• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ANDHRA PRADESH

ఏపీలో అన్ని జాబ్ లు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ

01 Wednesday Jun 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, APPSC, jobs

బుధవారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం  అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేబినెట్ లో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

  • ఈ నెల 8న ఒంగోలులో మహాసంకల్ప సభ నిర్వహణకు ఏపీ కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరిట ఏపీలో ప్రారంభమైన ‘చంద్రన్న బీమా’ పథకం విధివిధానాలకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుందని, ఇది పేదలకు వరప్రసాదం వంటిదని ఆయన అన్నారు. అంగవైకల్యానికి రూ. 3,62,500 వరకూ డబ్బు చేతికి అందుతుందని అన్నారు. సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు అందుతుందని వివరించారు. 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాన్ని చంద్రబాబు నాయకత్వంలో రూపొందించినట్టు తెలిపారు. ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు.
  • జూన్ 10 నుంచి 20 వరకూ ఉద్యోగుల బదిలీలుంటాయన్నారు
  • మొత్తం 10వేల పోస్టులను మొదటి దశలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు
  • కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలపై సోషియో ఎకనమిక్ డేటా సర్వే నిర్వహిస్తామన్నారు
  • జూన్ 20 నుంచి 30 వరకు, వచ్చే నెల 5 నుంచి 30 వరకు పల్స్ సర్వే జరుపుతామన్నారు
  • ప్రభుత్వోద్యోగాల కోసం కోటి ఆశ‌ల‌తో ఎదురుచూస్తోన్న‌ నిరుద్యోగుల‌కు త్వర‌లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపిక‌బురు అందించ‌నుందని మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల జాతర ఇక మొద‌లు కానుంద‌ని చెప్పారు.
  • పోలీస్ మినహా అన్ని జాబ్ లు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు
  • త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్ -3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయని అందులో భాగంగా గ్రూప్-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో వెయ్యి పోస్టులు ఉండనున్నాయన్నారు
  • అత్యధికంగా పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుందని తెలిపారు.
  • నవనిర్మాణ దీక్ష కోసం జొన్న విత్తుల రచించిన గీతానికి, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచగా దాన్ని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
  • ప్రభుత్వ ఎయిడెడ్ , మున్సిపల్ పాఠశాల విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి  వెల్లడించారు.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ- చంద్రబాబు ప్రత్యేక హోదా రాజకీయ క్రీడలో అమాయక ఆంధ్రులు

01 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Narendra Modi, pavan kalyan, special status, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   మూడు ఆకర్షణలు-ఆరు ఫిరాయింపులుగా లాహిరి లాహిరిలో ఓ హో జగ(నే)మే వూగెనుగా వూగెనుగా అంటూ ఆనందంతో తేలియాడుతున్నపుడు అంతరాయం కలిగిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? వున్న రెండు కళ్లలో ఒకదానిని పొడుస్తున్నా ఎంతో సహనంగా అదీ మనమంచికే అన్నట్లు ,తాపీగా కుమారుడు లోకేష్‌కు అధికార పదవిని ఎలా, ఎపుడు కట్టబెట్టాలా అని చూస్తున్న చంద్రబాబుకు మధ్యలో అంతరాయం కలిగిస్తే చిరుకోపం కూడా రాకుండా వుంటుందా ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రహోదా గురించి మరిచి పొమ్మని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టం చేసిన తరువాత ‘ ఏ మాటలవి ‘ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తమలపాకుతో చంద్రబాబు నాయుడు చిరుకోపం ప్రకటించారు. మామ వాగ్దానం నెరవేర్చనందుకు కాదు, తోడల్లుడు కిసుక్కు మన్నందుకు అన్నట్లు ఇంతకాలం ఏమీ చేయకపోగా దాని గురించి మరిచిపోండి అన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వదలి కేసుల కోసం తప్ప ఏనాడైనా జగన్‌ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లారా అని చంద్రబాబు ఆగ్రహించారు. జగన్‌ తన కేసుల కోసమే తిరుగుతున్నారనుకుందాం. అందులో తప్పేముంది? కేంద్రంలో వున్న చంద్రబాబు మిత్ర పక్షం, స్వయంగా తెలుగు దేశం మంత్రులు కాబినెట్‌లో వున్నారు. అందువలన జగన్‌ ఢిల్లీ వచ్చి తన కేసుల గురించి ఏం పైరవీలు చేసుకుంటున్నారో, వాటిని తామెలా ఎదుర్కొంటున్నారో చెబితే వుపయోగం. కేవలం తిరుగుతున్నారంటే అర్ధం లేదు.

      నిజమే చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినట్లు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై అదనపు భారం మోపే దారి ఖర్చులు దండగతప్ప అదనంగా సాధించిందేమిటి అన్నది అసలు ప్రశ్న. పదహారు వేల కోట్ల రూపాయల లోటుకు కేవలం 2,800 కోట్లు మాత్రమే కేంద్రం సాయంగా అందించిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే ఆ మిగతా మొత్తం కూడా రాదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అలా పదే పదే ఢిల్లీ తిరగటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాట్టు పెట్టిన గత పాలకులు, పాలనను గుర్తు చేయటం లేదా ?వారికీ వీరికీ వున్న తేడా ఏమిటి ? తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్‌ గానీ వీటికి సమాధానాలు చెప్పాలి. అలాగాకుండా రోజంతా జగన్‌ భజన చేస్తూ వుంటే సామాన్య జనానికే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు కూడా విసుగు పుడుతుంది. 1978లో జనతా పార్టీ ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌ పూర్తిగా తనలో చేర్చుకున్నట్లుగా మరికొద్ది రోజుల్లో మిగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఏలను కూడా ‘అభివృద్ధి’ ముసుగులో తెలుగుదేశంలోకి ఆకర్షిస్తారు.ఆ తరువాత చెప్పుకోవటానికి ఏమీ వుండదు.

    రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇటుక ఇటుకనూ పేరుస్తూ నిమగ్నమైన చంద్రబాబుకు కేంద్రంపై ఆగ్రహం కలిగించటానికి తప్పితే తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ప్రయివేటు బిల్లుపెట్టటం ఏమిటి ? పెట్టెను పో దాని మీద చర్చ జరగనీయటం ఏమిటి? జరిగెను పో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది, కావాలంటే ఇంకా అదనంగా కూడా ఏం కావాలంటే అది చేస్తాం అని లాలీపప్‌ సమాధానం చెప్పటం గాక వాటి గురించి మరిచి పోండి అని కేంద్ర మంత్రి కట్టెవిరిచినట్లు మాట్లాడటం ఏమిటి ? మోడీ బాబా నోరు విప్పకుండా శిష్యులతో ఇలాంటి ప్రకటనలు చేయించటం కావాలని చంద్రబాబుకు ఇబ్బంది కలిగించటం కాదా ?

   తానొవ్వ, ఇతరులను నొప్పించక సజావుగా సాగిపోవాలనుకుంటున్న తనకు మధ్య మధ్యలో తలనొప్పి కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడికి తీయని కోపం వస్తోందా? అది శ్రీకృష్ణుడి మీద సత్యభామకు వచ్చినటువంటిదేనా ? తాను ఏం చెప్పినా, ఏం చేసినా ప్రశ్నించేవారు వుండకూడదు, అలా వుండాలంటే చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా పోవాలి, అది జరగాలంటే అన్ని పార్టీల వారూ తన పార్టీలో చేరి నోర్మూసుకోవాలి.అందుకే ఇతర పార్టీల వారికి గాలం.లొంగని వామపక్ష పార్టీల వారిపై కేసులు, దమనకాండ, దాడులు.

    ప్రత్యేక రాష్ట్ర హోదా చర్చ తలెత్తినపుడల్లా ఇబ్బంది పడుతున్నవారిలో చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. కాంగ్రెస్‌ మాదిరి తప్పు చేయవద్దని బిజెపికి సలహా ఇస్తూ ట్వీటర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. బిజెపిలో చేరిన కామెడీ హీరో శివాజీ వంటి వారికి కూడా కోపం వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడికీ తెలిసినంతగా మరొకరికెవ్వరికీ తెలియదు.

    ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా పొందాలంటే అందుకు ఎలాంటి పరిస్థితులు వుండాలో అసలు ప్రత్యేక రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశం ఎజండాలో లేక ముందే నిర్ణయించారు. అననుకూల పరిస్ధితులు వున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించి, పన్నుల రాయితీలు కల్పించాలని ఐదవ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు 1969తో జమ్ము-కాశ్మీర్‌, అస్సాం, నాగాలండ్‌ను ఈ తరగతిలో చేర్చారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, హిమచల ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌కు కూడా దానిని వర్తింప చేశారు. 1. కొండలూ,లోయలతో సంచరించటానికి కష్టంగా వుండే ప్రాంతాలు, 2. జనాభా సాంద్రత తక్కువ లేదా గణనీయ సంఖ్యలో గిరిజనులు వుండటం, 3. పొరుగు దేశాల సరిహద్దులతో వుండి వ్యూహాత్మక ప్రాంతాలలో వుండటం, 4.ఆర్ధిక, మౌలిక వసతుల విషయంలో వెనుకబడి వుండటం, 5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గిట్టుబాటు కాకపోవటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) ఆమోదం మేరకు ఈ హోదా కల్పిస్తారు.

    ఈ హోదాను పొందిన రాష్ట్రాలకు నిధులు ఎలా కేటాయించాలన్నదానిపై కూడా మార్గదర్శక సూత్రాలు వున్నాయి. ప్రణాళికా సంఘం సాయాన్ని మూడు తరగతులుగా విభజించింది. 1.సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సిఏ), 2. అదనపు కేంద్ర సాయం(ఎసిఏ) 3.ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సిఏ). కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలకు కేటాయించే సాధారణ కేంద్ర సాయం 100 అనుకుంటే ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 30, మిగతా వాటికి 70 అందచేస్తారు.ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించే నిధుల కేటాయింపునకు ప్రత్యేక నిబంధనలు వుంటాయి. సాధారణ సాయం ఈ రాష్ట్రాలకు 90శాతం గ్రాంటు, పదిశాతం రుణంగా వుంటుంది. అదే సాధారణ రాష్ట్రాలకు 30,70 శాతాలుగా వుంటుంది. సాధారణ రాష్ట్రాలకు కేటాయించే నిధులలో నిధులు 100 అనుకుంటే వాటిలో జనాభా మాషాకు 60, తలసరి ఆదాయాన్ని బట్టి 25, ఆర్ధిక వ్యవస్ధ పనితీరును బట్టి, ప్రత్యేక సమస్యలుంటే ఏడున్నర శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక ప్రాతిపదికలేమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులలో 2010-11 లెక్కల ప్రకారం సాధారణ కేంద్ర సాయం కేవలం ఐదుశాతం మాత్రమే వుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు, గిరిజన వుప ప్రణాళికలు, సరిహద్దు వుండేట్లయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేక సాయం అందుకుంటాయి. ఈ సదుపాయాలు కాకుండా ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన విధంగా ఎక్సయిజ్‌, కస్టమ్స్‌, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రాయితీలు పొందుతాయి. విదేశీ నిధులతో ఏర్పాటయ్యే పధకాలు, కేంద్ర ప్రభుత్వ పధకాల సాయం కూడా పొందుతాయి.

      నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘం స్ధానంలో నీతి ఆయోగ్‌ వునికిలోకి వచ్చింది. అదింకా పూర్తిగా కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తెలివిగా నీతి ఆయోగ్‌కు బాధ్యతను అప్పగించింది. అది ఇంకా పరిశీలిస్తూనే వుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టిన సందర్బంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని బిల్లులో చేర్చలేదు. దీనిని బిజెపి లేదా తెలుగు దేశం పార్టీలు అప్పుడు మౌనంగా వుండి ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నాయి. నిజానికి వాటికి చిత్త శుద్ధి వుంటే ఇప్పుడైనా విభజన చట్టానికి సవరణలు చేయవచ్చు. అయితే విభజన కారణంగా ప్రత్యేక హోదాలు కల్పించేట్లయితే అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాటితో నిమిత్తం లేకుండానే ఒడిషా వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కల్పించమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాయి. నిజానికి ఈ విషయాలు విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌, బిజెపిల పెద్దలతో పాటు తెలుగు దేశం నేతలకు కూడా తెలియనివి కావు. అప్పుడు మాకు తెలియ లేదన్నా లేదా తెలుసన్నా జనంలో అభాసుపాలు కావాల్సి వస్తుంది కనుక రాజకీయంగా కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నారు. దానికి వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది తామే అనుకున్నా ఇక్కడా జనం ఓడించారు, రాష్ట్రాన్ని చీల్చారనే కోపంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దానికి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జనాన్ని ఈ పార్టీలన్నీ బకరాలుగా చేసి వాడుకున్నాయి, ఇప్పుడు రాజకీయంతో ఆడుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Andhra Pradesh first state in the country to become Open Defecation Free in urban areas

30 Saturday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Open Defecation, urban areas

UD Secretary reviews progress of Swachh Bharat Mission with all 110 Municipal Commissioners

Andhra Pradesh is set to become the first State in the country to make all of its urban areas ‘Open Defecation Free’ by October 2nd this year, marking the two years of the launch of Swachh Bharat Mission by Prime Minister Shri Narendra Modi.

The State officials gave this assurance during a review of progress of Swachh Bharat Mission in all the 110 municipalities of Andhra Pradesh by Shri Rajiv Gauba, Secretary(Urban Development) at Visakhapatnam today. Shri Gauba went to the port city for review of progress of urban missions like Smart city Mission, Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) and Swachh Bharat Mission. He held extensive discussions with the Collectors of all the 13 districts and Municipal Commissioners of all the 110 urban local bodies in Andhra Pradesh on their action plans for ensuring sanitation.

During the review, it emerged that Andhra Pradesh which has been in the forefront of construction of toilets in urban areas can make all 100 municipalities Open Defecation Free by October 2 this year as per the action plans in progress.

As against the Mission target of construction of 1,94,336 individual household toilets in urban areas of Andhra Pradesh, work has started in respect of 1,53,779 and construction of 1,04,732 toilets has already been completed.

In addition to the central assistance of Rs.4,000 per toilet, Andhra Pradesh Government is extending assistance of an additional Rs.11,000 per toilet giving a big boost for the programme.

Regarding Community and Public Toilet seats, as against the mission target of 4,614 seats, work has started on 3,887 seats and 1,952 seats have already been constructed.

In respect of Solid Waste Management, out of the total wards of 3,458 in 110 municipalities, 100% door-to-door collection and transportation of such waste is being done in 3,072 wards i.e 89% of total urban wards in the state.

The State Governments has also awarded works for construction of 10 Waste to Energy Plants for generating 63 MW of power from the 6,440 tonnes of municipal waste being generated per day in the state. Shri Gauba was informed that these plants would be commissioned during 2017-18.

Shri Gauba complimented the State Government and all concerned officials for good progress under Swachh Bharat Mission in urban areas and for becoming the first state to make all urban areas open defecation free much ahead of the target this year.

Share this:

  • Tweet
  • More
Like Loading...

VDA points increased in AP

16 Saturday Apr 2016

Posted by raomk in AP, Current Affairs

≈ 3 Comments

Tags

ANDHRA PRADESH, Industrial Workers Consumer Price Index Numbers, VDA

The Commissioner of Labour, Andhra Pradesh, Hyderabad, and the Competent Authority under the Minimum Wages Act, 1948, has declared the average State Industrial Workers Consumer Price Index Numbers for the first half year ending December , 2015, as 1187 points (Base year 1982=100 series) for Industrial Workers under Part-I and 922 points (Base year 1986=100 series) for Agricultural Workers under Part-II  which are applicable for the period from  01.04.2016 to 30.09.2016 in various Scheduled Employments notified under the Minimum Wages Act,01948, for the purpose of calculation of Variable Dearness Allowance. Gazette notification will be issued in due course.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి బహిరంగ లేఖ

13 Wednesday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 2 Comments

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, jana sena party, pavan kalyan, special status to Andhra pradesh

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి

    మీ అభిమాని ఎం కోటేశ్వరరావు  వ్రాయు బహిరంగ లేఖ. అన్నా ఇలా రాస్తున్నందుకు మీరు అన్యధా భావించవలదు. ఎంతో బిజీగా వుంటారు కనుక లేఖలను మీరు చూసే అవకాశం వుండదు. మీ సిబ్బంది కూడా అభిమానుల లేఖలన్నింటినీ పూర్తిగా చదువుతారో లేదో అనే అనుమానంతో ఇలా రాయాల్సి వస్తోంది. మీరేమీ అనుకోరని అనుకుంటున్నా.

    మీ అభిమానులందరం రాజా గబ్బర్‌ సింగ్‌ కోసం ఎదురు చూస్తూ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా చూస్తూ ఆనందిస్తున్నాం. అన్నదానాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. మీ (మా) సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా వివిధ టీవీ చానల్స్‌ , పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించి ఖుషీ కలిగించి అభిమానులలో వున్న అనుమానాలను తొలగించారు. గత రెండు సంవత్సరాలుగా లేస్తే మనిషిని కాను అన్న కుంటి మల్లయ్య మాదిరి మీ పీకె మాటలు తప్ప ఇంతవరకు పీకిందేమీ లేదని అంటుంటే ఎంత గుడ్డి అభిమానులమైనా అడ్డగోలుగా మిమ్మల్ని సమర్ధించలేక, కాదని ఖండించలేక చచ్చిపోతున్నాము. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీకు తెలుసు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎవరు ఏమి అన్నా పడాల్సిన పరిస్థితి.ఎన్నికలలో మీ పోటీ ప్రకటన తరువాత ఇప్పటిదాకా మనకు అత్తారింటికి దారేదో చూపిన మీ పవర్‌ స్టార్‌ ఇప్పుడు తన పదవికి మార్గమేదో వెతుక్కుంటున్నాడని కొంత మంది వ్యంగ్యంగా అంటున్నారు. పదవి కోసం పాకులాడని వాడెవడు, అదేపని మా పీకే చేస్తే తప్పేమిటి అని ఎదురుదాడి చేస్తున్నాం. ఇంకా అవసరమైతే వుధృతం చేస్తాం మీరు ఫికరు పడకండి.

   గతంలో తెలుగు దేశం పార్టీ వారు తాము పార్టీ పెట్టిన ఎనిమిది నెలలో అధికారానికి వచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. అదొక పెద్ద గొప్పేంటి మే మసలు అధికారానికి వచ్చిన తరువాతే పార్టీ పెట్టామని(జనతా) మరొకరు బదులిచ్చారు. మన ప్రత్యేకత ఏమిటన్నా ? మీరు గత అసెంబ్లీ , పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామంటున్నారు. ఇది చాలా చిత్రంగా వుందన్నా.

    ఈ మధ్య కాలం ఐదు సంవత్సరాలో ఏం పీకారంటే ఏం చెప్పాలన్నా ! ఎన్నికలపుడు చెప్పుకోవటానికి ఏదైనా వుండాలి కదన్నా. జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించితే మంచిది. అన్నా మనలో మాట, హైదరాబాదులో వున్నన్ని రోజులు మరొకచోట ఎక్కడా జీవించలేదని మీరు ఒక మాట అన్నారు. ఇంతకీ మన పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుందన్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోనా ? ఒక్క ఏపిలోనేనా ? వైఎస్‌ఆర్‌ సిపి, తెలుగుదేశం పార్టీ పాట్లు చూసిన తరువాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నా.

     ఏపికి ప్రత్యేక హోదా ఇతర విషయాల గురించి మీకింకా గుర్తుందని చెప్పినందుకు ఒకవైపు సంతోషంగా వున్నా మరో వైపు మాత్రం విచారంగా వుందన్నా. పేదరాసి పెద్దమ్మ కథలలో చెప్పే రాజహంస ఎంతో అందంగా వుంటుంది గానీ దానిని ఎవరూ చూసిన వారు లేరన్నా, ఏపికి ప్రత్యేక హోదా కూడా అలాంటిదే అంటున్నారు. అది రాదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి పదే పదే అడుగుతారు ఒకసారి చెబితే అర్ధం కాదా అంటూ కేంద్ర మంత్రులు విసుక్కుంటున్నారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తద్దినం రోజు తప్ప మిగతా రోజులలో విస్మరించే మాదిరి పట్టించుకోవటం లేదు. జనం కూడా దాని గురించి మరిచి పోయి అంతకంటే మంచి రోజులు వస్తాయని సర్దుకు పోతున్న రోజులలో అదింకా గుర్తుందని మీరెందుకన్నా చెప్పటం.మీరేమైనా అనుకోండి ఇది అశుభ సూచకం అన్నా. జనానికి పట్టని దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నిబంధనలు మారిన కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదని అందరికీ అర్ధమైనా మీ పీకెకు అర్ధం కాలేదా, కాదా అని ఎవరైనా అడిగితే మీరేమో గానీ మేం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నా. ఇంతవరకు లేదు అని కేంద్రం చెప్పలేదు కనుక మాట్లాడటం లేదుతప్ప మరొకటి కాదని మీరు చెప్పారు.

     అన్నా ! కాదని కేంద్రం ఎప్పుడు చెప్పేను మీరు ఎప్పుడు నోరు విప్పేను ! అది జరిగేది కాదన్నా ! ఆంధ్రప్రదేశ్‌ అంటే కేవలం ప్రత్యేక హోదా ఒక్కటే కాదన్నా. జనానికి సంబంధించిన సమస్యలు అనేకం వున్నాయి. దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అని ఎన్నో పుస్తకాలు చదివిన మీకు మేం చెప్పాలా అన్నా ! రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీరు చెప్పిన నిబద్దతగా వుండే కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగతావి ఏనాడన్నా ఫలానిది చేయం అని ఎప్పుడైనా చెప్పాయా అన్నా ? మీకెందుకన్నా ఆ పార్టీల మీద అంత భ్రమ ? లేదు తమ్ముడూ నిజం చెప్పాలంటే మన దగ్గర చెప్పేందుకు ఇప్పుడేమీ లేదు, ఏం చెప్పాలో ఎటు పోవాలో తెలియటం లేదు అందుకే అలా చెప్పి కాలం గడుపుదాం అంటే అభిమానులంగా మేం సరే అనక చస్తామా అన్నా ? అన్నో ! అసలు విషయం మరొకటి వుంది !

    ఇంటర్వ్యూలలో మీకు ఖర్చులు ఎక్కువని, తగినంత ఆదాయంలేక రోజులు గడవటం కష్టంగా వుందని చెప్పారు. పార్టీ కోసం కూడా డబ్బు లేదన్నారు. డబ్బులేనోడు డుబ్బుకు కొరగాడని తెలియనిదేముందన్నా ! అలా అయితే మన పార్టీ వెనుక ఎవరు చేరతారన్నా ? లేదా మీరు చెప్పినట్లు చెప్పిన దానికి కట్టుబడి వుండే కమ్యూనిస్టు పార్టీల మాదిరి సమస్యలపై పని చేసి జనం దగ్గరకన్నా వెళ్లాలి. మీరది చెయ్యరు ఇది చెయ్యకుండా డబ్బు లేదంటే కష్టం అన్నా. తమ్ముడు తనోడు కావచ్చు కాని న్యాయం న్యాయమే అన్నట్లుగా చిరంజీవి మా అన్న కావచ్చు గానీ ఆయన కాంగ్రెస్‌లో వున్న కారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించను అని చెప్పారు. అదేంటన్నా ఆలూలేదు చూలు లేదు అన్నట్లు అప్పుడే దారులు మూసేస్తే ఎలా ? ఏ పార్టీ వాసన అంటని వీర భోగ వసంతరాయుళ్లు మన పార్టీకి దొరుకుతారంటావా అన్నా ? మీ దగ్గర డబ్బూ లేక మీ అన్న వంటి వారిని దరిచేరనీయక వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానంటే జనం నమ్మరేమో అన్నా. ఎందుకంటే గతంలో లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పై ఎన్నికలలో కేంద్రంలో పదవి చేపట్టటం నా లక్ష్యం అని చెప్పారు. చివరకు లోక్‌సత్తా దుకాణాన్నే ఎత్తివేశారు. మన పార్టీ పరిస్ధితి అలాకాకుండా చూడండన్నా, ఒకవేళ అదే జరిగితే మీరు తిరిగి సినిమాల్లోకి పోతారు, మేం ఏం కావాలో అలోచించండన్నా ? రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసిన తరువాత ఇంక సినిమాలు చేయను అంటున్నారు, వినటానికి బాగానే వున్నా అలాంటి ప్రకటనలు మంచివి కాదేమో, అటూ ఇటూ కాకుండా పోతారేమో చూసుకోండన్నా ?

    ఇక పోటీ విషయానికి వస్తే స్వంతంగా చేస్తారా? బిజెపితో కలుస్తారా ? తెలుగుదేశంతో దోస్తీ చేస్తారా అని వూహాగానాలు మొదలయ్యాయి. కొందరేమో మీకు కులముద్ర వేసి కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగు దేశం, బిజెపికి మీరు అలాగే వుపయోగపడ్డారని అందరూ అనుకుంటున్నారు. ఇపుడు పార్టీల ఫిరాయింపులు, ఎత్తులు, జిత్తులు చూస్తుంటే కుల సమీకరణల చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. తోక, తోరెలు అధికార, ప్రతిపక్ష పార్టీలవైపు సమీకరణయ్యారని, తోకా లమద్దతు ఎవరు పొందితే వారికి వచ్చేసారి అధికారం ఖాయం అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు.(తోక అంటే తోటి కమ్మ, తోరె అంటే తోటి రెడ్డి, తోకా అంటే తోటి కాపు, ఇలా ప్రతి కులానికి ఒక సాంకేతిక నామం) రాబోయే ఎన్నికలలో సినిమా రంగాన్ని కూడా తమవైపు తిప్పుకొనేందుకు పార్టీల ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి అన్నా. చివరిగా మరొక విషయం అన్నా. ప్రతి ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య రష్యాలోని సైబీరియానుంచి వలస పక్షులు వచ్చి వెళతాయి. అలాగే ఎన్నికలపుడు మాత్రమే కనిపించేవారిని ఎన్నికల పక్షులని పిలుస్తారన్నా. మీరు ఆ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం అవసరం అన్నా. వుంటా మరి మరోసారి మరో లేఖ రాస్తా

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొడదామంటే కడుపుతో వుంది-తిడదామంటే అక్కకూతురై పోయింది !

01 Tuesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

Amaravati, ANDHRA PRADESH, Andhrapradesh new Capitol, AP CM, Central budget 2016, tdp, Telangana, trs

 

ఎం కోటేశ్వరరావు

   సాంకేతికంగా చూస్తే రెండోదే కావచ్చు గానీ నరేంద్రమోడీ గారీ ముచ్చటైన మూడో బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు పెద్ద ఇబ్బందే తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన సామెత ‘కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్క కూతురై పోయింది’ అన్నట్లుగా ఇద్దరు చంద్రుల పరిస్ధితి తయారైంది. జనం ముందు ఎలా కనిపించినా తగిలిన ఎదురు దెబ్బలతో వెనక్కు తిరిగి గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు. బడ్జెట్‌ అంటే నిబంధనల ప్రకారం రూపొందించేది. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. మహారాజులు, పాదుషాల హయాం కాదిది. ఒక రాష్ట్రానికి ఒక రూపాయి అదనంగా కేటాయించాలన్నా ఏదో ఒక ప్రాతిపదిక, వాటికి సవాలక్ష నిబంధనలు వుంటాయి.వాటిని దాచి పెట్టి కేంద్రం దగ్గర తమ కెంతో పలుకుబడి వుందని చూపుకొనేందుకు కబుర్లు చెప్పటం ఒక ఫ్యాషనై పోయింది.

   హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి సీట్లేమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసని ఆయన అంతరంగంగా అందరూ పరిగణించే ఒక మీడియా వ్యాఖ్యాత ఫలితాలు వెలువడిన తరువాత ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పాటు వున్న కాలంలో చంద్రబాబు జోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి వుండాలి. తాను అభివృద్ధి చేసిన పరాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తన జనం తనకు ఒక్కటంటే ఒక్కటే కార్పొరేటర్‌ సీటను కట్టబెడతారని ముందే తెలుసుకున్నపుడు తన స్వంత రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా మోడీ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వరని చంద్రబాబుకు తెలియకుండా ఎలా వుంటుంది. అందుకే తాత్కాలిక సచివాలయం పేరుతో కధ నడిపించేందుకు పూనుకున్నారా ? ఏపికి ప్రత్యేక హోదారాదని ముందే నిర్ధారణ అయినందున అసలు అలాంటి ఒక ప్రతిపాదన వుందని కూడా ఎరగనట్లుగా అమాయకత్వం నటిస్తున్నారు.తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తారని కట్టుకధలు ప్రచారం చేశారు. వాటిని ఎంతో కాలం చెప్పలేరు కదా. దాంతో ఇప్పుడు లీకుల్లో గానీ చెప్పేవాటిలో గానీ దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

    పైసా పైసాను ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకోవాల్సిన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మాట తిరుగులేని నిజం. చంద్రబాబు నాయుడి ఇరవై నెలల పాలన చూస్తే అసలు విషయాలను దాచిపెట్టి ఏదో ఒకదానిపై జనం దృష్టిని మళ్లించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ స్థితిలో చంద్రబాబు అభివృద్ధి ఆకర్షణకు తట్టుకోలేక ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పిన లేదా రేపు చెప్పబోయే వైసిపి ఎంఎల్‌ఏలలో కొందరికి మంత్రి పదవులు, కొందరికి పైరవీలు తప్ప దక్కేది మరేమీ వుండవు, వచ్చే ఎన్నికలలో మరో పార్టీ కండువా కప్పుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేయటం కూడా అవసరమేమో ? ఎంత లేదనుకున్నా తొలిసారి మారటానికి కాస్త సిగ్గూ బిడియం, మాన,మర్యాదల గురించి జంఝాటం వుంటుంది. ఒకసారి అలవాటు పడి అదొక జీవన విధానం అయినపుడు మారేవారు , చేర్చుకొనే వారు సిగ్గుపడితే పనులెలా అవుతాయి? రాజకీయాల్లో కిక్కేముంటుంది?

     అమరావతి శాశ్వత రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర బడ్జెట్‌ మౌనం దాల్చింది. నూతన రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదా నిర్మించాలని చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. నాలుగు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది కావాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. పెద్ద ఎత్తున వందల కోట్లు ఖర్చు చేసి రాజధాని శంకుస్తాపన పేరుతో నిధులు తగలేశారు. దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని చెబుతున్న మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతాయి . జనం సొమ్ము కాంట్రాక్టర్ల పాలు కావటమే. ఇప్పటికే రెవెన్యూ ఆర్ధిక లోటు రు.13,779 కోట్లు వుండగా ఒకటి తాత్కాలికంగా, మరొకటి శాశ్వత రాజధాని నిర్మాణానికి వుదారంగా ఖర్చు చేసే డబ్బు ఎక్కడుంది? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా ఈ ఖర్చు ? వుమ్మడి రాజధానిగా మరో ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదులో వున్న వసతులను వుపయోగించుకోవటానికి అవకాశం వుండగా తాత్కాలిక సచివాలయం పేరుతో మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం ఏ జవాబుదారీతనం కిందికి వస్తుంది ? వాటినే శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఎందుకు వుపయోగించరు? ఈ ప్రశ్న వస్తుందని గ్రహించే తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా భవిష్యత్‌లో వుపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదే వాస్తవం అయితే తన మకాం విజయవాడకు మార్చే సమయంలోనే హైదరాబాదులోని తన కార్యాలయ సుందరీకరణకు పదుల కోట్లు ఎందుకు వెచ్చించినట్లు ? ఆ తరువాత ఒక్క రోజైనా ఆఫీసును వుపయోగించుకున్నారా ? ఇప్పటికే మంత్రులు, అధికారులు పనీ పాటా లేకుండా విజయవాడ-హైదరాబాదు చుట్టూ తిరుగుతూ అనవసరంగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది.

     కేంద్ర నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా అడుక్కోవటంలో పిసినారితనం ఎందుకన్నట్లుగా రాజధాని పరిసరాల్లో పెట్టబోయే పరిశ్రమలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీలు ఇవ్వాలన్న కోరికను కేంద్రం అసలు పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు రెండువేల కోట్లు అడిగితే వంద కోట్లు ప్రకటించారు. అంతకంటే పెద్ద దైన విశాఖ మెట్రోకు మాత్రం మొండిచేయి చూపారు.అసలే అవి గిట్టుబాటు కావన్న అభిప్రాయం వుండగా ఇలాంటి కేటాయింపులతో నిర్మాణ భారం పెరిగిపోతే వాటిని జనం నెత్తిమీదే కదా రుద్దేది? ఇక కేంద్రం ప్రకటించిన విద్యా సంస్ధల భవన నిర్మాణాలకు కూడా విదిలింపులే తప్ప గణనీయమొత్తాలను కేటాయించలేదు. దీని వలన అరకొర అద్దె లేదా వసతులు లేని భవనాలలోనే వాటిని దీర్ఘకాలం కొనసాగించాలన్నమాట.

      తెలంగాణా పరిస్ధితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఆ మధ్య ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జరిపి మోడీ పాదుషా గారిని ఖుషీ చేసేందుకు ముఖస్తుతి చేసి వచ్చినట్లు ,ఎంతో ఆత్మీయంగా, చొరవగా మాట్లాడినట్లు మీడియా కధనాలు వచ్చాయి. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పధకాలకు 30వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని, కొన్నింటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభువులకు కెసిఆర్‌ పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 30వేల కోట్ల పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న బకాయిలను కూడా పూర్తిగా చెల్లించని కేంద్రం గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా వంద కోట్లు కేటాయించింది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు 150వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి గాని పూర్తి కాదేమో ?అలాంటపుడు అలూచూలూ లేని తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందా?

     బడ్జెట్‌ ప్రతిపాదనల తీరుతెన్నులను చూసినపుడు గత యుపిఏ పాలనకూ, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ వర్తింప చేస్తామన్న నరేంద్రమోడీ పాలనకూ ఇంతవరకు పెద్ద తేడా ఏముంది? కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచారు. ఇది హర్షణీయమే. ఇదే సమయంలో కొన్ని పధకాల అమలు బాధ్యతను రాష్ట్రాలపై మోపటం ద్వారా ఆ పెంపుదల కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా అయింది తప్ప వేరు కాదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాని పర్యవసానం రానున్న సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పధకాలపై తీవ్రంగా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.నిధులకు ఎంత కటకట ఏర్పడితే పాలకులు కబుర్లు అంత ఎక్కువగా చెబుతారు.అంతగా జనం మోసపోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎందుకు మారుతున్నారో ! ఏం చేస్తారో చెప్పండి ప్లీజ్‌ !!

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, anti defection, CHANDRABABU, defections, tdp

గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం.

ఎం కోటేశ్వరరావు

     ఓకే, భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ ఇతర సపరివార బంధు మిత్రులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి లేదా ఫిరాయించటానికి సర్వహక్కులూ వున్నాయి.భూమాకు పార్టీలు మారటం కొత్తేమీ కాదు, కొట్టిన పిండే గనుక మార్గాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటాం, మా సహనాన్ని పరీక్షించవద్దు అని వైఎస్‌ఆర్‌సిపికి ముందే తెలుగుదేశం నాయకులు చెప్పారు, ఆ వెంటనే భూమా పార్టీ మారటం గురించి వార్తలు వచ్చాయి. ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పారు తప్ప వాటిని ఆయన పూర్తిగా ఖండించనూ లేదు తిరస్కరించనూ లేదు. తెలంగాణాలో జరిగిన పరిణామాలను చూసిన తరువాత ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. లెక్కలు తేల్చుకోవటాన్ని బట్టి వుంటుంది. పార్టీ మారితే భూమా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా అనో, లేకపోతే వైసిపి నాయకుడు జగన్‌ పనితీరు నచ్చలేదనో ఏదో ఒక కారణం చెప్పవచ్చు. ఏ కారణం చెప్పినా తన అనుచరులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రతివారూ సమర్ధించుకుంటారు. దీనిలో పెద్ద కిక్కుండటం లేదు. మన రాజ్యాంగంలో ఓటర్లను సంప్రదించాలి లేదా వారి అంగీకారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవు గనుక ఫిరాయించటం సులభం. తిరిగి గెలుస్తామనే ధైర్యం వుంటే ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడినా తిరిగి ఎన్నికలలో నిలబడవచ్చు. ఈలోపల ఎంఎల్‌ఏ కాకున్నా ఆరునెలల పాటు మంత్రి పదవిలో వుండవచ్చు కనుక మంత్రిగా ఎన్నికలలో తిరిగి పోటీ చేయవచ్చు. లేదా తెలంగాణాలో మాదిరి వేరే పార్టీలో వుంటూ కూడా మంత్రివర్గంలో చేరవచ్చునని కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. స్పీకర్‌ను బట్టి అది వుంటుంది. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. లేదా తేలే లోపల ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంకా ఇలాంటివి చాలా చూశాము గనుక పెద్దగా చర్చించాల్సినపని లేదు.

     గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం. దీని వలన అనుచరులే కాదు సామాన్య ఓటర్లను కూడా చైతన్య వంతులను చేసిన వారౌతారు. ఓటు వేసిన వారికి కాస్త సంతృప్తి అయినా మిగులుతుంది. పార్టీ మారే వారే కాదు, వారిని చేర్చుకొనే అధికార పార్టీ లేదా ప్రతిపక్షం ఎందుకంటే జగన్‌ కూడా తనతో టిడిపి ఎంఎల్‌ఏలు టచ్‌లో వున్నారని చెబుతున్నారు గనుక వారు కూడా ఆ నియోజకవర్గాల ఓటర్లకు శ్వేతపత్రం వెల్లడించాలి. ఫలానా నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఇది, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి తమ పార్టీలో వుండి వుంటే అభివృద్ది ఇంకా ఏమి జరిగి వుండేదో, చేర్చుకుంటే ఏమేమి చేయాలనుకుంటున్నామో అని అధికార పార్టీ కూడా ప్రకటించాలి. లేదా అధికార పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్షంలోకి ఫిరాయిస్తే తమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో, పార్టీ మారి దాన్ని ఎలా పట్టాలపైకి ఎక్కించాలనుకుంటున్నారో ప్రతిపక్షపార్టీ అయినా ఓటర్లకు తెలపాలి.

   ఏదో ఒక పద్దతి పాటించాలి. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరింది, తరువాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరింది. ఆ కుటుంబ సభ్యులు మధ్యలో కొంతకాలం తప్ప ఎక్కువ భాగం ప్రజాప్రతినిధులుగానే వున్నారు. అందువలన ఒకవేళ పార్టీ మారితే గీరితే ఇంతవరకు తాము ప్రాతినిధ్యం వహించిన కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటో, పార్టీ మారి ఇంకా ఏమి చేయబోతున్నారో చెబితే ఆ కుటుంబంపై వున్న గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. పార్టీలు మారే వారికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపినవారు అవుతారు. అభివృద్ధి అయినా మరొక కారణం చెప్పినా నైతిక బాధ్యత ఒకటి వుంటుంది. కలియుగంలో నీతి నియమాలేమిటి తూనా బొడ్డుబాలు అనుకుంటే వేరే విషయం. లేదు కేవలం అధికారం కోసమే పార్టీ మారుతున్నాం అని నిజం చెప్పినా అదీ ఒక నిజాయితీయే ఈ రోజుల్లో, ఏం చెబుతారో చూద్ధాం. రాయలసీమలో ముఠాకక్షలలో ఎన్నోమార్పులు జరుగుతున్నాయి. వారిలో కూడా పాతకాలపు మొరటు పద్దతులు పోయి ఆధునిక సర్దుబాటు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. మా ప్రయోజనాలకు మీరు అడ్డురావద్దు, మీకు మేము అడ్డురాము అనే సహనం,సహజీవనం పెరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం క్రితం అక్రమంగా తిన్నవాడెవడో చెప్పాలని నిలదీసిన జనం ఈ రోజు అసలు తినని వాడెవడో చెప్పండని దబాయిస్తున్న రోజులివి.జనం ఇలాంటి ఫిరాయింపులు, అనైతిక వ్యవహారాలను సహించినంత కాలం ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

NO additional Railway lines  construction through extra budgetary resources in Andhra pradesh,Telangana             

18 Thursday Feb 2016

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

additional Railway lines, ANDHRA PRADESH, Indian Ralways, Railway lines, Telangana

 

The Cabinet Committee of Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved construction of six Railway Lines and a Railway bridge to cater to both increased passenger and freight needs in various areas of the country. The proposals will cost over Rs.10,700 crore and most part of the expenditure will be met through extra budgetary resources (Institutional Financing). Details of the six approved projects are as follows:

1)   Doubling of Hubli-Chickajur railway line

Doubling of 190 km long Hubli-Chickajur broad gauge single railway line has been approved. The total estimated expenditure will be Rs.1294.13 crore. The project is likely to be completed in 4¼ years during 13th Plan period and will cover the areas of Chitradurga, Davangere, Haveri and Dharwad.

Entire route from Pune-Miraj-Hubli-Bengalore has been identified for doubling which will not only improve smooth flow of traffic but also boost overall development of the region.

This stretch is part of an important rail link of passenger trains between Mumbai and Bangalore and goods trains to the ports at Mangalore.  On this route, doubling between Bangalore-Tumkur and Arsikere-Chickajur have already been completed.  On balance portion, doubling work between Hubli-Londa part of Hubli-Londa-Vasco-da-Gama, is also in progress.

2)   Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line

Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line of 132 km will be taken up at an estimated completion cost of Rs.1443.32 crore.  The project is likely to be completed in five years during 13th Plan period and will be located in Wardha and Chandrapur districts.

The line capacity utilization of the section is saturated and running of additional Mail/Express and Goods traffic over the section cause detention to the trains.  Wardha (Sewagram) – Ballarshah section is very important from goods originating point of view of Nagpur Division where many collieries and many sidings are proposed on the section.

3)   Doubling of Ramna-Singrauli railway line

Doubling of 160 km long Ramna – Singarauli railway line has been approved at a cost Rs.2675.64 crore and is likely to be completed by 2019-20.   The project will cover the districts of Garhwa in Jharkhand, Singrauli in Madhya Pradesh andSonbhadra in Uttar Pradesh.

The Ramna-Singrauli section falls in Dhanbad Division of East Central Railway.  At present traffic utilization of the section is 105%, resulting in detention of trains and loss of revenue.  In order to attain the desired fluidity and increase in the sectional capacity, doubling of this single line section is very essential from operational point of view.  The project will serve the freight and passenger traffic needs in the jurisdiction of Northern Coal Fields and series of power plants and associated small scale industries in and around Anpara and Shaktinagar, namely Anpara Super Thermal Power Plant, RihandSuper Thermal Power Plant, Renusagar Hydro Power Plant,Singrauli Super Thermal Power Plant, Vidhyachal Super Thermal Power Plant.

4)   Construction of 3rd railway line between Anuppur-Katni

Construction of 165 km long 3rd railway line between Anuppur-Katni in Madhya Pradesh has also been apporved at a cost of Rs.1595.76 crore. The project is likely to be completed in 5 ¼ years spanning over 12th and 13th plan period.

The project would cover the districts of Anuppur, Shahdol, Umaria and Katni districts of Madhya Pradesh.

There has been tremendous surge in coal and one mining which has been geared up in the recent past and ambitious plans for an enormous leap forward in the ensuing years to tap these resources lying hitherto untapped.  As a result of the rapid industrialization, number of industrial townships have also grown up along the project line.  These developments have resulted in large demand for additional coaching services on the section.  With this anticipated increase of freight traffic, the capacity utilization will reach upto 175%.  Apart from this substantial additional coal traffic from IB valley, Korba area, East Corridor and Gevra Road – Pendra Road Project would be channelized through this route to the respective destinations. In order to meet the growth in the freight and passenger traffic, tripling of 3rd line between Anuppur-Katni is essential.

 

5)   Doubling of Katni-Singrauli railway line

Construction of doubling of 261 km long Katni – Singarauli railway at a cost of Rs.2084.90 crore has been approved. The project will be completed in 5 ¼ years.  The project would cover the districts of Katni, Shahdol, Sidhi and Singrauli in Madhya Pradesh.

Katni-Singrauli is a critical and busy section carrying coal from Northern Coal Fields towards Western and Northern thermal power plants.  This section intersects Allahabad-Mumbai route at Katni.  Provision of doubling between Katni-Singrauli section would provide the necessary line capacity for introduction of additional mail/express and passenger trains to serve the people of the area and transportation of coal from collieries.  This will also boost overall development of the region.

6)   Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul

Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul sector in Bihar at a cost of Rs.1700.24 crore has also got CCEA’s approval today.

The project is likely to be completed by 2019-20.  The project is located in Begusarai and Patna districts of Bihar.

The existing rail-cum-road bridge at Hathidah has single line track and doubling is not possible.  Present traffic utilization of the section is 123.5%.  At present this is the only railway bridge connecting both North and South Bihar.  Existing single line has resulted in heavy detention of goods and passenger traffic.

In order to streamline the operation of traffic in this single line section, it is very essential that one additional bridge and doubling of this section is undertaken.  By providing this facility, there will be ample fluidity in maintaining train operations as well as introduction of more passenger/goods trains in the section and it will augment line capacity too.  This will also facilitate in minimizing the running time of trains between Kiul-Barauni and Mokama-Barauni section and will ease out the existing operational constraints in this section.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమరెవరి వలలో చిక్కుకున్నారు లోకేశా ?

11 Thursday Feb 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Nara lokesh

సత్య

     ‘తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి.’ అని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పర్యవసానాల గురించిన వ్యాఖ్యలో పేర్కొన్నాను. జనమే కాదు, తెలుగుదేశం నేతలు కూడా అదే నిర్ధారణకు వచ్చారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలుగుదేశంలో ఇంకే మాత్రం కొనసాగినా తమకు భవిష్యత్‌ లేదని ఇంతకాలం దాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన వారంతా భావిస్తున్నారు. అందుకే తట్టాబుట్టా సర్ధుకుంటున్నారు. ఇంకా మేయర్‌ ఎన్నికలు జరగక ముందే ఏకంగా తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెరాస కారు ఎక్కేశారు. తిమ్మినిబమ్మిని చేయటంలో, చాణక్య నీతిని ప్రదర్శించటంలో తెలుగుదేశం నేతలు తిరుగులేని చంద్రబాబు నాయుడిని చూసి ఎంతో నేర్చుకొని ఆయనకే పాఠాలు చెబుతున్నారంటే అతిశయోక్తికాదు. పార్టీలు మారటం సాకులు చెప్పటం ఇప్పుడు ఎంత సులభమైందో. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరవచ్చు. అందుకు మారేవారికే కాదు, చేర్చుకొనే వారికి కూడా సిగ్గు ఎగ్గులు లేవు.ఎక్కడ ఎలా కట్టిందా అని కాదు మా దొడ్లో ఈనిందా లేదా అన్నదే ప్రాతిపదిక. ఇంతకాలం కాంగ్రెస్‌లో వున్నా తెలుగుదేశంలో వున్నా వారు జ నానికి చెప్పిందేమిటి తమ నియోజకవర్గాలను, ప్రజలను తామెంతో అభివృద్ధి చేశామనే కదా ! అలాంటి వారు పార్టీ మారటానికి చెబుతున్న తొలిసాకు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు తీర్చటం కోసమే అని కదా చెబుతోంది. ఎంత ఆత్మవంచన. అయినా సరే జనం అలాంటి వారికి పట్టం కడుతున్నారు. ఇదింకా సామూహిక ఆత్మవంచన.

     హైదరాబాదు ఎన్నికలలో అనూహ్యంగా మట్టి కరచిన తెలుగుదేశం నేతలు కింద పడ్డా మాదే పైచేయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో తమకు హైదరాబాదులో లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చెబుతున్నారు. ఇంకా నయం గత ఎన్నికల కంటే నా వయస్సు ఐదేళ్లు పెరిగింది అని చెప్పలా. తాను తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడానని ఇంకెవరూ పార్టీ నుంచి బయటకు పోరని చెప్పిన మాటలు ఇంకా టీవీలలో మోగుతుండగానే ఏకంగా పార్టీ శాసనసభా పక్షనేతే ఫిరాయించటాన్ని లోకేష్‌ బాబు పసిగట్టలేకపోయారు. ఒకే ఒక్కడు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడెందుకు అంటే దానికి కారణాలు చెప్పకుండా తాము వేసిన ఎత్తుగడలో తెరాస చిక్కుకు పోయి జనానికి అమలు జరపలేని 60వేల కోట్ల రూపాయల వాగ్దానాలు చేసిందని లోకేష్‌ చంకలు కొట్టుకుంటున్నారు. అదీ ఎక్కడా ? విజయవాడ నడి గడ్డ మీద ! అమరావతితో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా మారుస్తానని వాగ్దానం చేసిన చోట. కాపులకు రిజర్వేషన్లు, రైతులతో సహా అన్ని తరగతుల రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం, బాబొస్తే ఇంటికో జాబు ఇలా ఎన్నిలక్షల కోట్లో తెలియని వాగ్దానాలను తెలుగుదేశం ఎవరి వలలో చిక్కుకొని చేసినట్లో లోకేష్‌ చెప్పగలరా ? తెరాస అమలు జరపలేని వాగ్దానాలు చేసి ఇరుక్కు పోయిందని సంతోష పడుతున్న లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో తాను, తన తండ్రి చేసిన వాగ్దానాలతో ముందుంది ముసళ్ల పండుగ అని గుర్తించినట్లు లేదు. తెలంగాణాలో తగిలిన ఎదురు దెబ్బలతో జనం దృష్టిని మరల్చటానికి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించటానికి తెలుగుదేశం ప్రయత్నించవచ్చు. ఈ రోజుల్లో అత్యంత సులభమైన చౌకబారు వ్యవహారమది. కోట్ల రూపాయలలో పెట్టుబడి పెట్టి ఎన్నికలలో గెలిచిన వారు వాటితో పాటు లాభాలను కూడా రాబట్టుకొనేందుకు అధికారం ఎక్కడ వుంటే అక్కడ చేరతారు. అందులో తెలియనిదేముంది?

     చంద్రబాబు నాయుడు డబ్బుతో కూడుకున్న వాగ్దానాలు అమలు జరపకుండా కాలక్షేపం చేస్తున్నారంటే కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం చేసిన కాపురిజర్వేషన్ల వాగ్దానం వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడేదేముంది. అయినా ఇరవై నెలల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక కమిషన్‌ వేసి ఏడు నెలలు, తొమ్మిది నెలల్లోనో ఫలితం చూపాలని హడావుడి చేస్తున్నారు. ఇది కొత్త సమస్యలు, సమీకరణాలకు దారి తీయటం అనివార్యంగా కనిపిస్తోంది. ఆ గందరగోళం కారణంగానే బుర్ర ఖరాబై గత వారంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అని పిస్తోంది.

     అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణాలో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్‌ కృష్ణయ్య అని చంద్రబాబు నాయుడు ప్రకటించి వెనుకబడిన తరగతులలో ఒక బలమైన తరగతి ఓట్ల కోసం గాలం వేశారు. ఎవరినైనా వాడుకో, వుపయోగించుకో, అవసరం తీరిన తరువాత వదిలెయ్‌ అన్న ఆధునిక నీతి చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్యను కనీసం శాసనసభా పక్ష నేతగా కూడా చేయలేదు. గత ఎన్నికలలో ఎల్‌బి నగర్‌ నియోజకవర్గంలో కృష్ణయ్యను నిలిపిన కారణంగా అపుడు తమకు రావాల్సిన మెజారిటీ తగ్గిపోయిందని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో అక్కడ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానమైనా దక్కించుకోలేకపోయిన తరువాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. బోడిగుండుకు మోకాలికీ ముడి పెట్టటం అంటే ఇదే. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేత చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం అంటే మున్సిపల్‌ ఎన్నికలు ఆయన బుర్రను ఎంతగా ఆందోళనకు గురిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీలలో ఎవరూ పుట్టాలని కోరుకోరు అని ఒక అసందర్భ ప్రేలాపన దాని పర్యవసానమే.తనకు కుల పట్టింపులు లేవని చంద్రబాబు నాయుడు నమ్మబలుకుతారు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా అని తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీ చరిత్ర విప్పితే కులాన్ని వుపయోగించుకొని పైకి వచ్చిన పెద్ద మనుషులెవరో బహిరంగ రహస్యం. విశ్వవిద్యాలయాలలో కుల జాడ్యం అక్కడి నుంచే వ్యాపించిందన్నది దాచినా దాగని సత్యం .

     కుల రాజకీయాలు చేయటం, దాని వలన పొందేలబ్ది ఏమిటో ఈ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు తప్ప మిగతా పార్టీలన్నింటికీ వెన్నతో పెట్టిన విద్య.ఎవరు దీనికి కారకులు అని తర్కించుకోవటం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుల గురించి మాట్లాడుకోవటం వంటిదే. ఎవరు వాటి నుంచి బయట పడ్డారన్నదే నేడు గీటురాయిగా వుండాలి. రిజర్వేషన్లు సమస్యల పరిష్కారానికి మార్గాలు కావన్నది చరిత్ర చెబుతున్నది. అసలు ప్రభుత్వ రంగమే అంతరిస్తున్న తరువాత ప్రభుత్వ వుద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం అవుతున్నాయి. రిజర్వేషన్లు కుల నిర్మూలనకు ఒక మార్గంగా అంబేద్కర్‌ భావించారు. ఇప్పుడు ప్రయివేటీకరణ పర్యవసానంగా ప్రభుత్వ వుద్యోగాలు తగ్గిపోతూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు తగిన అభ్యర్ధులు లేని కారణంగా ఎస్‌సిఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెరుగుతున్నాయి. కొన్ని సందర్బాలలో వుద్యోగ ప్రకటనలు చేసినపుడు అవే ఎక్కువగా వుండటంతో మిగిలిన వారు అపార్ధం చేసుకోవటం కూడా జరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే రిజర్వేషన్ల పరిధిలోకి తమనుకూడా తీసుకురావాలని కొత్త వారు డిమాండ్‌ చేయటం, కొత్త వారిని తీసుకువచ్చి తమ అవకాశాలను దెబ్బతీయ వద్దని ఇప్పటికే రిజర్వుడు తరగతులుగా వున్నవారు ప్రతిఘటించటం దేశమంతటా జరుగుతోంది.ఏది సమర్ధనీయం ఏది కాదు కాదు అంటే తిరిగి చర్చ విత్తు ముందా చెట్టుముందా అన్నదగ్గరకు చేరుతోంది.

     అందరికీ విద్య, వుద్యోగ అవకాశాలు వుంటే ఇలాంటి సమస్యలు అంతగా ముందుకు రావు. మన దేశంలో ఈ సమస్యలతో పాటు ప్రపంచంలో ఎక్కడాలేని సామాజిక విభజన, వివక్ష సమస్యలు కూడా జనానికి తోడయ్యాయి. ముందుగా వర్గదోపిడీ అంతమైతే కుల సమస్య అంతరిస్తుందని కమ్యూనిస్టులు చాలా కాలంగా నమ్మారు. ముందు కుల సమస్య అంతరించిన తరువాతే వర్గ సమస్య సంగతి చూడాలని అంబేద్కరిస్టులు నమ్మారు. భారత్‌లో వున్న సంక్లిష్టతల కారణంగా రెండు వైఖరులను పునరాలోచించుకోవాల్సి వచ్చింది. వర్గ సమస్యలతో పాటు కుల వివక్ష సమస్యను కూడా తక్కువగా చూడరాదని కమ్యూనిస్టులు చాలా కాలం క్రితమే గుర్తించారు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో కుల వివక్ష వ్యతిరేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ సమస్యపై పని చేస్తున్నారు. తాము కలలు కన్న కుల నిర్మూలన ఇప్పట్లో జరిగేది కాదని అంబేద్కరిస్టులు అంతర్గతంగా ఆలోచిస్తున్నా అంగీకరించటానికి ముందుకు రావటం లేదు.ఈ వైఖరి అటు వర్గ, కుల నిర్మూలన పోరాటాలు రెండిండికీ హాని కలిగిస్తుందని గుర్తించటం అవసరం. ఎవరి అభిప్రాయాలు వారు కలిగి వుండవచ్చు, అదే సమయంలో ఎక్కడ ఏ సమస్య ముందుకు వస్తే దానిని, రెండు సమస్యలపై ఐక్యంగా పని చేయవచ్చు. కావాల్సింది చిత్త శుద్ధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏదో జరుగుతోందని అందరికీ తెలుసు ? ఏమిటది ?

29 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Modi

మన్మోహన్‌ సింగ్‌ శంకుస్ధాపన – నరేంద్రమోడీ ప్రారంభోత్సవం

ఎంకెఆర్‌

అటు కాకలు తీరిన పాలకపార్టీ పెద్దలు నిండు పేరోలగంలో ప్రతిపాదిస్తే ఇటు తలలు పండిన ఎందరో ప్రతిపక్ష యోధులు ఆమోదించారు. (సిపిఎం మినహా) వారూ వీరూ , వారితో చేరినవారూ చేతులు కలిపి లేదా కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రత్యేక హోదా, లోటు భర్తీకి నిధులు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రారంభోత్సవంగా భావించి క్యా సీన్‌ హై అనుకోకండి. వట్టిస్తరి మంచినీళ్లు మాత్రమే. శంకస్ధాపన మాదిరి కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి అమరావతి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి నిర్ణయం జరిగినపుడే అంతసీన్‌ లేదని తేలిపోయింది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆఫ్ఘనిస్తాన్‌ పార్లమెంట్‌ భవనం గురించి. వేసిన అంచనాల కంటే ఎక్కువ కావటం, పనులు ఇంకా పూర్తి గాక పోవటంతో సవరించిన అంచనా ఖర్చు రు.960 కోట్లకు చేరుకోవటంతో బుధవారం నాడు జరిగిన మన కేంద్ర కాబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఇంకా అయితే తరువాత ఎలాగూ చెల్లిస్తారు లెండి. ఇదేమిటి ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్‌ ! ఎక్కడి మోడీ సర్కార్‌ !! వారి పార్లమెంట్‌ భవనం మనం కట్టటం ఏమిటి !!!

ఆఫ్ఘనిస్తాన్‌ సర్వనాశనం కావటానికి కారకులు నూటికి రెండువందల శాతం అమెరికా, దాని చుట్టూ తోకాడించుకుంటూ తిరిగే ఐరోపా ధనిక, సౌదీ అరేబియావంటి అమెరికా తొత్తు దేశాలు. దాన్ని పునరుద్ధరించేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ తలాకాస్త సాయం చేయాలంటూ అమెరికా ఆదేశించింది. అదే లెండి దొరగారు తలా కాస్త చేయండి అంటే చేయకపోతే అయ్యగారితో ఎప్పుడు ఏతంటా వస్తుందో, ఎప్పడు ఏ అవసరం వస్తుందో పోయిందేముంది లే అనుకొని మన వాటాగా పార్లమెంట్‌ భవనం నిర్మాణం, మరికొన్ని చేస్తామని మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వున్నపుడు వాగ్దానం చేసి వచ్చారు. అది సకాలంలో పూర్తిగాక చివరికి డిసెంబరులో పూర్తి కావటంతో 25వ తేదీన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడితో కలసి నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. మిగిలిన ఎలక్ట్రానిక్‌ పరికరాల బిగింపు వంటి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి ఈ ఏడాది మార్చి 31 నాటికి భవనాన్ని అఫ్ఘన్‌ అధికారులకు అందచేయాల్సి వుంది. అందుకుగాను పెరిగిన ఖర్చుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ సంబంధాలు సజావుగా కొనసాగటానికి ఎవరి హయాంలో ఏ నిర్ణయం జరిగినా దానిని కొనసాగించటం తరువాత అధికారంలో వున్న వారి బాధ్యత అనుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాల మాటేమిటి ? ఆంధ్రులు అంత నోరు లేనివారా ?

కన్నమ్మకు కూడు పెట్టని కొడుకు పిన్నమ్ముకు ఒంటి నిండా బంగారు ఆభరణాలు తొడిగిస్తా అని చెప్పినట్లుగా చ ంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో కురిపించని వాగ్దానాలు లేవు. హైదరాబాదు నుంచి ఏటా 45వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందంటే ఆ శ్రమ తనదే అని చంద్రబాబు నాయుడు చెప్పారు, నైజాం నవాబులు హైదరాబాదును 400 సంవత్సరాలలో, బ్రిటీష్‌ వారు సికిందరాబాదును 200 సంవత్సరాలలో తీర్చిదిద్దితే ఈ రెండింటికీ ప్రపంచ పటంపై కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే ఎనలేని కీర్తి తెచ్చి పెట్టానని, హైటెక్‌ సిటీని కేవలం 15నెలల్లోనే నిర్మింపచేయించిన ఘనత తనదేనని, తాను ఆనాడు అభివృద్ధి చేయకపోయి వుంటే ఈ రోజున తెలంగాణా ప్రభుత్వానికి సంక్షేమ పధకాలు అమలు జరపటం సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు హైదరాబాదు వీధుల్లో చెప్పారు. అంతేనా ! కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పధకాల్లో తెలంగాణాకు అన్యాయం జరగకుండా చూస్తానని, అవసరమైతే ప్రధాని మోడీని ఒప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మరీ చెప్పారు. పిట్టల దొర గుర్తుకు రావటం లేదూ ?

ఈ వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వారికి కూడా తెలిసి వుంటే బాబ్బాబు….. ఐదు సంవత్సరాలలో ఇప్పటికే మూడోవంతు అయిపోయింది. లేస్తే మనిషిని కాను అని దారిన పొయ్యేవారిని బెదిరించి దండుకున్న కుంటి మల్లయ్య కధ మాదిరిగాక ముందే కొత్తవి రాకపోతే పోయే చేసిన వాగ్దానాల అమలుకు కేంద్రాన్ని ఒప్పిద్దురూ మీకు పుణ్యముంటుంది అని ఆంధ్రప్రదేశ్‌ జనాలు పోకిరి సినిమాలో మాదిరి విజయవాడ రాగానే చంద్రబాబు వెంట బడటం ఖాయం.

రాజధాని అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి వచ్చినపుడు తాను కూడా దాని నిర్మాణానికి కొంత విరాళం ప్రకటిద్దామని అనుకున్నానని, అయితే ప్రధాని మోడీ అంతటి వ్యక్తే పిడికెడు మట్టి, కుండెడు నీళ్లు ఇచ్చినపుడు తాను విరాళం ప్రకటిస్తే తెలంగాణాపై మోడీ ఎక్కడ మరింత కక్ష పెంచుకుంటాడోనని తాను ప్రకటించలేదని, అయినా అమరావతికే దిక్కులేదు, హైదరాబాదుకేం వరాలిస్తారని అటు బిజెపిని ఇటు తెలుగుదేశం పార్టీని తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గాలితీశారు. వెంకయ్య(నాయుడు) ప్రాసకోసం ఎన్నయినా మాట్లాడతాడు, అలా మాట్లాడటం నాకూ వస్తుంది, ఆయనకంటే తెలుగు సాహిత్యం నాకే బాగా వచ్చు అని కూడా చెప్పారు.

ఏ దేశం వెళితే అక్కడి తెలుగు వారిని, భారతీయులను పొగడటం, మీరే ఆ దేశాలను పెంచి పోషిస్తున్నారన్నట్లుగా చెప్పటం చంద్రబాబు బ్యాండు బృందానికి బాగా వచ్చు. కానీ ఆయన మాత్రం సావిత్రీ నీ పతి ప్రాణంబు దక్క మరొక్క వరం కోరుకో అని యమధర్మరాజు చెప్పినట్లుగా తెలుగువారి రాజధాని నిర్మాణ రూపకల్పన బాధ్యత మాత్రం తెలుగు వారికీ ఇవ్వలేదు, భారతీయులకు ఇవ్వలేదు. ఎంత రాష్ట్ర భక్తి, ఎంత దేశ భక్తి ? పోనీ మనవారేమైనా తక్కువ వారా ?

మయసభకు ప్రతిరూపాన్ని నిర్మించారే, ప్రపంచ స్దాయి కట్టడాలకు ఏ విషయంలో తక్కువ తిన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయులు నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రపంచంలో అత్యుత్తమ పార్లమెంట్‌ భవనాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న అరాచక పరిస్దితులు, భద్రతా సమస్యల కారణంగా 2009లో ప్రారంభమై 2012లో పూర్తి కావాల్సింది 2015 వరకు సాగింది.దీనిలో ప్రధాన ఆకర్షణ ఏమంటే 17.15 మీటర్ల ఎత్తుండే కంచు గుమ్మటం ఆసియాలోనే పెద్దదట. ఇక భవనం లోపలా బయటా ఆకర్షణలు చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదట. ఇంత మంచి కన్సల్టెంట్స్‌, నిర్మాణ కంపెనీలు, నిపుణులైన పనివారు మన దగ్గర వుండగా అందునా మేకిండియా పిలుపు ఇచ్చిన ప్రధాని కేంద్రంలో వుండగా రాజధాని అమరావతిని సింగపూర్‌ వారికి ఎందుకు కట్టబెట్టినట్లు ? నీకిది నాకది అని పక్కా అవగాహనలతో పంచుకొనే రోజుల్లో ఏది ఎందుకు జరుగుతుందో ? గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు అలాంటి విషయాల్లో పండిపోయిన వారే చెప్పాలి. కాకపోతే అలాంటి వారికి విస్వసనీయత వుండదు, అందరికీ తెలుసు ఏదో జరుగుతోందని. అదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d