• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Vemula Rohit

అబ్బ ! అపర ‘దేశ భక్తుల’కు దిమ్మ తిరిగే భలే తీర్పు చెప్పారు కదా !!

30 Friday Sep 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, fitting tribute to Rohit Vemula, HCU, Rohith Vemula, sfi, so called 'nationalists", University of Hyderabad (UoH), UoH, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

   రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపధ్యంలో సెప్టెంబరు 28న జరిగిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో సంఘపరివార్‌ శక్తులు, వారికి వంత పాడిన మీడియా చిత్రించిన ‘దేశద్రోహులు’ ఘన విజయం సాధించారు. అపర’ దేశ భక్తులు ‘గా చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ, ప్రసార మాధ్యమాల నీరాజనాలు అందుకున్న ఏబివిపి అభ్యర్ధులు అన్ని స్ధానాలలో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలోని లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక పరిణామం లేదా వుదంతంపై ఎవరైనా మైనారిటీ అయినా మెజారిటీ అయినా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, అలాంటి వారికి చెప్పే అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరిచే వారిని కూడా దేశద్రోహులుగా చిత్రిస్తున్న నిరంకుశ, ఫాసిస్టు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. దేశమంతటినీ ఆకర్షించిన ఈ రెండు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల ఆందోళనల పూర్వరంగంలో వచ్చిన ఈ ఫలితాల తరువాత అయినా భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించటం, వేధించటం మానుకుంటారా ?

     మానుకోరు అని గట్టిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆ రెండు విశ్వవిద్యాలయాల సమస్య కాదు. అంతకంటే లోతైనది. విద్యారంగంలో మనువాద భావజాలాన్ని రుద్దాలన్న తీవ్ర ప్రయత్నంతో పాటు వామపక్ష, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలన్న అంతకంటే తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. అందుకు నిదర్శనం హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయ వుదంతం. మహాశ్వేతాదేవి రాజకీయ అభిప్రాయాలు, వైఖరితో అందరూ ఏకీభవించాలని లేదు. ఆమె రచనలలోని వస్తువుతో కూడా ఎవరైనా విబేధించవచ్చు. ప్రముఖ రచయిత్రులలో ఒకరు అన్న అభిప్రాయంతో మాత్రం విబేధించాల్సిన అవసరం లేదు.ఆమె రాసిన ‘ద్రౌపది’ కథ ఆధారంగా రూపొందించిన ఒక నాటికను హర్యానా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లం మరియు విదేశీ భాషల విభాగం వారు ప్రదర్శించారు. జూలై 28న మరణించిన మహాశ్వేతాదేవి సంస్మరణగా సెప్టెంబరు 21న ఆ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్నేహస్థ రూపొందించిన నాటికను ప్రదర్శించారు. ఆ నాటిక ప్రదర్శన తరువాత దేశంలో కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు, గిరిజన యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, సైనికుల అనుచిత చర్యల వివరాలను డాక్టర్‌ స్నేహస్ధ చదివి వినిపించారు. ఈ విషయం స్ధానిక పత్రికలలో వార్తగా వచ్చింది.1970 దశకంలో ఒక ఆదివాసీ మహిళ ప్రత్యేక పోలీసుల కస్టడీలో అత్యాచారానికి గురి కావటం కథాంశం. గిరిజనోద్యమ నాయకుల గురించి వివరాలు వెల్లడించాలని పోలీసులు కోరితే నిరాకరించిన యువతిపై అత్యాచారం జరిపి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించటం. దీనిలో సైనికుల గౌరవానికి భంగం కలిగించేలా వుందంటూ కొందరు మాజీ సైనికులు అభ్యంతరం చెప్పారు, వెంటనే ఎబివిపి, మరో విద్యార్ధి సంస్ధ ఇండియన్‌ నేషనల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశాయి. నాటికలో పల్గొన్నవారిపై చర్య తీసుకోవాలని విశ్వవిద్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒక సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ఛాన్సలర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ప్రతిదానిని సంచలనాత్మకం చేసేందుకు ఎదురు చూసే మీడియా దీన్ని కూడా జెఎన్‌యు వుదంతంతో పోల్చి నాటికను ప్రదర్శించిన వారికి ‘జాతి వ్యతిరేకం’ ముద్ర తగిలించింది.

    భావ ప్రకటనా స్వేచ్చను కాపాడాల్సిన,సమర్ధించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులలో ఒకరైన రిజిస్ట్రారు సెప్టెంబరు 22వ తేదీన కొన్ని బృందాలు తెలుపుతున్న అభ్యంతరాలను వుటంకిస్తూ ర్‌ స్నేహస్థ సైన్యానికి వ్యతిరేకంగా చేసినట్లు చెబుతున్న ఆరోపణపై రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఒక లేఖ రాశారు.దీనిపై దర్యాప్తు చేసేందుకంటూ వైస్‌ ఛాన్సలర్‌ ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ వారు 1876లోనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నాటకాలు ప్రదర్శిస్తే వాటిని సెన్సార్‌ లేదా నిషేధించేందుకు నాటక ప్రదర్శనల చట్టం చేశారు. ఇన్నేండ్ల తరువాత విశ్వవిద్యాలయ అధికారుల తీరు చూస్తే అదే చట్టం ఇంకా అమలులో వున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు అధికారులుగా వుండటం తప్ప వేరు కాదు. రోహిత్‌ వేముల ఆత్మహత్య సందర్భంగా సంతాపం తెలుపుతూ కొంత మంది విద్యార్ధు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా ఈ విశ్వవిద్యాలయంలోని ఏబివిపి సభ్యులు వారిపై దాడి చేశారు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     ద్రౌపది నాటిక విషయానికి వస్తే జెఎన్‌యు, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాదిరి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఒక పెద్ద కుట్రలో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో వున్న ఈ విశ్వవిద్యాలయంలో నాటికను ప్రదర్శించారని హర్యానా ఏబివిపి నేత ప్రమోద్‌ శాస్త్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు శాస్త్రవిషయాలు, పరిశోధనల కోసం ఏర్పాటు అయ్యాయని అలాంటి చోట ప్రతి అంశంపై చర్చలు జరపవచ్చని నాటికను రూపొందించిన స్నేహస్ధ సమర్ధించారు.ఆమె రాసిన నాటిక ప్రదర్శనకు అధికార యంత్రాంగం అనుమతించిందని, దానిలో చేసిన విమర్శకు ఎవరైనా సైనికుల మనోభావాలు గాయపడి వుంటే క్షమించాలని ఆ వివాదానికి స్వస్థిపలికేందుకు ప్రయత్నించారు. అయితే యురిలో సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడి, సైనికుల మరణం నేపధ్యంలో ఎబివిపి దీనిని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది.

    ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ లెక్చరర్‌ షైకత్‌ ఘోష్‌ హర్యానా విశ్వవిద్యాలయ వుదంతం గురించి వ్యాఖ్యానిస్తూ రెండు సంవత్సరాల క్రితం సంఘపరివార్‌ భావజాలాన్ని విమర్శిస్తూ తన దర్శకత్వంలో ‘వెల్‌కం టు మెషిన్‌ ‘ అనే నాటిక ప్రదర్శనను రెండు సంవత్సరాల క్రితం ఏబివిపి అడ్డుకున్నదని భావ ప్రకటనా స్వేచ్చను ఆటంకపరచటంలో భాగ మే ఇదన్నారు.

    ప్రజా వుద్యమాల అణచివేతలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరపటంలో పోలీసులు, పారా మిలిటరీ, సైనికుల తీరు తెన్నుల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా ఎందరో మానవతులను నిజాం పోలీసులు, రజాకార్లతో పాటు మలబార్‌ స్షెషల్‌ పోలీసులు, మిలిటరీ జరిపిన దారుణాలు చరిత్రలో నమోదయ్యే వున్నాయి. తరువాత కాలంలో కూడా అనేక వుద్యమాలు, ఆందోళనలు, పోరాటాల సందర్భంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వీటిని గురించి చెప్పటమంటే మొత్తం సైన్యం, పారామిలిటరీ, పోలీసులు అలాంటి వారని నిందించటం లేదా వారి సేవలను కించపరచటం కాదు. ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రజా వుద్యమాలు, తిరుగుబాట్లను అణచటంలో పాలకవర్గానికి అత్యాచారం ఒక ఆయుధం. దానిని ప్రయోగించటంలో భారత పాలకవర్గమేమీ తక్కువ తినలేదు.

      చివరగా ఒక్క మాట ! ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా కాదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :తమ పార్టీ అధికారానికి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్‌  మాటలివి.

     అబ్బ ! భలే తెలివిగా చెప్పిండు కదా !! అని అప్పుడు ఆయన భక్తులెందరో ప్రశంసించారు. ఇప్పుడా రోహిత్‌ వేముల ఆత్మార్పణ అజెండాపైనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో రోహిత్‌ వేముల అసలు దళితుడే కాదు, బిసి అంటూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంఘపరివార్‌ శక్తులను మట్టి కరిపించి అక్కడి విద్యార్ధులు తిరుగులేని తీర్పు చెప్పారు. రోహిత్‌కు తగిన నివాళి ఇది. ఇప్పుడైనా రోహిత్‌ వేముల మరణం గురించి కెసిఆర్‌కు మీ మాంస తీరిందా? ఇంకా కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ? అనుకుంటున్నారా !

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం కదా !

    నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. మధ్యమానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టిస్తానని తెలియక వాగ్దానం చేశాను కనుక క్షమించమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. రేపు మిగతా విషయాలలో కూడా ఇలాగే చెప్పి క్షమించమంటారేమో ? పాలకుల తెలివి తేటలకు కొదవలేదు, తవ్వినకొద్దీ వస్తూనే వుంటాయి ! పాలితులకే వెంటనే లైటు వెలగటం లేదా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమైంది వెంకయ్య గారూ ? మీ సమస్య ఏమిటి ?

31 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ 1 Comment

Tags

BJP, Dalit, Rahul gandhi, Rohith Vemula, University of Hyderabad (UoH), Vemula Rohit, Venkaiah naidu

లేఖల మీద లేఖలు రాసే మీ తోటి మంత్రి దత్తన్న స్ఫూర్తితో ఒక బహిరంగ లేఖ

      వెంకయ్య నాయుడు గారూ తెలుగు రాష్ట్రాలలో ప్రాసలను గుమ్మరించి వుపన్యాసాలు చెబుతూ జనాన్ని ఆకట్టుకొనే దిట్టలలో మీరు ఒకరు. దానితో సమస్య లేదు. హైదరాబాదు నగరాభివృద్ధికి వాజ్‌పేయి ఆద్యులు-చంద్రబాబు బాధ్యులు అన్నది మీ మాటల పొది నుంచి తాజాగా తీసిన నినాదం. కొత్తవారు ఎవరైనా హైదరాబాద్‌ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే చార్మినార్‌ , హుస్సేన్‌ సాగర్‌, గోల్కోండ కోట, కొండలు, గుట్టలు మొదలు ఇక్కడ లక్షలాది మందికి వుపాధి కలిగిస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను వాజ్‌పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగానే వచ్చాయని అనుకొనే ప్రమాదం లేకపోలేదు.వారికి అంత సీన్‌లేని చెప్పటం అవసరమోమో ఆలోచించండి.

     ఒక బిహెచ్‌యిఎల్‌, ఒక ఇసిఐఎల్‌ ఇలా ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమను హైదరాబాదులో వారి హయాంలో నెలకొల్పకపోగా హెచ్‌ఎంటి, ప్రాగా, ఐడిపిఎల్‌, ఇలా ఎన్నో పరిశ్రమలను మూసివేయించి పుణ్యం కట్టుకున్న పెద్దలు అంటే అతిశయోక్తి కాదు.ఈ మాట చెప్పగానే రింగ్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, ఐటి కంపెనీల మాటేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఒక అందగత్తె గర్వంతో ఒక రోజు తన భర్తతో ఏమండీ నేనే గనుక పుట్టి వుండకపోతే మీరు ఎవరిని వివాహం చేసుకొని వుండేవారు అని అడిగిందట. దానికా భర్త నువ్వు గాక పోయివుంటే నీ అమ్మను చేసుకొని వుండేవాడిని అన్నాడట.

      వాజ్‌పేయి, చంద్రబాబు నాయుడు లేకుండానే ఐటి పరిశ్రమలు బెంగళూరులో,చెన్నయ్‌, పూనేలలో ఎలా వచ్చాయి. నరేంద్రమోడీ వంటి కారణజన్ముడు పుట్టిన గుజరాత్‌లో ఐటి పరిశ్రమలు ఎందుకు రాలేదు, బిజెపి బలంగా వున్న వుత్తరాది ఇతర రాష్ట్రాలలో ఎందుకు రాలేదు అంటే వెంకయ్య గారేమంటారు? చంద్రబాబు మాదిరి అడిగిన వారు ఆ రాష్ట్రాలలో లేకపోయారా ? విజయవాడ, విశాఖ, వరంగల్‌, చివరికి మీ నెల్లూరును ఎందుకు అభివృద్ధి చేయలేదు? కేవలం రాజధాని నగరాలను మాత్రమే అభివృద్ధి చేయాలనేది ఒక విధానమా లేక రహస్య అజెండాగా అమలు జరిపారా ? రింగ్‌ రోడ్‌ విషయానికి వస్తే వారి హయాంలో వేసినదాని కంటే పెద్దదాన్ని రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు సార్‌ ?అయినా వాజ్‌పేయి వంటి వ్యక్తి కేవలం హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేసి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆయనేమి జాతీయ నాయకుడు ? అడగటానికి ఇలా చాలా వుంటాయి. ఏదో ఓట్ల కోసం వచ్చారు, అడిగారు అంతవరకు మంచిది, మిగతా విషయాలపై మూసుకుంటే మంచిదేమో ?

      వెంకయ్యగారూ మీరు ఓట్ల కోసం హైదరాబాదు వస్తున్న సమయంలోనే కాంగ్రెస్‌ నేతో రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక రోజు దీక్ష కోసం వచ్చారు. మీ కడుపు మంట ఏమిటి ? కాంగ్రెస్‌, వామపక్షాలు ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ విషయమై రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు.అసలు ముందు అక్కడి వ్యవహారాలలో జోక్యం చేసుకున్నదెవరు? రాజకీయం చేసిందెవరు ? బిజెపి ప్రజాప్రతినిధులు, మంత్రులు కాదా ? రోహిత్‌ మరణాన్ని దళితేతర సమస్యగా మార్చే అతి పెద్ద రాజకీయానికి తెరతీసిందెవరు ? అసలు మీ సమస్య ఏమిటి ? హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అంతకు ముందు చాలా మంది మరణిస్తే, వరంగల్‌లో రాజయ్య కుటుంబంలో మరణాలు జరిగినపుడు ఎందుకు రాలేదు అంటున్నారు ? నిజమే సార్‌ రాలేదు, వాటి వెనుక కూడా మీ మంత్రులు, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏల లేఖలు, హస్తాలు, వత్తిడి వున్నాయా లేక నాటి కాంగ్రెస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధుల వత్తిడులు వున్నాయా చెప్పండి, అన్నింటినీ కలిపి అఖిలపక్ష ఆందోళన చేస్తే దళితులు ఎందుకు ఆత్మహత్య లు చేసుకుంటున్నారో తేలుతుంది. అన్నట్లు గుర్తొచ్చింది, దేశంలో అనేక మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి దాని మీద స్పందించకుండా కూడికలు-తీసివేతల లెక్కలు వేసుకొని ఐదు రోజులు అయినా ఇంకా ఇంత లాభం వస్తుంది అని వేద గణితంలో నిర్ధారణకు వచ్చిన తరువాతే కదా రోహిత్‌ వుదంతం మీద ప్రధాని నరేంద్రమోడీ స్పందించటం రాజకీయం కాదా ?

      హర్యానాలో ఇద్దరు దళితుల పిల్లలను సజీవ దహనం చేసిన దుర్మార్గం మీద ‘ఎవరో రాళ్లు వేసి వీధిలో ఒక కుక్కను చంపితే ప్రభుత్వం ఎలా బాధ్యురాలు అవుతుంది’ అన్న మీ మంత్రి వీకె సింగ్‌ మాదిరి రోహిత్‌ మరణాన్ని కూడా అలాగే తీసుకోవాలనా ? అసలు మీ సమస్య ఏమిటి ? ఈ వుదంతాన్ని అసలు ఖండించాలా వద్దా ? ఖండించాలి అనుకుంటే రాజకీయ వాసనలు తగల కుండా ఎలా ఖండించాలో కావాలనుకుంటే మీ తరహా యతి ప్రాసలను చేర్చి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక పత్రాన్ని రూపొందించి దేశం మీదకు వదలండి , దాన్ని నలుగురి చేతా కనీసం మీకు నొప్పితగలకుండా మోసే తెలుగుదేశం, పోనీలే, పోయింది ఒక దళితుడే మన వాడే కదా అయినా అతని కులమేమిటో నిర్ధారణ కాకుండా స్పందించటేమిటి అసహ్యంగా అన్నట్లు వున్న , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తెరాస వంటి పక్షాల చేత ముందు వప్పించండి, తరువాత దాని మీద అందరూ స్పందించి సంతకాలు చేస్తారు. అవేమీ లేకుండా ఎంతగా మాట్లాడినా జనం అదేదో సినిమాలో అడిగినట్లు అసలు నువ్వు ఎవరు ? అన్నట్లుగా అసలు వెంకయ్యగారి ఏమిటి అని అడుగుతూనే వుంటారు.

భవదీయుడు

ఒక పాఠకుడు

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిత్రులెవరు? శత్రువులెవరు?

29 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Readers News Service, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CPI(M), Dalit, discrimination against dalits india, Rohith Vemula, Vemula Rohit

– వి. శ్రీనివాసరావు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయ రీసెర్చి స్కాలర్‌ వేముల రోహిత్‌ చక్రవర్తి బలవన్మరణంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగు తోంది. మూడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన దేశ వ్యాప్త నిరసనోద్యమం తర్వాత అంత కన్నా తీవ్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమమిది. అప్పటి ప్రభుత్వం చేతులు కాలాక ఆలస్యం గానైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పలేదు. కానీ నేటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దళితోద్ధరణ కోసమే తాను జన్మించినట్లుగా మాటల గారడీతో నమ్మ బలుకుతున్నట్లు నటించే ప్రధాని ఐదు రోజుల మౌనం తర్వాత దీనిపై బలవంతంగా నోరు తెరిచినా చేతల్లో మాత్రం ఏ చొరవా చూపలేదు. పైగా లక్నో సభలో రోహిత్‌ ఘటనపై ప్రధాని స్పందించాలని నిలదీసిన ముగ్గురు దళిత విద్యార్థులను కూడా హాస్టల్‌ ఖాళీ చేయించి ఇంటికి పంపా రు. ముంబాయిలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై ఆర్‌యస్‌యస్‌ మూక అడ్డంగా దాడి చేసి అనేక మందిని కిరాతకంగా గాయపరిచారు. ఈ దేశంలో న్యాయం చేయక పోయినా, కనీసం న్యాయం చేయమని అడిగే హక్కు కూడా లేదా? ఇలా నోళ్లు కుట్టేస్తారా? ప్రశ్నించేవారిని వేధిస్తారా? ఒక ప్రజాస్వామిక దేశంలో ఫాసిస్టు ప్రభుత్వమా?
రోహిత్‌ బలవన్మరణానికి కారకుడైన వైస్‌-ఛాన్సలర్‌ పొదెల అప్పారావుపై ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకో లేదు. ఆయనపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదైనా కనీసం అరెస్టు చేయలేదు. పేరుకు సెలవులో ఉన్నా పదవిలోనే కొనసాగు తున్నాడు. అంతకన్నా దుర్మార్గం అతని స్థానంలో తాత్కాలిక విసిగా ఈ ఘటనకు కారకులైన మరొక శిఖండిని నియమిం చడం. ఇది విద్యార్థులను రెచ్చగొట్టడం కాక మరేమవు తుంది? నిందితులపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు వారిని కనీసం విచారించను కూడా విచారించలేదు. తద్విరు ద్ధంగా రోహిత్‌ కుటుంబ చరిత్రను తొవ్వడానికి నానా యాతనలు పడుతున్నారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్‌, నిర్భయ ఘటనల్లో సారూప్యతలు న్నాయి. నాడు కూడా జరిగిన దుర్మార్గాన్ని పట్టించుకోకుండా నిర్భయ శీలాన్ని శంకించే ప్రకటనలు చేశారు. నాడూ ఇలాగే మనువాదానికి ప్రాతినిధ్యం వహించే ఫ్యూడల్‌ ఛాందస శక్తులు ఆడపిల్లల వస్త్రధారణ గురించి, రాత్రిపూట అబ్బాయి లతో కలిసి సంచరించడంపై సందేహాలు లేవనెత్తారు. అవే శక్తులు ఇప్పుడు రోహిత్‌ కులాన్ని, వామపక్షాల నిజాయితీని శంకిస్తున్నాయి. రోహిత్‌ బతికున్నంత వరకు వేపుకు తిన్నారు. అడుగడుగునా కులవివక్షను ప్రదర్శించారు. ఆఖరికి చనిపోయాక కూడా వదల్లేదు. తనను తాను అంతం చేసుకోవడం ద్వారా ఈ కులరాక్షసి కబంద హస్తాల నుంచి బయట పడాలనుకున్నాడు. కానీ రోహిత్‌ ఆత్మను కూడా వారు వదలదలచుకోలేదు. నీదే కులం అంటూ వెంటాడి పీడిస్తూనే ఉంది. రోహిత్‌ తల్లి రాధిక అతను చనిపోయిన నాటి నుంచి గుండెలవిసిపోయేలా కన్నీళ్ల పర్యంతమవు తూనే ఉంది. కానీ పాలకుల గుండెలు మాత్రం కరగడం లేదు. కేంద్రం గద్దెపై కూర్చున్న పాలకులను ”మను”వ్యాధి పీడిస్తోంది. దెబ్బకు దెయ్యం వదులుతుంది అన్నట్లుగా మనువ్యాధి పీడితులకు పోరాటమే చికిత్స. అదే నేడు విద్యార్థులు ఐకమత్యంతో చేస్తున్న పోరాటం.
ఘటన జరిగిన రోజు నుంచే దీన్ని దళిత-దళితేతర సమస్యగా చిత్రీకరించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పేరుతో అగ్రకులాలను తమ వైపు తిప్పుకోవాలన్న దుర్బుద్ధి వారిలో కనిపిస్తుంది. కానీ వారి ఆశలను అడియాసలు చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా విద్యార్థులంతా ఏకమై ఆందోళన చేస్తు న్నారు. తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం మరొకరికి జరగ కూడదన్న పట్టుదలతో వారున్నారు. సెమిస్టర్‌ కొద్దిరోజుల్లో ముగియనుండగా తమ చదువులను సైతం లెక్క చేయ కుండా క్లాసులను బహిష్కరించి, విశ్వవిద్యాలయ పాలక వర్గాన్ని నిలదీస్తున్నారు. ఐదుగురు దళిత విద్యార్థుల ”సామాజిక బహిష్కరణ”కు విరుగుడే ఈ తరగతుల సమైక్య బహిష్కరణ. తెరవెనుక నుంచి ఎబివిపి ద్వారా విద్యార్థుల్లో చీలికలు పెట్టడానికి నానా యాతన పడుతున్నాయి బిజెపి, ఆర్‌యస్‌యస్‌లు. విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులే కాదు బయట కూడా దళిత సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రగతిశీలురు గళం విప్పి వారికి అండగా నిలబడుతున్నారు. ఇదొక సమై క్యతా శంఖారావం. దీన్ని కులం పరిధిలో ఇరికించి బలహీన పరచాలనుకునే వారి కుట్రలు సాగవని విద్యార్థిలోకం నిరూపిస్తోంది.
రాజకీయ శక్తులు జొరబడి ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నాయని బిజెపి మరొక అస్త్రాన్ని బయటకు తీసింది. అసలు ఈ సమస్యంతా బిజెపి రాజకీయ జోక్యంతోనే మొదలైంది. కన్నంలో దొరికిన దొంగలా ఉంది బిజెపి పరిస్థితి. ఆఖరికి దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఇతరులు రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇరు వర్గాలకు చెందిన విద్యార్థుల గొడవను రాజకీయం చేసింది బిజెపి. క్యాంపస్‌లో జొరబడి ఈ ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేసేదాకా వదల్లేదు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తమ అనుచరుల్ని వెంటేసుకొని వైస్‌ ఛాన్సలర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాస్తవాలేమిటో తెలుసుకోకుండానే వారిని జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేశారు. కేంద్రమంత్రి ఇరానీ చర్య తీసుకునేదాకా వదల కుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. ఇదంతా వారి రాజకీయ జోక్యాన్నే తెలియచేస్తున్నది. ఆఖరికి అదే తమకు ఎదురు తిరిగేసరికి ఎవరో రాజకీయం చేస్తున్నారంటూ కాకిగోల చేస్తున్నారు.
పనిలో పనిగా తమ కొమ్ముకాసే కొందరు దళిత మేధావులు, సంఘాలను ఉపయోగించుకొని ఉద్యమంపై నీచమైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి కొండంత అండగా నిలబడ్డ వామపక్షాలపై వారి దాడి ఎక్కుపెడుతున్నారు. నానా రకాల ఆరోపణలు చేసి వామ పక్షాలను అప్రతిష్టపాలు చేయాలన్న దుష్టతలంపుతో వ్యవహరిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆర్‌యస్‌యస్‌ నెట్‌వర్క్‌ ద్వారా రకరకాల ఆకాశరామన్న పేర్లతో వామపక్షా లపై విషం కక్కుతున్నారు. తెలిసో తెలియకో కొందరు ఈ వలలో పడిపోతున్నారు. వామపక్షాలు, విద్యార్థిసంఘాలు, దళితసంఘాలు కలసికట్టుగా వ్యవహరించడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఐక్యతను దెబ్బ తీయడానికే వామపక్షాలను కేంద్రంగా చేసుకొని కాలం చెల్లిన విమర్శనాస్త్రాలను తిరిగి తమ అంబులపొది నుంచి బయటకు తీసి సంధిస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వామపక్షాల్లో ప్రత్యేకించి సిపియంలో అగ్రకులాలదే పెత్తనమని, దళితులు నాయకత్వస్థానాల్లో లేరని, అలాంటి వారు రోహిత్‌ సమస్యను ఆసరా చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ అరిగిపోయిన రికార్డులే. గతంలో పట్టించుకోవడం లేదని విమర్శించిన వారే ఇప్పుడు పట్టించుకుంటున్నందుకు అభినందించాల్సింది పోయి విమర్శలెందుకు చేస్తున్నారు? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరిని సంతృప్తి పర్చడానికి ఈ అబద్ధాలు వల్లిస్తున్నారు? ఇలాంటి చర్చ సమస్య పరిష్కారానికి తోడ్పడుతుందా? లేక ఉద్యమాన్ని బలహీనపర్చడానికి ఉపయోగపడుతుందా? అలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిత్‌, తదితరుల మీద చర్య తీసుకున్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ ఎక్కడ ఉంది అంటూ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాసం రాస్తూ అడిగాడు. అతనెక్కడున్నాడో ముందు చెప్పాలి? తన పదవి కోసం బిజెపికి దళిత ఉద్యమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం? ఆయనొకప్పుడు ఏం చేశాడనేది కాదు ఇప్పుడెక్కడున్నాడనేది ముఖ్యం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపి దళిత సమస్యను చర్చించాలని దళిత శోషిత్‌ ముక్తిమంచ్‌ (డిఎస్‌యంయం) డిమాండు చేస్తూ పార్లమెంటు సభ్యులకు విన్నపం చేసుకోడానికి ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లిన కార్యకర్తలను బూతులు తిట్టి పంపాడు. అదీ ఆయన నైజం. దీనిపై ఢిల్లీలో నిరసన కూడా వ్యక్తమైంది. ఇలాంటివారే మరికొంత మంది వామపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై తక్షణమే స్పందించి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకే వారికి కంటగింపుగా ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ప్పుడు చురుగ్గా ఉండే కొంతమంది నాయకులు ఈసారి కనుమరుగయ్యారు. అలాంటి వారికి కూడా వామపక్షాల చొరవ నచ్చడం లేదు. ఏది ఏమైనా వామపక్షాలు తాము నమ్మిన మార్గాన్ని వదిలిపెట్టవు. దళితులు, దళిత ఉద్యమాలు వామపక్ష ఉద్యమ స్రవంతిలో అంతర్భాగం. వారిని విడదీయం అంత సులభం కాదు.
ఐదుగురు దళిత విద్యార్థులపై అన్యాయంగా చర్య తీసున్నప్పటి నుంచి వారి సంఘం(అసా)తో తమకున్న విబేధాలను పక్కన పెట్టి ఎస్‌ఎఫ్‌ఐ చొరవతో వ్యవహరించింది. తాము యూనియన్‌లో గెలిచినప్పటికీ దానితో నిమిత్తం లేకుండా అసాతో సహా అన్ని సంఘాలను కలిపి ”సామాజిక న్యాయం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ”ని ఏర్పరచింది. దానిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆ సమయంలోనే ఈ రచయిత కూడా వారిని పలకరించాడు. సంఘీభావం తెలిపాడు. ఈ మధ్యలో రోహిత్‌ ఘోరం జరిగింది. దానితో ఉద్యమం మరింత ఊపందుకుంది. అన్ని రిపోర్టులూ ఆ అయిదుగురు విద్యార్థులు ఏ తప్పూ చేయలేదని ఘోషిస్తున్నా కావాలని రాజకీయ ఒత్తిళ్లతో చర్య తీసుకున్నారు. తన కొడుకుపై చర్య తీసుకుంటే ఎందుకు ఇంతవరకు-చని పోయిన తర్వాత కూడా- తనకు తెలియజేయలేదని రోహిత్‌ తల్లి నిలదీస్తుంటే దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? తనకు న్యాయం కావాలని ఆ తల్లి అడుగుతుంటే సమాధా నం చెప్పరా? ఇదేనా విశ్వవిద్యాలయాలు నేర్పించే చదువు? రోహిత్‌ మరణానికి నిరసనగా హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఆందోళన సాగుతోంది. వివిధ చోట్ల దళితుల పట్ల ఎంతగా వివక్షత సాగుతుందో కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఆఖరికి ప్రఖ్యాతిగాంచిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్శిటీలోనూ దళిత విద్యార్థుల పట్ల వివక్షత కొనసా గుతున్నదంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
రోహిత్‌ చనిపోయి ఇప్పటికి మూడు వారాలవు తోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌ కేందీయ విశ్వవిద్యా లయ విద్యార్థులు సమ్మెలో ఉన్నారు. వారి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ యాజమాన్యంపై ఉంది. విద్యా సంవత్సరం నష్టపోతే అందుకు వారిదే బాధ్యత అవుతుంది. విద్యార్థుల కోర్కెలన్నీ చట్టబద్ధమైనవి, న్యాయమైనవి. చట్టాన్ని అమలు చేయమని విద్యార్థులు కోరుతున్నారు. వాటిని ధిక్కరిస్తున్నది కేంద ప్రభుత్వం, విశ్వవిద్యాలయ పాలకవర్గం. తాజాగా తమిళనాడులోని విల్లుపురంలో ముగ్గురు విద్యార్థినులు ఇదే విధంగా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దానికి బాధ్యులైన ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండుకు పంపారు. కానీ హైదరాబాద్‌లో రోహిత్‌ మరణానికి కారకులైన వారు దర్జాగా, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఎదుటివారిపై ఆరోప ణలు చేస్తున్నారు. ఇంతకన్నా వివక్షత ఇంకేమన్నా ఉందా? వైస్‌ఛాన్సలర్‌ను వెంటనే అరెస్టు చేయడం పోలీసు ధర్మం. కానీ వారు కేంద్రం ఒత్తిడితో తమ విధుల్ని నిర్వహించడంలో విఫలమవుతున్నారు. రేపు విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతే అందుకు పోలీసు కూడా బాధ్యత వహించాలి. సవరించిన ఎస్‌స్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం ప్రకారం అలక్ష్యంగా వ్యవహరించే పోలీసులు కూడా శిక్షార్హులే. వెంటనే విద్యార్థుల న్యాయసమ్మతమైన కోర్కెలను పరిష్క రించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. లేకుంటే ఈ తరహా బాధ్యతారాహిత్యం మరింత మంది రోహిత్‌లను బలిచేయడానికే తోడ్పడుతుంది. మనకెందుకులే అని మిగతావారు నోరు మూసుకున్నా లేదా రోహిత్‌ దళితుడు గదా మనకెందుకులే అని ఇతర కులస్తులు అనుకున్నా ఈరోజు రోహిత్‌ అయితే రేపు మరొకరవుతారు. అన్యా యాన్ని ప్రశ్నించకపోతే అదే రేపు మనల్ని బలితీసు కుంటుందని మరచిపోరాదు. అందుకే ప్రతి ఒక్కరూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమానికి అండగా ముందుకు రావాలి. ఈ దేశానికి శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవాలి.
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)

This article first published in Prajasakti

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిజమే అయితే ? ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Rohith Vemula, RSS, University of Hyderabad (UoH), Vemula Rohit

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు.

సత్య

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఏ కులానికి చెందిన వాడన్నది నాకు ముఖ్యం కాదు, ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ? దానికి దారితీసిన పరిస్ధితులు ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం దాని మంత్రులు ,ఎబివిపి, విశ్వవిద్యాలయ అధికారులు ఇంకా తెరవెనుక ఎవరైనా వుంటే ఎందుకీ పుణ్యం కట్టుకున్నారు ? అన్నదే ముఖ్యం, సమాధానం రావాల్సిన ప్రశ్న.

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు. హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ వర్తిస్తాయి . మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని అలా మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

అందువలన అన్యాయాన్ని అన్యాయంగా ఖండించకుండా, నిరసించకుండా వుంటే చివరికి నీవరకు వచ్చే సరికి నిరసించటానికే కాదు, అయ్యో పాపం అనటానికి కూడా ఎవరూ మిగలరు.

అసలు మొదలైన వివాదం ఏమిటి ? రోహిత్‌ కులం గురించి కాదు. ఆ విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని ఘటనల గురించి కదా ! అవేమిటి? యాకూబ్‌మెమెన్‌ వురి తీతకు నిరసన తెలపటం, సంస్మరణ సభ జరపటం. నిరసన తెలిపిన వారు కులతత్వవాదులు, వుగ్రవాదులు, దేశవ్యతిరేక శక్తులు అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. దీనికి నిరసన తెలిపిన దేశభక్తుడైన ఎబివిపి విద్యార్ది సుశీల్‌ కుమార్‌పై దాడి చేసిన ఫలితంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఇటు వంటి ఘటనలు జరుగుతున్నా విశ్వవిద్యాలయ యంత్రాంగం మౌన ప్రేక్షకురాలిగా వుండి పోయింది కనుక సహించలేక సంగతేమిటో చూడమని కేంద్రమంత్రి దత్తాత్రేయ రాశారు. ఆయన రాసిన తరువాత పట్టించుకోకపోతే ఎలా అంటూ మరో మంత్రి స్మృతి ఇరానీ రాశారు. సుశీల్‌ కుమార్‌ పై దాడి, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కట్టు కధ అన్నది తేలిపోయింది. ఈ విషయాలు మంత్రికి తెలియకుండా వుండవు. అయినా ఎందుకు రాశారంటే రోహిత్‌ వ్యతిరేకించిందీ, చావక ముందు వరకు వ్యతిరేకిస్తున్నదీ, ద్వేషిస్తున్నదీ హిందూత్వను. దానికి బండారు దత్తాత్రేయ ఒక స్థంభం వంటి వ్యక్తి. అందుకే అంతగా స్పందిచారు.

విద్యార్ధులు చెబుతున్నది, బయటికి వారికి కనిపిస్తున్నదీ దత్తాత్రేయ, సంబంధిత శాఖ మంత్రిని స్మృతి ఇరానీ ఒకదాని తరువాత ఒకటిగా లేఖలు రాసిన తరువాత విశ్వవిద్యాలయ అధికారులు తీసుకున్న చర్యల పర్యవసానం రోహిత్‌ బలవన్మరణం. అసలు వీటన్నింటిలో అతని కుల ప్రస్తావన ఎక్కడ వుంది? అతను విశ్వవిద్యాలయంలో దళితుడిగానే పరిచయమయ్యాడు, దళితులు ఎక్కువగా వుండే అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యకర్తగానే మరణించిన తరువాత దళిత విద్యార్ధి ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి తప్ప మరొకటి కాదు.

దళిత విద్యార్ధి, అందునా వ్యక్తిగత కారణాలు కాకుండా ఒక సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక కారణాలతో బలవన్మరణం చెందాడు కనుక సహజంగానే యావత్‌ దేశంలో కదలిక వచ్చింది. దాని తీవ్రత తగ్గించటానికి సంఘపరివార్‌ మేథావులు కనుగొన్న చిట్కా రోహిత్‌ దళితుడు కాదు బిసి అని చెప్పటం. కులాంతర వివాహాలు చేసుకున్న వారి కులం ఏదవుతుంది, వారికి పుట్టిన బిడ్డల కులం ఏది అనే వివాదాలపై కోర్టులలో అనేక కేసులు నడిచాయి. హిందూ పర్సనల్‌ లా ప్రకారం తండ్రిది ఏ కులమైతే బిడ్డలకు ఆ కులం అన్నది ఒక అంశం. ఇక్కడ తల్లి దళిత తండ్రి బిసి, సాధారణ సూత్రం ఇక్కడ వర్తించదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బిడ్డలు ఏ వాతావరణంలో పెరిగారనే దానిపై ఏ కులం వర్తిస్తుందనేది నిర్ణయించాలని కొన్ని సందర్బాలలో కోర్టులు చెప్పాయి. ఇక్కడ ప్రభుత్వ గుర్తింపును బట్టి బిసి వడ్డెర కులం ఒక అడుగు దళిత కులం కంటే ముందు వుండవచ్చు గానీ సామాజికంగా చూస్తే అగ్రకులాలనబడే వారి దృష్టితో చూసినా జీవన పరిస్ధితులను చూసినా రెండూ ఒకటిగానే వుంటాయి. రోహిత్‌ చిన్న తనం నుంచి తల్లికి చెందిన దళిత కుల వాతావరణంలోనే పెరిగాడు తప్ప వేరు కాదు. అసలు ఇక్కడ తేలాల్సిన సమస్య అది కాదు. దళితుడైనా, బిసి అయినా ఓసి అయినా సంఘప్రచార్‌ హిందూత్వ పోకడలను వ్యతిరేకించటం దగ్గర మొదలైంది. అందువలన తేల్చాల్సింది, తేల్చుకోవాల్సింది దాని గురించి, హిందూత్వను వ్యతిరేకించేవారందరినీ ఏదో విధంగా వేధిస్తారా ? దాన్ని సమాజం సహించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ‘పాలనా దక్షుడే కాదు మహా నటుడు’

24 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Narendra Modi, Rohith Vemula, RSS, RSS Double game, Subramany swamy, University of Hyderabad (UoH), Vemula Rohit

Snapshot of the front page of The Telegraph, January 23, 2016.

courtesy : The Telegraph

ఎం కోటేశ్వరరావు

ప్రధాని నరేంద్రమోడీ ! గొప్ప ‘పాలనా దక్షుడు’, అంతకంటే ఆయనో ‘మహానటుడు’ అన్నది హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి వేముల రోహిత్‌ మరణించిన ఐదు రోజుల వరకూ చాలా మంది గుర్తించలేదు. అన్నింటి కంటే ఆయన వెనుక వున్న మేథో చెరువు(మాయా బజార్‌ సినిమాలో ఘటోద్గజుడు చెప్పినట్లు ఎవరూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయి వేయండిరా వీడికో వీరతాడు అన్నట్లు థింక్‌ టాంక్‌కు నా అర్ధం)లో వున్న వ్యూహకర్తలు ఇంకా తెలివి గల వారు. ఆయనెంతటి పాలనా దక్షుడు కాకపోతే ముఖ్యమంత్రిగా తన పదమూడు సంవత్సరాల, తన విధానాల కొనసాగింపు వారసురాలి రెండు సంవత్సరాలు వెరసి 15 ఏళ్లలో గుజరాత్‌ నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్లకు నీరు అందించాల్సి వుండగా ఇప్పటి వరకు లక్షా 17వేల 026 హెక్టార్లకు అందించగలిగినా, ప్రధాన కాలవలు పూర్తయి, పొలాలకు నీరందించాల్సిన పిల్లకాలవల తవ్వకం 21శాతం పూర్తి కావటమంటే 35 సంవత్సరాల నర్మదా ప్రాజెక్టు చరిత్రలో సాధించిన ‘ఘనత ‘కాకపోతే మరేమిటి? అంతేనా నీటిలో పరిశ్రమలకు కేటాయించిన 0.20 ఎంఎఎఫ్‌(మిలియన్‌ యాకర్‌ ఫీట్‌)కు గాను ఇప్పటికే 0.25 కేటాయించటం మామూలు విషయమా? వ్యవసాయం కంటే పరిశ్రమలకు పెద్ద పీట వేసినట్లు కాదూ !!

ఇక నటుడిగా నరేంద్రమోడీ గురించి చెప్పాలంటే ఆయనొక మట్టిలో మాణిక్యం. తెలుగు సినిమాల్లో పేద పాత్రలు వేసేటపుడు కూడా చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటే మన హీరో, హీరోయిన్ల గ్లామర్‌ ఎక్కడ తగ్గిపోతుందో అని పట్టుబట్టలను చింపి వేయటమో , కలల్లో అందమైన దుస్తులతో కూడిన దృశ్యాలను చూపటమో చేసినట్లుగా నరేంద్రమోడీ సందర్బానికి తగినట్లు దుస్తులు మార్చటంలో పేరు మోశారంటే నటుడు కాకపోతే సాధ్య మౌతుందా ? ఆయన తనదైన బ్రాండ్‌ కుర్తాను ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వదిలిన విషయం తెలిసినదే.ఏంజెలా మెర్కెల్‌ పర్యటన సందర్బంగా ఆమె ఏ రంగు కోటు వేసుకుందో అదే రంగు కోటును తాను ధరించటం, మరొక సందర్బంలో ఒకే రోజు నాలుగు కార్యక్రమాలకు నాలుగు దుస్తులు మార్చిన ఘనత మోడీ వంటి సామాన్యుడు, టీ అమ్మిన వారికి తప్ప మరొకరికి సాధ్యంకాదు.ఏదో సమయానికి కనపడిన దుస్తులు వేసుకుంటాను తప్ప తనకు దుస్తుల డిజైనర్‌ ఎవరూ లేరని అదీ నేటితరం విద్యార్ధులతో చెప్పటం ఒక మహానటుడికి తప్ప మరొకరికి ఎలా సాధ్యం ? నరేంద్రమోడీ హావభావాల గురించి తాజాగా కొల్‌కతా నుంచి వెలువుడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక సచిత్రంగా వెల్లడించింది. వరుసగా సోమ, మంగళ,బుధ, గురువారాలలో వివిధ కార్యక్రమాలలో ఎంతో వుల్లాసంగా, వుత్సాహంగా కనిపించిన ప్రధాని శుక్రవారం నాటికి లక్నోలో తీవ్ర విచార సాగరంలో మునిగి పోయారు. రోహిత్‌ మరణం గురించి (ఐదురోజుల తరువాత) బొటబొటా కన్నీరు కార్చారు.అదీ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో, కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన తరువాత కూడా అలా చేయకపోతే ఎలా ! ఈ సందర్బంలో కూడా మా భారతి అంటూ రోహిత్‌ తల్లిని సంబోధించారు. రాధిక అన్న ఆమె పేరును పలకటానికి కూడా ఇచ్చగించలేదా ? సంఘపరివార్‌ ప్రచారక్‌లు ప్రతిదానికీ భారత్‌, భారతి అనే పదాలను ముందు, వెనుకా తగిలించటంలో పెద్ద శిక్షణే పొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తాను గొప్ప జాతీయ వాదినని ప్రదర్శించుకొనేందుకు తాను ఏర్పాటు చేసిన అనేక సంస్ధలకు వాటిని తగిలించింది. భారతీయ జన సంఘ్‌, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌,అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌, విద్యాభారతి, విజ్ఞాన భారతి, సంస్కార భారతి ఇలా….ఒక ప్రచార్‌క్‌గా పనిచేసేందుకు కట్టుకున్న భార్యనే వదిలేసిన నరేంద్రమోడీ జీవితకాలమంతా చేసే ప్రసంగాలలో భారత్‌, భారతి అని పదే పదే పలికి చివరికి రోహిత్‌ తల్లిని కూడా మా భారతి అన్నారేమో . మా మోడీ ఆ ఆర్ధంతోకాదు భారత మాత ఒక బిడ్డను కోల్పోయింది అన్నారని ఎవరైనా టీకా తాత్పర్యం చెప్పవచ్చు. ఏదైతే ఏమైంది వదిలేయండి, మొసలి కన్నీరు ఎవరికి కావాలి?

కులుబర్గి, దాద్రి వుదంతాల తరువాత కూడా నరేంద్రమోడీ ఏమీ నేర్చుకోలేదా ? ఆయన మేథో చెరువులోని కప్పలు అంతకు ముందు రాసిన స్ట్రిప్టులను కాపీ చేసి యధాతధంగా ఎప్పటి కప్పుడు అందిస్తున్నాయా? ఏమో అలాగే కనిపిస్తోంది. వారు మోడీ ప్రతిష్ట పెంచేందుకు చేస్తున్న సాయం, పడుతున్న కష్టం ఏమిటో తెలియదుగానీ దేశ పౌరులకు చేస్తున్న మేలుకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి. కులుబర్గి హత్యా వుదంతంలో కొంత మంది మేథావులను అయినా కదిలించగలిగారు, దేశంలో అసహన ధోరణుల గురించి తెలియని వారికి తెలియచెప్పారు.తమ పండగ సందర్బంగా గొడ్డు మాంసం తిన్న ముస్లిం కుటుంబం ఆవు మాంసం తింటున్నారంటూ దాడి చేసిన దాద్రి ఘటనలో కుటుంబ యజమానిని చంపివేసిన సందర్బంగా చాలా రోజుల వరకు మోడీ నోరు తెరవకుండా వ్యూహం రచించి ఆయనపై భ్రమలు పెంచుకున్న నయా వుదారవాద ముస్లింలలో సైతం పునరాలోచన కలిగించటంలో మోడీ తెరవెనుక మేథావులు జయప్రదమయ్యారు. ఇప్పుడు కూడా దళిత విద్యార్ధి రోహిత్‌ విషయంలో కూడా దానినే అమలు జరిపి బిజెపి దళిత మోర్చా కూడా భరించలేని పరిస్ధితిని తెచ్చి మొత్తం దళితులను, ఇతర బలహీన వర్గాలకు ఎంతో జ్ఞానోదయం కలిగించారు. నూటికి నూరు శాతానికి కలగదు అది వేరే విషయం.

ప్రపంచ చరిత్రలో ఒక చిన్న సంఘటన జనానికి సామూహిక చైతన్యం కలిగించి పెను మార్పులకు నాంది పలికిన వుదంతాలు చాలా వున్నాయి. రష్యాలో జనానికి జార్‌ ప్రభువుపై అసంతృప్తి వున్నప్పటికీ మరోవైపు ఎక్కడో నమ్మకం కూడా వుంది. అందుకే 1905లో జపాన్‌లో యుద్ధం సందర్భంగా లెనిన్‌ తదితరులు తిరుగుబాటుకు ప్రయత్నిస్తుండగా ఫాదర్‌ గోపన్‌ నాయకత్వంలో జార్‌కు తమ కోర్కెలను విన్నవించుకొనేందుకు వెళ్లిన జనంపై జార్‌ సైన్యం జరిపిన మారణ కాండ రష్యన్‌ విప్లవాన్ని వేగవంతం చేసింది. లెనిన్‌ తదితరులు జార్‌ను నమ్మవద్దని చేసిన హెచ్చరికలను జనం ఖాతరు చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జపాన్‌ ఓడిపోయి సలాంగొట్టిన స్ధితిలో హిరోషిమా,నాగసాకీలపై అమెరికన్లు అణుబాంబులు వేసి ప్రపంచాన్ని అణ్వాయుధ పోటీకి నెట్టి వనరులను ఎంత వృధా చేయటానికి కారకురాలైందో తెలిసిందే. అలాగే మోడీ ఆయన పరివారం ఇలాంటిది అని ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు, మధ్యలో మరికొందరు చెప్పినా ఆ , వారు రాజకీయం చేస్తున్నారు, అలాగే చెబుతారులే అని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు నిజమే అని కనీసం అంతరంగంలో అయినా అనుకుంటున్నారు. సమయం వచ్చినపుడు తామేం చేయగలరో నిర్ణయించుకోవటానికి అది చాలు.

నిజానికి కలుబుర్గి, దాద్రి, రోహిత్‌ వుదంతాలపై నరేంద్రమోడీ స్పందన సంఘపరివార్‌ వ్యవహారశైలికి అనుగుణంగానే వుంది. ముందు ఆత్మ సమర్ధన, ప్రత్యర్దులపై ఎదురు దాడికి దిగువ స్థాయి సైన్యాన్ని వినియోగిస్తారు.అది వికటించిన తరువాత నష్ట నివారణ చర్యలలో భాగంగా ఏదో ఒక మొక్కుబడి ప్రకటన చేయిస్తారు. కులుబర్గి హత్యను ఖండించకుండా కేంద్ర సాహిత్య అకాడమీపై వత్తిడి తెచ్చింది, అడ్డుకున్నదీ మోడీ సర్కారే. చివరికి అవార్డు వాపసీ వత్తిడితో ఒక ప్రకటన చేయించారు, తరువాత దాద్రి హత్యతో కేంద్రానికి సంబంధం ఏమిటని ఎదురుదాడి చేశారు. తిన్నది గోవు మాంసం కాదని తెలిసి కూడా జర్మన్‌ నాజీ గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకొని సమర్ధించుకోవటమేగాక గోవును చంపిన వారిని చంపివేయమని వేదాలు కూడా చెప్పాయంటూ స్వయంగా సంఘపరివార్‌ అధికార పత్రికలో రాశారు. తరువాత ఘనమైన నరేంద్రమోడీతో నోరు విప్పించారు. ఇప్పుడు రోహిత్‌ వుదంతంలో కూడా అదే జరిగింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎబివిపి పలుకుబడి ఏమిటో ప్రదర్శితం కావాలంటే దానిని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేసి మావారి జోలికి వస్తే మా తడాఖా చూపుతాం అని చెప్పేందుకే ఇద్దరు కేంద్రమంత్రులతో వత్తిడి తెప్పించి తమ నైజాన్ని ప్రదర్శించారు.అది వికటించటంతో దాన్ని తప్పుదారి పట్టించేందుకు, విశ్వవిద్యాలయ అధికారులపై కేంద్ర మంత్రులు తెచ్చిన వత్తిడి, జోక్యం విషయాన్ని మరుగుపరిచేందుకు కాషాయ పరివారం ఎన్ని పాట్లు పడిందో, పడుతోందో దేశమంతా చూసింది. అతను దళితుడు కాదు బిసి అంటూ ప్రారంభించి చెప్పని అబద్దం లేదు. పరివార్‌ సంస్ధ ఏబివిపి నాయకుడిని కొట్టారని, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కూడా కట్టుకధే అని పోలీసులే స్వయంగా కోర్టుకు తెలిపారు. మధ్యలో తాను జోక్యం చేసుకోకపోతే అసంపూర్ణంగా వుంటుందనుకున్నారేమో సుబ్రమణ్య స్వామి అందుకున్నారు. బహుశా నరేంద్రమోడీ స్క్రిప్ట్‌ రైటర్స్‌ దృష్టిలో ఈ పాత్ర లేదేమో ? సరిగ్గా మోడీతో లక్నోలో రోహిత్‌ మరణంపై విచార కన్నీరు కార్పించే సమయంలోనే సుబ్రమణ్యస్వామి తన ట్వీట్ల ద్వారా రోహిత్‌ మరణంపై కమ్యూనిస్టులు, వారికి విశ్వాసపాత్రంగా వుండే కుక్కలు మాత్రమే నిరసన అనే ఆందోళన డ్రామా ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌ విశ ్వరూపంలో ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ. ఇంకా చూడాల్సింది చాలా వుంది. హిట్లర్‌ పోయినా హిట్లరిజాన్ని సమర్ధించే, ఆచరించే వారసులు పుట్టుకు వస్తున్నట్లే ఇంత జరిగినా ఎవరైనా తామింకా పరివార్‌ సంస్ధలను, కార్యకలాపాలను సమర్ధిస్తామంటే చేసేదేముంది .ఇది స్వేచ్ఛా భారతావని !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రాహ్మణిజానికి అనుకూలమో ! వ్యతిరేకమో తేల్చుకోవాలి !!

23 Saturday Jan 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Brahminism, Hinduthwa, Social reformers, Vemula Rohit

సత్య

వినదగు నెవ్వరు చెప్పిన………

     వినినంతనే వేగపడక గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అసలేం జరుగుతోందో తెలుసుకోవాలి? ముందు ముందు ఏం చేయాలో ఆలోచించాలి. అంతకు మించి మరొక మార్గం లేదు. వుద్రేక పడితే ప్రయోజనం లేదు. ఈ మధ్య సామాజిక మీడియాలో అనేక అంశాలపై చర్చ జరుగుతోంది. అది మంచిదే, కానీ కొందరు మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పిన మాదిరి ఎదుటివారిపై మరకలు పడేస్తున్నారు. కొన్ని అంశాలను ఈ సందర్బంగా అవలోకించ మనవి. కొందరు తీవ్ర బ్రాహ్మణ వ్యతిరేకత చూస్తుంటే బాధేస్తోంది అంటున్నారు. దానిలో వాస్తవం లేకపోలేదు. నిజమే తాము బాధ్యులం కాని దానికి తమను నిందిస్తే ఒక్క బ్రాహ్మణులేమిటి ఏ కులం వారిపై నిందవేసినా, విమర్శలు చేసినా , వివక్ష చూపినా బాధపడటం సహజం.హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మ హత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడిగా పుట్టటం నేరమా అంటూ వేసిన ప్రశ్న అలాంటి బాధలోంచి వచ్చిందే. కొన్ని సమస్యలను కూలంకషంగా అర్ధం చేసుకోకపోతే కొన్ని సందర్బాలలో అపార్ధాలకు దారితీయటం, అనేక పర్యవసానాలకు మూలం అవుతోంది.

     అలాంటి వాటిలో బ్రాహ్మణ వ్యతిరేకత ఒకటి. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత్‌, పశ్చిమ ప్రాంతాలలో ఇదొక ప్రధాన చర్చనీయాంశం. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లు దీనికి ఎవరు కారకులు అన్న చర్చలోకి పోతే తేలదు. ఏం చేయాలో ఆలోచించాలి. చరిత్రలో ఇలానే ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు అంటే కొన్నింటికి సమాధానాలు దొరకవు.దేవుడి దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పే వారు అదే దేవుడు కొందరిని అంటరాని దళితులుగా , వారితో సమంగా వివక్షకు గురి అవుతున్న మహిళలుగా ఎందుకు పుట్టించాడు. శాఖా బేధాలు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ ఘనీభవించి పోయిన మన దేశంలో అవి అగ్ర అనుకొనేవా లేక అధమ అనిపిలిచేవా ఏవైనప్పటికీ అంతర్గతంగా ఒకరి నొకరు తక్కువగా చూసుకోనివి, విభేదాలతో కొట్టుకోని కులాలు ఏమున్నాయి? తమకు మొత్తంగా ఎసరు వచ్చిందనుకున్నపుడు రాజీపడుతున్నాయి.

     బ్రాహ్మణిజం-బ్రాహ్మణ వ్యతిరేకత విషయానికి వస్తే మనుస్మృతి, వేదాలు,పురాణాలు, వుపనిషత్తులు ఇంకా అలాంటి వాటన్నింటిలో చెప్పినవి,మధ్యలో చొప్పించినవి,భిన్న వ్యాఖ్యానాలు చేసినవి కలిపి హిందూయిజం లేదా హిందుత్వ, హిందూ జీవన విధానం ఏ పేరుతో అయినా పిలవనివ్వండి వేల సంవత్సరాలుగా హిందూగా చలామణిలోకి వచ్చాయి. అవి సమాజంలోని మెజారిటీ ప్రజానీకాన్ని అణచివేశాయి, అవకాశాలు దక్కకుండా చేశాయి, చీకట్లో వుంచాయి. రాజులు, రంగప్పలు, భూస్వాములు,జమిందార్లు, జాగీర్దార్లు ప్రాంతాన్ని బట్టి పేర్ల మార్పు తప్ప అలాంటి ఫ్యూడలిస్టు(భూస్వామిక) పాలకవర్గాలన్నింటికీ ఆశ్రిత తరగతిగా, సలహాదారులుగా, అవకాశాలు దొరికితే మంత్రులుగా, పాలకులుగా, హిందూయిజానికి భాష్యం చెప్పేవారిగా బ్రాహ్మణులు కొనసాగుతూ వచ్చారు, అందుకే హిందూయిజానికి మారుపేరుగా దానిని బ్రాహ్మణిజం అని కూడా పిలిచారు. ఎవరైనా తాము అ పురాతన భావాలకు ప్రతినిధులం అని భావిస్తే తిరోగమన వాదుల ప్రశంసలతో పాటు పురోగమన వాదుల విమర్శలనూ ఒకే విధంగా తీసుకోకతప్పదు.

    బ్రాహ్మణిజంతో పాటు బ్రాహ్మలను వ్యతిరేకించాలని పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ పిలుపునందుకొని బ్రాహ్మణిజానికి ప్రతిరూపంగా వున్న బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించిన రోజులు గతంలో వున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో రామస్వామి నాయకర్‌ స్ధాపించిన జస్టిస్‌ పార్టీ అనుయాయులు బ్రాహ్మణ వ్యతిరేకతలో భాగంగా పెళ్లి మంత్రాలు చదువుకొని కమ్మ, రెడ్డి బ్రాహ్మణులుగా అవతారమెత్తి వివాహాలు చేయించిన వుదంతాలు కూడా వున్నాయి. నిజానికి మంత్రతతంగం బ్రాహ్మణిజంలో భాగమే అని వారు గుర్తించలేకపోయారు.అంటే బ్రాహ్మణులను తప్ప బ్రాహ్మణిజాన్ని వారు వ్యతిరేకించ లేదు. పెరియార్‌ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా హేతువాదిగా మారితే తరువాత తరంలో పుట్టిన అంబేద్కర్‌ తన జీవితాంతం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడి అలసిపోయి చివరి దశలో బౌద్దమతాన్ని పుచ్చుకున్నాడు తప్ప బ్రాహ్మణులను వ్యతిరేకించలేదు. అలా వ్యతిరేకించి వుంటే అంబేద్కర్‌ అనే ఒక బ్రాహ్మణుడి ఇంటి పేరును తన ఇంటి పేరుగా కొనసాగించి వుండేవారు కాదు, ఒక బ్రాహ్మణ యువతిని ద్వితీయ వివాహం చేసుకొని వుండేవారు కాదు. అందువలన బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వారిలో రెండు ధోరణులూ వున్నాయి.ఇప్పుడు పెరియార్‌ అనుచరులుగా వున్నవారు కూడా బ్రాహ్మణులను వ్యతిరేకించాలని పిలుపు ఇవ్వటం లేదు. అదే జరిగి వుంటే తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఎలా అవుతారు. ఎవరైనా ఫేస్‌బుక్కులో అలాంటి సందేశాలు పెట్టి వుంటే వాటిని పట్టించుకోనవసరం లేదు. బ్రాహ్మణిజానికి పాలకవర్గాలు మద్దతు ఇచ్చినంత కాలం దాని ఫలాలను అనుభవించిన బ్రాహ్మణులు ఇపుడు ఆ పరిస్ధితి లేదు, దాని దుష్పరిణామాలను తాము అనుభవించాల్సి వస్తోంది కనుక వారు కూడా సమాజంతో పాటు మారాల్సిన అవసరం వుంది.

       ఇక బ్రాహ్మణులుగా పుట్టి బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించినవారు మన దేశంలో కోకోల్లలు. బెంగాల్‌లో 1772లో పుట్టిన రాజా రామమోహనరాయ్‌ పేరు ఇప్పటికీ ఏదో ఒక మూలన పెట్టుకుంటూనే వుంటున్నారు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణిజం లేదా హిందూయిజం రుద్దిన సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్త.అదే ప్రాంతంలో పుట్టిన మరో గొప్ప సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ కూడా బ్రాహ్మణుడే.తెలుగువాడైన గురజాడ అప్పారావు పంతులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి పరంపరగా తరువాత కాలంలో ఎందరో బ్రాహ్మణులు సంఘసంస్కరణ వుద్యమం నుంచి మరొక అడుగు ముందుకు వేసి కమ్యూనిస్టులుగా కూడా కూడా మారిన చరిత్ర మన కళ్ల ముందు వుంది.

     ఇలాంటి వారందరినీ హిందూత్వ పదికాలాల పాటు కొనసాగాలనుకొనే ఛాందసులు కులంలో తప్పు పుట్టారని నిందించారు. అలా కులంలో తప్పు పుట్టిన వారిగా పేరు తెచ్చుకున్నవారిలో తెలుగునాట పోలేపెద్ద నరసింహమూర్తి( ఆంధ్రకమ్యూనిస్టు కమిటి తొలి కార్యదర్శి) పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, నండూరి ప్రసాదరావు, కంభంపాటి సత్యనారాయణ , చండ్రరాజేశ్వరరావు, మగ్దుం మొహిద్దీన్‌, గుంటూరు బాపనయ్య, రావినారాయణ రెడ్డి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎందరో మనకు కనిపిస్తారు. వర్తమాన తరానికి వస్తే ఈ పరంపరను కొనసాగిస్తున్న సీతారామ్‌ ఏచూరి సిపిఎం జాతీయ కార్యదర్శి. బ్రాహ్మణులతో పాటు వివిధ కులాలకు చెందిన వీరందరూ తమ జీవితకాలాల్లో బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వారే. సకల శ్రామికవర్గాన్ని పీల్చిపిప్పి చేసే పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ధను కూల్చివేయాలని పిలుపునిస్తూ కమ్యూనిస్టు ప్రణాళిక రూపొందించిన కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు ఆ పెట్టుబడిదారీ వర్గంలోనే పుట్టారు. తన కంటే ముందున్న మతంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏసుక్రీస్తు, హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధాన్ని స్ధాపించిన గౌతమ బుద్దుడూ, అంతెందుకు రాక్షసరాజు కుటుంబంలో పుట్టిన ప్రహ్లాదుడు తాము పుట్టిన వర్గానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే. అంతకంటే మనకు మరొకరి మార్గదర్శకత్వం అవసరం ఏముంది? మనం ఒక కులం లేదా మతం, కుటుంబంలో పుట్టటం అనేది యాదృచ్ఛికం తప్ప మరొకటి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు కాకుండా మన జీవితానికి ఒక అర్ధం, సంతృప్తి వుండాలంటే మనం ఎక్కడ పుట్టినా శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి అన్నట్లు మనం సమాజ పురోగమనానికా తిరుగమన ప్రతినిధులమా అన్నది నిర్ణయించుకోవాలి.

    హిందూయిజం లేదా బ్రాహ్మణిజాన్ని విమర్శించినంత మాత్రాన బ్రాహ్మణులందరూ తమనే విమర్శిస్తున్నారని భావించనవసరం లేదు.ముందే చెప్పుకున్నట్లు హిందూయిజం మన సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. దయానంద సరస్వతి వంటి వారు హిందూపురాణాలు పేర్కొంటున్న విగ్రహారాధన, అంటరానితనం, బాల్యవివాహాల వంటి ఇతర మూఢనమ్మకాలను వ్యతిరేకించి హిందూ సమాజ సంస్కరణలో భాగంగా కులవివక్షలేని వేదకాలాన్ని పునరుద్దరించాలని కోరుకున్నారు. అందుకోసం ఆర్యసమాజాన్ని స్ధాపించారు. అయితే దానితో పాటు ఇతర మతాలలోకి మారిన వారిని శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి మార్చాలనే వివాదాస్పద కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రతిపాదించారనేది వేరే విషయం. ఇప్పుడు సంఘపరివార్‌ సంస్ధలు చెప్పే ఘర్‌వాపసీ కార్యక్రమానికి మూలం అదే.

      హిందూత్వ లేదా బ్రాహ్మణిజాన్ని విమర్శిస్తున్నారని బాధపడే వారు బ్రాహ్మణులైనా, లేదా ఇతర కులాల వారి ముందు రెండే మార్గాలు వున్నాయి. బిడ్డ తల్లి గర్భంలోంచి ఒకసారి బయటకు వచ్చిన తరువాత తిరిగి వెనక్కు వెళ ్లటం ఎంత అసాధ్యమో రోసిపోయిన హిందూత్వ కూడా అలాంటిదే. ఒక వేళ ఎవరైనా చరిత్రను వెనక్కు తిప్పాలని అమలుకు పూనుకుంటే ఇస్లామ్‌లో షరియత్‌పేరుతో ఛాందసులుగా, వుగ్రవాదు లుగా మారిన తాలిబాన్లను అనుసరించటం. అందుకు పూనుకున్నపుడు విమర్శలు , ప్రతిఘటనలు రాకుండా ఎలా వుంటాయి బాధ పడటమెందుకు అనుకోవాలి లేదా కాలం చెల్లిన హిందూత్వ లేదా బ్రాహ్మణిజానికి మేం కూడా వ్యతిరేకం అనుకున్నపుడు ఎవరైనా వాటిని విమర్శించినందుకు చింతించాల్సిన అవసరం లేదు. అందువలన ముందు ఎటు వుండాలో తేల్చుకోవాల్సి వుంది. కుండలో కూడు కుండలోనే వుండాలి, పిల్లాడు దుడ్డుగా తయారు కావాలి అన్నట్లుగా అనేక అవలక్షణాలున్న హిందూత్వ లేదా బ్రాహ్మణిజం అలాగే వుండాలి, దాన్ని ఎవరూ పల్తెత్తు మాట అనకూడదంటే కుదరదు.

     రాజారామ్మోహనరాయ్‌, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, జ్యోతిబాపూలే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి ఎందరో సంస్కర్తల పతాకను సమున్నతంగా ఎగురవేస్తూ , విమర్శలను సహించే ఏకత్వంలో భిన్నత్వానికి ప్రాతినిధ్యం వహించే మహత్తర భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకుపోయే, తాతగారి నాన్నగారి భావాలకు పాడెకట్టే ముందుయుగం దూతల వారసులు వున్న దేశం ఇది. విమర్శలను సహించక తప్పదు. మీరూ విమర్శించండి, నిజాల నిగ్గు తేల్చండి, మా మనోభావం, మా నమ్మకం అంటే కుదరదు. ఎవరి నమ్మకాలు, ఎవరి మనోభావాలు వారికీ వుంటాయని గుర్తించండి.జనాన్ని మెప్పించండి, నొప్పించకండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Intervene in the Rohith Vemula Case:A Plea to the President

22 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

academics and scholars, Central University of Hyderabad, Plea to the President, Rohith Vemula, University of Hyderabad (UoH), Vemula Rohit

A group of 189 academics and scholars are sending a letter to President Pranab Mukherjee asking him to take steps to ensure, inter alia, that the Vice Chancellor of Hyderabad University is dismissed and Rohith Vemula’s family is given an ex-gratia payment of Rs 50 lakhs:

We, the undersigned teachers and researchers of Central Universities, research institutes and institutions of higher education in India, and independent scholars appeal to you to intervene with the MHRD and the Government of India to ensure the constitutional right to life and liberty and the freedom to educate, organise, and agitate are upheld in all educational institutions. 

The death of Rohith Vemula of the University of Hyderabad is a grief that is impossible to bear, made even worse with the revelations that the toxic mix of anti-Dalit, Hindutva-inspired exclusionary politics that took Rohith’s life involved at least two ministries of the Central government, and a Member of Parliament of the ruling party. This incident also foregrounds the disastrous consequences of the lack of institutional autonomy in institutions of higher education, and the resultant lack of accountability to the university community of those entrusted with the responsibility for administering them – in this case, the Vice Chancellor and his entire administrative machinery.  

As teachers, we are deeply aware of the many challenges that higher education faces in India today, including the fact that our university spaces have had, and in many cases continue to have, an exclusively upper-caste character that is downright hostile to the well-being and education of marginalised sections –Dalit, adivasis, women, religious and sexual minorities. In our struggle, through our teaching, research and administrative duties, to refashion institutions of higher education into democratic spaces substantively accessible to the most downtrodden in our society, we draw upon the resources created by the social engagement of marginalised groups both within and without the University.

Students’ groups that give voice to critiques of the violence of caste, class, and gender hegemonies and religious majoritarianism, and instill in each student the self-belief that (s)he can “travel to the stars,” are integral to this process of social transformation and if anything, the most constitutional of all.  To label Ambedkarite groups “casteist” and to accuse those that campaign against the death penalty of being “extremist,” “terrorist” and “anti-national” displays an ignorance of the philosophical foundations of human dignity.  Universities and institutes of higher education have a critical role to play in the development and understanding of philosophies of resistance and justice.  

Far from fostering equality of access and opportunity in our universities, the government of India has, over the past year and a half, repeatedly assaulted the autonomy and freedom of university spaces and their constituents. The expulsion of five student activists, one of whom was Rohith Vemula, of the Ambedkar Students Association in the University of Hyderabad is both one of a long string of such violations and a cataclysmic one, as a promising young academic and Dalit activist ended his life. The trail of letters made public show not only the direct official involvement of the MHRD in relentlessly haranguing the university to take action against these student activists, they also demonstrate a contemptible interest in bolstering the fortunes of the student wing of the ruling party, the Akhil Bhartiya Vidyarthi Parishad. This naked meddling in the internal affairs of a university is deserving of censure in itself, but the fact that these partisan interventions resulted in a total suspension of the principles of natural justice in the university response to these directives — the five ASA scholars were punished without a hearing — shows that the MHRD and the UoH administration have scant respect for justice and the rule of law. 

String of suicides

It is also in order here, to underscore the fact that there has been a string of suicides by Dalit research scholars in the University of Hyderabad under successive administrations.  This is the decimation of an entire generation that has struggled to break through in an extremely hostile social environment, to enter the university, believing that its portals will deliver the promise of liberation, only to find that the only plea they can make is for a length of rope in the room of every dalit student and euthanasia (as Rohith wrote in his letter to the Vice Chancellor last month).

Rohith Vemula lost his life at the hands of a callous university administration that was instigated to act thus by the central government. Even in death, he was not accorded the dignity that should accrue to all human beings and citizens of this country — his body was not handed over to his family and friends and hastily cremated by the police. Further, the vice-chancellor of the UoH, in a complete breach of responsibility, left the campus within an hour of Rohith’s death, and there has been no university administration in place in the crucial period following the death of a student on campus.  Although he is faced with the death of a student under his watch, and as a direct result of actions undertaken by him, the Vice Chancellor has refused to meet Rohith’s mother and offer an official explanation in person of the circumstances leading to the death of her son.  

In his final letter, Rohith asked those who wished him well, not to weep for him. He was right: this is not the time for tears but for decisive action on your part. We demand your urgent intervention to ensure that the following steps are immediately taken:

  • A withdrawal of all measures taken or proposed to be taken by the MHRD, UGC, or any other government department that seeks to police, monitor, restrict, or otherwise control the liberty of all students, especially Dalits, women, and sexual and religious minorities.
  • Immediate revocation of the suspension of the four student activists of the Ambedkar Students Association suspended by the UoH administration and withdrawal of all police cases against them.
  • Immediate dismissal of the UoH Vice-Chancellor, Appa Rao.
  • Ex-gratia payment of Rs 50 lakhs to Rohith Vemula’s family and the guarantee of employment to a family member.
  • Investigation, prosecution, and/or departmental action of any individual or official involved in the persecution of Rohith Vemula and his fellow student activists of the Ambedkar Students Association. 
  • A moratorium on the practice of the discontinuation of fellowships as a disciplinary measure for all students across all universities in the country. 
  • An assurance from the Government of India and particularly the MHRD that it will respect the institutional autonomy of all institutions of higher education, and that it will promote university cultures in which the values of democratic pluralism, human equality and dignity are upheld.
  • An unequivocal assurance from the government of India that it will desist from its attempts to install nominees friendly to its right wing Hindutva ideology as heads or administrators of higher educational institutions.

Signed,

Ayesha Kidwai Professor

Kalpana Kannabiran Professor

S Anandhi Associate Professor

Rahul Roy Professor

Surinder S. Jodhka Professor JNU New Delhi

Vasanth Kannabiran Writer Asmita

Padmini Swaminathan Professor

Rustom Bharucha Professor

K. Kalpana Assistant Professor

Utpal Lahiri Visiting Professor

Prachinkumar Ghodajka Assistant Professor

Prabir KC Consultant Independent

Tanmoy Bhattacharya Professor of Linguistics UNIVERSITY OF DELHI

Kaushik Bhaumik Associate Professor

Chirashree Das Gupta Associate Professor

Sahni, Madhu Professor J.N.U.

U.Vindhya Professor

Padmaja Shaw Rtd Professor Osmania University

Dr Sanjay Nagral Head Dept of Surgery

Ravi Duggal Independent Researcher Jan Swasthya Abhiyaan

Nivedita Menon Professor

Sumi Krishna Independent Scholar

Soma Kishore Parthasar Independent researcher

Franson Manjali Professor J.N.U.

Ritesh Kumar Assistant Professor

Sunita Independent Researcher

Bindhulakshmi Pattadat Associate Professor

R.Gopinath Professor Jamia Millia Islamia

Ameet Parameswaran Assistant Professor

Arijit Chakrabarty Assistant Professor

Sachidanand Sinha Professor

P.Madhavi Member Human rights forum

Amit Upadhyay Assistant Professor TISS Hyderabad

Uma Chakravarti Retd University teacher

Anand Chakravarti Retd University teacher

Shilpaa Anand Assistant Professor

Dr.Shahida Associate Professor

Rohini Hensman Writer Independent scholar

Saradindu Bhaduri Teacher

M. Vijayabaskar Associate Professor

Dr.Gabriele Dietrich Professor (rtd)

Khairunnisa Nakathorige Assistant Professor

Gayatri Reddy Associate Professor

MANGAI Academician & Artist

Samar Sinha Asst. Prof. Sikkim University

Ajit Menon Professor

R.Santhosh Asst. Professor IIT Madras Chennai

Carol Upadhya Professor

Praveena Kodoth Associate Professor

Sudeshna Sengupta Research Scholar

K.Srilata Professor IIT Madras

Ambili K R Kannur University

Santhakumar V Professor Azim Premji University

Rahul Kamble Assistant Professor

Rahul Govind Assistant Professor University of Delhi

Sanghamitra Misra Assistant Professor University of Delhi

Zidheeque A P Research Scholar Manuu Hyderabad

Rajeev B R Health activist

K Venkata Subrahmany Professor

Chandrashekar Professor Amrita university

Urmimala Sarkar Munsi Associate Professor

P. S. Manojkumar Assistant Professor

V.Sujatha Professor JNU

Farheen Taha Postgraduate student

Supriya RoyChowdhury Professor

Janaki Nair Professor

V. Geetha Writer and Publisher Independent Scholar

Rohit Assistant Professor JNU

Brahma Prakash Assistant Professor

Moushumi Basu Associate Professor

Deepak Mehta Professor SNU

Rekha Pappu Associate Professor

Saptarshi Mandal Assistant Professor

Rahul Balusu Assistant Professor EFL-U

Shikha Jhingan Associate Professor

Indranil Dutta Assistant Professor

Vimal Thorat Retired Professor

Aparna Sundar Visiting Faculty Azim Premji University

Shikha Bhattacharjee Senior Researcher

Aproorvanand Professor

Gayatri Menon Assistant Professor Azim Premji University

Dhruv Raina Professor JNU

Sreeparna Ghosh Assistant Professor

Udaya Kumar Professor

Shyla Doctor Ashwini Gudalur

Babu Thaliath Professor

Dr Sivadasan P Associate Professor University of Calicut

Pooja Venkatesh Research Associate Azim Premji University

Sumangala Damodaran Associate Professor

Binitha Thampi Assistant Professor IIT Madras, Chennai

Madhava Prasad Professor EFL University

Prabhat Patnaik Professor Emeritus

G. Arunima Professor

Navaneetha Mokkil Assistant Professor

Veena Shatrugna Former Deputy Director

Ajay Patnaik Professor

Hari Madhab Ray Asst Professor

Amar Jesani Independent researcher

Albeena Shakil Fellow IIAS Shimla

Mohan Rao Professor

Prabhu Prasad Mohapat Associate Professor

M Parameswaran Associate Professor

Yasmeen Arif Associate Professor

Jaivir Singh Professor

Reddeppa Associate Professor

S.Suraparaju Assistant Professor

Vineeta Bal Scientist

Himanshu Associate Professor

Y. Madhavi Sr Principal Scientist NISTADS

A Oommen Biochemist

Sunkari Satyam Assistant Professor

Sowjanya Assistant Professor

Ch Shankar Rao Assistant Professor

Chandramohan S poet PK Rosi foundation

Mini Sukumar Assistant Professor

Simona Sawhney Associate Professor

Beena PL Associate Professor

Qudsiya Contractor Asistant Professor TISS, Mumbai

C h e r a y i R a m a d Writer Freelancer

J Devika Associate Professor

Meena Gopal Associate Professor TISS, Mumbai

Danyasi Sivakumar Post Doctoral Fellow

Imrana Qadeer Visiting Professor CSD (New Delhi)

Chitra Kannabiran Scientist L.V. Prasad Eye Institute

Kumkum Roy professor

Sneha Palit Researcher

Govinda Distinguished Professor

Akhil Alha

K.N.Harilal Professor

Dr. Wandana Sonalkar Professor

Poornima M Associate Fellow

Tara Nair Professor

Anita Ghai Professor

Mary John Senior Fellow

Keshab Das Professor

Mannika Chopra Managing Editor, Social

Wrick Mitra Assistant Professor

Shyamolima Ghosh Chou Research scholar University of Delhi

Arathi PM Associate Fellow

Arindam Banerjee Associate Professor

Akhila Vasan Co-Convener

Samuel

Gopalji Pradhan Associate Professor A U D

Jafar K Post-Doctoral Fellow CSD Hyderabad

Sonika Gupta Associate Professor HSS, IITM

Anubhuti Maurya Assistant Professor

Soumya Vinayan Assistant Professor

Janaki Srinivasan Asst Professor Panjab University

Susan Paul Visvanathan Professor CSSS/SSS JNU

Meena Radhakrishna Independent researcher

Rama Srinivasan PhD Candidate Brown University

Nasir Tyabji Former Professor and Di

Monica Sakhrani Associate Professor

Manoranjan Mohanty Professor

Sonia Sawhney Assistant Professor

Meena Radhakrishna Independent researcher

Chitra Harshvardhan Professor JNU

K.C. Bindu Assistant Professor

Dr MA Sikandar Registrar

Mohan Rao Professor

Kamal Mitra Chenoy Professor

K B Saxena Professor

Anuradha Chenoy Professor

Bidyut Mohanty Head, Women Studies

Dr.K.Valentina Assistant Professor

A.K. Ramakrishnan Professor

Chayanika Shah Visiting Faculty TISS Mumbai

Parul Malik Research Assistant Ambedkar University

Leela PS Assistant Editor

Jhuma Sen Assistant Professor

Anjali Monteiro Professor

K.P. Jayasankar Professor

Smita Gupta Director

Asha Hans Professor (Retd)

Dr. Smita Mishra Panda Professor

Rukmini Sen Associate Professor

Shambhavi Prakash Assistant Professor

Leon Morenas Associate Professor

Ekramul Haque, Research Scholar

Shailaja Menon, Assistant Professor

Farida Khan Professor Jamia Millia Islamia

Gurujegan M Assistant Professor

Mitra Ranjan Media Coordinator RTE Forum

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాయర్‌ కాదు లయర్‌ !

22 Friday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, Hinduthwa, Rohith Vemula, RSS, Vemula Rohit

షరియత్‌ను అంటే తాలిబాన్లు, మరి హిందూత్వను రుద్దే వారు జీహాదీలు కాదా ?

ఎం కోటేశ్వరరావు

పవిత్ర మత యుద్ధం జరపాలనే వారందరూ వున్మాదులే, వుగ్రవాదులే ఎవరికి నచ్చిన పేరు పెట్టుకోండి.మన దేశానికి వస్తే అకుపచ్చ తాలిబాన్లు మైనారిటీ, కాషాయ తాలిబాన్లు మెజారిటీ. ఎవరు చెప్పినా మతాన్ని రక్షించాలి, మతం చెప్పినదాన్ని పాటించాలి లేకుంటే అంతు చూస్తాం, ఇదేగా జరుగుతోంది. స్వతంత్ర పార్టీ మితవాద శక్తులు ప్రారంభించిన స్వరాజ్య పత్రికను ఇప్పుడు చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా స్వరాజ్య నినాదం, వుద్యమాలతో సంబంధం లేని, మతవాదులు దానిని స్వాధీనం చేసుకొని భారత దేశ మితవాద అభిప్రాయాలు చదవండనే తోక తగిలించుకొని మరీ దానిని ప్రచురిస్తున్నారు.పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.

రోహిత్‌ వేముల కారల్‌ సగాన్‌ అనే శాస్త్రవేత్త అంతటి వాడు కావాలనుకున్నాడు, కానీ కారల్‌ మార్క్స్‌ నాశనం చేశాడు అనే పేరుతో ఆ పత్రికలో తేజస్వి సూర్య అనే కర్ణాటక బిజెపి లాయర్‌ ఒక వ్యాసం రాశాడు. భారతీయ విశ్వవిద్యాలయాలలో కమ్యూనిస్టు-జీహాదిస్టులు వుమ్మడిగా ఎక్కించిన దానికి ఒక దళిత విద్యార్ధి ఎలా బలయ్యాడో చూడండనే ఆర్గ్యుమెంట్‌ను సదరు లాయరు వినిపించాడు. వామపక్ష-దళిత విద్యార్ధి రాజకీయాలకు వేముల రోహిత్‌ బలయ్యాడని ఆరోపించారు. ఒక బిజెపి నేత అంతకంటే భిన్నంగా చెబుతాడని ఎవరైనా ఎలా వూహిస్తారు. అతని ఆత్మహత్యకు నేటి రాజకీయ వ్యవహారాలు,దేశంలో విద్యార్ధి రాజకీయాలు నడుస్తున్న తీరు, మన విద్యావిషయాల స్ధితితో పాటు దేశంలో దళితుల కార్యాచరణ అవినీతి గురించి మర్చిపోవద్దంటారు.

ఇంతకీ ఈ పెద్ద మనిషి కడుపు మంట ఏమిటంటే దేశంలో నేడు అత్యధిక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ‘కమ్యూనిస్టు లేదా మార్క్సిస్టు బ్రాండ్‌లైన దళిత-ఇస్లామిక్‌ రాజకీయాలకు కేంద్రాలుగా మారాయట, ప్రేమ ముద్దుల ప్రచారం, శిక్షపడిన వుగ్రవాది యూకూబ్‌ మెమెన్‌ సంస్మరణ సభలూ, మహిషాసుర దినాలను పాటించటం, గొడ్డు మాంస విందుల వంటి వాటన్నింటినీ వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో, మైనారిటీ, ఇతర వుప హక్కుల పేరుతో వామపక్ష-జీహాదీ కుమ్మక్కు విశ్వవిద్యాలయాలలో నడుస్తోందట.

కాలం చెల్లిన కమ్యూనిజంతో యువత బుర్రలను పాడు చేయటంతో పాటు హిందూ అంటేనే దేన్నయినా వ్యతిరేకించటం నేర్పాయట, ఇది వందలాది దారుణమైన దాడులకు ముఖ్యంగా కేరళ, బెంగాల్‌, తెలంగాణాలో వారికి వ్యతిరేకమైన సిద్ధాంతాలున్నవారిపై జరిగేందుకు దోహదం చేశాయట. ఇలా సాగిన ఆ వ్యాసం చివరికి ఎటు తిప్పి వుంటారో ఊహించటం కష్టం కాదు. కేవలం తోటి విద్యార్ధి ఎబివిపికి చెందిన వాడైన కారణంగానే అతని మీద దారుణమైన దాడికి రోహిత్‌ పాల్పడ్డాడట.

ఈ లాయర్‌ తప్పుడు కేసులు వాదిస్తాడనటానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.ఈ కట్టుకధను గుడ్డిగా నమ్మే కేంద్ర మంత్రులు విశ్వవిద్యాలయంపై వత్తిడి తెచ్చి రోహిత్‌ మరణానికి కారకులయ్యారన్నది దాస్తే దాగని సత్యం. ఎబివిపి విద్యార్ధిని రోహిత్‌, ఇతరులు కొట్టినట్లు, గాయాలైనట్లు ఎక్కడా లేదు, గాయాల కోసం ఆసుపత్రిలో చేరలేదని అపెండిసైటిస్‌ కారణంగా చేరినట్లు పోలీసులు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి సదరు లాయర్‌ కేరళ,బెంగాల్లో జరిగాయని చెబుతున్న దాడులలో నిజం ఎంతుందో అర్దం చేసుకోవచ్చు. సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు ఎంత సాధు పుంగవులో అనేక ప్రాంతాలలో జరిగిన మత కొట్లాటలలో పాల్గొన్న తీరు లోకం చూసింది. గుజరాత్‌ మారణకాండకు పాల్పడిన వారందరూ సాధుపలవలు అని ఈ లాయర్‌ నమ్మబలుకుతున్నారా ? కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల చేతిలో ఎందరు అమాయకులు బలయ్యారో లోకానికి తెలియదా ? కుమారుడిపై జరిగిన దాడే అవాస్తవమని పోలీసులు చెబుతుంటే తనపై కూడా దాడికి ప్రయత్నించారని ఎబివిపి విద్యార్ధి తల్లి కొత్త కథను చెప్పారు. తల్లులందు పుణ్యతల్లులు వేరయా అంటే ఇదేనేమో.

ఇక ఆ లాయర్‌ మనువాది సావర్కర్‌, దానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన అంబేద్కర్‌ శత్రువులు కాదని దళిత విద్యార్ధులు తెలుసుకోవాలట. ఎంత చక్కని వ్యాఖ్యానం ! అంటే అంబేద్కర్‌ కూడా మనువాదే అని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పటమే.అంతే కాదు కమ్యూనిజం, ఇస్లాంకు వ్యతిరేకంగా అంబేద్కర్‌ తన జీవితాంతం పోరాడారని ఈ విషయాలను దళితుల్లో ఎబివిపి సైద్ధాంతికంగా ప్రచారం చేయాలని బోధనొకటి.ఇంతటి పచ్చి అసత్యాలను చెప్పిన ఆ పెద్దమనిషి లాయర్‌ కాదు లయర్‌ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామాజిక , వర్గ సమస్యలపై జమిలిగా కార్యరంగంలోకి దిగాలి

21 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

caste system, class exploitation, Rohith Vemula, social oppression, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

      చచ్చినా చలించని లోకం అని తెలియని పసివాని స్ధితిలో హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ రోహిత్‌ బలవన్మరణం పాలయ్యాడు. దేశమంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. సమాజ చరిత్రలో ఎందరో వీరులు సమాజం కోసం, జన హితం కోసం వురికొయ్యలతో వూయలులూగారు, ప్రత్యక్ష పోరులో వీరమరణం పొందారు. ముందుగా ప్రకటించి మరీ ప్రాణత్యాగాలు చేశారు. అయినా చలించలా. అందుకు లోకాన్ని నిందిస్తామా ? ఎవరైనా అలాచేస్తే వచ్చే వుపయోగం వుండదు, తాము చెయ్యాల్సిన కర్తవ్యాన్ని కూడా నీరసంతో నిర్వర్తించలేరు. ఇలాంటి వుదంతాలు జరిగినపుడు అందరూ ఒకే విధంగా స్పందిస్తారని ఆశించకూడదని ఇప్పుడు మరోసారి రుజువైంది.ఈ సందర్బంగా సహజంగానే దళిత వుద్యమాలు, భవిష్యత్‌ గురించి అనేక మందిలో చర్చ, అంతర్మధనం మొదలైంది.

    వినదగునెవ్వరు చెప్పిన వినిన0తనే వేగ పడక అన్నట్లు చర్చలో ముందుకు వచ్చే అన్ని అంశాలను ప్రతి వుద్యమకారుడూ వుద్రేక పడకుండా సహనంతో మంచిచెడుల గురించి ఆలోచించాలి. గతంలో జరిగిన దాని గురించి గుణపాఠాలు తీసుకోవాలే తప్ప దెప్పి పొడుపులు, ఎవరి బాధ్యత ఎంత అన్నది ముందుకు రాకూడదు. ఇది వ్యక్తిగతమైనదో లేక కొందరు వ్యక్తులకు సంబంధించినదో కాదు. ఆర్ధిక వ్యవస్ధతో ముడిపడిన ఒక పెద్ద సంక్లిష్ట సామాజిక సమస్య. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సమస్యను మనదైన పరిష్కారంతోనే స్వస్థి పలకాల్సి వుంది. ఒక విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు అటువంటి పరిస్ధితి ఎందుకు వచ్చింది, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఎలా చూడాలి అన్నది సభ్య సమాజ వైఖరిగా వుండాలి పోయి, అతడు దళితుడు కాదు బీసి అని, బీసి బంధువు దత్తాత్రేయ మీద విమర్శలా అని సమస్యను పక్కదారి పట్టించటానికి బిజెపి పార్టీకి చెందిన రెండు విభాగాలే పూనుకోవటాన్ని చూశాము. అలాగే ‘ విశ్వవిద్యాలయ అవమానత్వం, పెత్తందారీతనం, క్రూరత్వం, కుల,మత రాజకీయం ఎంత కారణమో -వాటి మీద పోరాడుతున్న దళిత, బహుజన వుద్యమాలూ, ప్రగతిశీల శక్తులూ కూడా రోహిత్‌ మరణానికి అంతే కారణం’ అని ఒక వ్యాఖ్యాత చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? నిరాశా, నిస్పృహలు వుండవచ్చు గానీ ఇలాంటి వ్యాఖ్యలు, నిర్ధారణలకు రావటం వలన పైన పేర్కొన్న శక్తులకే ప్రయోజనం తప్ప వాటిని వ్యతిరేకించే వారికి కాదు. నిజానికి రోహిత్‌ మరణం చుట్టూ తిరుగుతున్న అంశాలను చూస్తే అవి కేవలం తక్షణ దళిత సమస్యలు కావు. దేశం మొత్తానికి సవాలు విసిరిన హిందూత్వను వ్యతిరేకించే , ఒక వుదంతంపై తమ అభిప్రాయం చెప్పుకొనే ప్రజాస్వామిక స్వేచ్ఛ హక్కు ఇమిడి అంశం. రోహిత్‌ చెప్పిన అంశాలంటూ సామాజిక మీడియాలో తిరుగుతున్న వీడియోలో అదే వుంది. ఎంతో స్పష్టంగా తన భావాలను రోహిత్‌ వెల్లడించాడు.

     నిజమే మూకుమ్మడి వుద్యమం చేసి వుంటే రోహిత్‌ బతికి వుండేవాడే. జరగకపోవటానికి కారకులు ఎవరు ? అటువంటి వుద్యమాలు చేసే వాతావరణం వున్నదా ? ఆ వ్యాఖ్యాతే చెప్పినట్లు ‘ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్ధులు అంబేద్కరిస్టు స్టూడెంట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన వాళ్లు,యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించుకోవటం మీదే వారి ప్రధాన దృష్టి. బయటి సంస్ధలతో వారికి పెద్ద సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం దళిత సంఘాలతో కూడా వారికున్నది అరకొర మైత్రి మాత్రమే’ అంటూనే ప్రగతిశీల వుద్యమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం విచారకరం.

    ఈ రోజు అస్థిత్వ ధోరణులు సమాజాన్ని వూపివేస్తున్నాయి. వాటికి గురికాని వారు దాదాపుగా లేరంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా అక్కడి వారు పిలిచినా పిలవక పోయినా తెలియచేయకపోయినా తెలిస్తే చాలు వుద్యమకారులు వాలిపోయి వారితో మమేకమైన వుదంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడా పరిస్ధితి వుందా?

      అవినీతి వ్యతిరేక ఆందోళనలో భాగంగా న్యూఢిల్లీలో అన్నా హజారే నాయకత్వంలో జరిగిన దీక్షలు, నిరసనల గురించి తెలిసినదే. మొత్తం రాజకీయ పార్టీలన్నీ ఒకటే అనే పేరుతో అవినీతికి దూరంగా వున్న వామపక్షాలతో సహా అన్నింటినీ దూరంగా పెట్టి రాజకీయ రహితం పేరుతో నడిపించిన విషయం తెలిసిందే. తరువాత దానిలో ఒకరైన కేజ్రీవాల్‌ స్వంత రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు. కిరణ్‌బేడీ బిజెపిలో చేరిపోయారు.జనరల్‌ వీకె సింగ్‌ ఇపుడు మోడీ మంత్రివర్గంలో సభ్యుడు. అన్నా హజారేను అరెస్టు చేసినపుడు వామపక్షాలు ఖండించాయి తప్ప అంతకు మించి ముందుకు పోతాయని ఎవరైనా ఎలా ఆశిస్తారు. ప్రతి వుద్యమం వెనుక ఏదో ఒక లక్ష్మం వుంటుంది. బయటకు చెప్పనిదేదో వుంది కదా అని అవినీతి వ్యతిరేక వుద్యమానికి మద్దతు పలకకుండా ఎలా వుంటారు? ఈ వుద్యమం పట్ల దళితనేతల లేదా మేధావుల వైఖరి ఏమిటి ? అది అగ్రవర్ణాల వుద్యమం అని చంద్రభాను ప్రసాద్‌ వ్యాఖ్యానిస్తే, మనువాది వుద్యమం, సామాజిక న్యాయ వ్యతిరేకం, దళితులు, గిరిజనులు, ఓబిసీలకు దానితో సంబంధం లేదు, వ్యతిరేకిస్తామని కంచె ఐలయ్య పేర్కొన్నారు.

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక సంఘం ఏర్పడి ఆందోళనలు చేస్తుంటే దళిత సంఘాలు దూరంగా ప్రేక్షక పాత్ర వహించాయి. దానిలో సిపిఎంలో పని చేసే కార్యకర్తలు చురుకుగా పనిచేస్తుండవచ్చు, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వున్న బివి రాఘవులు రంగారెడ్డి జిల్లాలో యాత్ర చేస్తే దాన్నొక రాజకీయ ప్రయోజన చర్యగా చూశారు. అంతెందుకు అస్ధిత్త ధోరణులు ఎంతగా పెరిగి పోయాయంటే స్త్రీల సమస్యలను స్త్రీలే పరిష్కరించుకోవాలి, దళితులు సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలి , బీసిల సమస్యలను బీసీలే పరిష్కరించుకోవాలి. ఇతరులకు వాటిలో స్ధానం లేదు, వారికి అసలు ఆ సమస్యలు తెలియవు అన్న ధోరణి ప్రబలిందా లేదా ? చివరికి అది ఇంకా ముదిరి పోయింది. లేకుంటే ‘వివిధ రంగాలలో వివిధ కోణాల నుంచి దళిత బహుజన జీవితాన్ని, అనుభవాల్ని విశ్లేషించుకుంటూ కొత్త కొత్త పోరాట రూపాల్ని ఆవిష్కరించటం ఇక్కడ మృగ్యం.ఎవరి కుల సంక్షేమం కోసం వారు కట్టుబడి వుండటం తప్ప వుమ్మడి పోరాటాల్ని చేపట్టటానికి ఇరుకు విబేధాల్ని పక్కన పెట్టే సమన్వయం లేదు.’ అని పైన నేను పేర్కొన్న వ్యాఖ్యాత వాపోవటం నూటికి నూరు పాళ్లు నిజం. ‘ సరైన అంబేద్కరిస్టు దృష్టితో కుల నిర్మూలనోద్యమాన్ని బలోపేతం చేయగలిగే వుద్యమాలు రూపొందక పోవటం దళిత బహుజన ప్రపంచానికి చెందిన తక్షణ ప్రశ్న. మన కోసం మనం నిలబడుతూ అందరి కోసం పోరాడాలనే పూలే స్ఫూర్తిని విస్మరించిన దళిత బహుజన సంఘాలు రోహిత్‌ లాంటి ఎంతో మంది విలువైన వ్యక్తుల్ని నిలుపుకోలేకపోతున్నాయి. కనుక ఈ కోణంలో రోహిత్‌ మరణానికి వర్తమాన దళిత బహుజన వుద్యమాలే ఎక్కువ బాధ్యత వహించాల్సి వుంది’ అని కూడా పేర్కొన్నారు. చివరకు రోజువారీ కుల నిర్మూలనా పోరాటాలతో మమేకమవ్వటమే మన ముందున్న కర్తవ్యం అని సూత్రీకరించారు.

    అంబేద్కర్‌ ప్రారంభించిన కుల నిర్మూలన ఒక ఆదర్శం. అది సాధ్యమా, సాధ్యం కావటానికి ఎంత సమయం పడుతుంది అనేవి వూహాజనిత ప్రశ్నలు. పై రచయితే చెబుతున్నట్లు ఎవరి కుల సంక్షేమం కోసం వారు కట్టుబడి వుంటున్నపుడు కుల నిర్మూలన ఎలా సాధ్య పడుతుంది? సమరశీల కుల నిర్మూలనా పోరాటాలు ఎలా జరుగుతాయి? అసలు ఐక్యత ఎలా కుదురుతుంది? అందువలన కుల గిరి ఆలోచనా పరిధి నుంచి బయట పడాలి. కమ్యూనిస్టులు తమ అంతిమ లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం అని చెబుతారు. దాన్ని చేరుకోవటానికి ఎన్నో మెట్లు ఎక్కాలి. మెట్టు ఎక్కకుండా మేడమీదకు ఎగిరితే నడుములు విరుగుతాయి తప్ప పైకి ఎక్కలేరు. అందుకే అలాంటి మెట్టుగా మన దేశంలో సిపిఎం జనతా ప్రజాస్వామిక విప్లవ దశ గురించి తన కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్లుగానే ప్రపంచంలో ప్రతి కమ్యూనిస్టు పార్టీ తన కార్యక్రమాన్ని రూపొందించుకుంటుంది. దాన్ని సాధించటానికి అనుసరించే ఎత్తుగడలు, మార్గాల గురించి విబేధాలు వేరే విషయం.

     పెట్టుబడిదారీ విధాన వయస్సుతో పోల్చితే మన దేశంలో ఘనీభవించి పోయిన కుల, మనువాద వ్యవస్ధ ఎన్నో రెట్లు ఎక్కువ. పెట్టుబడిదారీ విధానంలో 99శాతం కార్మిక వర్గానికి కనిపించే ప్రత్యక్ష శతృవు ఒక శాతం యజమాని మాత్రమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో అలా కాదు. ప్రతి మెట్టుకూ ప్రతి కులమూ ఒక యజమాని. అందువలన ఎదుర్కోవటం అంత తేలిక కాదు. అందువలన దళిత బహజన సంఘాలు కూడా అంతిమ లక్ష్యంగా కుల నిర్మూలన లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు.  సాధనకు మిత్రులను కలుపుకో తప్పదు. అనేక అవలక్షణాలున్న ఈ సమాజం నుంచి ఆదర్శవంతమైన కొత్త సమాజం రావాలి రావాలి తప్ప వేరే ఎక్కడి నుంచో ఊడి పడదు. అందుకే సామాజికోద్యమాలతో పాటు వర్గ వుద్యమాలనూ జమిలిగా సాగిస్తేనే ప్రయోజనం. ఏది ముందు, ఏది వెనుక,దేనికి మొదటి ప్రాధాన్యత, దేెనికి రెండవ ప్రాధాన్యత అన్న వృధా చర్చలోకి పోకుండా అంతిమ లక్ష్యానికి అనుగుణంగా ఏది ముందుకు వస్తే దానిపై కేంద్రీకరించి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. ఒకదాని కోసం మరొక దానిని వాయిదా వేయాల్సిన పనిలేదు. పక్కదారి పట్టాల్సిన అవసరం లేదు. కుల వ్యవస్ధలో సామాజిక అణచివేతతో పాటు వర్గ దోపిడీ కూడా మిళితమై వుంది. అందువలన కుల వ్యవస్ధపై పోరాటానికి వర్గదోపిడీని వ్యతిరేకించే శక్తులన్నీ కలసి వస్తాయి. ఒక సంస్ధలో వుండి పనిచేయలేమనుకుంటారా విడివిడిగా వుండొచ్చు, సమన్వయం చేసుకోవచ్చు, కలసి పనిచేయవచ్చు. ఈ దిశగా దళిత వుద్యమం, వామపక్షాలూ, ఇతర భావ సారూప్యత గల శక్తులు, వ్యక్తులూ అందరూ కలసి పనిచేయటమే రోహిత్‌కు సరైన నివాళి అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయితే ఏమిటట !

20 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

ABVP, BJP, Central University of Hyderabad, Dalit, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ దళితుడు కాదు బిసి: ఎబివిపి

అయితే ఏమిటట !

     వారు చెబుతున్నదాని ప్రకారం దళితుడు కాదు, వెనుకబడిన తరగతికి చెందిన యువకుడు. కావచ్చు, కాకపోవచ్చు, లేదు బిసి కాకపోతే ఓసి, ఓసీలోకూడా హిందూత్వను వ్యతిరేకించే గట్టి కార్యకర్త అనుకోండి…. అంతమాత్రాన అందుకు కారకులుగా విమర్శలను ఎదుర్కొంటున్నవారిని నిలదీయ కూడదా ? ఎంతో భవిష్యత్‌ వున్న ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్ధితుల గురించి ప్రశ్నించకూడదా ? నేరగాళ్లను వదలి వేయాలా? శిక్షించాలా ? ఎబివిపి వారికి వచ్చిన సమస్య ఏమిటి ?

దొరల పాలనా భావజాలం నుంచి బయటకురాని రాజకీయ నేతలే బీసి బంధువైన దత్తాత్రేయపై కుతంత్రాలకు పాల్పడుతున్నారు : బిజెపి ఓబిసి మోర్చా

అయితే ఏమిటట !

     ఒక విమర్శ రాగానే మోర్చావారికి మూర్ఛ రావాలా ? మోర్చా, ఎబివిపి రెండూ సంఘపరివార్‌ సంస్ధలే ఒకే నోటితో, అదీ నరం వున్న నాలుక నోటితో కదా మాట్లాడాల్సింది. విశ్వవిద్యాలయానికి దత్తాత్రేయ వుత్తరాల మీద వుత్తరాలు రాసి తోటి మంత్రి స్మృతి ఇరానీతో రాయించి ప్రతిభావంతుడైన ఒక బీసి విద్యార్ధి జీవితంతో అడుకుంటే అయన బీసి బంధువా ? బలి తీసుకొనే వ్యక్తా ? ఎన్ని నోళ్లు వున్నాయి ? వున్న నోటికి నరం వుందా ?

     ఇక్కడ వీరి బాధ రోహిత్‌ ఎవరన్నది కాదు, దేశానికి విషంగా మారిన కాషాయ హిందూత్వ, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను గట్టిగా వ్యతిరేకించటమే అసలు సమస్య. దీర్ఘకాలం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార్‌క్‌గా వున్న దత్తాత్రేయ, వారి బాటలో నడుస్తున్న మరో మంత్రి స్మృతి ఇరానీ, విద్యార్ధులు చెబుతున్నదాని ప్రకారం దళితులు, బిసిల పొడగిట్టని విసి పొదిలి అప్పారావు అత్యుత్సాహం మ్తొత్తంగా హిందూత్వ వున్మాదం, దానికి లొంగిపోవటమే రోహిత్‌ను బలి తీసుకున్నాయన్నది స్పష్టం.

ముంబై పేలుళ్ల వుగ్రవాది యాకుబ్‌ మెమెన్‌ను వురితీస్తే దాన్ని ఖండిస్తూ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో రోహిత్‌ పాల్గొన్నాడు: సోషల్‌ మీడియా, కాషాయ మీడియా సేవకులు

అయితే ఏమిటట !

     శవాల కోసం గగన విహారం చేయటమే రాబందుల పని, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ఎక్కడ సంఘపరివార్‌ సంస్ధలు, వ్యక్తులకు ఇబ్బంది వస్తుందా అని అక్కడ వాలి పోదామా అని రాబందుల మాదిరి హిందూత్వ ప్రచార సేవకులు వెంటనే సామాజిక మీడియాలో తమ పనిలోకి దిగి పోతారు. మెమెన్‌ వంటి ఒక జాతి వ్యతిరేక శక్తి మరణిస్తే అంతగా స్పందించిన రోహిత్‌ ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా స్పందించాలా అన్నట్లు వ్యంగ్యోక్తులతో ప్రచారానికి దిగారు.

     వుగ్రవాదులు విదేశాలలో కుట్ర చేసి దాడులకు పాల్పడ్డారా, స్వదేశంలోనే కుట్రలు చేశారా అన్నది సమస్య కాదు. ఎక్కడ చేసినా కుట్ర కుట్రే ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఎవరూ సమర్ధించరు. అనేక మంది హిందూ వుగ్రవాదులు జైళ్లలో వున్నారా లేదా ? స్వామి అసిమానంద ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. అజ్మీర్‌ షరీఫ్‌, మక్కామసీదు, మాలెగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయా కాదా ? తన నేరాలను మెజిస్ట్రేట్‌ ముందు అంగీకరించాడా లేదా ? దర్యాప్తు సంస్ధలు తనపై వత్తిడి తెచ్చాని బుకాయించాడు. అందులో ఆశ్చర్యం లేదు.అలా బుకాయించిన తరువాత కారవాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వుగ్రదాడులకు ఆర్‌ఎసెస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్‌ భగవత్‌ అంగీకరించాడని చెప్పాడు. తరువాత తానలా అనలేదన్నాడు. అయితే కారవాన్‌ పత్రిక ఆడియో టేపులను విడుదల చేసి అసిమానంద్‌ నిజస్వరూపాన్ని బయట పెట్టింది.యూకూబ్‌ మెమెన్‌ తనంతట తానుగా లొంగిపోయాడన్నది అందరికీ తెలిసిన నిజం. పేలుళ్ల కుట్రకు సంబంóంచి అనేక విషయాలు వెల్లడించాడు. వాటితో తనకు ఎలా సంబంధం లేదో చెప్పటానికే లొంగిపోయాడన్నది ఒక కధనం. దీన్ని కొంత మంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. యూకూబ్‌ మెమెన్‌ వురితీయాల్సిన వ్యక్తి కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ కాబినెట్‌ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగానూ, పరిశోధన మరియు విశ్లేషణ( రా) పాకిస్థాన్‌ విభాగానికి అధిపతిగా పనిచేసిన బి రామన్‌ ఒక వ్యాసంలో రాశారు. ఇదేమీ రహస్యం కాదు. అలా రాసినంత మాత్రాన ఆయన దేశవ్యతిరేక శక్తా ? వురి శిక్షలను మొత్తంగా వ్యతిరేకించే సిపిఎం మెమెన్‌ వురిని వ్యతిరేకించింది. యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరింది. ఇతర అనేక మంది ఈ అభిప్రాయాన్ని కలిగి వున్నారు. కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని కొందరు విద్యార్ధులు కూడా ఆ కారణంగానే సంతాపసభకు హాజరై వుండవచ్చు, వారిలో రోహిత్‌ ఒకరు కావచ్చు. తప్పేముంది ? ముంబైలో వేలాది మంది మెమెన్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత మాత్రాన వారంతా జాతి వ్యతిరేక శక్తులా ?

     జాతిపిత మహాత్మా గాంధీని చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌ గాడ్సేకు గుడి కట్టేందుకు, వాడి వర్ధంతి,జయంతులను పాటింటే వారు, వారికి మద్దతు పలికే హిందూత్వ శక్తులు దేశ భక్తులుగా చలా మణి అవుతుండగా వాటి గురించి ఏమిటని ఏ చర్యలు తీసుకున్నారని లేఖలు రాయటంలో సిద్ధ హస్తుడైన దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేఖలు రాయటం లేదు? అంతెందుకు మజీతియా వేజ్‌ బోర్టు సిఫార్సులను మీడియా సంస్ధలు అమలు జరపటం లేదన్నది బహిరంగ రహస్యం. జర్నలిస్టులు స్వయంగా అయనకు చాలాసార్లు మౌఖికంగా చెప్పారు, రాతపూర్వకంగా ఇచ్చారు, ఆ సిఫార్సులను అమలు జరిపేందుకు కేంద్ర కార్మికశాఖా మంత్రిగా రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిన బాధ్యత ఆయనదే . ఎన్ని రాష్ట్రాలకు,ఎన్నిసార్లు రాశారు?్ల సమాధానం రాకపోతే గుర్తు చేస్తూ మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు లేఖలు రాశారో చెప్పగలరా ? పత్రికలకు వివరాలు విడుదల చేయగలరా ? ఒక ఎంపీ, కేంద్ర మంత్రి దేశంలో ఏం జరిగినా పట్టించుకోవాలి కదా ?

హిందుత్వను, కాషాయాన్ని తానెంతగా వ్యతిరేకిస్తున్నాడో రోహిత్‌ చెప్పే వీడియోను కమలం గ్రూపు పేరుతో వున్నవారు సామాజిక మీడియాలో తిప్పుతున్నారు. అతని నిజస్వరూపం ఇది, అందుకు సాక్ష్యం అది అంటున్నారు.

అయితే ఏమిటట !

     వీడియోలో రోహిత్‌ చెప్పినదానిలో దానిలో తప్పేముంది? హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పటం లేదా దాన్ని గోడల నిండా చెడరాయటం లేదా ? ఆవును చంపిన వారిని కొట్టి చంపమని వేదాలు చెప్పాయని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్యలో వినయకృష్ణ చతుర్వేది రాయలేదా. రోహిత్‌ అంతకంటే దారుణంగా ఏమీ చెప్పలేదే. హిందూత్వ, దానికి విద్యార్ధులలో ప్రతినిధులుగా వున్న ఎబివిపి కనపడితే ఎదిరించమని తన సంస్ధ చెప్పిందన్నాడు .దళితులకు ఇంకేం నేర్పించిందంటే హిందూత్వగానీ, హిందువులుగానీ హిందూ పేరు చెప్పుకొని మైనారిటీలపైకి వచ్చే వాళ్లనిగానీ, దళితుల గురించి గానీ మాట్లాడే వారుగానీ కనపడితే ఎదిరించమని చెప్పింది అని చెప్పాడు. అంతే తప్ప కొట్టమనో, చంపమనో చెప్పింది అనలేదుగా !

     ఇక్కడ దళితుల గురించి మాట్లాడటం అంటే వారి కులం పేరు చెప్పి తిట్టటం, వర్ణవ్యవస్ధ పేరుతో ఎక్కడుండాల్సినోళ్లు అ్కడుండాలని అంటరానితనం పాటించటం వంటి హిందూయిజం కనపడితే ఎదిరించటమని అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పాడు. . ఎబివిపి హిందుత్వ గురించి చెప్పినట్లుగానే అదే అంబేద్కర్‌ విద్యార్ధి సంఘమూ చెబుతోంది.తరతరాలుగా మానవత్వానికే మచ్చ తెచ్చిన హిందూత్వ గురించి ఘనంగా చెప్పుకుంటున్నవారు వుండగా లేనిది అందుకు తరతరాలుగా బలై అవమానాలు పొందిన వారు దానిని ఎదిరించమని చెప్పటం ఎలా తప్పవుతుంది. దోపిడీ వ్యవస్ధను కూల్చివేయమని కమ్యూనిస్టులు బహిరంగంగా చెప్పటం లేదా? ప్రత్యర్ధి పార్టీని ఓడించటమని పిలుపివ్వని, కార్యకర్తలకు చెప్పని పార్టీ ఏదో చెప్పమనండి.

     గుజరాత్‌ మారణకాండ సందర్బంగా మూడు రోజుల పాటు ఏం చేయదలచుకుంటే అది చేయండని 2002లో ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ చెప్పారని నాడు భజరంగ దళ్‌ జాతీయ సమన్వయ కర్తగా వున్న హరేష్‌ భట్‌ చెప్పిన అంశాలు కూడా వీడియోలో వచ్చాయి. అంబేద్కర్‌ సంఘం లేదా సంఘపరివార్‌ను వ్యతిరేకించే వామపక్షాలు, ఇతర సంస్ధలు అలా చెప్పినట్లు వీడియోలు లేవే . సామాజిక మీడియాలో రోహిత్‌ వీడియోను తిప్పుతున్నవారు గుజరాత్‌ వీడియోను ఎందుకు చేయరు? అలాంటి వీడియోలను చూసిన తరువాత ఎవరైనా కాషాయ ముసుగులో జరిపే దారుణాలను వ్యతిరేకించనందుకు, అసహ్యించుకోనందుకు సిగ్గుపడాలి. వీడియో కనుక నిజమైనదైతే బ్యానర్లను చించి వుండవచ్చు, ప్రాణాలను తీయలేదే, గుజరాత్‌ మాదిరి మారణకాండకు రోహిత్‌ పాల్పడలేదే, ప్రోత్సహించలేదే ! వేలాది మంది ప్రాణాలు తీసిన గుజరాత్‌ మారణకాండలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరికీ వురి శిక్ష పడలేదేం ? శిక్షలు పడిన వారికి ఇంటి కంటే జైలు పదిలం అన్నట్లు సకల సౌకర్యాలు కల్పించటం సోషల్‌ మీడియాలోని కొంత మందికి కనిపించటం లేదా ? వారి బాధ ఏమిటి ?

విద్యార్ధులపై చర్యకు వత్తిడి చేయలేదు:బిజెపి నేతలు

    అరచేతిని చూసుకొనేందుకు అద్దం కావాలా? వరుసగా తెరిపి లేకుండా రాసిన లేఖల తేదీలు చూస్తే వత్తిడి చేసిందీ లేనిదీ తేటతెల్లమైంది. నిజంగా ఒక ఎంపీ, ఒక మంత్రి లేఖ రాస్తే ఒక చిన్న విషయం మీద ప్రభుత్వ శాఖలు అంతగా వెంటపడటం ఆశ్చర్యమే. ఎన్నికలలో లోక్‌పాల్‌, నల్లధనం వెలికితీత గురించి తాను లేఖ రాస్తే కనీసం ప్రధాని కార్యాలయం స్పందించి తిరుగు జవాబు కూడా రాయలేదని 18 నెలల తరువాత అన్నా హజారే అంతటి పెద్ద మనిషి వాపోయిన విషయం తెలియదా ? అగస్టు నుంచి లేఖల మీద లేఖలు రెండు మంత్రిత్వశాఖలు రాయటం వత్తిడి కాదా ? వైస్‌ ఛాన్సలర్‌ కొత్తగా వచ్చి విద్యార్ధుల బహిష్కరణ మీద చూపిన శ్రద్ధ, ఆసక్తి అంతకు ముందు విశ్వవిద్యాలయంలో కమిటీలు చేసిన సిపార్సులపై లేదెందుకు?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d