• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

Consumer Price Index Numbers for the Month of November 2016

14 Wednesday Dec 2016

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Consumer Price Index, Consumer Price Index Numbers, Consumer Price Index Numbers November 2016

Consumer Price Index Numbers on Base 2012=100 for Rural, Urban and Combined for the Month of November 2016
Central Statistics Office (CSO), Ministry of Statistics and Programme Implementation has revised the Base Year of the Consumer Price Index (CPI) from 2010=100 to 2012=100 with effect from the release of indices for the month of January 2015.

  1. In this press note, the CPI (Rural, Urban, Combined) on Base 2012=100 is being released for the month of November 2016. In addition to this, Consumer Food Price Index (CFPI) for all India Rural, Urban and Combined are also being released for November 2016. All India Inflation rates (on point to point basis i.e. current month over same month of last year, i.e., November 2016 over November 2015), based on General Indices and CFPIs are given as follows:

All India Inflation rates (%) based on CPI (General) and CFPI

Indices November 2016 (Prov.) October 2016 (Final) November 2015 (Final)
Rural Urban Combd. Rural Urban Combd. Rural Urban Combd.
CPI (General) 4.13 3.05 3.63 4.78 3.54 4.20 5.95 4.71 5.41
CFPI 2.87 0.75 2.11 3.86 2.33 3.32 5.75 6.53 6.07

Notes: Prov.  – Provisional, Combd. – Combined

  1. Monthly changes in the General Indices and CFPIs are given below:

Monthly changes (%) in All India CPI (General) and CFPI: Nov. 2016 over Oct. 2016

Indices Rural Urban Combined
Index Value % Change Index Value % Change Index Value % Change
Nov.16 Oct.16 Nov.16 Oct.16 Nov.16 Oct.16
CPI (General) 133.6 133.8 -0.15 128.4 128.6 -0.16 131.2 131.4 -0.15
CFPI 136.2 137.1 -0.66 134.7 136.2 -1.10 135.7 136.8 -0.80

Note: Figures of November 2016 are provisional.

  1. Provisional indices for the month of November 2016 and also the final indices for October 2016 are being released with this note for all-India and for State/UTs. All-India provisional General (all-groups), Group and Sub-group level CPI and CFPI numbers for November 2016 for Rural, Urban and Combined are given in Annexure I. The inflation rates of important categories of items are given in Annexure II. State/UT wise provisional General CPI numbers for Rural, Urban and Combined are given in Annexure III. Inflation rates of major States, having population more than 50 lakhs as per population Census 2011, are given in Annexure IV. State/UT–wise Group CPIs are available on the Ministry’s website (www.mospi.gov.in).
  2. Price data are collected from selected towns by the Field Operations Division of NSSO and from selected villages by the Department of Posts. Price data are received through web portals, maintained by the National Informatics Centre.

Next date of release:  12th January 2017 (Thursday) for December 2016.                    

Annexure I

All India Consumer Price Indices

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Weights Oct. 16 Index
(Final)
Nov. 16 Index
(Prov.)
Weights Oct. 16 Index
(Final)
Nov. 16 Index
(Prov.)
Weights Oct. 16 Index
(Final)
Nov. 16 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 12.35 131.3 132.1 6.59 128.7 130.2 9.67 130.5 131.5
1.1.02 Meat and fish 4.38 137.6 137.5 2.73 138.4 138.5 3.61 137.9 137.9
1.1.03 Egg 0.49 130.1 130.7 0.36 130.3 134.0 0.43 130.2 132.0
1.1.04 Milk and products 7.72 136.0 136.4 5.33 132.7 132.9 6.61 134.8 135.1
1.1.05 Oils and fats 4.21 120.8 121.1 2.81 112.5 112.6 3.56 117.8 118.0
1.1.06 Fruits 2.88 138.4 137.0 2.90 130.4 130.8 2.89 134.7 134.1
1.1.07 Vegetables 7.46 149.2 142.1 4.41 155.1 142.0 6.04 151.2 142.1
1.1.08 Pulses and products 2.95 170.2 169.9 1.73 175.7 174.8 2.38 172.1 171.6
1.1.09 Sugar and Confectionery 1.70 113.4 113.5 0.97 115.4 115.5 1.36 114.1 114.2
1.1.10 Spices 3.11 136.3 136.8 1.79 145.3 145.4 2.50 139.3 139.7
1.2.11 Non-alcoholic beverages 1.37 128.7 128.8 1.13 122.5 122.6 1.26 126.1 126.2
1.1.12 Prepared meals, snacks, sweets etc. 5.56 142.4 143.1 5.54 139.6 140.3 5.55 141.1 141.8
1   Food and beverages 54.18 137.4 136.7 36.29 136.3 135.1 45.86 137.0 136.1
2   Pan, tobacco and intoxicants 3.26 140.9 141.2 1.36 144.3 144.3 2.38 141.8 142.0
3.1.01 Clothing 6.32 139.6 140.0 4.72 129.1 129.6 5.58 135.5 135.9
3.1.02 Footwear 1.04 134.3 134.5 0.85 121.9 122.1 0.95 129.1 129.3
3   Clothing and footwear 7.36 138.8 139.2 5.57 128.0 128.5 6.53 134.5 135.0
4   Housing – – – 21.67 128.7 129.1 10.07 128.7 129.1
5   Fuel and light 7.94 129.8 130.4 5.58 115.2 116.2 6.84 124.3 125.0
6.1.01 Household goods and services 3.75 131.8 132.2 3.87 124.5 124.6 3.80 128.4 128.6
6.1.02 Health 6.83 128.7 129.0 4.81 121.8 122.1 5.89 126.1 126.4
6.1.03 Transport and communication 7.60 117.8 118.2 9.73 112.8 113.4 8.59 115.2 115.7
6.1.04 Recreation and amusement 1.37 126.5 126.9 2.04 121.2 121.7 1.68 123.5 124.0
6.1.05 Education 3.46 133.0 133.7 5.62 131.9 132.1 4.46 132.4 132.8
6.1.06 Personal care and effects 4.25 123.0 123.5 3.47 120.8 121.3 3.89 122.1 122.6
6   Miscellaneous 27.26 125.7 126.1 29.53 120.9 121.3 28.32 123.4 123.8
General Index (All Groups) 100.00 133.8 133.6 100.00 128.6 128.4 100.00 131.4 131.2
Consumer Food Price Index 47.25 137.1 136.2 29.62 136.2 134.7 39.06 136.8 135.7

Notes:

  1. Prov.   : Provisional.
  2. –           : CPI (Rural) for housing is not compiled.
  3. The weights are indicative to show relative importance of groups and sub-groups. However, all India indices have been compiled as weighted average of State indices.

Annexure II

All India annual inflation rates (%) for November 2016 (Provisional)

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Nov. 15 Index
(Final)
Nov. 16

Index
(Prov.)

Inflation Rate
(%)
Nov. 15 Index
(Final)
Nov. 16

Index
(Prov.)

Inflation Rate
(%)
Nov. 15 Index
(Final)
Nov. 16

Index
(Prov.)

Inflation Rate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 126.1 132.1 4.76 124.0 130.2 5.00 125.4 131.5 4.86
1.1.02 Meat and fish 130.6 137.5 5.28 129.8 138.5 6.70 130.3 137.9 5.83
1.1.03 Egg 121.7 130.7 7.40 121.5 134.0 10.29 121.6 132.0 8.55
1.1.04 Milk and products 129.5 136.4 5.33 128.6 132.9 3.34 129.2 135.1 4.57
1.1.05 Oils and fats 117.8 121.1 2.80 110.0 112.6 2.36 114.9 118.0 2.70
1.1.06 Fruits 132.1 137.0 3.71 123.7 130.8 5.74 128.2 134.1 4.60
1.1.07 Vegetables 155.2 142.1 -8.44 164.6 142.0 -13.73 158.4 142.1 -10.29
1.1.08 Pulses and products 160.8 169.9 5.66 191.6 174.8 -8.77 171.2 171.6 0.23
1.1.09 Sugar and Confectionery 94.5 113.5 20.11 90.8 115.5 27.20 93.3 114.2 22.40
1.1.10 Spices 128.3 136.8 6.63 137.1 145.4 6.05 131.2 139.7 6.48
1.2.11 Non-alcoholic beverages 123.1 128.8 4.63 119.8 122.6 2.34 121.7 126.2 3.70
1.1.12 Prepared meals, snacks, sweets etc. 134.2 143.1 6.63 133.7 140.3 4.94 134.0 141.8 5.82
1 Food and beverages 132.4 136.7 3.25 133.3 135.1 1.35 132.7 136.1 2.56
2 Pan, tobacco and intoxicants 132.2 141.2 6.81 137.6 144.3 4.87 133.6 142.0 6.29
3.1.01 Clothing 132.1 140.0 5.98 125.0 129.6 3.68 129.3 135.9 5.10
3.1.02 Footwear 128.2 134.5 4.91 119.3 122.1 2.35 124.5 129.3 3.86
3 Clothing and footwear 131.5 139.2 5.86 124.2 128.5 3.46 128.6 135.0 4.98
4 Housing – – – 122.9 129.1 5.04 122.9 129.1 5.04
5 Fuel and light 125.6 130.4 3.82 115.1 116.2 0.96 121.6 125.0 2.80
6.1.01 Household goods and services 125.6 132.2 5.25 121.0 124.6 2.98 123.4 128.6 4.21
6.1.02 Health 122.6 129.0 5.22 118.1 122.1 3.39 120.9 126.4 4.55
6.1.03 Transport and communication 114.0 118.2 3.68 109.3 113.4 3.75 111.5 115.7 3.77#
6.1.04 Recreation and amusement 120.9 126.9 4.96 117.9 121.7 3.22 119.2 124.0 4.03
6.1.05 Education 125.8 133.7 6.28 126.6 132.1 4.34 126.3 132.8 5.15
6.1.06 Personal care and effects 114.2 123.5 8.14 113.3 121.3 7.06 113.8 122.6 7.73
6 Miscellaneous 119.6 126.1 5.43 116.6 121.3 4.03 118.1 123.8 4.83
General Index (All Groups) 128.3 133.6 4.13 124.6 128.4 3.05 126.6 131.2 3.63
Consumer Food Price Index 132.4 136.2 2.87 133.7 134.7 0.75 132.9 135.7 2.11                

 

Notes:

  1. Prov.   : Provisional.
  2. –           : CPI (Rural) for housing is not compiled.
  3. #          : More than those of Rural as well as Urban due to rounding.

 

Annexure III

State/UT wise General Consumer Price Indices

(Base: 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Weights Oct. 16 Index
(Final)
Nov. 16 Index
(Prov.)
Weights Oct. 16 Index
(Final)
Nov. 16 Index
(Prov.)
Weights Oct. 16 Index
(Final)
Nov. 16 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 1.14 132.9 134.5 0.72 125.1 125.2 0.94 130.1 131.2
02 Himachal Pradesh 1.03 133.4 134.0 0.26 124.2 124.9 0.67 131.7 132.4
03 Punjab 3.31 130.0 129.9 3.09 126.7 126.7 3.21 128.5 128.5
04 Chandigarh 0.02 142.9 143.7 0.34 125.2 125.6 0.17 126.2 126.6
05 Uttarakhand 1.06 128.6 128.7 0.73 121.0 121.9 0.91 125.8 126.2
06 Haryana 3.30 131.3 131.8 3.35 124.5 124.5 3.32 128.1 128.4
07 Delhi 0.28 129.2 129.0 5.64 130.8 131.1 2.77 130.7 131.0
08 Rajasthan 6.63 135.6 135.7 4.23 130.1 130.3 5.51 133.6 133.8
09 Uttar Pradesh 14.83 132.3 131.8 9.54 128.9 128.9 12.37 131.1 130.8
10 Bihar 8.21 135.7 135.4 1.62 128.2 126.6 5.14 134.6 134.1
11 Sikkim 0.06 140.5 140.4 0.03 134.7 134.4 0.05 138.6 138.4
12 Arunachal Pradesh 0.14 140.3 140.7 0.06 — — 0.10 — —
13 Nagaland 0.14 141.8 142.9 0.12 128.5 129.0 0.13 136.1 137.0
14 Manipur 0.23 129.6 133.6 0.12 125.9 127.3 0.18 128.4 131.6
15 Mizoram 0.07 132.3 132.9 0.13 124.5 124.7 0.10 127.5 127.9
16 Tripura 0.35 140.0 139.9 0.14 132.6 134.7 0.25 138.1 138.6
17 Meghalaya 0.28 135.3 134.8 0.15 125.0 124.8 0.22 132.1 131.7
18 Assam 2.63 129.7 129.6 0.79 128.1 128.0 1.77 129.4 129.3
19 West Bengal 6.99 134.4 133.6 7.20 129.7 129.2 7.09 132.2 131.5
20 Jharkhand 1.96 138.9 138.1 1.39 128.3 127.8 1.69 134.9 134.2
21 Odisha 2.93 139.7 138.6 1.31 127.2 126.9 2.18 136.2 135.3
22 Chhattisgarh 1.68 139.1 138.3 1.22 127.8 127.2 1.46 134.7 134.0
23 Madhya Pradesh 4.93 129.7 129.6 3.97 128.1 128.6 4.48 129.0 129.2
24 Gujarat 4.54 136.0 135.8 6.82 125.8 125.1 5.60 130.2 129.7
25 Daman & Diu 0.02 144.7 147.4 0.02 129.4 128.7 0.02 138.3 139.6
26 Dadra & Nagar Haveli 0.02 137.1 136.1 0.04 124.6 124.7 0.03 128.8 128.5
27 Maharashtra 8.25 134.6 134.8 18.86 125.1 124.8 13.18 128.3 128.1
28 Andhra Pradesh 5.40 137.5 136.6 3.64 131.7 131.4 4.58 135.4 134.7
29 Karnataka 5.09 134.6 134.2 6.81 134.9 134.8 5.89 134.8 134.5
30 Goa 0.14 142.0 142.9 0.25 126.3 126.0 0.19 132.4 132.5
31 Lakshadweep 0.01 129.3 127.9 0.01 119.0 113.7 0.01 124.0 120.6
32 Kerala 5.50 130.5 130.8 3.46 131.3 131.1 4.55 130.8 130.9
33 Tamil Nadu 5.55 131.2 131.0 9.20 130.7 130.9 7.25 130.9 130.9
34 Puducherry 0.08 138.2 137.5 0.27 129.5 129.1 0.17 131.7 131.2
35 Andaman & Nicobar Islands 0.05 136.2 136.7 0.07 125.6 125.9 0.06 130.8 131.2
36 Telangana 3.16 135.0 135.1 4.41 130.2 130.4 3.74 132.4 132.5
99 All India 100.00 133.8 133.6 100.00 128.6 128.4 100.00 131.4 131.2

Notes:

  1. Prov.   :  Provisional.
  2. —         :  indicates the receipt of price schedules is less than 80% of allocated schedules and therefore indices are not compiled.

 

Annexure IV

Major State/UT wise annual inflation rates (%) for November 2016 (Provisional)

(Base: 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Nov. 15 Index
(Final)
Nov. 16

Index
(Prov.)

Inflation Rate
(%)
Nov. 15 Index
(Final)
Nov. 16

Index
(Prov.)

Inflation Rate
(%)
Nov. 15 Index
(Final)
Nov. 16

Index
(Prov.)

Inflation Rate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 126.5 134.5 6.32 123.2 125.2 1.62 125.3 131.2 4.71
02 Himachal Pradesh 127.3 134.0 5.26 119.5 124.9 4.52 125.9 132.4 5.16
03 Punjab 123.7 129.9 5.01 123.4 126.7 2.67 123.6 128.5 3.96
05 Uttarakhand 123.2 128.7 4.46 119.8 121.9 1.75 121.9 126.2 3.53
06 Haryana 124.9 131.8 5.52 121.4 124.5 2.55 123.3 128.4 4.14
07 Delhi 122.5 129.0 5.31 124.7 131.1 5.13 124.6 131.0 5.14
08 Rajasthan 128.9 135.7 5.28 125.1 130.3 4.16 127.5 133.8 4.94
09 Uttar Pradesh 127.2 131.8 3.62 125.3 128.9 2.87 126.5 130.8 3.40
10 Bihar 130.9 135.4 3.44 124.9 126.6 1.36 130.0 134.1 3.15
18 Assam 127.2 129.6 1.89 125.1 128.0 2.32 126.8 129.3 1.97
19 West Bengal 125.6 133.6 6.37 123.7 129.2 4.45 124.7 131.5 5.45
20 Jharkhand 129.6 138.1 6.56 122.9 127.8 3.99 127.0 134.2 5.67
21 Odisha 133.9 138.6 3.51 123.9 126.9 2.42 131.1 135.3 3.20
22 Chhattisgarh 137.7 138.3 0.44 124.8 127.2 1.92 132.7 134.0 0.98
23 Madhya Pradesh 126.3 129.6 2.61 125.2 128.6 2.72 125.8 129.2 2.70
24 Gujarat 128.7 135.8 5.52 122.0 125.1 2.54 124.9 129.7 3.84
27 Maharashtra 128.6 134.8 4.82 121.2 124.8 2.97 123.7 128.1 3.56
28 Andhra Pradesh 131.9 136.6 3.56 128.4 131.4 2.34 130.6 134.7 3.14
29 Karnataka 131.4 134.2 2.13 130.3 134.8 3.45 130.8 134.5 2.83
32 Kerala 125.7 130.8 4.06 127.0 131.1 3.23 126.2 130.9 3.72
33 Tamil Nadu 128.5 131.0 1.95 128.6 130.9 1.79 128.6 130.9 1.79
36 Telangana 125.7 135.1 7.48 126.0 130.4 3.49 125.9 132.5 5.24
99 All India 128.3 133.6 4.13 124.6 128.4 3.05 126.6 131.2 3.63

Notes:

  1. Prov.         :  Provisional.

 

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తున్న పూజారి మోడీ 

12 Monday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Priest Narendra Modi, temple of democracy

Image result for Priest Narendra Modi

సత్య

   ‘జరిగిన ప్రచారాన్ని చూస్తే నరేంద్రమోడీ వుద్యమం దేశపు వుత్తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిందనే భావం కలిగింది. అది దేశాన్ని సోషలిజం మరియు విప్లవం వైపు నడిపిస్తుందనిపించింది. ప్రత్యర్ధులను ఆ ప్రచారం వెర్రివాళ్లను చేసింది, ఆశ్యర్యంలో ముంచెత్తి రక్షణ లేని స్థితిలో పడవేసింది, గుక్క తిప్పుకోకుండా దాడులతో వుక్కిరిబిక్కిరి చేసింది. అది కొంత మందిని నేరగాళ్లగా ఆరోపించింది. అవాస్తవాలను ప్రచారం చేసింది. దేశ వ్యవస్ధ యావత్తూ ప్రచారంపై నిర్మితమైంది. భీతిని ఘోరంగా స్థుతించారు.ఈ ప్రచారదాడిలో లక్షల మంది అనుబంధ సంఘాల సభ్యులను సాధనాలుగా వినియోగించారు. మోడీ ప్రచారం మొత్తాన్ని ప్రచార వూహకర్తల పధకాలమేరకు రూపొందించారు .’ నరేంద్రమోడీ నిజస్వరూపం ఏమిటో ముందునుంచీ తెలిసిన వారికి ఈ మాటలు ఆశ్చర్యం గొలపకపోవచ్చు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన వీర భక్తులుగా మారిన ఎందరినో గత 33 రోజులు ఆలోచనలో పడవేశాయి. ఏమిటిలా జరుగుతోంది అనే అంతర్మధనం వారిలో ప్రారంభమైంది. ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అంటే ఇదే. పై పేరాలో వర్ణితమైన అంశం నిజానికి నరేంద్రమోడీ గురించి రాసింది కాదు. హిట్లర్‌ గురించి ‘ ద థర్డ్‌ రీచ్‌ ‘ అనే పుస్తకంలో రాసిన ఒక పేరా. అందువలన దానిలో నరేంద్రమోడీ అన్న దగ్గరల్లా హిట్లర్‌ అని చదువుకోవాలి. నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచార తీరు తెన్నులు, దానిని అమలు చేసిన తీరును తప్పుపట్టిన వారిపై జరుగుతున్న ప్రచారదాడిని చూస్తే అది యాదృచ్చికంగా జరుగుతోందా లేక హిట్లర్‌ ప్రచార వూహాలను బాగా అధ్యయనం చేసిన నరేంద్రమోడి నియమించిన నిపుణుల ఎత్తుగడల మేరకా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. హిట్లర్‌ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి.

    పార్లమెంట్‌ భవనాన్ని తానే తగుల బెట్టించి ఆ పని కమ్యూనిస్టులపై ఆరోపించి వారి అణచివేతకు ఒకసాకుగా వుపయోగించుకున్న హిట్లర్‌ దుర్మార్గానికి ఇప్పుడు రుజువులు అవసరం లేదు. గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, ఆయన మంత్రులు బాణీ మార్చారు. ప్రతిపక్షాలు తనను పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాయని నరేంద్రమోడీ పదే పదే పెద్ద గొంతుకతో చెబుతున్నారు.ప్రతిపక్షాలు నల్లధనులకు మద్దతు పలుకుతున్నాయనేది సరేసరి. ఎంతైనా ప్రధాని కనుక దొంగే దొంగ అని అరచినట్లున్నదని చెప్పటానికి మనస్కరించటం లేదు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల పీచమణిచామని చెప్పుకుంటున్నారు. హోంమంత్రి రాజనాధ్‌ సింగు మన దేశాన్ని విడదీసేందుకు పాక్‌ ప్రయత్నిస్తున్నదని, మనం తలచుకుంటే దానిని పది ముక్కలు చేయగలమని మాట్లాడారు. నోట్ల రద్దుతో వుగ్రవాదం తగ్గిపోయిందని, వారికి డబ్బులందించే హవాలా మార్గాన్ని కూడా మూసివేశామని చెబుతున్న తరువాత ఈ మాటలు చెప్పటం విశేషం.

   పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పదవీ బాధ్యతలు స్వీకరించే సందర్బంగా నరేంద్రమోడీ పేర్కొన్నారు. అలాంటి దేవాలయానికి ఒక ప్రధానిగా నరేంద్రమోడీ ఒక పూజారి లాంటి వారు. ప్రతి రోజూ పూజారి రాకుండా భక్తులు మాత్రం వచ్చి తమ పాత్ర తాము నిర్వహించి భక్తి రసాన్ని రక్తి కట్టిస్తున్నారు. పూజారి దేవాలయానికి రాకుండా తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. దానికి సమాధానం చెప్పకుండా తననే అడ్డుకుంటున్నాయని మోడీ ఎదురుదాడికి దిగారు. బలమైన ప్రధానిగా, ఒక్క మగాడు అన్న భుజకీర్తులు తగిలించుకున్న వ్యక్తి నుంచి ఇంతటి బలహీనమైన వాదన వెలువడటం ఆశ్చర్యం. ఏదో మంచి జరగబోతోందన్న భావనతో తాము ఇబ్బందులు పడుతున్నా ఎంతో సహనం ప్రదర్శిస్తున్న జనం బయట వున్నారు. తిరుగులేని మెజారిటీ వున్న మోడీని పార్లమెంటులో అడ్డుకొనేదెవరు ? ఓటింగ్‌కు అవకాశం వున్న నిబంధన కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న మాట నిజం.వాటికా హక్కు లేదా ? పోనీ అదైనా చెప్పమనండి. దానికి బదులు ధర్మోపన్యాసాలతో చర్చను ముగించే నిబంధన కింద జరపాలని అధికారపక్షం మొరాయిస్తోంది. అదే పార్లమెంట్‌ జరగకపోవటానికి కారణం. గతంలో బిజెపి ప్రతిపక్షంలో వుండగా ఇదే మాదిరి డిమాండ్‌ చేసిందా లేదా ? అప్పుడు తనకు సరైనది ఇప్పుడు కాకుండా ఎలా వుంటుంది? లోక్‌సభలో ఓటింగ్‌ జరిగినా మోడీ సర్కార్‌కు ఢోకా లేదు. రాజ్యసభలో ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రతిపక్షాలు ఓటింగ్‌కు పట్టుబడతాయో లేదో కూడా వూహాజనితమే. చర్చను బట్టి ఎవరి రంగేమిటో జనానికి తెలుస్తుంది. అటువంటపుడు అధికారపక్షం భయపడాల్సిన పనేముంది? ప్రజాస్వామిక దేవాలయాన్ని పూజారి బహిష్కరించాల్సిన అవసరం ఏముంది ?

    అసలు విషయం ఏమంటే నోట్ల రద్దుతో తలెత్తే ప్రయోజనాల గురించి ఆహా ఓహో అన్నట్లుగా పార్లమెంట్‌లో చెబితే కుదరదు, నిర్ధిష్టంగా జరిగే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టీకరించాలి. చీకట్లో బాణం వేసినట్లుగా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనటం తప్ప మరొక అంశం లేదుకనుకనే నరేంద్రమోడీ పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సిద్ధం కావటం లేదు. దేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసిన ఇంతటి తీవ్ర చర్య గురించి కూడా ప్రధాని మీడియా సమావేశం పెట్ట లేదంటే జర్నలిస్టులను చూసి కూడా భయపడుతున్నారా అని సందేహించాల్సి వస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్ధలో ఒక మంచి వరవడిని నెలకొల్పాల్సిన వారు ఇలా చేయటం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయటమే. తాను ప్రధాని గద్దె నెక్కెందుకు పార్లమెంట్‌ సోపానాలు కావాల్సి వచ్చాయి గాని తరువాత మాట్లాడేందుకు మాత్రం పనికిరాకుండా పోయాయా ? ఏంత చిత్రం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలు’

12 Monday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

advertising purchases, freedom house, India press freedom, Media, Narendra Modi, news outlets, press freedom, punish, reward

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫ్రీడం హౌస్‌ విమర్శ

   తాము కోరుకున్న రీతిలో వార్తల ప్రచురణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా సంస్ధలపై బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలను’ వుపయోగిస్తున్నాయని అమెరికా కేంద్రంగా పని చేసే ఫ్రీడం హౌస్‌ 2016 నివేదికలో మన దేశ పరిస్థితి గురించి పేర్కొన్నది. కోరుకున్న రీతిలో వార్తలు ఇస్తే బహుమానంగా ప్రకటనల జారీ, విమర్శనాత్మకం, వ్యతిరేక వార్తలు ఇచ్చిన వారికి శిక్షగా ప్రకటనలు ఇవ్వకపోవటం గురించి మన నిత్యజీవితంలో చూస్తున్నదే. ఆ నివేదికలో మన దేశం గురించి రాసిన కొన్ని అంశాలు ఇలా వున్నాయి. అంతకు ముందు సంవత్సర నివేదికలో పత్రికా స్వేచ్చలో 40, రాజకీయ వాతావరణంలో 20 వ స్ధానాలలో వున్నది కాస్తా 2016లో రెండింటిలో ఒక పాయింటు చొప్పున తగ్గి 41,21గా వున్నట్లు, భారత్‌ను పాక్షిక స్వేచ్చ వున్న తరగతి కింద పరిగణిస్తున్నట్లు పేర్కొన్నది.

    దక్షిణాసియా పరిధిలో భారత మీడియా 2015 సంవత్సరంలో అత్యంత స్వేచ్చాయుతమైనదిగా వుండగా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కింద మీడియా సిబ్బంది ఆటంకాలను ఎదుర్కోవటం కొనసాగింది. ప్రభుత్వ అధికారులను కలుసుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొన్నామని జర్నలిస్టులు చెప్పారు, ఆ ఏడాదిలో ప్రభుత్వ సెన్సార్‌ షిష్‌ను అతిగా వుపయోగించి నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరుగుతోందా అని దేశవ్యాపిత చర్చ జరగగా జర్నలిస్టులు, రచయితలు తమ పనికి సంబంధించి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. విధి నిర్వహణ కారణంగా ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. శిక్షలు పడని వాతావరణం నెల కొన్న కారణంగా హింసాకాండను ప్రోత్సహించారు.

ముఖ్య పరిణామాలు

    సతాయింపు లేదా ఇబ్బంది కలిగించేందుకు వుద్ధేశించిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పెట్టటాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ 2000 సంవత్సర ఐటి చట్టంలోని ఒక సెక్షన్‌ను నిలుపు చేస్తూ 2015మార్చినెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలో 2012లో సామూహిత అత్యాచారం, హత్యకు గురైన ఒక వైద్య విద్యార్దినిపై నిర్మించిన ఒక డాక్యుమెంటరీని అదే నెలలో అధికారులు నిషేధించారు. ఫేస్‌బుక్‌లో విమర్మనాత్మక రిపోర్టులు పెట్టాడన్న కక్షతో వుత్తర ప్రదేశ్‌కు చెందిన పాలక సమాజవాదీ పార్టీకి చెందిన వారు జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ను జూన్‌ నెలలో సజీవదహనం చేశారు. ఆగస్టునెలలో గుజరాత్‌లో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శనలు జరిగిన సమయంలో జనం గుమి కూడ కుండా, వార్తలు, సమాచారాన్ని వెల్లడికానివ్వకుండా చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

    భావ ప్రకటన, స్వేచ్చల గురించి రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ ఎల్లవేళలా కోర్టులు తగిన విధంగా వాటిని కాపాడలేదు లేదా లేదా ప్రభుత్వ అధికారులు తగిన విధంగా చట్టపరమైన రక్షణలు కల్పించటంలో వాటిని గౌరవించలేదు.మీడియా స్వేచ్చను పరిమితం చేసే అనేక చట్టాలు ఇంకా అమలులోనే వున్నాయి. ప్రభుత్వంపై ద్వేషం లేదా వుల్లంఘన లేదా వ్యతిరేకతను రెచ్చగొట్టటం లేదా ప్రయత్నించటాన్ని దేశ ద్రోహంగా పరిగణించే 1860పీనల్‌ కోడ్‌లోని 124ఏ కొనసాగుతున్నది. భద్రతకు సంబంధించిన అంశాల వార్తలపై నిషేధం, జర్నలిస్టులను శిక్షించే అదికారాన్ని కట్టబెట్టిన 1923నాటి అధికారిక రహస్యాల చట్టం అమలులో వుంది. రోడ్డు నిర్మాణ యంత్రాన్ని తగుల బెట్టేందుకు మావోయిస్టు సానుభూతి పరులకు సహకరించాడనే పేరుతో సోమారు నాగ్‌ అనే జర్నలిస్టును చత్తీస్‌ఘర్‌ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండ, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడనే ఆరోపణతో సంతోష్‌ యాదవ్‌ అనే జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. మీడియా సంస్ధలపై పరువు నష్టం కేసులు కూడా పెరిగాయి. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ రాజకీయ అవినీతికి పాల్పడిందని రాసిన కారవాన్‌ పత్రికపై 3.9 కోట్ల డాలర్లకు కేసు వేసింది.

    దేశంలోని టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే డేటా, ఫోన్‌ కాల్స్‌ను ఒక కేంద్రీయ వ్యవస్ధ ద్వారా అధికారులు తెలుసుకొనేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్ధకు అనుగుణంగా ఆ సమాచారం లేదని వెల్లడి అయితే దీర్ఘకాల జైలు శిక్షలు విధించవచ్చు. దానిని 2016లో అమలులోకి తీసుకురానున్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా దీనిని దుర్వినియోగం చేయవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా నిఘావేసే ‘నేత్ర’ వ్యవస్ధ ఏర్పాటు గురించి వార్తలు వచ్చాయి.

   కొంత మందికి అనుకూలంగా వార్తలు రాయాలని కొంత మంది మేనేజర్లు జర్నలిస్టులను ఆదేశించటం ఆందోళనకరమైన అంశం. ప్రభుత్వానికి అనుకూలంగా మలిచేందుకు దూరదర్శన్‌ను వినియోగిస్తున్నారు. గొడ్డు మాంసంలో ఐరన్‌ లభ్యం అవుతుందని రాసినందుకు హర్యానా ప్రభుత్వం తన పత్రిక సంపాదకుడిని తొలగించింది. గొడ్డు మాంస వినియోగానికి వ్యతిరేకంగా హిందుత్వవాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పూర్వరంగంలో ఇది జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిసింది. ఆమేరకు మాట్లాడటం మానివేయటం లేదా ఎంతో కష్టంతో మాట్లాడుతున్నారని గతేడాది మార్చినెలలో 74శాతం మంది జర్నలిస్టులు వెల్లడించారు.

     ప్రభుత్వ రంగ కంపెనీల ప్రకటనలు పోగొట్టుకోకుండా వుండేందుకు కొన్ని మీడియా సంస&థలు స్వయం సెన్సార్‌షిప్పును విధించుకున్నాయి. గతంలో విమర్మశలతో కూడిన వార్తలు రాసిన విదేశీ జర్నలిస్టులకు వీసాలు దొరకటం కష్టమౌతున్నది. ఒక మరాఠీ ఛానల్‌ సంపాదకుడు నిఖిల్‌ వాగ్లేను మితవాద హింసాత్మక హిందూత్వ సంస&థ బెదిరించింది. కేబుల్‌ పంపిణీ నెట్వర్కులను స్వంతం చేసుకుంటున్న రాజకీయ నేతలు తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా లేని టీవీ ఛానళ్లను నిలిపివేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన మీడియాకు లబ్ది చేకూర్చటానికి, నచ్చని వాటిని దెబ్బతీయటానికి ప్రకటనల జారీని సాధనంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ లేదా ప్రయివేటు ప్రయోజనాలకు గాను జర్నలిస్టులు, సంపాదకులకు లంచాలతో సహా ప్రలోభాలు అందోళన కలిగిస్తున్నాయి. అదే విధంగా బడా కంపెనీలతో ప్రయివేటు ఒప్పందాల కారణంగా అనేక కంపెనీలలో సంపాదకవర్గం-వాణిజ్య విభాగానికి హద్దులు చెరిగిపోతున్నాయి. పార్టీలు, అభ్యర్ధులకు అనుకూలంగా నోటుకు వార్తల ప్రచురణలపై ఎన్నికల కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణలు జరుపుతున్నప్పటికీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కల్పిత వార్తలు- కట్టు కధలతో హిల్లరీకి దెబ్బ- మోడీకి లబ్ది

11 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA

≈ Leave a comment

Tags

Comet Ping Pong, fake news, Hillary Clinton, Narendra Modi, photos, Pizza Gate, Pizza Gate Fake News

 

Image result for  Hillary Clinton ,pizzagate

సత్య

    ప్రస్తుతం ప్రతిదీ నకిలీ, కల్పిత మయం. దీంతో ఏది నిజమో కాదో, ఎవరు నిజాయితీ పరులో కాదో తెలుసుకోవటం ఎంతో కష్టంగా మారుతోంది. నిజాన్ని నిగ్గు తేల్చే ఓపిక, వనరులు అందుబాటులో లేకపోవటంతో అనేక మంది అనుమానం వచ్చినా కాదని ఖండించలేని, విశ్వసించలేని పరిసి&థతి అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న తీరు తెన్నులను చూస్తే అత్యధికులు నమ్ముతున్నారు. ఈ బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు నకిలీ, కల్పితాంశాలను సాంప్రదాయక, సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ప్రపంచంలో అనేక చోట్ల కట్టుకథలను ప్రచారంలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నవారు వున్నారన్నది నమ్మలేని నిజం. ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి కొందరు వీటిని ఆశ్రయిస్తే తమ నేతలను గొప్పవారిగా చిత్రించేందుకు కొందరు వుపయోగించుకుంటున్నారు. ఈ రెండింటికీ హిల్లరీ క్లింటన్‌, నరేంద్రమోడీని వుదాహరణగా చెప్పవచ్చు.

   మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డిసెంబరు నాలుగవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే తన చేతిలో వున్న తుపాకితో ఢాం ఢాం మ్మని కాల్పులు జరిపాడు. అమెరికాలో అలా వచ్చి ఇలా కాల్పులు జరిపి కొంత మందిని చంపి, తనను తాను కాల్చుకొని లేదా భద్రతా దళాలకు దొరికి పోవటం సాధారణ విషయం. అయితే పింగ్‌ పాంగ్‌లో జరిపిన కాల్పులలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి తాపీగా తన ఆయుధాన్ని అప్పగించి పోలీసులకు లొంగిపోయాడు అది అమెరికా చరిత్రలో ఎనిమిదవ వింత !

    మన పాత తెలుగు సినిమాలలో మాదిరి గిర్రున తిరుగుతూ వెనక్కు వెళితే తప్ప ఈ అసాధారణ వరిణామం గురించి అర్ధం కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘పిజాగేట్‌ ‘ పేరుతో ఒక వార్త అమెరికన్లను వూపివేసింది. అదేమిటంటే పైన పేర్కొన్న పింగ్‌ పాంగ్‌ రెస్టారెంట్‌లోని సెల్లార్‌లో చిన్న పిల్లలతో సెక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దాని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ ఆమె ప్రచార బాధ్యతలు చూసే మేనేజర్‌ జాన్‌ పొడేస్టా వున్నారని ఒక వార్త వచ్చింది. అది పిజా దుకాణం కనుక దానికి పిజాగేట్‌ అని పేరు పెట్టారు. ఆ వార్తలో ఆ దుకాణ చిరునామా, ఆ భవనంలోని ఏభాగంలో సెక్స్‌ నిర్వహిస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. తట్టి మరీ లేపి ఈ వార్త విన్నారా అని అడిగినట్లుగా ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆ వార్త తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేయాల్సిందంతా చేశారు. ఇంకే మంది అనేక మంది ఆ షాప్‌ యజమాని, దానిలో పని చేసే సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అవి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా వార్తలయ్యాయి.బాబోయ్‌ ఈ బెదిరింపులు, అసలు కుట్రవార్త గురించి దర్యాప్తు చేసి నిగ్గుదేల్చండని పిజా షాప్‌ యాజమాన్యం ఎఫ్‌బిఐని, సామాజిక మీడియా కంపెనీలను కోరింది.అయినా సరే ప్రచారం ఆగలేదు. షాపు యజమాని, క్లింటన్‌ మేనేజర్‌ మధ్య జరిగిన ఇమెయిల్‌ వుత్తర ప్రత్యుత్తరాలంటూ ఒక వెబ్‌సైట్‌ బయట పెట్టటంతో అందరూ పీజా గేట్‌ నిజమే అనుకున్నారు. దానిలో పేర్కొన్న పీజా షాపులోని ఆహార పదార్ధాల పేర్లను సంకేత భాష అంటూ అర్ధాలు తీసి వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులను భరించలేక షాప్‌ మేనేజర్‌ వుద్యోగానికి రాజీనామా చేయాలని అతని భార్య పోరు పెట్టింది.

    చిత్రం ఏమిటంటే పీజాగేట్‌ కుంభకోణం నిజమని గానీ, కాదని గానీ ఎఫ్‌బిఐ ప్రకటించలేదు. హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పిల్లలను హత్య చేసింది అనే ఒక వీడియో రంగంలోకి వచ్చింది. తరువాత దానిని వుపసంహరించుకున్నారు. అయితే అప్పటికే అది చేయాల్సిన హాని చేసింది.నాలుగులక్షల 20వేల మంది దానిని కాపీ చేసుకున్నారని తేలింది. న్యూయార్క్‌ పోలీసు వర్గాల కధనం పేరుతో వార్తలు వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌ ఇంటిపై దాడి జరిగిందనే బ్రేకింగ్‌ న్యూస్‌లు వచ్చాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాల గురించి ఇంక చెప్పేదేముంది. ఎన్నికలైపోయాయి.హిల్లరీ క్లింటన్‌కు జరగాల్సిన నష్టం, ట్రంప్‌కు లాభం కలిగింది.

    మరోసారి గిర్రున తిరిగి వర్తమానంలోకి వస్తే వుత్తర కరోలినా నివాసి 28ఏండ్ల ఎడ్గార్‌ మాడిసన్‌ వాల్చ్‌ అనే యువకుడు పిల్లలను రక్షించేందుకంటూ తుపాకితో రెస్టారెంట్‌కు వచ్చాడు. పిల్లలతో సెక్స్‌ రాకెట్‌ నడిచిందన్న సెల్లార్‌ కోసం చూశాడు. అసలు ఆ భవనానికి సెల్లారే లేదని తేలింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా పీజా గేట్‌ అనేది ఒక కట్టుకధ అని తెలుసుకొని గాలిలోకి కాల్పులు జరిపి తన ఆయుధాన్ని అక్కడి సిబ్బందికి అప్పగించి తానెందుకు వచ్చిందీ చెప్పాడట. మా రెస్టారెంట్‌లో గనుక సెల్లార్‌ వుండి వుంటే ఏం జరిగి వుండేదో, కట్టుకధలు ఎలాంటి పరిస్ధితులను తెస్తాయో ఈ రోజు మీరు చూశారు. ఇక ముందైనా ఇలాంటి వాటిని నమ్మకండని యజమాని వేడుకున్నాడు. అయితే ఈ వుదంతాన్ని కూడా కొంత మంది కట్టుకథగా కొట్టి పేస్తున్నవారు లేకపోలేదు. కొందరైతే పోలీసులు ఆడించిన నాటకంగా కూడా చెప్పారు. ఏది ఏమైనా క్లింటన్‌ ఓటమికి ఇది కూడా తన వంతుగా తోడ్పడిందని చెప్పవచ్చు.

     ఇక కట్టుకధలతో లబ్ది పొందిన వారిలో మన ప్రధాని నరేంద్రమోడీ ఒకరని చెప్పవచ్చు. ఆయన గురించి సామాజిక మీడియాలో ఎన్నికల సందర్భంగా వ్యాపింప చేసిన కథలు ఎన్నో. వాటిలో ఒకటి మోడీ యువకుడిగా వున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్భంగా గదులను వూడ్చిన నిరాడంబరుడు అంటూ సామాజిక మాధ్యమాలలో తిప్పిన ఫొటో ఒకటి. అసలూ, దానికి నకిలీని దిగువ చూడవచ్చు.

Image result for narendra modi fake news, fake photos

ఈ ఫొటో గురించి ఫేస్‌బుక్‌ దర్యాప్తు బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. చాలా మంది ఇప్పటికీ నరేంద్రమోడీ నిరాడంబరతకు ఆ చిత్రాన్ని వుదాహరణగా చూపుతున్నారు. అంతగా జనంలోకి వెళ్లింది. అసలు ఆ ఫొటో స్వాతంత్య్రానికి ముందు 1946లో అసోసియేటెడ్‌ ప్రెస్‌ తీసిన ఫొటో అని అది ఇ బే నుంచి స్వీకరించారని తేలింది. అంటే అప్పటికి అసలు నరేంద్రమోడీ పుట్టలేదు. ఆ ఫొటో ఎలా సంపాదించారనేది ఇంకా రహస్యంగానే వుంది. దొంగలు తమకు తెలియకుండానే కొన్ని ఆనవాళ్లను వదులుతారని పోలీసు చెబుతారు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. అది 1988 నాటిదని దానిలో పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్రమోడీకి అలాంటి గడ్డం లేకుండా వున్నారని కొందరు 1980దశకంలో ఎల్‌కె అద్వానీతో కలసి వున్న ఒక ఫొటోను వుదహరించారు. దాన్ని పక్కన పెడితే మహారాష్ట్ర బిజెపి మీడియా విభాగపు సహ కన్వీనర్‌గా వున్న ప్రీతీ గాంధీ ఆ చిత్రం నరేంద్రమోడీదే అంటూ 2013జూలై 12 తెల్లవారు ఝామున రూపా పంజారియాకు ట్వీట్‌ చేశారు. ఈ విషయాలు కావాలంటే దిగువ లింక్‌లో వున్నాయి చూసుకోవచ్చు.http://fbinvestigations.blogspot.in/2014/04/modi-fake-vs-real.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులపై కాషాయ దళాల ఆత్మవంచన, పరవంచన ?

04 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, china boycott, chinese investments, RSS Outfits anti china, RSS Outfits anti china feets, saffron brigade hypocrisy

సత్య

    కాషాయ తాలిబాన్లకు దేశభక్తి గురించి ఆకస్మికంగా మెలకువ వచ్చిందా ? లేక ఎవరైనా వెనుకనుంచి పొడుస్తున్నారా ? కాషాయ పరంపరలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వారం రోజుల క్రితం పేటిమ్‌ సంస్ధలో చైనా పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలని తన విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)ను కోరినట్లు వారం రోజుల క్రితం మీడియాలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం ఈ విషయమై విచారణ జరపాలని కోరుతున్నట్లు తాజాగా ఆ సంస్ధ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వెల్లడించారని ఒక వార్తా సంస్ధ ఆదివారం నాడు తెలిపింది. పద్నాలుగు నెలల క్రితం మన దేశానికి చెందిన పేటిమ్‌ కంపెనీలో 68కోట్ల డాలర్లకు 40శాతం వాటాను చైనా ఇ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కొనుగోలు చేసినట్లు లోకానికంతటికీ తెలిసిందే. అదేమీ రహస్యంగా జరగలేదు. ఇన్ని నెలల తరువాత ఆ లావాదేవీ, దాని పర్యవసానాలపై విచారణ జరపాలని కోరటమే విచిత్రం. ఇది వారికి కలిగిన ఆలోచనా , వేరే ఎవరినైనా సంతుష్టీకరించేందుకు ఇలా చేస్తున్నారా ? చైనా కంపెనీలు మన దేశ సంస్ధలలో పెట్టుబడులు పెట్టటం, వాటాలు కొనుగోలు చేయటం ఈ వారంలోనే ప్రారంభమైందా ?

     స్వదేశీ జాగరణ మంచ్‌ వారు చెబుతున్న అభ్యంతరం ఏమిటి ? పేటిమ్‌ ద్వారా చైనా కంపెనీలు మన దేశ సమాచారాన్ని తెలుసుకొని దుర్వినియోగం చేసే అవకాశం వుందని, అసలు ఏ కంపెనీకి ఎంత వాటా వుందో, ఎలా ఇచ్చారో వెల్లడించాలని కోరటంతో పాటు పేటిమ్‌ తన వాణిజ్య ప్రకటనలలో ప్రధాని నరేంద్రమోడీ బొమ్మను వుపయోగించుకోవటం అభ్యంతరకరం అని మహాజన్‌ చెప్పారు. పది సంవత్సరాల పాటు అధికారంలో వున్న యుపిఏ సర్కారు సంస్కరణలను సంపూర్ణంగా అమలు జరపలేదని, తాము వాటిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని బాసలు చేసిన కారణంగానే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు, వాటి కనుసన్నలలో మెలిగే మీడియా నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యమే. దానిలో భాగంగానే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు మరింతగా తెరిచిన ఖ్యాతి తమదే అని చెప్పుకుంటున్న కాషాయ ‘దేశ భక్తులు’ ఆ విదేశీ పెట్టుబడుల గురించి లబలబలాడటం ఎనిమిదో ప్రపంచ వింత.

    చైనా సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. మనం కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలూ కూడా ప్రవేశిస్తాయి, వాటి బెడదను వదిలించే శక్తి తమకు వుందన్నారు. మన దేశ పాలకవర్గం కూడా సంస్కరణల పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధ కిటికీని బాహాటంగా తెరిచింది. మన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుబడుల కోసం తిరగని విదేశీ నగరం లేదు, కలపని చేయిలేదు. ఎక్కడా ఫలానా దేశాల నుంచి పెట్టుబడులు వస్తే తిరస్కరిస్తాం అని ఎన్నడూ, ఎక్కడా చెప్పలేదు. అందువలన అనేక దేశాల కంపెనీలు వచ్చిన మాదిరే చైనా కంపెనీలు కూడా అన్ని దేశాలలో ప్రవేశించినట్లుగానే మన దేశంలో కూడా కాలుపెడుతున్నాయి. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దుర్వినియోగం చేసినట్లు గమనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఏ ప్రభుత్వానికైనా సర్వ హక్కులూ వున్నాయి. అలాంటిది కేవలం చైనా కంపెనీలే దుర్వినియోగం చేస్తాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటి ?మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయనుకుంటే అది ఒక్క చైనా కంపెనీయే చేస్తుందని, మిగతా కంపెనీలు చేయవనే గ్యారంటీ ఏముంది. తనకు మార్గదర్శనం చేసే, తన కార్యకలాపాలను సమీక్షించే స్వంత సంస్ధలే డిమాండ్‌ చేస్తున్నాయి గనుక చైనాతో సహా మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని విదేశీ కంపెల గురించి గతంలో తీసుకున్న చర్యలేమిటి? భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ద్వారా ప్రకటించటం అవసరం.

     పేటిమ్‌ కంపెనీ ఏ లావాదేవీలనైతే నిర్వహిస్తున్నదో వాటినే ముఖేష్‌ అంబానీ రిలయన్సు జియో మనీ పేరుతో నిర్వహించేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పేటిమ్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. తాను వెనుకబడిపోతానని అంబానీ ఆందోళన చెందుతున్నారా ? సరిగ్గా ఈ సమయంలో స్వదేశీ జాగరణ మంచ్‌కు పేటిమ్‌ విదేశీ (చైనా) సంబంధాల గురించి గుర్తుకు వచ్చింది. నిత్యజీవితంలో మన సమాచారాన్ని తెలుసుకోని,తెలుసుకోలేని విదేశీ కంపెనీలు ఏమున్నాయి గనుక. మనం మాట్లాడే ప్రతి మాటా, పంపే ప్రతి ఎస్‌ఎంఎస్‌, ప్రతి ఇ మెయిల్‌ సమాచారాన్ని అవసరం వున్నా లేకపోయినా అమెరికా సిఐఏ ఎప్పటిప్పుడు సేకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్‌ కార్డుల గురించి అందరికీ తెలిసిపోయింది. పాన్‌ కార్డుల ద్వారా ఎవరి నగదు లావాదేవీలేమిటో ఎవరైనా తెలుసుకోవచ్చు. టీవీలలో అమర్చిన సాధనాల ద్వారా మన ఇండ్లలో, చివరికి పడక గదుల్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకొనే రోజులు వచ్చాయి. మన సమాచార గోప్యత ఎక్కడుంది కనుక. వాటన్నింటినీ వదలి చైనా గురించి మాత్రమే సందేహాలు వెలిబుచ్చేవారి గురించి సందేహించాల్సిన అవసరం కలుగుతోంది. ఎవరికైనా ఏజంట్లుగా పని చేస్తున్నారా ? ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన వార్తలు మనకు తెలియదు. పాలస్తీనా అరబ్బులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ వస్తువులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎప్పటి నుంచో పిలుపులు ఇస్తున్నాయి.

Image result for boycott chinese products

    సదరు స్వదేశీ జాగరణ మంచ్‌ గత కొంత కాలంగా చైనా వస్తు బహిష్కరణ గురించి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజమే కదా అని అమాయకులు వీర సైనికుల్లా పని చేస్తున్నారు. అధికారంలో వున్న వారి ప్రతినిధులేమో చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెబుతుంటారు. అక్కడి వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయిస్తుంటారు ! డాలర్ల కేటాయింపు నిలిపివేస్తే చైనా వస్తువుల దిగుమతులు ఎప్పుడో ఆగిపోయి వుండేవి కదా ! మోడీ సర్కారు ఆపని ఎందుకు చేయదు ? దొంగతనంగా దిగుమతి అయితే పట్టుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారు ? ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేద్దామని ? ఎవరి చెవుల్లో పూలు పెడతారు ? ఇంతకాలం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రతినిధులు సర్కారు పగ్గాలు చేపట్టి చైనాతో నానాటికీ బంధం పెంచుకుంటూ పోతుంటే మిన్నకుండటం ఆత్మవంచన కాదా ? వీధుల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పరవంచన కాదంటారా ? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

    నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశంలో చైనా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయని మీడియా కోడై కూస్తున్నది.http://www.livemint.com/Politics/X9NBWqqs0JzkX0OQ3UaMQO/Chinese-investments-in-India-increased-sixfold-in-2015.html 2000 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి నెల వరకు మన దేశంలో చైనా పెట్టుబడుల మొత్తం 135 కోట్ల డాలర్లయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 230 కోట్ల డాలర్లు వచ్చాయట.http://www.vccircle.com/news/economy/2016/08/30/chinese-investment-india-shoots-23-bn-past-3-months-against-135-bn-2000-16 వీటి గురించి స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు మాట్లాడదు ? విచారణ జరపాలని ఎందుకు డిమాండ్‌ చేయదు ? ఈ ఏడాది అక్టోబరు 6-7 తేదీలలో ఢిల్లీలో స్వయంగా నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చైనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల సహకార ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదు ?

    నల్ల ధనాన్ని వెలికి తీసే పేరుతో ఆ పని చేసిన వారు తరువాత బాణీ మార్చి నగదు రహిత లావాదేవీల గురించి ఎక్కువగా చెబుతున్నారు. చెప్పుకోలేని బాధ ఏమిటో సానుభూతి చూపుదాం. నోట్ల రద్దు తరువాత బిజెపి నేతలందరూ ఇప్పుడు చైనా భజన చేస్తున్నారు. మన కంటే పెద్ద దేశమైన చైనాలో నగదు రహిత కార్యకలాపాలు జయప్రదం అయినపుడు మన దేశంలో ఎందుకు కావు అన్నది వారి ఒక ప్రశ్న. చైనా చర్యలను సమర్ధించిన కమ్యూనిస్టులు అదే పని మన దేశంలో చేస్తే విమర్శిస్తారు ఎందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. రోజంతా చైనా కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోయటం, సాయంత్రం కాగానే దాన్ని అడ్డం పెట్టుకొని తమ చర్యలను సమర్ధించుకోవటం. అవకాశవాదానికి హద్దులు లేవు. మేథోపరంగా ఎంతదివాళా స్ధితిలో వున్నారో కదా !

   నల్లధనాన్ని, నగదు రహిత లావాదేవీలను కమ్యూనిస్టులే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ మన కంటే ఎన్నోరెట్లు పెద్దది. అక్కడ నగదు రహిత లావాదేవీలను మోడీ సర్కార్‌ మాదిరి బలవంతంగా రుద్దలేదు. తగినంత నగదు రాదని, నగదు రహితానికి మళ్లాలని తెలంగాణా ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్‌ చంద్ర ప్రకటించటాన్ని బట్టి తగినన్ని నోట్లను ముద్రించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావటం లేదని తేలిపోయింది. నగదు రహిత కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు చేయని, కార్డులు గీకటానికి నిరాకరించే విద్యా, వైద్య సంస్ధలు, దుకాణాల తగిన గడువు నిచ్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కార్డుల వినియోగం భారం కాదని జనాన్ని ఒప్పించగలిగితే వారే దుకాణాలలో డిమాండ్‌ చేస్తారు. ఒక పరిమితి దాటిన లావాదేవీలు కార్డుల ద్వారా మాత్రమే చేయాలని, అందుకు రెండున్నర శాతం రుసుం అదనం అని వసూలు చేస్తే శిక్షించటం వంటి చర్యలు తీసుకుంటే క్రమంగా అలవాటు పడిపోతారు. ఆ పని చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టినట్లు నగదును అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా అమలు చేయపూనుకోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌- నరేంద్రమోడీకి తేడా ఏమిటి ?

03 Saturday Dec 2016

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

black money, black money unearth, Demonetisation, India black money, muhammad bin tughlaq, Narendra Modi

ఎంకెఆర్‌

   ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అనేది ఈ రోజుల్లో ఒక జోకుగా మారిపోయింది. పెద్ద నోట్ల రద్దు, లెక్కకు మించిన బంగారంపై దాడుల వార్తలు రెండవసారి కూడా గద్దె నెక్కాలన్న నరేంద్రమోడీ ఆశల మీద నీళ్లు చల్లుతాయా ? అసలు తొలి అయిదు సంవత్సరాలూ పదవిలో కొనసాగటాన్నే ప్రశ్నార్ధకం చేస్తాయా ? జ్యోతిష్కులకు పెద్ద సవాల్‌ ఇది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అనే నరేంద్రమోడీ అయిడియా – లేఖ రాసిన చంద్రబాబు తన వాటా ఖ్యాతి గురించి ఏమంటారో తెలియదు – అనేక మంది ప్రాణాలను తీసి, జనాన్ని నానాయాతనలకు గురి చేస్తోంది. ఇలాంటి మహత్తర అయిడియా పేటెంట్‌ హక్కు తనదేనా లేక మరొకరిదా అన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత మోడీగారి మీదే వుంది. నోట్ల రద్దు నిర్ణయం ఏక్షణంలో తీసుకున్నారో గాని పెద్దలు ఒక మాట మీద నిలకడగా లేరు. ఎన్ని నిర్ణయాలు , ఎన్ని మార్పులు ! ఏ రోజు బ్యాంకులలో ఎంత డబ్బు ఇస్తారో తెలియదు, ఏ ఎటిఎం ఎప్పుడు తెరుచుకుంటుందో అసలే తెలియదు. అనేక అంశాలను ముందే కనిపెట్టి చెప్పేశాం అని గొప్పలు చెప్పుకొనే జ్యోతిష్కులు, జ్యోతిషాన్ని పాఠాలుగా చెబుతున్న విశ్వవిద్యాలయాల మేథావులు గానీ నోరు మెదపటం లేదు. వారి దురవస్థకు జాలి పడాలి. నోట్ల రద్దు దెబ్బకు గ్రహాలు కూడా గతి తప్పి డబ్బుకోసం క్యూలలో నిలవటానికి వెళ్లి వుండాలి. ఒక ఎటిఎం నుంచి మరో ఎటిఎం వద్దకు పరుగులు తీసే క్రమంలో తమ చిరునామాలే మరచిపోయాయా ? లేకపోతే మన జ్యోతిష్కులు ఈ పాటికి ఏదో ఒకటి చెప్పే వుండేవారు.

    గత కొద్ది రోజులుగా వెలువడుతున్న సమాచారం, తీరు తెన్నులను చూస్తే మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌కు ప్రధాని నరేంద్రమోడీకి వున్న తేడా ఏమిటని అనేక మంది విశ్లేషించేపనిలో పడ్డారు. చరిత్ర అవసరం లేదని చెప్పిన వారంతా ఇప్పుడు తుగ్లక్‌ చరిత్రను చదువుతున్నారు. దేశం మొత్తాన్ని అంటే దక్షిణాదిని కూడా తన పాలనలోకి తెచ్చుకోవాలంటే ఢిల్లీ దూరంగా వుంది కనుక రాజధానిని దేశం మధ్యలోకి తరలించాలని తుగ్లక్‌ భావించాడు. అలాగే బిజెపిని వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో గెలిపించి పటిష్టపరచాలంటే నోట్ల రద్దు వంటి చర్యలు అవసరమని మోడీ భావించినట్లు కనిపిస్తోంది. తుగ్లక్‌ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి( మహారాష్ట్రలోని దౌలతాబాద్‌)కు మారుస్తూ పరివారంతో పాటు రాజధాని జనాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టాడు. మోడీ దేశం మొత్తాన్ని యాతనలకు గురి చేస్తున్నారు. నెలాఖరుకు కాస్త నొప్పి తగ్గుతుందని, తరువాత కొంత కాలం వరకు వుంటుందని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పేశారు. తుగ్లక్‌ నగదు రద్దు చేసి అభాసుపాలయ్యాడు. మోడీ పాత పెద్ద నోట్లను వుపసంహరించి ఏం కాబోతున్నారో డిసెంబరు ఆఖరు నాటికి స్పష్టత రానుంది.

    నోట్ల రద్దు వలన ఆహా ఎన్ని ప్రయోజనాలో ఓహో ఎన్ని ప్రయోజనాలో, 50 రోజుల తరువాత తడాఖా చూడండి, ముందుకాస్త నొప్పి వుంటుంది కానీ తరువాత అంతా మంచే అని చెప్పటం తప్ప నల్లధనం ఎంత వస్తుందో, దానితో ఏమి చేయవచ్చో అపర మేథావిగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీగానీ, అంతకంటే ఎక్కువ తెలివితేటలు వున్నాయని చుట్టుపక్కల వుండే వారి ప్రశంసలు అందుకొనే చంద్రబాబు గానీ లేదా వారికి మద్దతు ఇస్తున్న మీడియా విశ్లేషకులు గానీ నిర్ధిష్టంగా చెప్పలేదు. మూడు నుంచి ఐదులక్షల కోట్ల రూపాయల మేరకు నల్లధనం బయటకు వస్తుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వ లోటు తీర్చుకునేందుకు లేదా నరేంద్రమోడీని మరోసారి గద్దె నెక్కించేందుకు వీలుగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయటం లేదా విజయమాల్య వంటి ఘరానా పెద్దలకు ఇచ్చిన అప్పులను రద్దు చేయటం ద్వారా నష్టపోయిన బ్యాంకులకు పెట్టుబడిగా పెట్టి ఆదుకోవటం వంటి అనేక పిట్టల దొరల వూహాగానాలు వెలువడ్డాయి. వాటిని ఇప్పటికీ నమ్ముతున్నవారు గణనీయంగా వున్నారు. సమాజంలో మధ్యతరగతికి లోలకం లక్షణం వుందని అనుభవజ్ఞులు చెబుతారు. గోడగడియారాలలో లోలకం ఆ వైపు ఈ వైపు తిరుగుతుంటుంది తప్ప మధ్యలో ఎప్పుడూ ఆగదు. అలాగే పొలో మంటూ నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తిన వారు అంతే వేగంతో కిందకూడా పడేయగలరు. ఏం జరుగుతుందో తెలియదు కనుక తోటి వారు కాస్త కనిపెట్టి వుండటం మంచిది.

    నవంబరు 29న రాజ్యసభకు ఆర్ధికశాఖ సహాయ మంత్రి తెలియచేసినదాని ప్రకారం పెద్ద నోట్లు రద్దు చేసే సమయానికి దేశంలో 1716.5 కోట్ల ఐదు వందల నోట్లు, 685.8 కోట్ల వెయ్యిరూపాయల నోట్లు చలామణిలో వున్నాయి.(దీనిలోనే నల్లధనం కూడా కలసి వుంది) వాటి మొత్తం విలువ 15.44 లక్షల కోట్లరూపాయలు. రిజర్వు ప్రకటించినదాని ప్రకారం నవంబరు 27 తేదీ నాటికి బ్యాంకుల వద్ద డిపాజిట్‌ చేసిన పెద్ద నోట్ల విలువ రు.8.45లక్షల కోట్లు. నోట్ల మార్పిడికి ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడువులో 18 రోజులలో జమ అయిన మొత్తం ఇది. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పదిలక్షల కోట్ల మేరకు జమ కావచ్చని అంచనా. అంటే ఐదులక్షల కోట్లకు అటూ ఇటూగా నల్లధనం బయటకు రావచ్చని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. అయితే ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను గుర్తుకు తెస్తోంది.http://www.thehindu.com/business/Economy/Deposits-of-withdrawn-notes-nears-Rs.11-lakh-crore/article16738256.ece  ప్రకారం 14.15లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో వుంది. చెలామణిలో వున్న నోట్ల విలువ గురించి లెక్కలలో తేడాలు వుంటున్నాయి. అందువలన కొన్ని వేల కోట్లు అటూ ఇటూగా 14లక్షల కోట్లని అందరూ చెబుతున్నారు. డిసెంబరు 30 నాటికి బ్యాంకుల వద్ద ఎంత మేరకు పెద్ద నోట్లు జమ అవుతాయో చూసిన తరువాత రిజర్వుబ్యాంకు తాము ముద్రించిన నోట్లెన్నో, తమ వద్దకు వచ్చినవెన్నో లెక్కించి రాని వాటిని నల్లధనంగా ప్రకటిస్తుంది. అంటే ఆ మేరకు తిరిగి అదనంగా ముద్రించి ఆ సొమ్మును ఏం చేయాలో ప్రభుత్వ నిర్ణయం మేరకు అది చేస్తారు. అంతకు ముందు డిపాజిట్‌ చేసిన తీరు తెన్నులను బట్టి నవంబరు 30వ తేదీ నాటికి 11లక్షల కోట్ల మేరకు డిపాజిట్‌ అయివుంటుందని బ్యాంకర్ల అంచనా. అంటే ప్రభుత్వం అనుకున్న ఐదులక్షల కోట్లు కాస్తా మూడుకు పడిపోయాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పాతనోట్లే ఎక్కువగా చెలామణిలో వున్నాయి. వాటిని కూడా డిపాజిట్‌ చేయటానికి ఈనెలాఖరు వరకు గడువు వుంది కనుక, చివరి నిమిషంలో జమ చేసే వారు కూడా గణనీయంగానే వుంటారు కనుక మిగిలిన మూడులక్షల కోట్లలో ఎంత జమ అవుతుంది అన్నది ప్రశ్న. ఇంక ఈ మొత్తం జమ కాకుండా వుండేట్లు చూడు మనువా, మా మోడీ పరువు కాపాడు మనువా అని ఆయన వీర భక్తులు రహస్యంగా మొక్కుకోవటం ప్రారంభించటం మంచిది. ఎందుకంటే ఇంకే మాత్రం బ్యాంకుల్లో జమ అయినా జనం అడిగే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు వుండవు. ఎవరైనా దీని మీద కూడా కొత్త నోట్లతో పందాలు కాసే ప్రమాదం లేకపోలేదు.

  వారం రోజుల క్రితం సిఎంఐఇ అనే సంస్ధ వేసిన అంచనా ప్రకారం లక్షా 28వేల కోట్ల రూపాయల మేర నోట్ల రద్దు వలన నష్టాలుంటాయట. అంటే ఇంకా జనం దగ్గర వున్న మూడులక్షల కోట్లూ నల్లధనమే అనుకున్నా, అనుకున్నా నిఖర లాభం లక్షా 82వేల కోట్లు మాత్రమే. మూడులక్షల కోట్లలో ఈ నెలాఖరుకు రెండులక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినా ఆర్ధికంగా నష్టదాయకమే. అది నిఖరంగా ఎంత అన్నది కొత్త సంవత్సర కానుకగా తెలుసుకోవచ్చు.

సిఎంఐఇ లెక్కల ప్రకారం అది వేసిన నష్ట అంచనాలన్నీ తక్కువలో తక్కువ. ఆ యాభై రోజులు బ్యాంకులు, ఎటిఎంల దగ్గర నిలిచిన కారణంగా పోయిన పని లేదా సెలవుల నష్టం మొత్తం 15వేల కోట్ల రూపాయలు.

బ్యాంకులు కొత్త నోట్లను అమర్చేందుకు, గుర్తించేందుకు వీలుగా ఎటిఎంలలో చేయాల్సిన మార్పులకు అయ్యే ఖర్చు రు.35.1వేల కోట్లు.

కొత్త నోట్లను అచ్చు వేయటానికి ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు వదిలే చేతి చమురు రు.16.8వేల కోట్లు.

వ్యాపార, వాణిజ్యాల ప్రత్యక్ష నష్ట అంచనా రు.61.5వేల కోట్లు.

   వీటన్నింటి మొత్తం లక్షా 28వేల కోట్ల రూపాయలు. ఇక ప్రభుత్వానికి సంభవించే నష్టాలను కూడా లెక్కించాల్సి వుంది. అవి కూడా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వెల్లడి అవుతాయి. సిఎంఐఇ సంస్ధ వేసిన నష్టాలలో టోల్‌ టాక్సు రద్దు వలన కలిగిన లోటును పరిగణనలోకి తీసుకోలేదు. రోజుకు 80 నుంచి 90 కోట్ల మేర జాతీయ రహదారుల మీద ఆదాయం కోల్పోయినట్లు అంచనా. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కలుపు కుంటే నష్టాలు తడిచి మోపెడు అవుతాయి. అవన్నీ ఆయా సంస్ధలు వార్షిక లెక్కలు తయారు చేసేటపుడుగానీ స్పష్టం గావు అందువలన మోడీ సర్కార్‌ నల్ల ధనాన్ని ఈ మేరకు నష్టపోయిన విలువగల దానిని అయినా పట్టుకుంటే జనానికి మిగిలేది ఆయాసం అయినా నల్లధనంపై పోరులో నేను సైతం అన్నట్లుగా ఎంతో కొంత త్యాగం చేశామని గర్వపడతారు-లేకపోతే జనంలో కలిగేది ఆగ్రహం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెద్ద నోట్ల రద్దు, నగదు రహితం వెనుక రిలయన్స్‌ హస్తం ?

01 Thursday Dec 2016

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

black money, cashless transactions, demonetization, Narendra Modi, Reliance

Image result for Reliance hand behind demonetization and cashless transactions move ?

ఎం కోటేశ్వరరావు

  నగదు రహిత లావాదేవీలను ఎక్కువగా నిర్వహించేందుకు అవసరమైన పద్దతులను సూచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. నగదుకు బదులు కార్డు గీకి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేకున్నా బలవంతంగా అయినా ఆ పద్దతికి మళ్లించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మరికొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జనం అనివార్యంగా అటువైపు మళ్లుతారని గత కొద్ది రోజులుగా పేటిమ్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరగటాన్ని బట్టి చెప్పవచ్చు.

    నల్లధనాన్ని అరికట్టే పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే నగదు రహిత కార్యకలాపాల గురించి ఎందుకు తొందర పడుతున్నారో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఒక కమిటినీ ఎందుకు వేశారో, గురువారం నాడు రిలయన్స్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ ప్రకటనతో స్పష్టమైంది. నోట్ల రద్దుకు దీనికి ఏదైనా సంబంధం వుందా ? ముఖేష్‌ ప్రకటించిన వివరాల ప్రకారం సోమవారం నుంచి దేశవ్యాపితంగా కోటి మంది వ్యాపారులను జియో మనీతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. దానికి వీలు కల్పించే జియో వుచిత డేటా, ఫోన్‌ సౌకర్యాన్ని మరో మూడు నెలల వరకు వుచితంగా అందచేయనున్నారు. ఆధార్‌ నంబరు అనుసంధానంతో చిన్న ఎటిఎంలను మార్చినెల నాటికి దేశ వ్యాపితంగా నాలుగు లక్షలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అన్ని బ్యాంకులకు వున్న ఎటిఎంల కంటే ఇవి రెట్టింపు. ఇప్పటికే రెండులక్షల దుకాణాలతో ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. దుకాణాలతో లావాదేవీలు మాత్రమే గాక వ్యక్తుల నుంచి వ్యక్తులకు కూడా లావాదేవీలు జరపవచ్చు. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారి ఖాతాకు సొమ్ము బదలాయించటమే కాకుండా వ్యాపారులు దీనితో తమ బ్యాంకు ఖాతాలలో కూడా నగదు జమచేయటానికి వినియోగించవచ్చు.ఎస్‌బిఐతో కలిసి నగదు చెల్లించే బ్యాంకు లైసన్సును కూడా జియో తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే జియో ఫోన్‌ కనెక్షన్ల ద్వారా ఐదు కోట్లకు పైగా ఆధార్‌ కార్డుల సమాచారాన్ని రిలయన్స్‌ సేకరించింది. అంటే బ్యాంకింగ్‌ వ్యవస్ధకు సమాంతరంగా ఆర్ధిక కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సంస్ధ పధకాలతో వున్నట్లు చెప్పవచ్చు.

  నగదు రహిత కార్యకలాపాల నిర్వహణ ద్వారా పారదర్శకతను పెంచుతామని, అవినీతిని అరికడతామని చెప్పటాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే దేశంలో పుష్కలంగా నిరక్షరాస్యత, అమాయకత్వం నిండి వుండి, అనువైన వ్యవస్థాగత సౌకర్యాలు లేకపోతే సామాన్య జనం నోట్ల రద్దు మాదిరి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. రెండవది నూటికి నూరుశాతం నగదు రహిత దేశాలు, ప్రాంతాలుగా వున్న చోట్ల అవినీతి రూపం మార్చుకుంది తప్ప పోలేదు. నూతన ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ పేరుతో గత పాతిక సంవత్సరాలుగా అనుసరించిన విధానాలు వుపాధి రహిత అభివృద్ధికి బాటలు వేశాయి. పర్యవసానంగా ఆర్ధిక అసమానతలు మరింతగా పెరిగాయి. ప్రపంచవ్యాపితంగా జరిగిన పరిణామమే మన దేశంలో కూడా జరిగింది.

   అనేక మందికి నగదు రహితం అంటే డబ్బుకు బదులు కార్డులను గీకటం మాత్రమే అనుకుంటున్నారు. రిలయన్స్‌ వంటి సంస్ధలు మన జేబులను స్మార్ట్‌గా కొల్లగొడతాయి. అంబానీలు నాలుగులక్షల చిన్న ఎటిఎంలు పెట్టినా, ఆరునెలల పాటు వుచితంగా డేటా, ఫోన్‌ సౌకర్యం కలిగించినా అది తాను సంపాదించిన లక్షల కోట్ల సంపద నుంచి చేస్తున్న దానం కాదని తెలుసుకోవటం అవసరం. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇవన్నీ చేస్తున్న పెద్ద మనిషి వడ్డీతో సహా అసలు, లాభాలను రాబట్టుకొనేందుకు చూస్తాడని వేరే చెప్పాలా ? కార్డు డబ్బు లావాదేవీలపై జనానికి అలవాటు చేసేందుకు తొలి రోజుల్లో కొన్ని రాయితీలు ఇస్తారు. తరువాత అసలు నగదుపైనే పరిమితులు విధించి విధిగా కార్డులపై ఆధారపడేట్లు చేస్తారు. అటువంటి పరిస్థితి వచ్చిన తరువాత చార్జీలు, సర్చార్జీల మోత మోగుతుంది. అంటే నగదు కంటే నగదు రహితంతో వినియోగదారులు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది.

     వుదాహరణకు క్రెడిట్‌ కార్డులపై బంకుల్లో పెట్రోలు పోయించుకుంటే ఎలాంటి సర్‌ఛార్జీలు వుండవు అని చెబుతారు. రద్దు చేస్తున్న మాట కూడా నిజం. అయితే ఈ రాయితీ శాశ్వతం కాదు. ఎలాంటి చార్జి వసూలు చేయవు అన్నది కూడా వాస్తవం కాదు. వుదాహరణకు నేను కోటక్‌ క్రెడిట్‌ కార్డు మీద రు.1500ల పెట్రోలు కొనుగోలు చేస్తే కార్డును గీకినపుడు ఇచ్చిన రశీదుపై అంతే మొత్తం వుంది. తీరా క్రెడిట్‌ కార్డు బిల్లు చూస్తే అసలు విషయం తెలిసింది. రు.43.13లు ఎక్కువ వసూలు చేసి దాని నుంచి రు.37.64 తిరిగి జమ చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. మిగిలిన రు.5.49 నేను కోటక్‌ కార్డు యజమానులకు చెల్లించాను. ఇది ఒక లావాదేవీకి మాత్రమే. ప్రతిదానికి విలువను బట్టి వుంటుంది. అదే నగదు చెల్లిస్తే అదనం వుండదు. ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో నగదు బదిలీ చేసినా, కార్డు ద్వారా చెల్లించినా కొద్ది రోజులు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకపోవచ్చు. వినియోగదారుల తరఫున వ్యాపారి తన లాభంలోంచి ఆ మొత్తాన్ని చెల్లిస్తాడు. తరువాత పరోక్షంగా సరకు ధరలో దానిని కూడా కలిపి మన దగ్గర వసూలు చేస్తాడు. కార్డు మోజు ఖరీదు ఇలా వుంటుంది.

   నగదు లావాదేవీ అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు రోజువారీ వచ్చిన సొమ్ముకు ఒకటో, రెండో,మూడు ఖాతాలలోనో లెక్కలు రాయాలి. మరుసటి రోజు లేక అదే రోజు బ్యాంకుల్లో జమ చేయాలి. సరే ఇప్పుడంటే లెక్క పెట్టటానికి మిషన్లు వున్నాయి కనుక కట్టలు కట్టటానికి, వాటిని బ్యాంకులకు చేర్చటానికి సిబ్బంది, వాహనాలు, రక్షణ అవసరం. నగదు రహితమైతే అవేమీ అవసరం లేదు. అంటే దుకాణాలలో కొన్ని వుద్యోగాలు పోవటం ఖాయం.

   నగదు రహిత కార్యకలాపాలు పెరిగితే బ్యాంకులలో వుద్యోగాలు కూడా హరీ అంటాయి. ఇప్పటికే ఎటిఎం మిషన్లు, కంప్యూటర్లు వచ్చి సిబ్బంది తగ్గిపోయారు. పశ్చిమ దేశాలలో కొన్ని బ్యాంకు శాఖలు అసలు నగదు స్వీకరించవు. ఎక్కువ చోట్ల నామమాత్రంగా సిబ్బంది వుంటారు. మన దేశంలో కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పటికే నగదు జమ చేయటానికి కూడా ఎటిఎంలు వచ్చాయి. అసలు నగదు లేకపోతే ఏటిఎం మిషన్లు అవసరం వుండదు. అంటే ప్రతిదాని దగ్గర వుండే రెండు సెక్యూరిటీ , వాటి నిర్వహణ సిబ్బంది వుద్యోగాలు ఎగిరి పోతాయి.

    ఇక నగదు రహిత లావాదేవీల సాధ్యాసాధ్యాల గురించి చూద్దాం. గిరిజన ప్రాంతాల జనం విద్య, వైద్య సౌకర్యాలు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎంతెంత దూరాలు కొండలు, గుట్టలు ఎక్కి దిగుతున్నారో చూస్తున్నాం. వారందరికీ అమలు చేయటం సాధ్యమేనా ? ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకొనే అమెరికాలో 2012లో 40శాతం నగదు లావాదేవీలు జరిగాయి, తగ్గే ధోరణిలో వున్నాయి. అక్కడే 2013 లెక్కల ప్రకారం అసలు బ్యాంకులలో ఖాతాలు లేని జనం ఎనిమిదిశాతం అయితే మరో 20శాతం మందికి ఖాతాలున్నప్పటికీ పూర్తిగా వాటిని వినియోగించకుండా ప్రత్యామ్నాయ అంటే నగదు, ఇతర పద్దతులలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.2014 గ్యాలప్‌ సర్వే ప్రకారం 29శాతం మందికి క్రెడిట్‌ కార్డులు లేవు.2009లో చేసిన కార్డు చట్టం ప్రకారం 21 సంవత్సరాల లోపు వారికి క్రెడిట్‌ కార్డులు ఇవ్వరు. అందువలన నగదు లావాదేవీలను పరిమితం చేసినా, లభ్యతను పరిమితం చేసి అప్రకటిత నిషేధం విధించినా బ్యాంకు ఖాతాలు లేని పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి వారు ప్రీపెయిడ్‌ అంటే మనం సెల్‌ఫోన్లను చార్జింగ్‌ చేయించుకున్నట్లుగా డబ్బును కార్డులలో వేయించుకోవాలి. ప్రీపెయిడ్‌ ఫోన్‌ కాల్‌ ఎలా ఎక్కువ ఖరీదో ప్రీపెయిడ్‌ డెబిట్‌ కార్డుకు కూడా చార్జీలు ఎక్కువ అవుతాయి.

   నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టటమంటే జనంపై బలవంతంగా రుద్దటమే అన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఫ్రాన్స్‌లో వెయ్యి యూరోల కంటే ఎక్కువ విలువగల లావాదేవీలకు నగదు వినియోగించటం చట్టవిరుద్దం. అనేక దేశాలలో ఇలాంటి ఆంక్షలున్నాయి.కొన్ని ఐరోపా దేశాలలో గ్రీసు వంటి చోట్ల ఒక పట్టణంలో మాత్రమే చెల్లుబాటయ్యే ప్రత్యామ్నాయ కరెన్సీలు కూడా వునికిలోకి వచ్చాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే కలిగి వుండాలి. కొన్ని చోట్ల పిల్లలకు ఇచ్చే డబ్బును పుస్తకాల వంటికి వాటికి మాత్రమే వుపయోగించాలి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వినియోగించటం నిషిద్ధం.

    బ్యాంకులు పెద్ద మొత్తంలో నగదు నోట్లను ముద్రించటం, వాటిని రవాణా చేయటం, భద్రతను కూడా లాభనష్టాల కోణంలో చూస్తున్నాయి.ఈ ఏడాది జూలై ఎనిమిదిన రిజర్వు బ్యాంకు సమాచారం మేరకు 95శాతం కరెన్సీ అంటే 16.8లక్షల కోట్ల నోట్లు చలామణిలో వున్నాయి. ఏటా నోట్ల ముద్రణ ఖర్చు 3,760 కోట్లు,ఎటిఎంల నిర్వహణకు రు.15,800 కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ ఖర్చును కూడా గణనీయంగా తగ్గించేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. న్యూఢిల్లీలో నోట్ల రవాణాకు 2014లో 9.1 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తేలింది.నగదు రహిత లావాదేవీలు నిర్వహించే పశ్చిమ దేశాలలో పెద్ద నోట్లను ముద్రించటం లేదు. అదే బాటలో మన దేశంలో కూడా వెయ్యి నోట్లను ముద్రించకూడదని నిర్ణయించారని, రెండువేల రూపాయల నోట్లను కూడా రద్దు చేసి తరువాత మిగతా నోట్ల ముద్రణను కూడా పరిమితం చేసే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.నగదు రహిత లావాదేవీలు జనంపై ఆదనపు భారం మోపకూడదు. వీటి వలన పన్ను ఎగవేతలు తగ్గి ఆదాయం పెరుగుతుంది అంటున్నారు కనుక ఆమేరకు జనంపై విధించే పన్నుల భారం కూడా తగ్గాలి. లేదా పెరిగిన ఆదాయాన్ని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీల రూపంలో కట్టబెట్టటం కాకుండా జన సంక్షేమానికి వెచ్చించాలి. ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగి మంచి చెడ్డలను వివరించిన తరువాతే ముందుకు పోయే విషయాన్ని నిర్ణయించాలి .లేకుంటే పెద్ద నోట్ల రద్దు మాదిరి పరిస్థితులు నిత్యకృత్యంగా మారతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ అడుసు తొక్కారు ! కాళ్లు కడిగే విధము చెప్పండి !!

30 Wednesday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

demonetization, demonetization mesh, Modi, modi government

ఎం కోటేశ్వరరావు

    తాంబోలం ఇచ్చేశాను యిహ తన్నుకు చావండి అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, మా మోడీ అడుసు తొక్కారు, కాళ్లు కడిగే విధము చెప్పండీ అంటున్నారు నమో ప్రహసనంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ .

    మొదటిది నాటకం. కరటకశాస్త్రి, ఆయన శిష్యుడు, మధురవాణి నాటకం ఆడి బాల్యవివాహాన్ని తప్పిస్తారు. కధను సుఖాంతం చేస్తారు. రెండవది వాస్తవం. ఎలా ముగుస్తుందో తెలియదు. అన్నింటికంటే ఎలా ముగించాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి ముందుగానే వుప్పందిన కారణంగా పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాలని లేఖ రాసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందినట్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఆ లేఖను చూపి ఆ ఖ్యాతిలో తమ నేతకు భాగముందన్నట్లుగా మీడియాలో ప్రచారం వచ్చేట్లుగా తెలుగుదేశం వారు మేనేజ్‌ చేశారు. రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నగదు రహిత లావాదేవీలపై సూచనలు చేసే పేరుతో ఐదుగురు ముఖ్య మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయతలపెట్టినట్లు, దానికి చంద్రబాబు నాయుడిని సారధ్యం వహించమని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్టీ ఫోన్లో కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

     కేంద్రం నుంచి అలాంటి ఆఫరు వచ్చినపుడు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసి వుండేవారు.అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా తగిన సన్నాహం, పర్యవసానాలను వూహించకుండానే నరేంద్రమోడీ నోట్ల రద్దును ప్రకటించేశారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే సర్వేల లోగుట్టు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటపుడు నరేంద్రమోడీ తాను చేయించిన సర్వేలో నోట్ల రద్దుకు 93శాతం మద్దతు వుందని చెబితే నమ్మేంత అమాయకంగా చంద్రబాబు వుంటారా ? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు, ఆ విషయాలలో, అలాంటి రాజకీయ చాణక్యంలో సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకరా అన్నట్లుగా చంద్రబాబు పండిపోయారు. కేంద్రం ప్రతిపాదించిన కమిటీకి సారధ్యం వహించే విషయాన్ని కాదన్నట్లుగా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసే మీడియాలో వార్తలు వచ్చాయి. అవునంటే కాదనిలే అని ఆడవారి గురించి అనవసరంగా ఆడిపోసుకుంటారు గానీ చంద్రబాబు కాదు అన్నారంటే నరేంద్రమోడీ దగ్గర దేనికో టెండరు పెట్టి వుంటారని గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నోట్ల రద్దు పర్యవసానాలపై తలుపు చెక్కతో కాకుండా తమలపాకుతో కొట్టినట్లుగా జనం కోసమైనా తన అసంతృప్తిని వెల్లడించారు. కేంద్రం వద్ద తన పలుకుబడిని వుపయోగించి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నోట్లు తెప్పిస్తా అన్నట్లు హడావుడి చేసి అవాక్కయ్యారు. ఇనుము బాగా కాలినపుడే దానిని కావలసిన విధంగా మలచుకొనేందుకు సుత్తి దెబ్బలు వేయాలి. నోట్ల రద్దు గురించి మాట్లాడటానికి పార్లమెంట్‌కు వెళ్ల కుండా ముఖంచాటేయటం ఒక బలహీనత. దానిని ప్రదర్శించిన మోడీని ఎలాంటి ప్రతిఫలం లేకుండా -అదేలెండి రాష్ట్ర అభివృద్ధికే సుమా- వూరికే ఆదుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అది పరిష్కారం అయితే ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించటానికి చంద్రబాబు క్షణంలో సిద్దం అవుతారు.

    నోట్ల రద్దు పర్యవసానాల గురించి జనం అర్ధరాత్రుళ్లు ఎటిఎంల ముందు క్యూలు కడుతుంటే , బ్యాంకుల్లో తమ డబ్బును తాము తీసుకోవటానికి వీల్లేక జనం అవస్తలు పడుతుంటే వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం దాని గురించి స్పష్టంగా చెప్పకుండా తక్షణమే నగదు రహిత బదిలీ గురించి సలహాలు చెప్పాలని ముఖ్య మంత్రుల కమిటీని ప్రతిపాదించటం అర్ధంలేని విషయం. నగదు రహిత లావాదేవీల గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి తగిన పరిస్థితులు వున్నాయా లేవా అన్నదే సమస్య. దయ్యాలు తిరిగే సమయంలో ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే తెల్లవారేసరికి దానిని అమలు జరపాలని పట్టుబడితే కుదరదు. అనేక అభివృద్ది చెందిన దేశాలలో ఇప్పటికీ నగదు లావాదేవీలు గణనీయంగా వున్నాయి. కొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో అవి పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువలన తగిన సన్నాహాలు చేసుకొని చేయాల్సిన మార్పులను తొందరపడితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలే ఏర్పడతాయి. ముందు ప్రభుత్వంతో మొదలు పెట్టి దశలవారీగా అమలు జరిపి అవినీతిని అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

నీవు నేర్పిన విద్యయే కదా మోడీ !

     ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటంలో కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదని తేలిపోయింది. ఓటింగ్‌కు అనుమతించే నిబంధన కింద చర్చకు అధికారపక్షం తిరస్కరించటంతో బుధవారం నాడు లోక్‌సభ పరిమితంగానే కార్యకలాపాలు చేపట్టి గురువారం నాటికి వాయిదా పడింది. గతంలో 2జి స్కామ్‌పై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహస్‌ సింగ్‌ సభకు హాజరై, ఓటింగ్‌కు అనుమతించే నిబంధనల ప్రకారం చర్చ జరగాలని బిజెపి పెద్దలు పట్టుపట్టారు. ఇప్పుడు వారు వీరయ్యారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. పోయినోడే మంచోడనిపిస్తున్నారు. ఎలాగంటే అప్పుడు చర్చ అవినీతి గురించి కనుక కాంగ్రెస్‌ ప్రధాని సభకు రావటానికి సిగ్గు పడ్డారు, సమర్ధించుకోలేని దుస్థితిలో ఆపని చేశారు. ఇప్పుడు నరేంద్రమోడీ సభకు రావటానికి బిడియమెందుకు ? ఇదేమీ అవినీతి అంశం కాదే. నోట్ల రద్దును అవినీతి అని ఎవరూ అనటం లేదే ! ఓటింగ్‌ జరిగేందుకు వీలు కల్పించే నిబంధనల కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో పాలక కూటమికి పూర్తి మెజారిటీ వుంది. అయినా వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా 16వ తేదీ నుంచి జరుగుతున్న వుభయ సభలలో ఈ అంశంపై ముందుకు సాగటం లేదు.ఒక వేళ ఓటింగ్‌ గీటింగ్‌ జరిగితే దాని వలన ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేమీ లేవే ! నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటు చేస్తే ఎందుకు అలా చేశారో వారే చెప్పాల్సి వుంటుంది.

     తాను చేసిన నోట్ల రద్దుకు 93శాతం జనం మద్దతు పలికారని ప్రధానే స్వయంగా చెబుతున్నారు. వందకు రెండువందల మంది మద్దతు వుందనే వంది మాగధుల సంగతి సరేసరి. జనం మద్దతు లేకపోతే మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా ఎలా సీట్లు సంపాదించింది అని కొత్త పాయింటును దొరకబుచ్చుకున్నారు. జనం మద్దతు వుందా లేదా అన్నది తేలాలంటే ఆ సమస్య మీదే ఓటింగ్‌ జరగాలి. నోట్ల రద్దుతో తలెత్తిన జన ఇబ్బందులను ఎప్పటిలోగా తీరుస్తారు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఇబ్బంది పెట్టే చర్య ఎందుకు తీసుకున్నారని కదా ప్రతిపక్షాలు అడుగుతోంది. ఏ పార్టీ అయినా నోట్ల రద్దును వ్యతిరేకించిందా ? లేదే ! దాని పర్యవసానాల గురించి అడగటానికి ప్రతిపక్షానికి అర్హత లేకపోతే పార్లమెంట్‌కు హాజరై ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ వివరించాలి కదా ! పార్లమెంట్‌తో పని లేకుండా నరేంద్రమోడీ ప్రధాని కాలేదు, ఆయన లోక్‌సభా నాయకుడు. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే ప్రధాని సభకు వస్తారు అని పాలకకూటమి వాదిస్తోంది. ప్రధాని రాక నెపంతో పార్లమెంట్‌ను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షానికి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? జనం సొమ్మును ఎందుకు వృధా చేయాలి? యాభై రోజులలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని, ధరలు తగ్గుతాయని అనటం తప్ప నిర్ధిష్టంగా ఏదీ చెప్పటం లేదు. బంగారం ధరలు తగ్గాయి, జనం దానితో కడుపు నింపుకోలేరు కదా ! కడుపు నింపే పప్పుల ధరలు పెరిగాయి. అలాంటపుడు పాలకులు చెప్పే మాటలను జనం ఎలా నమ్మాలి ?

అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు

       అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ( ఇది మహిళలను కించపరచటంగా భావించవద్దని మనవి ) చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు బ్యాంకర్లపై నిందమోపి తన పరిధిని అతిక్రమించారు. మధ్యలో వారేమి చేస్తారు. ఒక చెక్కు తీసుకొని ఒక రోజు బ్యాంకుకు వెళ్లి వుంటే సిబ్బంది ఎంత వత్తిడితో గత కొద్ది రోజులుగా పని చేస్తున్నారో చంద్రబాబుకు తెలిసి వుండేది. రిజర్వుబ్యాంకు నోట్లు పంపితే కదా పంపిణీ చేసేది. తెలుగు నేలలో కొన్ని మీడియా సంస్ధలు ఒక కొత్త లాజిక్‌ను తయారు చేశాయి. అదేమంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు తమకు మంచివి అనిపించిన అంశాలను చంద్రబాబు ఖాతాలో జమ చేయటం, వైఫల్యాలన్నింటికి అధికారులను బాధ్యులుగా చేసి వారి ఖాతాలో వేయటం. నోట్ల రద్దు పర్యవసానాలకు నరేంద్రమోడీ నిర్వాకాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా సానుకూలంగా కూడా విమర్శించలేదు. బ్యాంకర్లపై నిందలు మోపి, వారిపై వత్తిడి పెంచి ముఖ్యమంత్రి సాధించేదేమీ వుండదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Draft Model GST Law

28 Monday Nov 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Draft Compensation Law, Draft IGST Law, Draft Model GST Law, GST, IGST

Draft Model GST Law, Draft IGST Law and Draft Compensation Law placed in the public domain for information of trade, industry and other stake holders.

The Draft Model GST Law, Draft IGST Law and Draft Compensation Law which would be considered by the GST Council for approval are placed in the public domain for information of trade, industry and other stake holders. The Draft Model Laws can be accessed at the following websites: www.cbec.gov.in, www.dor.gov.in and www.gst.gov.in

 Earlier, the Draft Model GST Law was put in public domain in the month of June, 2016 for comments. A large number of comments were received on the Draft Model GST Law from various stake holders including the trade and industry associations and public.

A Technical Committee of officers from some of the States and the Central Government was constituted to examine the inputs from the stake holders and make suitable amendments in the Draft Model GST Law. The Revised Draft submitted by this Technical Committee on law was further discussed in a meeting held on 21st and 22nd of November, 2016 in Delhi where officers from all States and Central Government were present. The revised and improved version of this Model GST laws shall now be considered by the GST Council for approval on 2nd and 3rd of December, 2016.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోట్ల రద్దు పర్యవసానాలపై నిరసన విఫలమైందా ? సఫలమైందా ?

28 Monday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, Demonetisation, Demonetisation standoff, Narendra Modi, opposition protest on demonetisation, protest on demonetisation

కేరళ హర్తాళ్ దృశ్యమ్

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా పౌరుల మీద రుద్దిన ఇబ్బందులకు నిరసనగా అనేక పార్టీలు విడివిడిగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు (నవంబరు 28న) దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన గురించి రకరకాల వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అది ఏ రూపంలో జరిగింది ? జయప్రదమైందా విఫలమైందా అన్న లెక్కలు వేయబోవటం లేదు. జయప్రదమైంది అంటే దాని అర్ధం బిజెపి చిత్రిస్తున్నట్లు నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరూ నల్లధనాన్ని, అవినీతిని సమర్ధించేవారు కాదు. విఫలమైంది అంటే ముందు చూపులేకుండా, అనాలోచితంగా నరేంద్రమోడీ చేసిన పిచ్చిపనిని ఆందరూ ఆమోదించినట్లూ కాదు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యను పక్కదారి పట్టించేందుకు గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాణీగారి ప్రతిపక్షం, రాణీగారీ అనుకూల పక్షాల మాదిరి వ్యవహరిస్తున్న మీడియా సంస్ధలు, వాటిలో పనిచేసే షార్ట్‌ హాండ్‌ జర్నలిస్టులు ఈ సమస్యపై కూడా తమ పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.

   గత ఇరవై రోజులుగా దేశ విదేశాల విశ్లేషకుల నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు, సమాచారం ప్రకారం నోట్ల రద్దు వలన నల్లధనం రద్దు పెద్ద ప్రహసనంగా మారనున్నట్లు కేంద్రంలోని పెద్దలు గ్రహిస్తున్న కారణంగానే దానినొక రాజకీయ అంశంగా ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు, నగదు రహిత ఆర్ధిక లావాదేవీల పెంపుదల ప్రచార అంశంగా మార్చి వేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా బయట తప్ప అక్కడ మాట్లేడేందుకు నరేంద్రమోడీ ఇప్పటికీ విముఖంగానే వున్నారు. అంటే అసలు సమస్య నుంచి జనం దృష్టిని వేరే వివాదంపైపు మార్చేందుకు చూస్తున్నట్లుగానే భావించాలి. నోట్ల రద్దును స్వాతంత్య్రానంతర తొలి విప్లవాత్మక చర్య అన్నంత గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ దాని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి పార్లమెంట్‌కు హాజరు కాకపోవటమే పెద్ద వైఫల్యం. ఎంతకాలం మౌనంగా వుంటారు, ఎంతకాలం తప్పించుకుంటారు ? గతంలో ఏదైనా ఒక అంశంపై పాలకపార్టీని నిలదీయాలంటే భిన్న ధృవాలుగా వున్న పార్టీలు సైతం పార్లమెంట్‌లో సమన్వయం చేసుకొనేవి. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్‌లో ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించటమే కాదు, నోట్ల సమస్యపై వెలుపల కూడా ఒకే రోజు వివిధ రూపాలలో విడివిడిగా ఆందోళనకు పిలుపు ఇవ్వటం బహుశా ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. నోరు వుంది కదా, మీడియాలో ఎక్కడ లేని ప్రచారం దొరుకుతోంది కదా అని పాలకపార్టీ నేతలు సంబర పడవచ్చు. ఎందుకైనా మంచిది, భవిష్యత్‌లో ఎటుబోయి ఎటువస్తుందో ఒక అవకాశం అట్టిపెట్టుకుందామని చంద్రబాబు నాయుడి వంటి వారు ఒకవైపు మంచిదని చెబుతూనే మరోవైపు అసంతృప్తి గళం వినిపించటం మామూలు విషయం కాదు.

    సమస్య తీవ్రత కారణంగా సామాన్యులే కాదు చివరికి ఆర్ధిక మంత్రి కుటుంబం కూడా ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి అని నమ్మించేందుకు వండి వార్చిన కట్టుకధలలో భాగంగా కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గారు ఒక వంద మందికి విందు ఏర్పాటు చేయమని తన సతీమణికి చెప్పారట. తీరా ఆమె తన, భర్త ఖాతాల నుంచి 24వేల చొప్పున తీసుకున్న డబ్బుతో 50 మందికి మాత్రమే ఏర్పాటు చేయవచ్చని చెప్పారట. సరే పెద్ద వారు అంత ఖరీదైన విందులు ఇస్తారు వదిలేద్దాం. నరేంద్రమోడీ, చంద్రబాబు గారు నగదుతో పని లేకుండా అంతా కార్డులతో ఎంత సులభంగా నడిపించవచ్చో జనానికి చెబుతున్నారు. కేంద్రమంత్రి కుటుంబం వంద మంది విందుకు సరిపడా అవసరమైన ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డారంటే వారికి కూడా అలాంటి కార్డులు లేనట్లే కదా ? ఒక వేళ వుంటే ఇలాంటి కట్టుకధలు ఎందుకు పుట్టినట్లు ?

    మరొక కధ. ఇది స్వయంగా నరేంద్రమోడీ చెప్పిన పిట్ట కధ. తాను టీ అమ్మిన సమయంలో పేదలు స్ట్రాంగ్‌ టీ అడుగుతుండేవారట. అలాగే ఇప్పడు నల్లధనంపై గట్టి చర్య తీసుకున్నా అన్నారు. ఒకే. ఆయన టీ అమ్మినట్లు చెబుతున్న ప్రాంతాలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్లలో అమాయకులు తప్ప రోజూ టీ తాగే వారు ఎవరైనా స్ట్రాంగ్‌ టీ అడుగుతారా ? అలాంటి చోట్ల స్ట్రాంగ్‌ టీ దొరకటం ఎంత నిజమో పెద్ద నోట్ల రద్దుతో గట్టి చర్య కూడా అంతే నిజం !

   సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియాలో అనేక మంది ఈ నిరసనను భారత బంద్‌ పిలుపుగా వర్ణించారు. బంద్‌లు జరపకూడదని, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా 1997లో సమర్ధించిన తరువాత ఏ పార్టీ కూడా బంద్‌ పిలుపులు ఇవ్వటం లేదు. అయితే తరువాత మరొక కేసు సందర్భంగా బంద్‌లు జరపటం ప్రజాస్వామ్య బద్దమే అని అదే కోర్టు 2009లో చెప్పిందనుకోండి. సోమవారం నాడు స్ధానిక పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో నిరసన తెలపమని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.http://cpim.org/pressbriefs/observe-november-28-all-india-protest-day ఈ లింక్‌లో సిపిఎం అధికారిక ప్రకటన వుంది. దానిలో ఎక్కడా బంద్‌ అన్న పదం లేదు.

    ఇక నిరసన రూపం గురించి పాక్షికం, విఫలం, తీవ్ర అంతరాయం ఇలా రకరకాలుగా వర్ణించటాన్ని చూడవచ్చు. తొంభై బస్‌లు ఆగిపోయి ప్రయాణీకులు లేకుండా పంతానికి పది తిప్పినా, రోజంతా మూసి సాయంత్రం కొద్ది సేపు దుకాణాలు తెరిచినా పాక్షికం అని చిత్రించ వచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో అనేక బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నిరసనలలోనూ అందరికీ సంబంధించిన సమస్యలు ఎప్పుడూ వుండవు. నోట్ల రద్దు అందుకు మినహాయింపు. సామాన్యుడైనా, ముకేష్‌ అంబానీ అయినా రోడ్డు మీదకు వచ్చి ఒక చాయ్‌ తాగాలంటే స్వయంగా లేదా డ్రైవర్‌ ద్వారా అయినా డబ్చిచ్చి తాగాలే తప్ప చెక్కు లేదా కార్డు గీక్కో మంటే కుదరదు. అందువలన ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీనికి ఒక ప్రత్యేకత వుంది. చిత్రం ఏమంటే తాను పేదలకు టీ అమ్మానని చెప్పిన మోడీ ఆ పేదలు టీ డబ్బులను కార్డులు, చెక్కుల రూపంలో ఇవ్వలేరని అర్దం చేసుకోలేకపోయారు. అందువలన నిజంగా అమ్మారా అని ఎవరైనా సందేహించే ఆస్కారం కూడా వుంది.

   నోట్ల రద్దు నల్లధనం రద్దుకు అని చెప్పారు. తీరా ఇప్పుడు పెద్ద లందరూ అసలు నోట్లతో పని లేకుండా మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు, దాని మీద మీటలు నొక్కటం నేర్చుకుంటే అంతా అయి పోతుందని వూదర గొడుతున్నారు. నోట్ల రద్దును వేల కోట్ల సంపదలున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయటాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

   ఒకటి. నోట్ల రద్దు మరుసటి రోజు నుంచి జరిగిన పరిణామాలను చూస్తే డబ్బుతో పని లేకుండా కార్డులు గీకి వస్తువులు అమ్మే చోట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, డబ్బుతీసుకొని అమ్మే దుకాణాలలో తగ్గాయి. అంటే పెద్ద దుకాణాల వారు ఈ నోట్ల రద్దు వెనుక చక్రం తీప్పారా ? కారణం ఏదైనా తనకు కూడా అలాంటి కార్డులు గీకే హెరిటేజ్‌ దుకాణాలు వున్నాయి కనుక ముందు చూపుతో పెద్ద నోట్లు రద్దు చేయాలని అందరి కంటే ముందే కేంద్రానికి లేఖ రాశారా ? చంద్రబాబు నాయుడు కార్డుల ద్వారా లావాదేవీలు జరిపించేందుకు నాలుగు కమిటీలను కూడా వేశామని ప్రకటించారు. మంచిదే. త్వరలో కార్డులు కూడా ఇప్పిస్తారు. ఫోన్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కనుక సందేహం లేదు. ( వుద్యోగాలకు బదులు ఫోన్లు, గీకే కార్డులు కావాలని జనాన్ని తిప్పించుకోవచ్చు ) అవి వచ్చిన తరువాత ఏ రోజు పని చేస్తే వచ్చిన ఆరోజు కూలి డబ్బులతో వస్తువులను కొనుగోలు చేసే వారు పల్లె టూళ్ల నుంచి సాయంత్రానికి బ్యాంకులున్న పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి తమ కూలి డబ్బులను బ్యాంకుల్లో వేయాలి. ఆ సమయానికి బ్యాంకులు మూసివేస్తారు కనుక ఆ రాత్రికి అక్కడ వుండి మరుసటి రోజు వుదయం లేదా వేరే వారికి ఇచ్చి తమ ఖాతాలలో వేయించుకొని మరుసటి రోజు సాయంత్రానికి కార్డుపై సరకులు కొనుక్కోవాలి. ప్రతి రోజు కూలి డబ్బులను అలానే చేయాల్సి వుంటుంది. లేదా కులానికొక కార్పొరేషన్‌ పెట్టినట్లుగా బ్యాంకులు కూడా పెట్టించి వాటి శాఖలను ప్రతి వూరిలో లేదా ఏ కులపు వారికి ఆ కులవీధులలో ఏర్పాటు చేసి అక్కడే వేయించవచ్చు.

   రెండు. బ్యాంకుల వద్దకు చలామణిలో వున్న సొమ్ము పెద్ద మొత్తంలో చేరింది. వెంటనే అనేక బ్యాంకులు తమ వద్ద సొమ్ము దాచుకున్నవారి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటను తగ్గించేశారు. అంటే ఆ మేరకు సుజనా చౌదరి, రాజగోపాల్‌ వంటి పెద్దల కుటుంబాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు ఇచ్చే రుణాల రేట్లు కూడా తగ్గిపోతాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి కంపెనీలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సుబ్రమణ్యస్వామి వంటి వారు వారందరూ పని గట్టుకొని రఘురామ్‌ రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వకుండా వుర్జిత్‌ పటేల్‌ను తెచ్చి పెట్టుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్దల హస్తం కూడా వుందా ?

   మూడు. బ్యాంకులలో దోపిడీలు జరుగుతున్నాయని ఎవరైనా బ్యాంకులను మూసి వేస్తారా ? ఎలుకలున్నాయని ఇంటినే తగుల పెట్టుకుంటారా ? రొట్టెను ముక్కలుగా కోయటానికి చాకు బదులు పెద్ద కత్తులను వాడతామా ? పెద్ద సుత్తులతో బాదుతామా ? నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. అసలు మన దేశంలో పాకిస్థాన్‌ లేదా మరొక దేశం నుంచి గానీ వస్తున్న లేదా మన దేశంలో మేకిన్‌ ఇండియా ‘ముద్రణ పరిశ్రమల’ నుంచి వస్తున్న కోయంబత్తూరు నోట్లుగా పిలిచే దొంగ నోట్లు ఎన్ని వున్నాయి? నల్లధనం ఎంత?

    నల్లధనం ఎంత అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. రెండవది నల్లధనం మొత్తం కూడా నగదు రూపంలో దొంగ నిల్వలుగా లేదు.అధిక భాగం నల్లధనం స్విట్జర్లాండ్‌, పనామా వంటి పన్నులు లేని ప్రాంతాలకు తరలిపోయింది. అక్కడి నుంచి కేవలం తపాల పెట్టె చిరునామా లేదా సూట్‌కేసు కంపెనీల పేరుతో వున్న వాటాల రూపంలో, రియలెస్టేట్‌, బంగారం తదితర రూపాలలో ప్రపంచమంతటికీ పోతోంది. అలాంటి చోట్ల, వివిధ రూపాలలో డబ్బు దాచుకున్న పెద్దలందరూ మోడీ చర్య మంచిదేనని పొగడటమే విషాదం. వారిని వదలి జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్న, విమర్శిస్తున్నవారిని నల్లధనులను బలపరిచేవారిగా బిజెపి, దాని మిత్రపక్షాలు చిత్రిస్తున్నాయి. మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రూపంలో వస్తున్న మొత్తాలలో కూడా నల్లధనం వుంది. ఎంత వంతే అంత ఎర్రతివాచీ పరచి ఆహ్వానించటం తప్ప వాటి మంచి చెడ్డలను కనుగొనేందుకు పాలకులు ప్రయత్నించటం లేదు.

    ఒక గీత పెద్దదా చిన్నదా పెద్దదా అని చెప్పటానికి మరో గీత అవసరం. అలాగే నల్లధనం సమస్య కూడా. షిండర్‌ అంచనా ప్రకారం ఖండాలవారీగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలలో నల్లధనం 41-44శాతం మధ్య వున్నది.ఆసియాలో అది 28-30శాతం. అధికారికంగా ప్రకటించిన జిడిపి లెక్కల ప్రకారం 96 అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు 38.7శాతం. అదే అంచనా ప్రకారం మన దేశంలో 23-26శాతం మధ్య వుంది. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులలో 35శాతం మారిషస్‌ నుంచి 14శాతం సింగపూర్‌ కంపెనీల పేరుతో వస్తోంది. దీనిలో ఎక్కువ భాగం మన దేశం నుంచి తరలిన నల్లధనమే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాకు ఒక్క హాంకాంగ్‌ నుంచే 73శాతం వస్తోంది. అది చైనా నుంచి తరలి వెళ్లిన నల్లధనం అనుకోవచ్చు లేదా హాంకాంగ్‌లో విదేశీయులు దాచుకున్నది కావచ్చు.

   ఇక నకిలీ నోట్ల విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాపిత సమస్య. అమెరికా డాలర్లనే పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. అయినా డాలర్లను అమెరికా రద్దు చేయలేదు. మన దేశంలో చలామణిలో వున్న నోట్ల మొత్తం 16లక్షల కోట్లు. వాటిలో నకిలీ నోట్లు 400 కోట్లు. అంటే 0.03శాతం. అనేక దేశాలలో వాటి నివారణకు నిరంతరం చర్యలు తీసుకుంటూనే వుంటారు.అనుమానం వచ్చిన సిరీస్‌ నోట్ల వుపసంహరణ వాటిలో ఒకటి.మన దేశంలో కొద్ది నెలల క్రితం ఐదువందల నోట్లపై ముద్రించిన సంవత్సరం వుందా లేదా అని చూసుకోమని జనాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండువేలు, ఐదు వందల నోట్లకు సైతం నకిలీలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వాటిపై నిరంతర నిఘాతప్ప ఇప్పుడు చేసిన మాదిరి చర్యలు కాదు.

    సోమవారం వారం నాటి నిరసన సమర్ధనీయమా, కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే నోట్ల రద్దు చేసిన నాడు వున్న మద్దతు తరువాత క్రమంగా తగ్గిపోయిందన్నది వాస్తవం. ఒక వైపు మోడీని సమర్ధిస్తూనే చేసిన పని బాగాలేదని విమర్శించేవారి సంఖ్య పెరిగింది. ప్రతిపక్షాల విమర్శలకంటే సామాన్యుల్లో వచ్చిన విమర్శనాత్మక స్పందనే బిజెపి వారిని భయపెడుతోంది. దాన్ని దాచుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d