యమే నాశనం అయింది అనుకుంటే తరువాత ఎన్నో వందల సంవత్సరాల తరువాత వచ్చిన యూరోపియన్లు దొంగిలించటానికి అక్కడ ఏముంటుంది? వేదాలు, ఎంతో సాంకేతిక నైపుణ్యం వున్న సాహిత్యం సంస్కృతంలో వుందని చెబుతున్నవారు నలంద వంటి బౌద్ద విశ్వవిద్యాలయం మాదరి దేశంలో ఎక్కడా వేద విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదు అన్నది ప్రశ్న.

వేదాలను బ్రహ్మ సృష్టించాడని చెబుతారు, అలాంటి వాటిని మానవ మాత్రులు నాశనం చేయటం ఏమిటి? శృతి, అనుశృతుల ద్వారా వేదాలు, వుపనిషత్తులు, పురాణాలను పరంపరగా తరువాతి తరాలకు అందించారు, అందువలన వాటిని భౌతికంగా నాశనం చేశారని చెప్పటం చెవుల్లో పూలు పెట్టటమే. చతుర్వేదాలు, పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం తప్ప నాశనం చేశారని, లేదా దొంగిలించారని చెబుతున్న వేదాల గురించి ఇంతవరకు ఎవరూ ఎందుకు చెప్పటం లేదు. పోనీ కాన్నింటినీ నాశనం చేశారని అనుకుందాం, అవన్నీ పోయిన తరువాత కూడా మన వారు వేదాల్లో అన్నీ వున్నాయష అన్నారు తప్ప కొన్నే వున్నాయష అన లేదు. అందువలన కొన్ని నాశనం చేశారని చెప్పటం ఇటీవలి కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ముస్లిం పాలకులు మన దేశం మీద దండ యాత్రలు చేసినపుడు మన విజ్ఞానాన్నినాశనం చేశారని ఒక కధ, ఎవరైనా విజ్ఞానాన్ని గ్రహించి తాము వుపయోగించుకుంటారు. నిజంగానే వారు మన టెక్నాలజీని చోరీ చేసి వుంటే ముస్లిం దేశాలు నేడు సాంకేతిక పరంగా ఎంతో ముందుండాలి, దానికి బదులు పశ్చిమ దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు ? బ్రిటీష్‌, ఫ్రెంచి వారు అపహరించారంటారు. వారు మన దేశానికి రాకపూర్వమే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది కదా, దాంతో పెరిగిన వుత్పత్తి అయిన వస్తువులను అమ్ముకొనేందుకే కదా మన దేశం వచ్చింది. మరి వారికి ఆ టెక్నాలజీ ఎలా వచ్చినట్లు ? సున్నా కనిపెట్టింది భారతీయులంటారు, ఎవరు నిర్ధారించారు? మూడువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో దాని ప్రస్తావన వున్నట్లు, నేటి సున్నాకు రూపమిచ్చింది చైనీయులని చరిత్ర వుంది. మనది కూడా పురాతన సమాజాలలో ఒకటి కనుక సున్నా గురించి పురాతన ప్రస్తావనలు మనకూ వున్నాయి. వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పిన తరువాత ప్రతి దానిని మన ఖాతాలో వేసుకుంటే ప్రపంచం నవ్విపోతుంది. అంతెందుకు విదేశీ విడి భాగాలు లేకుండా మనం ఫోన్‌, కారు, టీవీ వంటి వాటిల్లో ఒక్కదానినైనా స్వంతంగా తయారు చేస్తున్నామా ? మనకు వున్న కీలకపేటెంట్లు ఎన్ని? చివరికి పెద్ద విగ్రహం తయారు చేసుకొనేందుకు కూడా చైనా వద్దకు పరుగెడుతున్నామే ఎంత సిగ్గు చేటు ?

క్రీస్తుకు పూర్వమే వున్న చరకుడు, ఆర్యభట్టు, శుశ్రుతుడు అంటూ ఒక జాబితాను వల్లె వేస్తున్నారు. వారితో ఎవరికి పేచీ వుంది ? వారి పరిజ్ఞానం ఎంత అన్న మీమాంస ఎప్పుడూ వుంటుంది. అతిశయోక్తులు జోడిస్తేనే వెక్కిరింతలు వస్తాయి. వినాయకుడికి ఏనుగు తలను అతికించిన గొప్ప శస్త్ర నిపుణులున్నారని చెబుతారా ? మనిషికి మనిషి తలదొరక్కపోతే దానికి సమబరువుతో వుంటే మరో కుక్కో, నక్క తలో అంటించాలిగాని మోయలేని ఏనుగు తలను అంటించే మొరటు వారా నాటి వైద్యులు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుందని ఒక ముఖ్యమంత్రి ప్రవచిస్తాడా ? అదే నిజమైతే ముస్లింలు, అంతకు ముందు ఇతరుల దండయాత్రల గురించి ఎందుకు హెచ్చరించలేదు, తలలో మెదడు వుండి చెబుతున్న మాటలేనా ? పురాతన సమాజాలలో ఒకటైన మన దేశంలో కొన్ని రంగాలలో పని చేసిన ప్రముఖులను గుర్తించటానికి, వారి ఘనతను పొగటానికి ఎవరికీ ఇబ్బంది లేదు. వారందరూ వేదాలనుంచే ప్రావీణ్యం పొందారని చెబుతుంటేనే సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. వారికీ వేదాలకు సంబంధం వుండి వుండదు. ఒక వేళ వుంటే అదే వేదాల నుంచి తరువాతి తరాలు మరింత నైపుణ్యంతో వైద్యం, ఇతర శాస్త్రాలను ఎందుకు మెరుగుపరచలేకపోయారు? వేదాలతో సంబంధం లేకపోయినా వారి అనుచరులు తరువాత ఎందుకు నిపుణులుగా రాణించలేకపోయారు అన్నది పరిశోధించాల్సిన అంశం. వేదాలలో ఏముంది, అది పనికి వచ్చేదా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక సాహిత్యంగా చూసినపుడు వాటిని కంఠోపాఠం చేసి తరతరాలకు అందించినందుకు ఘనపాఠీలను అభినందించాల్సిందే. అదే సమయంలో వారి చాదస్తాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అణకువ, ఆసక్తి, తపన వున్న సమాజమే ఎప్పుడైనా ముందుకు పోతుంది. అహంకారం, గర్వం వుంటే ఎక్కడో అక్కడ బొక్కబోర్లా పడి ముక్కు బద్దలు చేసుకుంటాం. సాయంత్రం కాగానే సత్రాలకు చేరుకొని గంజాయి దమ్ముకొట్టి మనం తెల్లవారిన తరువాత అది చేయాలి, ఇది చేయాలి అని ప్రగల్భాలు పలికి తెల్లవారి మత్తుదిగగానే ఎవరి కర్రాబుర్రా పట్టుకుని అడుక్కొనేందుకు పోయే సోమరిపోతుల మాదిరి కబుర్లు కాదు కావాల్సింది. వేదాల్లోనే అన్నీ వున్నాయని చెబుతున్న వారు విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నట్లు ? తమ బిడ్డలకు శ్లోకాలు నేర్పించటం ఒక దేశభక్తిగా అనేక మంది ప్రదర్శించుకుంటున్నారు. డాలర్ల కక్కుర్తి తప్ప దేశభక్తి ఏమైనా వుందా ?

ఇక గురుకులాల వ్యవస్ధను పునరుద్ధరించాలని మోహన్‌ భగవత్‌ చెబుతున్నారు. మదర్సాలనుంచి తాలిబాన్లు వస్తున్నారని నిత్యం ప్రచార దాడులు చేస్తున్న వారే వాటికి పోటీగా గురుకులాలను ఏర్పరచాలని అంటున్నారు. అంటే మైనారిటీ తాలిబాన్లతో పాటు మెజారిటీ తాలిబాన్లను తయారు చేసి సమాజాన్ని మధ్యయుగాల నాటికి తీసుకు పోయి రక్తపుటేరులు పారిద్దామనా ? ఏమిటీ వున్మాదం ? దీన్ని నాగరిక సమాజం సహించాలా ? ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధిస్తున్న వారిలో తమ బిడ్డలను గురుకులాల్లో చేర్పించటానికి ఎందరు ముందుకు రాగలరో చెప్పగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోటి తుత్తర నేతలు -బిజెపి ద్వంద్వ ప్రమాణాలు !

25 Wednesday Apr 2018

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP double standards, BJP motor mouths, motormouths, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

నోటి తుత్తరతో సమస్యలు తీసుకురావద్దని ప్రధాని నరేంద్రమోడీ తన పార్టీ అనుచరగణానికి చెప్పాల్సి రావటం ఆ పార్టీ ఎలాంటి సంకట స్ధితిని ఎదుర్కొంటోందో తెలియచేస్తోంది. జర్నలిస్టుల ప్రత్యక్షంగా మాట్లాడకుండా మౌన దీక్షపూని ఒక ప్రపంచ రికార్డు ఇప్పటికే సృష్టించిన మోడీ త్వరలో ఐదో సంవత్సరంలో ప్రవేశించబోయే వుత్సవంతో కలిపి దాన్ని కూడా ఒక విజయంగా జరుపుకుంటారు. ఒకవైపు నేత నిక్కచ్చిగా వుంటే మరోవైపు అందుకు విరుద్ధంగా పండ్లుతోముకోవటమైనా మానతారేమోగాని బిజెపి నాయకులు మీడియా ముందు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడపలేని స్ధితికి వచ్చారు. అయితే మోడీ ఇప్పుడెందుకు హెచ్చరించారనేదే అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం. ఊరందరిదీ ఒక దారయితే వులిపికట్టెది మరొక దారి అన్నట్లుగా కథువా(అసిఫా) అత్యాచార వుదంతంపై దేశ మంతటా ఆగ్రహం, విచారంతో నిరసన వ్యక్తం చేస్తుంటే, పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులకు వురి శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చారిత్రాత్మకమైనది కనుక పండుగ చేసుకోవాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.

వైపరీత్యం ఏమంటే ఎనిమిదేండ్ల అసిఫాపై అత్యాచారం జరిపి హత్య చేశారని కొందరిపై అభియోగం మోపారు. నిందితులు నిర్దోషులని, హిందువులను గబ్బు పట్టించటానికి ఇదంతా చేస్తున్నారంటూ వీధులకు ఎక్కి ప్రదర్శనలు చేసిందీ, కేసు నమోదుచేయకుండా పోలీసులను అడ్డుకున్న బిజెపి అనుకూల లాయర్ల, నేతలు,కార్యకర్తల తీరు తెన్నులు చూసి దేశం ఇంకా దిగ్బ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.Û గతంలో గోరక్షకుల మంటూ ఆవులను రక్షించటానికి ముందుకు వచ్చిన వారే ముక్కుపచ్చలారని పసి పిల్లపై అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా రేపిస్టు రక్షకులుగా ముందుకు వస్తారని ఎవరూ వూహించి వుండరు. దాన్నుంచి దృష్టిమళ్లించటానికి తెచ్చిన ఆర్డినెన్స్‌పై పండుగ చేసుకోవాలని పిలుపివ్వటం గుండెలు తీసిన బంట్లకు తప్ప అన్యులకు అసాధ్యం. బిజెపి అభిమానులు దీన్ని ఎలా జీర్ణించుకుంటున్నారో అనూహ్యం. తమదాకా వచ్చినపుడు గాని వారికి తెలియదని సరి పెట్టుకోవటం తప్ప ఇంకేం చేయగలం. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలపై వేగంగా నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్‌ దీనిపై ఎందుకు తాత్సారం చేసిందని, అదీ ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సినంత అగత్యం ఏమిటని అడగటం పాచిపోయిన పాత పాట ‘దేశద్రోహం’ అవుతుందేమో !

పన్నెండు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారం జరిగితే మరణశిక్ష, 12ా16 సంవత్సరాల మధ్యవారిపై జరిగినపుడు పది నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచాలని మోడీ సర్కార్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను నేటికి నెరవేర్చారని, ఈ రోజు చారిత్రాత్మకం అన్నారు. మహిళాసాధికారత పెంపుదలకు, గొడ్డుచాకిరీని తగ్గించేందుకు మోడీ సర్కార్‌ తీసుకున్న సానుకూల చర్యల గురించి చర్చించాల్సిన దినమిదన్నారు. అంతటితో వూరుకుంటే కిక్కేముంది. సమాజంలో వున్న కొంతమంది వున్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు తీసుకున్న చర్యలతో ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు.అసిఫా వుదంతంపై దేశమంతటా, విచార,మౌన, నిందుతులను వెనుకేసుకు వచ్చిన బిజెపి నేతలపై ఆగ్రహ ప్రదర్శనలు చేస్తుంటే ఈమె గారికి పండుగ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది.

గత చరిత్రను చూసినపుడు బిజెపిలో నోటి దురుసుతనం లేదా తుత్తర ఎంత ఎక్కువగా వుంటే అంత త్వరగా వారు అధికార ప్రతినిధులుగా, పదవులు పొందుతారని వెల్లడైంది. దానికి కారణం మత, సామాజికరీత్యా విద్వేషభావాలను, ప్రచారాలను రెచ్చగొట్టటం, వదరుబోతుతనం తమకు ప్రయోజనకరమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావించటమే. అదుపు తప్పిన నోళ్లు ఎప్పుడు ఏంమాట్లాడతాయో తెలియదు. అది రాజకీయంగా నష్టం కలిగించటం, తమ తెలివితక్కువ తనంతో ఓహో ఈ పార్టీ ఇలాంటివారితోనే నిండి వుందనే సందేశం ఇటీవలి కాలంలో అనేక మందికి అవగతం అవుతుండటంతో నోళ్లను అదుపులో పెట్టుకోవాలని మోడీ చెప్పాల్సి వచ్చింది.

‘ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు’ అంటూ కేంద్ర కార్మిక, వుపాధిశాఖల మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు బిజెపి కార్యకర్తలకు మంచి వుత్సాహాన్నిచ్చి సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా స్పందించిన వారి మీద విరుచుకుపడేట్లు చేస్తాయి. అసలు విషయాన్ని జయప్రదంగా పక్కదారి పట్టిస్తాయి.’ ప్రతి సమస్య మీద విశ్లేషణ చేసే ఒక సామాజిక శాస్త్రవేత్తగానో లేక పండితులుగానో భావించుకొని టీవీ కనపడిన ప్రతిసారీ ఒక ప్రకటన చేసేందుకు తొందరపడవద్దు ‘ అని నమో ఆప్‌ ద్వారా నరేంద్రమోడీ తన సహచరులను మందలించారు. గత నాలుగు సంవత్సరాలలో అనేక మంది బిజెపి నేతలు మసాలా వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక బిజెపి నేత ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌ను ప్రారంభించి మీడియాలో గబ్బుపట్టగానే నాకు అది క్లబ్బు అని చెప్పకుండా మోసం చేశారంటూ చేతులు దులుపుకున్న సాధువైన పార్టీ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ ‘ ఒక వేళ రాజీవ్‌ గాంధీ ఒక నైజీరియన్‌ మహిళను పెళ్లి చేసుకొని వుంటే, ఆమెకు తెల్లతోలు లేకపోయి వుంటే కాంగ్రెస్‌ ఆమె నాయకత్వాన్ని ఆమోదించి వుండేదా ?’ అని వ్యాఖ్యానించారు. తరుణ్‌ విజయ్‌ అనే మరో ఎంపీ ‘ మేము జాత్యహంకారులమే అయితే మొత్తం దక్షిణ భారత్‌లో మేము ఎందుకు వుండేవాళ్లం. తమిళనాడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్‌ మరియు కేరళ మీకు తెలుసు, వారితో మేము జీవిస్తున్నాం, మా చుట్టూరా నల్ల వారున్నారు’ అని సెలవిచ్చిన విషయం తెలిసిందే. ‘డార్విన్‌ సిద్ధాంతం తప్పు ఎందుకంటే కోతులు మనుషులుగా మారటాన్ని ఎవరూ చూడలేదు’ అన్న సత్యపాల్‌ సింగ్‌, ‘మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధరంగంలో ఏం జరుగుతున్నదీ చెప్పగలిగాడంటే ఆ రోజు ఇంటర్నెట్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం వుండబట్టే ‘ అన్న త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ చెప్పిన మాటలతో బిజెపి నవ్వులపాలైంది. అయితే కొద్ధి సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలను స్వయంగా నరేంద్రమోడీయే చెప్పినపుడు మీడియా వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. వాటిని సమర్ధించేందుకు అనేక మంది సమర్ధకులు బయటకు వచ్చారు. ఇప్పుడా సీన్‌ లేదు. అధికారానికి వచ్చిన ఆరునెలలకు 2014 అక్టోబరులో వైద్యులు,శాస్త్రవేత్తలు పాల్గన్న ఒక సమావేశంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ మహాభారత సమయంలోనే జెనెటిక్స్‌ శాస్త్రంలో భారత్‌ ప్రావీణ్యం సంపాదించిందని, వినాయకుడికి ఏనుగుతలను అంటించటం ఆ సమయంలో మనకు ప్లాస్టిక్‌ సర్జన్స్‌ వున్నారనేందుకు ప్రత్యక్ష రుజువు అని సెలవిచ్చారు. అంతటి పెద్దమనిషే అలా అన్నతరువాత అనేక మంది తరువాత ఎన్నో అశాస్త్రీయ, కేవలం నవ్వులాటకు పనికి వచ్చే, మన దేశ పరువు తీసే అంశాలను ముందుకు తెచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వీటిని ప్రవచించిన పెద్దలందరూ నిజంగా వాటిని గట్టిగా విశ్వసించబట్టే చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలోని తిరోగమన వాదులు బిజెపి పుట్టకముందే వేదాల్లోనే అన్నీ వున్నాయష అంటూ చేసిన ప్రచారాన్ని చిన్న తనం నుంచి తలకెక్కించుకున్నవారెందరో వున్నారు. వారిలో కాషాయ కుటుంబానికి చెందిన వారు అగ్రస్ధానంలో వుంటారు.

విద్వేష పూరిత ప్రసంగాలు చేసే నోళ్లు కూడా చిన్నవేమీ కాదు, తక్కువేమీ లేవు. వారు ఒక హిందువును చంపితే మేము వంద మంది ముస్లింలను చంపుతామన్న యోగి ఆదిత్యనాధ్‌, ఇంట్లో ఆవు మాంసం వుందంటూ దాద్రిలో దాడి చేసి ఇంటి యజమాని మహమ్మద్‌ అఖ్లాక్‌ను హత్యచేసిన తరువాత నిందితులను బదులు మాంసం కలిగి వున్నందుకు ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలన్న ఎంఎంల్‌ఏ సంగీత్‌ సోమ్‌, మన దేశాన్ని హిందుస్తాన్‌ అని పిలుస్తారు, అంటేదాని అర్ధం ఇది హిందువులది, గతంలో ఒక పద్దతి వుండేది ఎంత పెద్ద గడ్డం వుంటే అంత ఎక్కువ లబ్ది కలిగించేవారు అన్న ఎంఎల్‌ఏ విక్రమ్‌ సైనీ వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ విషయంలో నరేంద్రమోడీ ఏమీ తక్కువ తినలేదు. ముఖ్యమంత్రిగా వున్నపుడే ముస్లిం కాందిశీక శిబిరాలన్నీ పిల్లలను పుట్టించే ఫాక్టరీలని, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖబరస్తాన్‌(ముస్లింల శ్మశానవాటిక) ఏర్పాటు చేసినపుడల్లా ఒక శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందే అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిజెపి మిత్ర పక్షం శివసేన నాయకులూ ఈ విషయంలో బిజెపితో పోటీపడతారు. అలాంటి పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం బిజెపి ప్రజాప్రతినిధుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు బాధ్యత ప్రధానిదే అని దాడి చేసింది. ఈ బిజెపి రాజ్యంలో ప్రధాని మోడీని చూసి వుత్తేజం పొందే పార్టీ మంత్రుల నోటికి అదుపుండదు అని పేర్కొన్నది.

పోనీ ఇలా నోరు అదుపులేని నేతల పట్ల బిజెపి గతంలో ఎలా వ్యవహరించింది? 2008లో ముంబై వుగ్ర దాడుల సందర్భంగా నాటి హోం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ నోరు జారారు. పెద్ద పట్టణాలలో ఇలాంటి చిన్నచిన్న అంశాలు జరుగుతుంటాయి అన్నందుకు గాను నానా యాగీ చేసిన బిజెపి ఆయన రాజీనామా చేసే వరకు వూరుకోలేదు. మరి ఇప్పుడు దేశమంతటినీ కుదిపివేసి వున్నావ్‌ అత్యాచార వుదంతంపై ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు అన్న కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ను కనీసం అదే బిజెపి మందలించను కూడా లేదు, ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే.

ఒక అత్యాచారం జరగ్గానే చేసిన వాడిని వురి తీయాలి, వాడి అంగాన్ని నరికివేయాలంటూ ఆగ్రహం తీవ్ర స్ధాయిలో వ్యక్తం చేయటం సహజం. హత్య నేరమే కొన్ని కేసులలో యావజ్జీవ శిక్ష పడుతుంది, కొన్నింటిలో వురి శిక్ష కూడా వేశారు. ఎందుకీ తేడా ? ఏదైనా హత్య హత్యేకదా ? వుద్రేకంలోనో, అసంకల్పిత ప్రతీకార చర్యలోనో మరొక కారణంతో జరిగితే అది సాధారణ హత్య. అలాగాక కుట్ర చేసి లేదా హత్యలు చేయటమే పనిగా పెట్టుకొని లేదా, వున్మాదంతో చేసేవి దారుణ హత్యలు. అందుకే శిక్షల్లో తేడా. వురి శిక్ష వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే అనేక దేశాలు, మన దేశ అనుభవం చూసినా అలాంటి వాటి వలన ఫలితమేమీ కనపడటం లేదు. అందువలన సిపిఎం వంటి పార్టీలు, కొన్ని సంస్ధలు వురి శిక్షలు వద్దు ఇతర శిక్షలు వద్దని చెబుతున్నాయి. వద్దన్నవారిని దుండగులను ప్రోత్సహించేవారుగానూ, కావాలన్నవారిని నిరుత్సాహపరిచేవారుగానూ అనేక మందికి కనిపిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలోనూ, ఇతరత్రా చూసినపుడు అవాంఛనీయ శక్తులు ఇతర పార్టీలలనే ఎక్కువగా వున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

సరే బిజెపి వారు అనేక చారిత్రకాంశాలకు ఆద్యులమని చెప్పుకుంటున్నారు గనుక వారు చెప్పుకున్నట్లు పన్నెండు సంవత్సరాల లోపు వయస్సు వున్న బాలికలపై అత్యాచారం చేసిన వారికి వురి శిక్ష విధిస్తూ , అంతకంటే కాస్త పెద్దవారిపై అత్యాచారం జరిగితే శిక్షను పది నుంచి 20కి పెంచుతూ శిక్షాస్మృతిని సవరిస్తూ తొలిసారిగా ఆర్డినెన్స్‌ తెచ్చిన ఆ ఖ్యాతిని కూడా వారి ఖాతాలోకే వేద్దాం. దాంతో పాటే మరొకదానిని కూడా వేయాలి. ఒక పన్నెండేళ్లలోపు బాలికపై అత్యాచార కేసులో నిందితులు నిర్దోషులంటూ హిందూ ఏకతా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శనలో బిజెపి మంత్రులు పాల్గనటం కూడా ఇదే ప్రధమం కనుక దీన్ని కూడా ఆ ఖాతాకే జమచేయటం న్యాయం.ఇక బేటీ బచావో నినాదం ఇచ్చిన ఖ్యాతి కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి. దేశంలో అత్యాచారాలు ఈనాటివి కాదు. కొత్తగా బిజెపిలో ప్రారంభంగాని మాట నిజం.2016 లెక్కల ప్రకారం మొత్తం రేప్‌ కేసులు 39068,రోజుకు 107, గంటకు 4.46, ప్రతి 14ని నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది.

ఇక వివరాల్లోకి వస్తే ఆరేండ్ల లోపు అభాగినులు 520,6ా12 ఏండ్ల మధ్య వారు 1596,12ా18 ఏండ్ల మధ్య వయస్కులు 8656, మిగిలిన 22205 మందిలో 57 మంది అరవై సంవత్సరాల పైబడిన వారు కూడా వున్నారు. పన్నెండు సంవత్సరాల లోపు వారు 1114 మంది వున్నారు.2016లెక్కల ప్రకారం నాలుగో వంతు మైనర్‌ బాలికలపై జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నాడు ఇంత మందిపై జరిగాయి, తరువాత సంవత్సరం కూడా ఎంతమంది బలయ్యారో లెక్కలు వారికి అందుబాటులో వుంటాయి కనుక కేంద్రంలోని పెద్దలకు తెలియకపోదు. అలాంటపుడు ఆర్డినెన్స్‌లోని శిక్ష మంచిదో చెడ్డతో అన్న మీమాంసను పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తేలేదు, ఇన్నాళ్ల తరువాత తెచ్చిందానిని చారిత్రకం అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నారు. దీన్ని కూడా ఓట్లకోసం వాడుకుంటారా? 2013 ఆగస్టు ఒకటిన ఆశారామ్‌ బాపు అనే ఒక బాబా దయ్యం వదలగొట్టే నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాబా నిర్దోషి అంటూ సమర్ధించిన వారిలో బిజెపి నేతలున్నారు. ఇప్పుడు ఆ కేసులో తీర్పు వెలువడనుండగా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే భయంతో పోలీసులను మోహరించాల్సిస దుస్ధితి వచ్చిందంటే బాబా భక్తులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్లు ? ఆ కేసులో బాబాపై పోస్కో చట్టంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలపై అత్యాచార నిరోధ చట్టం కింద కూడా అభియోగాలను మోపారు.కోర్టు బాబాను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షవిధించింది. అదే కేసులో మరో నలుగురికి జోధ్‌పూర్‌ కోర్టు శిక్షలు వేసింది. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల క్రితం ముంబయ్‌లో శక్తి మిల్స్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్టు కేసును పరిశీలించటం సముచితం. ఇది శ క్తి మిల్స్‌ కేసుగా కూడా పిలుస్తారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో 2014 మార్చి 20న ఇచ్చిన తీర్పులో ఐదుగురు నేరగాండ్లలో ముగ్గురికి మరణశిక్ష, ఒకడికి జీవిత ఖైదు విధించింది. అప్రూవర్‌గా మారినవాడిని వదిలేసింది. అదే మిల్స్‌ ఆవరణలో జరిగిన మరొక అత్యాచార వుదంతంలో ఒక మైనర్‌ బాలుడు నిందితుడు. వాడికి మూడు సంవత్సరాల శిక్ష విధించారు. చట్ట ప్రకారం అంతకంటే ఎక్కువ లేదు.

వదిలేద్దాం, ఓట్ల కోసం దేన్నయినా వాడుకోగల దిట్టగా బిజెపి ఆరితేరిందని దాని ఘనతను కీర్తిద్దాం. ఇప్పటికే వున్న చట్టాల ప్రకారం దారుణమైన నేరాలకు వురి శిక్ష విధించటానికి అవకాశం వుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క బాలిక వుదంతంలో కూడా కోర్టులు ఎందుకు వురి శిక్ష విధంచలేదు. న్యాయమూర్తులలో స్పందన లోపించిందా? అసాధారణ రేప్‌ కేసులలో వురి శిక్ష విధించాలని, అయితే తమ పార్టీ సూత్రప్రాయంగా వురిశిక్షకు వ్యతిరేకమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అభిప్రాయం చెప్పారు. అది నచ్చని వారు తప్పు పట్టవచ్చు, కానీ కొందరు రేపిస్టులను సిపిఎం సమర్ధిస్తోందంటూ దాడులకు దిగారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? కాశ్మీర్‌లోని కథువా ఎనిమిదేండ్ల బాలిక అసిఫా వుదంతంలో నిందులపై కేసు పెట్టకుండా అడ్డుకోచూసింది బిజెపి మద్దతుదారులైన లాయర్లు, నిందితులకు మద్దతుగా హిందూ ఏకతా మంచ్‌పేరుతో మతోన్మాదులు జరిపిన ర్యాలీలో పాల్గన్నది బిజెపి మంత్రులు, దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో వారిని వుద్యోగాల నుంచి వూడగొట్టింది బిజెపి. గోరక్షక్‌ నుంచి రేపి స్ట్‌ రక్షక్‌ మారిందనే పేరు వచ్చింది. ఇంత పరువు పోయాక ఆ నష్ట నివారణ చర్యలో భాగం తప్ప ఆర్డినెన్స్‌లో నిజాయితీ ఎక్కడుంది? ఆర్డినెన్స్‌ తెచ్చినందుకు అభినందించుకోండి, వూరూరా తిప్పి సన్మానాలు చేయించి నీరాజనాలు పట్టండి, సమర్ధించని వారిని విమర్శించాల్సినంత సీన్‌ బిజెపి వారికి లేదు. చిత్రం ఏమిటంటే అసిఫా అత్యాచారాన్ని ఇంతవరకు ఖండించేందుకు నోరు రాని బిజెపి వారందరూ ఒక్కసారిగా ఇప్పుడు ఆర్డినెన్స్‌పై ఎక్కడలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ పేరుతో ఒక చట్టాన్ని చేశారు. ఇప్పుడు పేరు ఎలాగూ బయటకు వచ్చింది కనుక తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేటపుడు బిజెపి వారికి ఏమాత్రం నిజాయితీ వున్నా ఆసిఫా చట్టం అని పేరుపెడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల పధకంలో భాగమే ముస్లిం వుగ్రవాదుల తయారీ !

03 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

Cold War, Saudi crown prince, Spread of Wahhabism

ఎం కోటేశ్వరరావు

తమ విలువైన సంపదలు పశ్చిమ దేశాల కార్పొరేట్‌ సంస్ధల పాలవుతున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ముస్లిం దేశాల పౌరులున్నారు. మరోవైపు అదే సంస్ధల ఆధీనంలో వున్న మీడియా పని గట్టుకొని చేస్తున్న ప్రచారం, జరుగుతున్న కొన్ని వుదంతాల వలన మానసికంగా గాయపడిన, అవమానభారాలకు, గందరగోళానికి, ఆత్మన్యూనతకు గురి అవుతున్నారు. అలాంటి వారు వూరట పొందేందుకు, వాస్తవాలను అర్ధం చేసుకొనేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పిన అంశాలు నిస్సందేహంగా తోడ్పడతాయి. అత్యధిక ముస్లిం దేశాలలో పశ్చిమ దేశాలు, వారి ప్రయోజనాలతో ముడిపడి వున్న శక్తులతో సంబంధాలున్న నిరంకుశశక్తులు అధికారంలో వున్నాయి. వారు మిలిటరీ లేదా అవినీతి అక్రమాలకు నిలయంగా వున్నారు. అందువలన తమకు అవసరమైనది తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ ఆయా దేశాల జనానికి తెలియకుండా నియంత్రిస్తున్నారు. వారికి అందుబాటులో వున్నదంతా పశ్చిమ దేశాల కృత్రిమ తయారీ సమాచారమే. ఒక అంచనా ప్రకారం గత అర్ధశాతాబ్దంలో దాదాపు కోటి మంది సామాన్య ముస్లింలు పశ్చిమ దేశాల కుట్రలకు బలై ప్రాణాలర్పించారని అంచనా. ఇందుకు కారకులైన దుర్మార్గాలను మరుగుపరచి ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోయినా వుగ్రవాదులందరూ ముస్లింలే అనే పేరుతో అందరినీ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు, వాటితో చేతులు కలిపిన తమ దేశాల పాలకవర్గాల పుణ్యమే అని గ్రహించలేని వారెందరో. అలాంటి వారిలో కొందరికైనా సౌదీ పాలకుడు అధికారికంగా అంగీకరించిన అంశం వుపకరిస్తుంది.

ఇస్లామిక్‌ దేశాలలో మతోన్మాదశక్తులు పెరగటానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదశక్తులే కారణం అన్నది ఎప్పటి నుంచో తెలిసిన బహిరంగ రహస్యం. 1960వ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, సోవియట్‌ సేనలపై దాడులకు ముజాహిదీన్‌ లేదా తాలిబాన్ల పేరుతో వున్న మతశక్తులకు ఆయుధాలిచ్చాయి. ఇప్పుడు సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వాటిని వుపయోగిస్తున్నారు. ముస్లిం దేశాలు సోవియట్‌ ప్రభావంలో పడకుండా వుండేందుకు గాను పశ్చిమ దేశాల సలహా మేరకు వహాబియిజాన్ని వ్యాప్తి చేసేందుకు తాము పెద్ద మొత్తంలో నిధులు అంద చేస్తున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వెల్లడించారు. గతనెల మూడవ వారంలో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక జర్నలిస్టుల ఇష్టాగోష్టి సమావేశంలో పాల్గని అనేక విషయాలు చెప్పారు. ప్రచ్చన్న యుద్ద(కమ్యూనిజంపై సామ్రాజ్యవాదుల దాడికి పెట్టిన పేరు) సమయంలో సోవియట్‌ ప్రభావం (అంటే కమ్యూనిస్టు వుద్యమ) పెరగకుండా చూసేందుకు పశ్చిమ దేశాల సలహా సౌదీ అరేబియా వ్యవహరించిన తీరును వివరించారు. ఇష్టాగోష్టిగా చెప్పినప్పటికీ తరువాత కొన్ని విషయాలను ప్రచురించి, ప్రసారం చేయటానికి సౌదీ రాయబారకార్యాలయం వాషింగ్టన్‌ పోస్టు పత్రికకు అనుమతిచ్చింది.ఆ విధంగా పై వివరాలు బయటకు వచ్చాయి.

ఇస్లామిక్‌ దేశాలలో సోవియట్‌ ప్రభావం విస్తరించకుండా చూసేందుకు ఆ దేశాలలో సున్నీ తెగ ముస్లింల మసీదుల నిర్మాణం, మదార్సాల ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రచ్చన్న యుద్ధ కాలంలో తమ దేశాన్ని పశ్చిమ దేశాలు కోరాయని, మధ్యలో కొన్ని సౌదీ ప్రభుత్వాలకు వాటితో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరించుకున్నామని, వాటికి నిధులు ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రధానంగా సౌదీలోని ధార్మిక సంస్ధల ద్వారా అంద చేస్తున్నట్లు యువరాజు వెల్లడించారు. తరువాత కొద్ది రోజుల తరువాత అట్లాంటిక్స్‌ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతూ వహాబియిస్టులకు నిధులు ఇస్తున్న మాట వాస్తవమేనని అయితే వహాబియిజం అంటే నిర్వచనం ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఇస్లామ్‌ను సంస్కరించే పేరుతో 1703-1791 మధ్య సౌదీ ప్రాంతంలో నివశించిన మహమ్మద్‌బిన్‌ అబ్దల్‌ వహాబ్‌ అనే ఇస్లామిక్‌ పండితుడు సున్నీ ముస్లింలు కఠోరనైతికతా వాదంతో ఎలా వుండాలో ప్రవచించిన దానినే వహాబియిజమ్‌ అని వ్యవహరిస్తున్నారు. దానికి పలు వ్యాఖ్యానాలున్నాయి. అయితే ఇప్పుడు తాలిబాన్లు, ఆల్‌ఖైదా, ఐఎస్‌, బోకో హారం పేరుతో వ్యవహరిస్తున్న మత వుగ్రవాద సంస్ధలన్నీ తాము వహాబియిజాన్నే అనుసరిస్తున్నామని, అలాంటి ముస్లిం సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ జనం మీద అనేక ఆంక్షలు విధిస్తున్నాయి, అమలు జరపనివారి మీద దాడులు చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాలతో చేతులు కలపని ముస్లిందేశాల పాలకులందరిని మత ద్రోహులుగా ముద్రవేసి పవిత్రపోరాటం పేరుతో అమెరికా తదితర దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో కిరాయిదాడులకు పాల్పడుతున్నాయి.

జనంలో తంపులు పెట్టటం, తిరోగమన శక్తులను పెంచి పోషించటంలో అందెవేసిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వహాబియిజాన్ని సాధనంగా చేసుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. తరువాత అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. దీనిలో భాగంగానే బిన్‌ లాడెన్‌ వంటి దుష్టశక్తులను పెంచి పెద్ద చేశారు. ఆల్‌ఖైదా తీవ్రవాదులు 2001సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసినప్పటికీ అమెరికన్లు ఈ మత వుగ్రవాదులకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. దానికి తన ప్రయోజనాలు తప్ప తాను పెంచిన వుగ్రవాదులు తన దేశపౌరులపై దాడులు చేసినప్పటికీ దానికేమీ చీమకుట్టినట్లు లేదని తరువాత పరిణామాలు స్పష్టం చేశాయి. సౌదీలోని పాలకులకు ఈ శక్తులు వెన్నుదన్నుగా వున్నాయి. ఆఫ్రికాలోని ఎమెన్‌ ప్రాంతం మిలిటరీ వ్యూహరీత్యా ఎంతో కీలకంగా వుండటంతో అక్కడ తిష్టవేసేందుకు అమెరికా గత యాభై సంవత్సరాలుగా చేయని దుర్మార్గం లేదు. ఆ కుట్రలు ఫలించకపోవటంతో సౌదీ అరేబియాను ముందు పెట్టి దాని నాయకత్వంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎమెన్‌పై దాడులు చేయిస్తున్నారు. కొన్ని లక్షల మందిని చంపివేసినా, కరవు కాటకాలకు, కలరా వంటి వ్యాధులకు గురిచేసినా, లక్షల మందిని దేశం నుంచి తరిమివేసినా దాన్ని స్వాధీనం చేసుకోవటం సాధ్యం కావటం లేదు. అక్కడి సామ్రాజ్యవాద వ్యతిరేకశక్తులు మొక్కవోని ధైర్యంతో ప్రతిఘటిస్తున్నాయి. సౌదీ అరేబియన్‌ పౌరుల రక్షణకు మాత్రమే తాము అక్కడ జోక్యం చేసుకుంటున్నామని సల్మాన్‌ సమర్ధించుకున్నారు.

సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా మతోన్మాద, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల వలలో పడిన ముస్లిం యువతలో, యావత్‌ ఇస్లామిక్‌ దేశాలలో పురోగామి ఆలోచనలు రేకెత్తించటానికి, సామ్రాజ్యవాదుల కుట్రల పట్ల మరింత అప్రమత్తం కావటానికి సౌదీ యువరాజు వెల్లడించిన అంశాలు తోడ్పడతాయి. కమ్యూనిస్టు వుద్యమం విస్తరించకుండా చూసేందుకు సామ్రాజ్యవాదులు అనుసరించిన వ్యూహంలో ఎన్నో అంశాలున్నాయి. అరబ్‌ సోషలిజం పేరుతో సంస్కరణవాదశక్తులను ప్రోత్సహించారు. దానికి పెద్ద వుదాహరణ బాత్‌ పార్టీ సోషలిజం పేరుతో సద్ధాం హుసేన్‌ రంగంలోకి రావటానికి, సమర్ధించటంలో అమెరికా తోడ్పడింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆ సద్దాంనే ప్రయోగించి యుద్దం చేయించిన వుదంతం మన కళ్ల ముందే వున్నది. అమెరికా కుట్రలను ఎరిగిన సోవియట్‌ యూనియన్‌ అనేక అరబ్బు దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చి నిలబెట్టింది. అలాంటి వారిలో గడాఫీ ఒకరు. ఇదే సమయంలో సౌదీ అరేబియా వంటి దేశాల పాలకులతో చేతులు కలిపి తాలిబాన్లు,ఆల్‌ఖైదా వంటి ఛాందస వుగ్రవాదుల తయారీని చూశాము. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత తనను వ్యతిరేకించే అరబ్బు జాతీయశక్తులను దెబ్బతీసేందుకు అమెరికా పావులు కదిపింది. ఇరాక్‌ , లిబియాలో జరిగింది అదే. ఇరాన్‌లో విఫలయత్నం చేసింది. సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల పాలకులను మార్చేందుకు ఇప్పటికీ దాడులు కొనసాగిస్తున్నది. తమ చేతికి మట్టి అంటకుండా ఇస్లామ్‌ పునీకరించేపేరుతో మతఛాందసాన్ని మెదళ్లకు ఎక్కించటం, ప్రపంచాధిపత్యంలో భాగంగా అపార చమురు, ఇతర సహజ సంపదలున్న ప్రాంతాలపై ఆధిపత్యం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతాలను తమ చేతుల్లో వుంచుకొనేందకే ఇదంతా చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు కేవలం ఇస్లామిక్‌ సమాజాలు, ఇస్లామిక్‌ దేశాల మీదే కేంద్రీకరించాయనుకుంటే పొరపాటు. అది మతం, ప్రాంతీయం, భాష, వేర్పాటు వాదం ఏదైనా కావచ్చు. వాటి వెనుక సామ్రాజ్యవాదుల హస్తం వుంటుంది. మన దేశంలో హిందూ తాలిబాన్లు,గతంలో పంజాబ్‌ తీవ్రవాదులు, ఇప్పుడు కాశ్మీరులో తీవ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ వుగ్రవాదులు, ఐరోపా దేశాలలో నయా నాజీ బృందాల వెనుక పశ్చిమ దేశాల హస్తం, డబ్బు లేకుండా ఇంతగా రెచ్చిపోవటం సాధ్యం కాదు. తాము తయారు చేసిన వుగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ కొన్ని చోట్ల తమ అదుపు తప్పటంతో లేదా తమ వ్యతిరేకులైన ఇరాన్‌ ప్రభావంలోకి పోవటం వంటి పరిణామాలతో అవే పశ్చిమ దేశాలు ఒక ఎత్తుగడగా వుగ్రవాద వ్యతిరేక ఫోజుపెడుతున్నాయి. తమతో సంబంధాలలో వున్న వారితో సిరియా, ఎమెన్‌ వంటి చోట్ల కిరాయి మూకలుగా వుపయోగించుకుంటున్నాయి. నిజానికి వంద సంవత్సరాల క్రితం ముస్లిం తీవ్రవాదం గురించి ప్రపంచానికి తెలియదు, అటువంటి వుగ్రవాద చర్యలు కూడా లేవు. ముస్లిం సమాజం వుగ్రవాదానికి లోనై వుంటే పశ్చిమాసియాలో వారి మెజారిటీగా వున్న ప్రాంతాలకు ప్రపంచంలో వున్న యూదులందరినీ సమీకరించి కొన్ని ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తుంటే సహించి వుండేవారా ? తమ ప్రాంతాల నుంచి తమను వెళ్లగొట్టటం ప్రారంభమైన తరువాతే పాలస్తీనియన్లు ఆయుధాలు పట్టారు తప్ప అంతకు ముందు ఎంతో సౌమ్యంగా వున్న సమాజాలవి. నిజానికి ఇస్లాం ఒక మతమే కాదు, ఒక సంస్కృతి కూడా. ప్రతి సంస్కృతిలో కొన్ని మినహాయింపులున్నట్లే దానికి భిన్నంగా ప్రవర్తించేవారు ఆ సమాజంలో వుండట ఆశ్చర్యమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d