• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

సాంప్రదాయం, మనోభావాల పేరుతో సతి, దేవదాసీలనూ పునరుద్ధరిస్తారా ?

10 Sunday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

jallikattu, Modi Sarkar, Tamilnadu

మైనారిటీల ఓట్ల కోసం వారిని సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటున్నారంటూ ఇతర పార్టీలపై నిత్యం ఆరోపణల పారాయణం చేస్తున్న వారు జల్లి కట్టు, ఎద్దులను హింసపెట్టే బండ్ల పోటీలకు అనుమతించటం ఎవరిని సంతృప్తిపరచేందుకు, ఎవరి ఓట్లను కొల్లగొట్టేందుకు ?

జల్లికట్టుకు అనుమతితో ప్రమాదకర పోకడకు నరేంద్రమోడీ సర్కార్‌ నాంది

సత్య

తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించే జల్లికట్టు అనే ఒక మొరటు గ్రామీణ క్రీడను 2014లో సుప్రీం కోర్టు నిషేధించింది. సంప్రదాయాలు, సంస్కృతి పునరుద్దరణ పేరుతో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ఒక వుత్తరువు ద్వారా నిషేధాన్ని ఎత్తివేసి న్యాయ చరిత్రలో సర్వోన్నత న్యాయ స్ధానం తీర్పులను అపహాస్యం చేసే, వ్యవస్ధలను నాశనం చేసే ఒక అవాంఛనీయ పోకడకు తెరతీసింది. తమిళనాడులో కాలు మోపేందుకు అవసరమైన ఓట్ల కోసం పడిన కక్కుర్తి తప్ప ఇది మరొకటి కాదు. దీనిని అనుమతిస్తే రానున్న రోజులలో భారతీయత, సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతి, మనోభావాల మరొక పేరుతో ఎంతకైనా తెగించేందుకు అవకాశం వుంది. మోడీ సర్కార్‌ నిర్ణయంపై అనేక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె, ప్రధాన ప్రతిపక్షం డిఎంకె స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యను కోర్టులో అడ్డుకుంటే స్టే రాకుండా చూసేందుకు జయలలిత సర్కార్‌ కేవియట్‌ పిటీషన్‌ కూడా వేసింది. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టును యధావిధిగా అనుమతించేందుకే ఇది అని వేరే చెప్పనవసరం లేదు.

క్షత్రియత లేదా పౌరుషానికి(పురుషత్వం) జల్లికట్టు చిహ్నమని దానిని అనుమతించటాన్ని సమర్ధిస్తూ తమిళనాడు బిజెపి నేత ఎల్‌ గణేశన్‌ వ్యాఖ్యానించారు. ఇక బిజెపి మేథావులైతే కేంద్ర చర్యను విమర్శించిన వారిని సంస్కృతి తెలియని నిరక్షరాస్యులని విరుచుకుపడుతున్నారు. జల్లికట్టు లేకుండా పొంగల్‌ పండుగ సంపూర్ణం కాదని, ఎద్దులను హింస పెట్టటం జరగదని, వాటితో పోరాడి లొంగదీసుకొనే వారికే ఎక్కువ ప్రమాదమని, అహింస పేరుతో మనం పిరికివారిగా మారకూడదని గణేశన్‌ సెలవిచ్చారు. అంతే కాదు స్వామి వివేకానంద, సుబ్రమణ్య భారతి, ముత్తురామలింగ దేవర్‌ ఎప్పుడూ పురుషత్వం గురించి చెప్పారని, జల్లి కట్టుకు దానిని పెంపొందించే గుణం వుందంటూ వారిని కూడా ఇందులోకి లాగారు.

తమిళనాడు జల్లికట్టు, మహారాష్ట్రలోని ఎడ్ల బండి పందాలలో వుపయోగించే పశువులు హింసకు గురువుతున్నందున వాటిని నిషేధించాలని రెండు రాష్ట్రాలలో దాఖలైన పిటీషన్లు, స్దానిక కోర్టులు ఇచ్చిన తీర్పులు వాటిపై అప్ఫీళ్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారించింది. ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ న్యాయ ప్రక్రియ తరువాత 2014 మే నెలలో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధిస్తూ అంతిమ తీర్పు నిచ్చింది. దీనిని పూర్వపక్షం చేస్తూ ఈనెల ఏడున కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ

ఒక నోటిఫికేషన్‌ జారీ చేసి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా తమిళనాడులో జల్లికట్టు , మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌, హర్యానా, కేరళ, గుజరాత్‌ వంటి చోట్ల జరిగే పందాలను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నది. ఎవరైనా దీనిపై కేసులు దాఖలు చేస్తే తమవాదన వినకుండా ముందుకు పోరాదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ చర్య ఏదో తమిళనాడులో జల్లికట్టును అనుమతించటంగానే గాక అంతకంటే పెద్ద సమస్యగా చూడాలని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఎం పరాశరన్‌తో సహా అనేక మంది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశ చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్‌,అసెంబ్లీలు చట్టాలను చేస్తాయి, వాటిని ప్రభుత్వాలు అమలు జరుపుతాయి, అవి రాజ్యాంగబద్దంగా వున్నాయా లేవా అన్న టీకా తాత్పర్యాలను న్యాయస్ధానాలు విచారించి తీర్పులు చెబుతాయి. వాటిపై ప్రభుత్వంతో సహా ఎవరికైనా అభ్యంతరాలో మరొకటో వుంటే పునర్విచారణ కోరవచ్చు. లేదా ప్రభుత్వాలు చట్ట సభలలో అవసరమైన చట్ట సవరణలు చేసి కోర్టు తీర్పుల పర్యవసానాలను సరిచేయవచ్చు. ఇక్కడ కేంద్ర సర్కార్‌ దీనిని పట్టించుకోకుండా , కోర్టులో వున్న రివ్యూ పిటీషన్‌ విషయం ఏమీ తేలకుండానే ఏకంగా కార్యనిర్వహణ అధికారాన్ని వుపయోగించి సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో సర్వోన్నత న్యాయస్థాన తీర్పును వమ్ము చేసింది. విచారణ సందర్బంగా వాటన్నింటినీ కూలంకషంగా విన్నతరువాతనే సర్వోన్నత న్యాయ స్ధానం తీర్పు నిచ్చింది అన్న విషయాన్ని మరిచి పోరాదు.

మన దేశంలో సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాల పేరుతో గతంలో అనేక అనర్ధాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కొన్ని చట్ట వ్యతిరేకంగా మరికొన్నింటిని పైన చెప్పిన కారణాలను సాకుగా చూపుతూ చట్టవ్యతిరేక చర్యలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాటిన్నింటిపై గతంలో ఇచ్చిన తీర్పులను ప్రభుత్వాలు జల్లికట్టు మార్గంలో తిరగదోడే అవకాశం వుంది. ప్రజల మనోభావాల పేరుతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చని పరాశరన్‌ హెచ్చరించారు. ప్రతి వ్యవస్ధా పవిత్రతను కోల్పోతున్నది, తగు పద్దతులలో ఎందుకు చేయకూడదు ? ప్రభుత్వం ముందు మూడు అవకాశాలు వున్నాయి. ఒకటి రివ్యూ(సమీక్ష) పిటిషన్‌ దాఖలు చేయటం, రెండవది తాత్కాలిక పిటీషన్‌, మూడవది పార్లమెంట్‌లో చట్టసవరణ ద్వారా చేయవచ్చు అని పరాశరన్‌ అన్నారు.

మన సాంప్రదాయం కాదనే పేరుతో దేశంలోని వివిధ ప్రాంతలలో అటు మెజారిటీ ఇటు మైనారిటీ మతోన్మాద శక్తులు పౌరులపై ముఖ్యంగా మహిళలపై అనేక ఆంక్షలను విధించటమే కాదు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. సాంప్రదాయాల పేరుతో అనేక అనర్ధాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు కూడా జల్లికట్టువంటివే. సాంప్రదాయం, పల్నాటి పౌరుషం పేరుతోనో మరొక పేరుతోనో వాటిని నిషేధించిన హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం తిరగదోడదన్న గ్యారంటీ ఏముంది? ఒక యుగంలో ఏకపత్నీవ్రతం ఆదర్శ మైతే మరొక యుగంలో బహుభార్యాత్వం, వేలాది మందితో సరససల్లాపాలు ఆమోదమైంది. అనేక ప్రాంతాలలో ఎంత మంది వుంపుడుగత్తెలను కలిగివుంటే అంతటి పురుషత్వంగా కీర్తించబడిన రోజులు వున్నాయి. పురుషత్వం, పౌరుషం వంటివి తిరోగమన, ఫ్యూడల్‌ భావజాలానికి ప్రతీకలు. మహిళ లకు పౌరుషం అక్కర లేదా ?

మన దేశంలో బాల్యవివాహాలు, సతీసహగమనం, కన్యాశుల్కం, దేవదాసీ, బసివిని,జోగినీ వంటి దురాచారాలకు, దళితులపై అత్యాచారాలకు అనేక మత విశ్వాసాలు, గత సాంప్రదాయాలు, ఆచారాలను అతికించే మేథావులు ఎక్కడచూసినా మనకు కనిపిస్తారు. అఖండ భారత్‌, హిందూ సమాజ పునరుద్దరణ తమ లక్ష్యంగా, చట్టాలకంటే తమ విశ్వాశాలే ప్రధానమని ప్రకటించుకున్న శక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వున్నారు.పైన పేర్కొన్నవాటిని పునరుద్ధరించరన్న గ్యారంటీ ఏముంది. మైనారిటీల ఓట్ల కోసం వారిని సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటున్నారంటూ ఇతర పార్టీలపై నిత్యం ఆరోపణల పారాయణం చేస్తున్న వారు జల్లి కట్టు, ఎద్దులను హింసపెట్టే బండ్ల పోటీలకు అనుమతించటం ఎవరిని సంతృప్తిపరచేందుకు, ఎవరి ఓట్లను కొల్లగొట్టేందుకు ? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రేపు మరొక అంశంలో, మరొక రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు దారితీయదన్న గ్యారంటీ ఏముంది? బాబరీ మసీదు ప్రాంతం రాముడి జన్మ స్ధలం అన్నది తమ విశ్వాసమని అక్కడే గుడి కట్టాలని చెబుతున్నవారు రేపు కోర్టులో అందుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దాన్ని గౌరవిస్తారా ? ప్రజల, మతవిశ్వాసాలు, మనోభావాలను గౌరవించే పేరుతో ఆ వివాదాస్పద స్ధలంలో శాశ్వత చిచ్చు పెట్టరన్న గ్యారంటీ ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విరాళానికి ప్రచారఖర్చు పాతిక

08 Friday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, Janmabhumi, students

చంద్రబాబు చేతిలో మంత్రదండం !

సత్య

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతిలో మంత్రదండటం వుందా ? భక్తులను కరుణించేందుకు గతంలో పుట్టపర్తి సత్యసాయి బాబా హాంఫట్‌ అంటూ విభూతి,బంగారు చైనులు తీసి ఇచ్చేవాడని,ఆయన వేలు ముంచటంతో బకెట్‌లోని నీరు పెట్రోలుగా మారిందని గతంలో చెప్పారు. తిరుపతి జన్మభూమి సభలో అక్కడికక్కడ ఒక విద్యార్ధికి ఒక టాబ్‌ను చంద్రబాబు బహుకరించారంటే ఆయన కూడా అదే పరంపరకు చెంది వుండాలి.

ఎవరైనా బడి ఎగ్గొడితే మందలించాలి.పిల్లలను బడి ఎగ్గొట్టించి పిల్లలను తీసుకువస్తే టీచర్లను మందలించాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ? వచ్చిన 23 మంది పిల్లల్లో వుపన్యాసం చేసిన విద్యార్ధినికి టాబ్‌ బహుకరించారు. ఆది ఆయన జేబులోంచి తీశారా, పక్కన వున్న అధికారి చేతిలోది లాక్కొని ఇచ్చారా లేక ముందే చెప్పుకున్నట్లు మంత్రదండంతో సృష్టించారా అన్నది గొర్రెల గోత్రాలు కాపర్లకు ఎరుక అన్నట్లు తెలుగు దేశం మాజీ నాయకురాలు ప్రస్తుతం ఆ జిల్లాకు చెందిన వైసిపి శాసనసభ్యురాలు రోజాను అడగాల్సిందే.

సినిమాల్లో, కధల్లో మాఫియా నాయకుడు ఫలానా రోజున ఫలానా చోట నాకు ఇంత సొమ్ము తెచ్చి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అది కూడా స్వచ్ఛందంగానే అని తెలుసు కదా. అదే మాదిరి నా రాజధాని… నా అమరావతి…. నా ఇటుక పేరుతో ప్రతి విద్యార్ధి, టీచరు తలా పది రూపాయల చొప్పున విధిగా విరాళంగా వసూలు చేసి పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటంపై ప్రభుత్వం హైకోర్టులో మొట్టికాయలు తిన్నది. బలవంతపు వసూళ్లు చేయటం లేదని, గతంలో ఇచ్చిన వుత్తరువులను సవరిస్తూ ఒక మెమో జారీ చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరువు పోవటంతో విరాళాల వసూలుకు ఆదేశాలు ఇచ్చిన అధికారులపై ఆగ్రహించి, చర్య తీసుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారన్న వార్తలు కూడా పక్కపక్కనే వచ్చాయి. అంటే బాబుగారు మంచోరే మధ్యలో అధికారులే ఆయనకు మచ్చ తెస్తున్నారనే భజనలో భాగం కూడా ఇది కావచ్చు. ఎందుకంటే ఇలాంటి చర్యల వార్తల ప్రకారం నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఈ పాటికి ఒక్క అధికారి కూడా మిగిలి వుండేవారు కాదు, అన్నింటికి మించి ఇలాంటి వుత్తరువులు వచ్చి వుండేవి కాదు. ఎందుకంటే వుత్తరువులు ఇవ్వనేల ఆపైన చర్యలకు గురికానేల అని ఏపనీ చేసే వారు కాదు. ఇంత జరిగాక కూడా స్కూలు ఎగ్గొట్టి పలమనేరు నుంచి తిరుపతికి 120 కిలోమీటర్ల దూరం మూడు గంటల పాటు ప్రయాణించి 23 మంది పిల్లలు స్వచ్ఛందంగా పోగుచేసిన 230 రూపాయల విరాళాన్ని జన్మభూమి సభలో అందచేశారు. అంతదూరం ప్రయాణించటానికి వారికి అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు అయి వుండాలి. వారికి రానుపోను ఛార్జీలు, ఎంతో సమయం వెచ్చించాలి గనుక పిల్లలకు భోజనాల ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే రూపాయి విరాళానికి పాతిక రూపాయల ప్రచార ఖర్చు అన్నట్లు ఆ మొత్తాన్ని ఎవరు భరించారు?

పలమనేరులో జన్మభూమి సభ జరుగుతూ వుండి వుంటే పిల్లలు వుత్సాహపడి విరాళం అందచేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కనీసం పక్క నియోజకవర్గం కూడా కాదు, జిల్లా కేంద్రమూ కాదు, చిత్తూరు దాటి ప్రయాణించి రావాలి. ఇది టీచర్లు లేదా అధికారపార్టీ కార్యకర్తలు గానీ ముఖ్యమంత్రి మెప్పుకోసం నిర్వహించిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. దీన్ని అవకాశంగా తీసుకొని తాము స్వచ్ఛందంగానే విరాళాలు కోరామని, వత్తిడి చేయలేదని సదుద్దేశ్యంతో ముందుకు పోతుంటే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కోర్టులకూ వెళ్లారని వాళ్లు ఏ పనీ చేయరనీ ముఖ్య మంత్రి ధ్వజమెత్తారు. ఇతరులు తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పిన సిఎం వుత్తరువును సవరించినట్లు కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా విన్నపం చేయించటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు విశ్వామిత్ర సృష్టి

07 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Amaravathi, Andhrapradesh new Capitol, CHANDRABABU

దూరదృష్టా, అయోమయమా?

సత్య

చంద్రబాబు నాయుడికి ఎంతో దూరదృష్టి వుందని కొందరు చెబుతారు, ఎందరో నమ్ముతారు. అంతెందుకు తన దూరదృష్టి గురించి స్వయంగా అనేక సార్లు వివరించారు. ముఖ్యంగా విజన్‌ల ఆవిష్కరణల సందర్భంగా అన్నది తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి కొందరు ఆరోపించినట్లుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నూతన రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ స్వహస్తాలతో శంకుస్ధాపన చేయించారు. ఇప్పుడు మరికొన్ని వందల కోట్లు పారబోసి వేరే చోట తాత్కాలిక రాజధాని నిర్మించాలని నిర్ణయించటం ఆశ్చర్యంగా వుంది. దీన్ని చూస్తూ వుంటే రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి తిరిగి దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చటంతో పాటు జనాన్ని కూడా అటూ తిప్పిన మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ను గుర్తుకు తెస్తున్నారని ఎవరైనా అంటే ఆయనగాని లేదా వీరాభిమానులు గానీ వుక్రోష పడాల్సిందేమీ లేదు. మంత్రసాని పనికి ఒప్పకున్న తరువాత ఏది వచ్చినా పట్టాలి అన్నట్లు రాజకీయాల్లో వున్న తరువాత ప్రశంసలతో పాటు విమర్శలనూ అందుకోవాలి మరి.

అసలే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో వుండగా మన రాజధాని పేరుతో ప్రతి విద్యార్ధి నుంచి పది రూపాయలు విరాళం వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిని కొందరు విమర్శించవచ్చు, మరికొందరు రాజధాని భక్తి పేరుతో అంతే ఘాటుగా సమర్ధించనూ వచ్చు. కానీ తాత్కాలిక రాజధాని పేరుతో వందల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడటాన్ని భక్తులు ఎలా సమర్ధిస్తారో తెలియదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల పాటు వుమ్మడి రాజధానిగా నిర్వహణ ఖర్చులు తప్ప హైదరాబాదులోని వసతులను వుచితంగానే వుపయోగించుకోవచ్చు. తెలివిగల వారు ఎవరైనా దీనిని అవకాశంగా తీసుకొని కొత్త రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి. ప్రారంభంలో ఎలా వున్నా ఇప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు- చంద్రశేఖరరావు రావు ప్యారీ ప్యారీగా వున్నారు.

చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడు అని ఆయన అభిమానులు చెప్పేదానితో ఎవరికీ పేచీ లేదు.ఆచరణలో అది కనిపించకపోతే విమర్శల పాలవుతారు. రాజశేఖర రెడ్డి ఎంతో అభిమానంతో తన జీవిత కాలం గుర్తుంచుకొని మరీ వర్ణించిన యల్లో పత్రికలకు కూడా చివరికి చులకన అవుతారు.వాణిజ్య మీడియా సంస్ధలకు పాలకవర్గాలతో ఎప్పుడూ సఖ్యతే వుంటుంది. దున్నిస్తానని చెప్పిన ఒక ఫిలిం సిటీని దర్శించి తరించమని చెప్పటాన్ని చూశాం కదా !

చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి పాలన స్వరాష్ట్రం నుంచే అని చెబుతున్నారు. అందుకు గన్నవరం దగ్గర మేథాటవర్స్‌లో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారని కొంత కాలం, విజయవాడ-గుంటూరు నగరాలలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని కొన్ని సార్లు, మరోటౌన్‌షిపులో మంత్రులకు ఇళ్లని మరొకటని నిత్యం ఏదో ఒక వార్తను లీకుల రూపంలోనో మరొక రూపంలోనో ఇచ్చి రాయిస్తూనే వున్నారు. తాత్కాలిక రాజధానితో పాటు తాత్కాలిక అసెంబ్లీ వేదికల వెతుకులాట మరోవైపు. మొత్తం మీద జనానికి రోజూ ఏదో ఒక వినోదం. పాలన విజయవాడ నుంచే సాగిస్తానని చెప్పిన చంద్రబాబు హైదరాబాదులోని తన ఛాంబరు, అది వున్న భవనానికి ఇతర కార్యాలయాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చింది మరమ్మతులు, కొత్త హంగులు కల్పించారు. రాముడు వనవాసం చేసిన సమయంలో ఆయన పాదుకలను సింహాసనంపై వుంచి ఆయన పేరుతో పాలన సాగించినట్లుగా చంద్రబాబు లేకుండా, రోజూ రాకుండా హైదరాబాదు సచివాలయంలో ఛాంబరును నిర్వహిస్తున్నారు. హైదరాబాదు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ఏడాదికి ఒకసారి వచ్చి కొద్ది రోజులు విడిది చేసి పోతుంటారు. అయినా భవనాన్ని ఏడాది పొడవునా తేళ్లు, పాములు చేరకుండా సిబ్బంది చూస్తూ వుండాల్సిందే. అదే దుర్వినియోగం కానపుడు చంద్రబాబుకు హైదరాబాదు సచివాలయంలో ఒక ఛాంబరు వుండకూడదా అంటే ఎవరికి వారు తల పట్టుకోవటం తప్ప ఎవరేమి చెబుతారు. ఇదేమి జవాబుదారీతనమని ఎవరైనా ప్ర శ్నిస్తే ఇంకేమైనా వుందా ! ఏదో ఒక రంగు పడుద్ది.

ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు మాదిరి కొంత మంది వుద్యోగులు, అధికారులను హైదరాబాదు-విజయవాడ మధ్య తిప్పుతున్నారు. యథాముఖ్యమంత్రి తథా మంత్రులు అన్నట్లు వారిదీ అదే పరిస్ధితి. ఏతావాతా అందరూ చెప్పుకొనేదేమిటంటే ఎక్కడా ఎవరూ పని చేయటం లేదు. రూపాయి పొదుపుకు పది రూపాయల ఖర్చు అన్నట్లుగా స్వంత రాష్ట్రం నుంచి పాలన తయారైంది. హైటెక్‌, కాగిత రహిత పాలన అంటూ కబుర్లు చెప్పే పెద్దలు ఎక్కడి నుంచి ఎక్కడైనా పర్యవేక్షణ చేయవచ్చు.

తాత్కాలిక సచివాలయాన్ని మరోచోట నిర్మించటమంటే చంద్రబాబు నాయుడి ఐదు సంవత్సరా ల పాలనా కాలంలో కొత్త రాజధాని నగర నిర్మాణం జరగదని పరోక్షంగా చెప్పినట్లే. ఆరునెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలనే షరతు విధిస్తామని చెప్పిన మంత్రి నారాయణ మరో ఆరునెలల సమయం తీసుకొని శాశ్వత సచివాలయాన్ని నిర్మింపచేయలేని అసమర్ధంగా ప్రభుత్వం వుందా ?ఎందుకీ పిట్టల దొర మాటలు ? చంద్రబాబు నాయుడి సర్కార్‌ పోకడ చూస్తూ వుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ప్రయత్నించి అటూ ఇటూ గాని త్రిశంకు స్వర్గాన్ని ఏర్పాటు చేసిన విశ్వామిత్రుడిని గుర్తుకు తెస్తున్నారు. డబ్బుపోయి శని పట్టె అన్నట్లు జనాల నుంచి గోళ్లూడ గొట్టి లేదా తాగబోయించి వసూలు చేసిన పన్ను ధనాన్ని ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా అన్నట్లుగా తాత్కాలిక నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్లను వారికి వెన్నుదన్నుగా వుండే అధికార పార్టీ పెద్దలను బాగుచేయటానికి తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తలకిందులైన వూట సిద్ధాంతం-దలాల్‌ స్ట్రీట్‌ ఆక్రమణ తధ్యం

06 Wednesday Jan 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

India Super Rich, occupy dalal street, percolation theory, Trickle Down, Trickle-Up Policy

సత్య

సామ్యవాదం విఫలమైంది, కనుక పెట్టుబడిదారీ విధానం మినహా మరొక గత్యంతరం లేదు. పెట్టుబడిదారీ విధానం వెనుకటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయింది.దాని మానవీయ ముఖాన్ని మనం చూడటం లేదు. ప్రభుత్వాలు అన్నీ చేయాలంటే కుదరదు, చివరికి వుల్లిపాయలను కూడా ప్రభుత్వమే అమ్మాలనటం అన్యాయం. ఈనాడున్న యంత్రాంగంలో జనానికి చేరేలోపు వుల్లి పాయలు కుళ్లి పోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు, అందువలన అలాంటి వాటన్నింటినీ ప్రయివేటు రంగానికి వదలి వేస్తే జనానికి సరసమైన ధరలకు, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. ప్రయివేటు రంగానికి ఆదాయం వస్తే అది క్రమంగా వూటమాదిరి కిందికి దిగి సమాజానికంతటికీ పంపిణీ అవుతుంది. సోషలిజం చెప్పేది కూడా ఇదే కదా ! పెట్టుబడిదారులను, భూస్వాములను కూలదోసి, అంతం చేసి సోషలిజాన్ని సాధిస్తామని కమ్యూనిస్టులు చెబుతారు, అంతటి రక్తపాతం అవసరమా ? దాని కంటే వూట సిద్ధాంతం మెరుగు కదా ?

గత కొద్ది సంవత్సరాలుగా మనకు చెబుతున్న కబుర్లు ఇవి. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానమే ఎక్కువ దేశాలలో వుండటం, వనరులన్నీ ప్రయివేటురంగం చేజిక్కించుకోవటం, సోషలిస్టు వ్యవస్థలు వున్న దేశాలు పరిమితం కావటం వలన వనరులు పూర్తిగా జనపరం అయ్యేంత వరకు అన్నీ ప్రభుత్వం చేయలేదు అని కొంత మేరకు ఒప్పుకోవచ్చు. మన దేశంలో ధనవంతులలో తొలి వ్యక్తి ముకేష్‌ అంబానీ. అతగాడి సంపద విలువ లక్షా 50వేల కోట్ల రూపాయలు, అతని సామ్రాజ్య ఆదాయం నాలుగు లక్షల 15వేల కోట్ల రూపాయలు. ఇంత సంపదలున్న పెద్దమనిషి వీధుల్లో వుల్లిపాయలు అమ్ముకొని పొట్టపోసుకొనే చిరువ్యాపారుల పొట్టకొడుతూ రిలయన్స్‌ ఫ్రెష్‌ పేరుతో వుల్లిపాయలు, కూరగాయలు కూడా అమ్మటం అవసరమా ? ఆయనే కాదు, తాతా, బిర్లా, గోయంకా వంటి మహానుభావులెందరో బూరలు, కాశీదారాలు, పిన్నీసుల మొదలు దేన్నీ వదలకుండా తామే అమ్మాలని ముందుకు వస్తున్నారు. వుల్లి పాయలు అమ్మటం కంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా వున్నాయని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా హెరిటేజ్‌ ఫ్రెష్‌ పేరుతో చచ్చు వుల్లిపాయలు, కూరగాయలు, పాలు అమ్మటానికి వరుసగా దుకాణాలు తెరుస్తూ పోతున్నారు. అంటే ప్రభుత్వం కాదు, మేమే అమ్మి సొమ్ము చేసుకోవాలని అంబానీ మొదలు చంద్రబాబు నాయుడి వరకు అందరూ అనుకుంటున్నట్లే కదా ? రేపు నిర్మించబోయే అమరావతి స్మార్ట్‌ రాజధాని నగరంలో తోపుడు బండ్ల వారి కూరగాయలు,ఆకు కూరలు,వుల్లి పాయల కేకలు మనకు వినపడనిస్తారా ?

విన్నపం: ఈ సైట్‌లో వస్తున్న సమాచారంలో చిన్న నలుసైనా వుపయోగం అనుకుంటున్నారా ? వ్యాఖ్యలు, విమర్శలలో వాస్తవం వుందనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలు చెప్పండి ? వాటిని మీరు అభిమానించండి(లైక్‌) మీరు నలుగురితో పంచుకోండి(షేర్‌).

ఇంత వుపోద్ఘాతం ఎందుకంటారా ? పైన చెప్పుకున్న వూట సిద్ధాంతాల ప్రకారం రూపొందించిన విధానాల ప్రకారం( కమ్యూనిస్టులు వాటిని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశితం అంటారు, నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు లేదు లేదు అవి పక్కా పదహారణాల మన స్వంత విధానాలంటారు, పేచీ ఎందుకు రెండోవారు చెప్పిందే అంగీకరిద్దాం) సంపదలు వూటమాదిరి కిందికి దిగుతున్నాయా ?

క్రెడిట్‌ సూసీ సంస్ధ ప్రపంచ సంపదల నివేదిక 2015లో వెల్లడించినదాని ప్రకారం మన దేశంలో దిగువ 70శాతం మంది అంటే 87 కోట్ల జనాభాకు వుమ్మడిగా ఎన్ని ఆస్తులు వున్నాయో ఎగువన వున్న వంద మంది ధనికుల వద్ద అన్ని ఆస్తులు పోగుపడ్డాయి. వీరిలో కూడా అత్యంత ధనికుడైన ముకేష్‌ అంబానీ ఒక్కడి సంపదే దిగువ జనాభాలోని 25 కోట్ల మంది ఆస్తికి సమానం. మన సంపదలు కేంద్రీకృతం అవుతున్నాయో ఊట మాదిరి కిందికి దిగుతున్నాయో వేరే చెప్పాలా ? పాయింట్ల వారీ చెప్పాలంటే ఇలా వున్నాయి.

స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎగువ జనాభాలోని ఒక శాతం ఆస్తులు 2015లో మొత్తం జనాభా ఆస్తులలో 53శాతానికి చేరాయి. అంతకు ముందు ఏడాదిలో 49శాతం మాత్రమే. ఇది నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి సాధించిన ఘన విజయాలలో ఒకటి. గత పదిహేను సంవత్సరాలలో ఇంతటి పెరుగుదల లేదన్నది మరొక కలికి తురాయి. నూతన ఆర్ధిక విధానాలు బాగా అమలు జరిగిన పూర్వరంగంలో గత 15సంవత్సరాలలో ఎగువ ఒక శాతపు అపర కుబేరుల సంపద 38 నుంచి 53శాతానికి పెరిగింది.ఈ విధానాలను ప్రవేశ పెట్టిన ఘనత తనదే అని తొలి రోజులలో శాలువా ఎగరేసి చెప్పుకున్న మన పివి నరసింహారావు తన చివరి రోజులలో ఇదేమిటి ఇలా జరిగింది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చింతించాడంటారు, నిజమెంతో తెలియదు.

ఎగువ పదిశాతంలో మిగిలిన తొమ్మిదిశాతం మంది సంపద 29 నుంచి 23శాతానికి తగ్గగా తొంభైశాతం దిగువ జనాభా సంపద 33 నుంచి 24శాతానికి పడిపోయింది. అందుకే చాలా మంది వున్నవారు కూడా తమకు కలసి రావటం లేదు, కలసి రావటం లేదు అంటూ బాబాలు, స్వామీజీలు, చేతులు చూసి జోస్యం చెప్పేవారు ఎవరు కనపడితే వారి దగ్గరకు కుప్పలు తెప్పలుగా వెళుతున్నారు, చేతి చమురు వదిలించుకుంటున్నారు.

మన ఆర్ధిక వ్యవస్ధలో వున్న పెరుగుదల మొత్తాన్ని ఒక శాతం ధనికులే హాంaఫట్‌ అంటూ లాగించేస్తున్నారని స్పష్టం అవుతోందా లేదా ? గత పదిహేను సంవత్సరాలలో 2.3లక్షల కోట్ల డాలర్ల సంపద సృష్టి అయితే దానిలో ఎగువ ఒక శాతం మందికి 61శాతం, ఎగువ తొమ్మిదిశాతానికి 21, దిగువ 90శాతానికి 18శాతం చేరిందట.మనలో ఎవరికి వారు దేనిలో వున్నామో ఒక్కసారి లెక్కవేసుకుంటే మంచిదేమో !

ఎగువ ఒక శాతం అంటే కోటీ 25 లక్షల మంది(మన జనాభా 125 కోట్లపుడు)లో కేవలం 25లక్ష ల మంది దగ్గర దేశ సంపదలో 40శాతం వుంది. మనదేశంలో మధ్య తరగతి ఎక్కువగా వుందని అందువలన వినిమయ వస్తువులను అమ్ముకొనేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయని ఇప్పటివరకు ఒక అభిప్రాయం వుంది. ఇప్పుడు ఆ మధ్య తరగతి ఎంత మంది అనేది కూడా క్రెడిట్‌ సూసీ నివేదిక అనుమానంలో పడేసింది. నికర సంపద 8.5 నుంచి 85లక్షల రూపాయల మధ్య వున్నవారిని మధ్య తరగతిగా పరిగణిస్తున్నారు.అలాంటి వారు మన దేశంలో ఇప్పుడు మూడు శాతం అంటే 3.75 కోట్ల మంది మాత్రమే వున్నారట. అపైన వున్న ధనికులను కూడా కలపుకుంటే 3.2శాతానికి చేరతారని మిగిలిన వారంతా దిగువ తరగతి వారేనని ఆ నివేదిక చెబుతోంది.

ఈ లెక్కన సంపదలు పోగుపడుతూ వుంటే మరో పన్నెండు సంవత్సరాలలో ఒక శాతం వారి సంపద 75శాతానికి చేరుతుందని అంచనా.అంటే అమెరికాలో మీరు ఒక శాతం మేము 99శాతం అంటూ వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం ప్రారంభమైనట్లుగా మన దేశంలో కూడా దలాల్‌స్ట్రీట్‌( ముంబైలో వాణిజ్యం జరిగే వీధి) ఆక్రమణ వుద్యమానికి వూట మాదరి జనం మధ్యకు వుద్యమ సందేశం దిగేందుకు మన విధానాలు పునాది వేశాయన్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏది నిజం ! ఏది కల్ల !! అసలేం జరుగుతోంది ఓ మహాత్మా !!!

05 Tuesday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Others, Politics, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, Andhrapradesh, CHANDRABABU

విన్నపం: ఈ సైట్‌లో వస్తున్న సమాచారంలో చిన్న నలుసైనా వుపయోగం అనుకుంటున్నారా ? వ్యాఖ్యలు, విమర్శలలో వాస్తవం వుందనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలు చెప్పండి ? వాటిని మీరు అభిమానించండి(లైక్‌) మీరు నలుగురితో పంచుకోండి(షేర్‌).

సత్య

చంద్రబాబు నాయుడు అంటేనే ఓ రంగుల కల. భవిష్యత్‌ దార్శనికుడిగా కొందరు వర్ణించిన ఆయన గతంలో ముఖ్య మంత్రిగా వున్నపుడు విజన్‌ 2020ని ప్రకటించి నానా హంగామా సృష్టించారు. తమ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన బాబు బాగోతం మాకు తెలియదా అంటూ దానిని విజన్‌ 420గా వర్ణించిన కాంగ్రెస్‌ వారిపై తెలుగుదేశం వీరాభిమానులు విరుచుకు పడ్డారు. ఆ విజన్‌ ఏమైందో చూశాము. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు అంతకంటే పెద్ద విజన్‌ 2050ని జనం ముందుకు తెస్తున్నారు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో అన్న తెలుగు సామెతను గుర్తుకు తెచ్చుకోక తప్పదు.

గతంలో గ్రామాలలో తమ కళలను ప్రదర్శించి పొట్టపోసుకున్న జానపదులు వెళ్లిన ప్రతి చిన్న పల్లెనూ మీ వూరు చుట్టుపక్కల అరవైఆరు గ్రామాలకు పోతుగడ్డ అని పొగిడేవారు. పిట్టలదొరల సంగతి చెప్పనే అవసరం లేదు. నాకున్న కోట్లను కుక్కలు తింటున్నాయి, లక్షలను నక్కలు తింటున్నాయి, మీకు డబ్బేమన్నా కొదవ వుంటే చెప్పండి, కోరుకున్న కోరుకున్నంత ఇస్తా, కోట్లున్నా కడుపునిండా తినటానికి తిండి లేదు, అందుకే మీ ముందుకు వచ్చా, నాలుగు డబ్బుల్విండి బాబయ్యా అంటూ సాగుతుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దానిని చూస్తుంటే వూరూరా, వాడవాడలా ఆధునిక జానపదులు, పిట్టల దొరలు దర్శనమిస్తున్నారు. మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటాల మధ్య గొడవలతో తెరవెను ఎడమొఖం పెడమొఖంగా వుంటారని చెబుతారు. అయితే గత శుక్రవారం నాడు విశాఖ వుత్సవ్‌ను ప్రారంభించి విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని యుగళగీతం పాడారు. సేనానులే ఇలా మాట్లాడితే సోమవారం నాడు జన్మభూమిలో మాట్లాడిన వారి సేనాధిపతి చంద్రబాబు నాయుడు తెనాలి పట్టణాన్ని సాంస్కృతిక కేంద్రంగా మారుస్తానని ప్రకటించారు. ఒకపుడు తెనాలి, గుడివాడ, విజయవాడ, బందరు వంటి పట్టణాలు కళాకారులు, సాహితీవేత్తలకు కేంద్రాలుగా వున్నాయి. తెనాలికి ఆంధ్రా పారిస్‌ అన్న పేరు కూడా వుంది. విజయవాడను తెలుగుజాతి సాంస్కృతిక కేంద్రంగా ఎందరో వర్ణించారు. అంతకు ముందు రోజు చంద్రబాబు నెల్లూరు వెళ్లినపుడు ఆ నగరాన్ని మెగాసిటీగా, పరిశ్రమల కేంద్రంగా మారుస్తానని చెప్పారు.జన్మభూమి కార్యక్రమం ముగిసేలోగా ఇలాంటి విపరీతాలు, విడ్డూరాలను ఇంకా ఎన్ని వినాల్సి , కనాల్సి వస్తుందో తెలియదు.

నాలుగు వందల సంవత్సరాలకుపైగా చరిత్ర, విస్తరణ వున్న హైదరాబాదులో ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్దలు, ప్రయివేటు పరిశ్రమలు, ఐటి కేంద్రంగా వున్న చోటే మొత్తం జనాభాయే కోటి వరకు వుంది. అలాంటిది 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాలలో అమరావతి రాజధాని ప్రాంతంలో 60లక్షల వుద్యోగాలే కల్పిస్తానని చంద్రబాబు నాయుడు విజన్‌ 2050 పేరుతో మరో పెద్ద రంగుల కలకు తెరతీశారు. వున్న పరిశ్రమలే మూతపడుతూ వుత్పత్తులను తగ్గించాయని, ఎగుమతులు పడిపోయాయని, మన సరుకులను కొనేవారు ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.అవేమీ తెలియనట్లు, మనకు వర్తించవన్నట్లుగా మరోవై పు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతాన్ని పారిశ్రామికంగా, వాణిజ్య కేంద్రంగా మారుస్తానని చెబుతున్నారు.మరోవైపు రాజధాని ప్రాంతంలో కూడా ప్రత్యేక నగరాలు లేదా ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేస్తామని నమ్మబలుకుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అన్ని విధాలుగా అమలు జరిపితే పచ్చని పంటపొలాలను నాశనం చేసి రాజధానికి 33వేల ఎకరాలు తీసుకోవాల్సిన పనేముంది? దాని చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు అంటూ మరో భ్రమ కల్పించాల్సిన అవసరం ఏముంది? అసలేం చేస్తారు? ఎలా చేస్తారు? ఏం చేయబోతున్నారు ?

కొద్ది నెలల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపి సమాచార శాఖ మంత్రి పల్లె రఘనాధ రెడ్డి చెప్పినదాని ప్రకారం అమెరికా నుంచి ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వాటితో పదివేల మందికి వుపాధి కల్పించవచ్చన్నారు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఒక వార్త ప్రకారం అమెరికాలో వంద భారతీయ కంపెనీలు 1500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి 91వేల వుద్యోగాలను అమెరికన్లకు కల్పించినట్లు వుంది. అందువలన పెట్టుబడి అన్నది ఎక్కడ లాభం వుంటే అక్కడకు పోతుంది తప్ప వ్యక్తుల పలుకుబడి, వడ్డూ పొడుగులను చూసి రాదు, మాటల గారడీలకు పడిపోదు. ఐదువేల కోట్లకు పదివేల వుద్యోగాలైతే 60లక్షల వుద్యోగాలకు ఎన్నిలక్షల కోట్లు కావాలి? అరచేతిలో వైకుంఠాన్ని చూపి రెండేళ్లు అవుతోంది. గతంలో ఖాళీగా వున్న కొన్నిపోస్టులను నింపటం తప్ప కొత్తగా సృష్టించిన వుద్యోగాలెన్ని? అందుకోసం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు ఇప్పుడే దశలో వున్నాయి అన్నది బేతాళుడి ప్రశ్న. ఎవరైనా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయారో వారి తల ఒక్కలు కాదు కానీ ఏం జరుగుతుందో ప్రయత్నించి చూడండి, తెలిస్తే చెప్పండి.

ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, అలాంటి వారి మాటలు నమ్మి మీసాలు మెలేసేవారు అమాయకులు సుమతీ అనుకోవాలా ?

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

IT IS POLITICAL STONE THAT VHP IS TAKING TO AYODHYA: HINDU MAHASABHA

22 Tuesday Dec 2015

Posted by raomk in Communalism, Current Affairs, NATIONAL NEWS, Others, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, HINDU MAHASABHA, POLITICAL STONE, VHP

New Delhi, 22 Dec 2015: Two days after media reports about first lot of stones having reached Ayodhya allegedly for construction of Ram Temple, Hindu Mahasabha has come out opposing the move and termed it as ‘political stone’ that Vishwa Hindu Parishad is taking there.

Addressing a press conference in Delhi on Tuesday, Swami Chakrapani, National President, Akhil Bharat Hindu Mahasabha, said: “It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani said he believes in law and wants Ram Temple under the law not through communal politics.

“Even before the verdict (of Allahabad High Court) came, I had said in 2010 that I can never support construction of a temple on dead bodies. I demanded fast-track court for the (Babri Masjid-Ram Janmabhoomi) case so that judgment can come fast. Leave aside the stone and bricks of Vishwa Hindu Parishad. It is their internal politics. If verdict comes in our favour today we will construct the temple with gold, leave aside stone. But that should be done under the law” he said.

“Leave aside the issue of stone (being sent to Ayodhya). It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani also condemned the alleged blasphemous remarks of a person called Kamlesh Tiwari.

“I was saddened with remarks of Kamlesh Tiwari about Prophet Muhammad. I felt sad as much as I was when Aamir Khan disrespected gods and goddesses in PK film. We opposed him and asked our office to find about his details. We found he was removed from our organisation in 2008. If he were with it today, I would have removed him. He does not deserve to be called Hindu. Similarly if a Muslim disrespects other’s religion cannot be Muslim,” said Swami.

Sharing the dais with leaders from Muslim, Sikh and Christian communities including Maulana Tauqeer Raza Khan, Swami Chakrapani demanded a strong anti-blasphemy law in the country.

“There is a need for religious communities – Hindus, Muslims, Christians, Sikhs – to take a vow that they would not allow anyone to hurt other’s religion. We demand strong anti-blasphemy law and such people should be strongly punished.”

“Such people are of no worth. They make such statement for which they can’t get respect even in their family, leave aside the society. It becomes an issue between Hindus and Muslims and the man becomes hero. We should not allow this thing to happen. It is the duty of us religious leaders to join hands and stop such people,” he said.

No indication from PM on Ram temple: VHP

The Vishwa Hindu Parishad (VHP) has said that there was no indication from Prime Minister Narendra Modi on the construction of Ram temple in Ayodhya.

In a statement on Monday, VHP general secretary Champat Rai said: “VHP is of the view that Ram Mandir at Ayodhya should be built through an act of parliament. VHP has always respected the court and have faith in it.”

“Time has come for the construction of Ram Mandir in Ayodhya. Lot of stones arrived. And now the arrival of stones will continue. We have signals from Modi government that the construction of temple would be done now,” media reports had quoted Mahant Nritya Gopal Das, president of Ram Mandir Nyas, as saying.

“Reports published in media are false. Arrival of stones is a common practice and since 1990, thousands of trucks full of stones have arrived and kept at Ramghat Karyashala after fretwork (nakkashi),” Rai said.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెయ్యబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అంటే కుదురుతుందా ?

20 Sunday Dec 2015

Posted by raomk in AP NEWS, BJP, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, call money, CHANDRABABU, tdp

ఎంకెఆర్‌

కాంగ్రెస్‌ అంటే కుంభకోణాలకు మారుపేరు, సందేహించేవారే లేరు. వేల కోట్ల రూపాయలున్న (కొందరు ఐదువేలంటారు మరికొందరు రెండువేలంటారు) నేషనల్‌ హెరాల్డ్‌ అనే ఒక పత్రిక ఆస్ధులను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. దానిని అమలు జరిపారు. సుబ్రమణ్యస్వామి అనే ఒక నాయకుడో కార్యకర్తో స్థాయో అసలు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియని ఒక లిటిగెంట్‌ బిజెపిలో చేరక ముందు నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం అంటూ ఒక కేసు వేశాడు. దానిలో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు శనివారం నాడు న్యూఢిల్లీలో ఎలాంటి హంగామా చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా టీవీలలో చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది కనుక జైలుతో పనిలేకుండా బెయిల్‌ వచ్చింది. విచారణ వాయిదా పడింది. మనం కూడా దాన్ని కాసేపు పక్కన పెడదాం.

ఆసలు ఆ కేసుతో దానిని వేసిన సుబ్రమణ్యస్వామితో మాకు సంబంధం ఏమిటి అంటుందేమిటి బిజెపి? సదరు స్వామి బిజెపిలో లేనపుడు వేశారని ఇప్పుడు బిజెపిలో వున్నప్పటికీ అది స్వంత కేసు తప్పకేసు తప్ప పార్టీకి సంబంధం లేదని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో వున్న బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, ఆ పార్టీ ఇతర నాయకులు బల్లచరిచి మరీవాదిస్తున్నారు. ఇక్కడ సమస్య స్వామి ఇప్పుడు ఏ గంగలో వున్నాడన్నది కాదు. ఆ కేసు విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? పార్టీలో చేర్చుకొనే ముందు బిజెపి లేదా స్వామి ఆ కేసుల గురించి చెప్పలేదు. స్వామి తప్ప కేసులతో తమకు సంబంధం లేదని అనటం వింతగా వుంది. పాత కేసులు వున్న అనేక మందిని బిజెపి తన కండువా కప్పి వారిని ఎన్నికలలో నిలబెడుతున్నది. అయినంత మాత్రాన వారు అఫిడవిట్లలో ఆ కేసులను ప్రస్తావించకుండా వుంటున్నారా? వుంటే కుదురుతుందా ? ఏదో ఒక వైఖరి చెప్పాలా లేదా ?

కాల్‌ మనీ మాఫియా వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుతెన్నులను పరిశీలిస్తే అధికారపక్షం ఆబురదను పూసుకుందా ప్రతిపక్షం పైచేయి సాధించిందా అన్నది జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే తానే మకిలి అంటించుకుంది అన్న అభిప్రాయం బలంగా వుంది. దీనిలో తెలుగు కాల్‌ మనీ మాఫియా వ్యవహారాలను పోలీసుల దృష్టికి తెచ్చిన తెలుగుదేశం ఎంపీ ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల స్దంభనకు దారితీస్తుందని, అధికారపక్షాన్ని ఇంతగా ఇరుకున పెడుతుందని, పరిణామాలు ఈ విధంగా వుంటాయని ఊహించి వుండరు. దీన్ని గురించి బయట పెట్టిన నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే పది రోజులపాటు సెలవుపై వెళుతున్నారనే వార్తలు రావటంతో ప్రభుత్వం, పాలకపార్టీ ప్రతిష్ట దిగజారింది. కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వమే ఆ పని చేయించిందని వూరూ వాడా గుప్పు మంది. తెలుగుదేశం పార్టీని కాపాడటమే తమ కర్తవ్యంగా పెట్టుకున్న మీడియా కూడా ఈ విషయంలో ఆయన ప్రతిష్టకు మచ్చ రావటాన్ని నివారించలేకపోయింది. నష్ట నివారణ చర్యలు కూడా సరిగా చేపట్టలేదు. తన సెలవును తానే రద్దు చేసుకున్నట్లు సవాంగ్‌ మీడియాతో చెప్పగా ముఖ్యమంత్రి రద్దు చేయించారని తెలుగుదేశం నాయకులు ప్రకటించి అభాసుపాలయ్యారు.

కాల్‌ మాఫియా దురంతాలపై అసెంబ్లీలో చర్చ చేయకుండా పాలకపక్షాన్ని రచ్చకు ఈడ్వకుండా ప్రతిపక్షం ఎలా వుంటుంది. రాష్ట్రాన్ని కుదిపివేసిన కాల్‌ వ్యవహారంపై ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అంగీకరించి వుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నది కనుకే వెంటనే చర్చకు అంగీకరించినట్లు చెప్పుకోవటానికి ఒక మంచి సందేశం పంపటానికి అవకాశం వుండేది. నిజానికి దీని గురించి అధికారపార్టీ అంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ జరిగినన్ని రోజులూ ఈ అంశం తప్ప మరొకటి లేదు. ఈ అం శాన్ని రచ్చ చేయటం వలన రాజధానికి చెడ్డపేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు వాపోవాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అని జపాన్‌, సింగపూర్‌ పాలకులకు తెలిసి వుండేది కాదు. ఈ మాఫియాలో వున్న తమ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వెంటనే చర్య తీసుకోకపోగా ఇతర పార్టీల వారూ వున్నారనే ప్రచారం కోసం రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చేయించిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తరువాత అసెంబ్లీలో వైసిపి సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించిందని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు తప్ప కాల్‌మాఫియాలో వున్న వారిని తెలుగుదేశం లేదా వైసిపీ గానీ ఎవరూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. అలాంటి వారితో ఫొటోలు దిగటంలో తప్పులేదన్నట్లుగా మాట్లాడిన వైసిపి నేత జగన్‌ తమ పార్టీ వారూ ఫొటోల ప్రదర్శనకు దిగిన విషయాన్ని మరిచిపోతే ఎలా ?

తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్‌పై ఎక్కడలేని ప్రేమ ఆకస్మికంగా వుట్టుకువచ్చినట్లు ప్రవర్తించింది. ఒకవైపు రిజర్వేషన్లు అమలు జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్దలను నిర్వీర్యం చేసి వుద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నది. ప్రభుత్వ వుద్యోగాలలోనూ అదే పరిస్ధితి. ప్రయివేటు రంగంపై నియంత్రణల ఎత్తివేతలో భాగంగా కార్మిక చట్టాలను నీరు గార్చేందుకు మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేయటమంటే అంబేద్కర్‌ సామాజిక న్యాయాన్ని కాదని చెప్పటమే. అంబేద్కర్‌పై అసెంబ్లీలో నిజంగా చర్చజరపాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి జరిపితే ఎవరూ గొడవ చేయరు. ఆ పని ఎందుకు చేయలేదు. రెగ్యులర్‌ సమావేశాలలో ఆ అజెండాను మిళితం చేయటం ఒక రాజకీయం. దాన్ని అడ్డుకున్నారని ప్రతిపక్షంపై నెపం వేసేందుకే దాన్ని ముందుకు తెచ్చారనిపిస్తోంది. నిజంగా అంబేద్కర్‌పై, ఆయన పోరాడి, సంఘటితపరచిన దళితులు, గిరిజనులపై ప్రేమ వంటే గత ఇరవైనెలలుగా ఎస్సీ కమిషన్‌ ఎందుకు నియామకం జరపలేదు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాల్‌ మనీ కహానీలు

19 Saturday Dec 2015

Posted by raomk in AP NEWS, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, call money, telugudesam, Ycp

సత్య

శాసన సభలో కాల్‌ మనీ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు రెండూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆ దుమ్ములో జనానికి ఏం జరుగుతోందో, ఏ జరగనుందో తెలియటం లేదు. ఒక గీతను చిన్నదానిని చేయాలంటే దాని పక్కన పెద్ద గీతను గీయటం పాత విద్యే.కాల్‌మనీ, అప్పు ఇచ్చి అత్యాచారాలు చేశారన్న ఆరోపణ, దందాలో చిక్కుకున్న విజయవాడ తెలుగుదేశం పార్టీ పరివారాన్ని కాపాడుకొనేందుకు, ఈ సమస్యను దారి మళ్లించేందుకు ఇప్పటికే చేయాల్సింది చేశారు. దానిలో భాగంగానే అన్ని పార్టీలకు తలాకాస్త బురద పూసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల వారూ వున్నారని, వారిలో వైసిపి వారే ఎక్కువగా వున్నారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 188 మందిలో తమ వారు 20 మంది మాత్రమే వున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంలో ఆంతర్యం ఏమిటి ? దీనిలో నిజం కూడా వుండవచ్చు.

తమ వారు అంత తక్కువగా వున్నపుడు ఇతర పార్టీల వారూ ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి వారు ఎక్కువ మంది వున్నట్లు ఇప్పుడు చెబుతున్న సర్కార్‌ తమ వారిపై ఫిర్యాదు వచ్చేంత వరకు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న అధికారం పక్షం ఇంత తీవ్ర విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ? వడ్డీ వ్యాపారులందరూ విజయవాడలో వారి మాదిరి మాఫియా లేదా సెక్స్‌రాకెట్‌లో నిమగ్నమైనవారు కాకపోవచ్చు. వడ్డీ వ్యాపారం చేసేవిగా పేరుపడిన పట్టణాలు,గ్రామాలకు చెందిన వారందరినీ ఈ సందర్బంగా పోలీసులు రౌండప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా సమస్యను పలచపడేట్లు చేయటానికి వేసిన ఎత్తుగడ మాత్రమే అని జనం భావిస్తున్నారు.

విజయవాడలో ఆరోపణలు వచ్చిన వారి వివరణలు చూస్తే ముఖ్య ంగా అధికార పార్టీ వారివి కహానీలుగా కనిపిస్తున్నాయి. పెనమలూరు ఎంఎల్‌ఏ బోడె ప్రసాద్‌ రాజకీయాలలోకి రాకముందు తనకు 23 ఎకరాల పొలం వుందని ఇప్పుడు రెండున్నర ఎకరాలకు తగ్గిపోయిందని స్వయంగా చెప్పారు కనుక మనం నమ్మాలి. ఎందుకంటే అనేక మంది అలా పోగొట్టుకున్నవారు వున్నారు. ఈ రోజుల్లోనా అని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం కష్టం. అదే ఎంఎల్‌ఏ గారు మరొక మాట కూడా చెప్పారు బ్యాంకుల నుంచి పది కోట్ల రూపాయల అప్పు తీసుకొని వ్యాపారం చేస్తున్నానని అన్నారు. రెండున్నర ఎకరాల ఆసామికి పది కోట్ల రూపాయల అప్పు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు ఎంతో వుదారంగా అప్పులిస్తున్నట్లు మనం నమ్మాలి. ఇంత తక్కువ ఆస్ధి వున్నవారికే బ్యాంకులు పదికోట్ల రూపాయల అప్పులిస్తుంటే అంతకంటే ఎక్కువ ఆస్థులున్నవారు కూడా కాల్‌మనీ మాఫియా చేతుల్లో ఎందుకు చిక్కుకున్నారో, మాన మర్యాదలు ఎందుకు పోగొట్టుకున్నారో ఎంఎల్‌ఏగారు చెపితే బాగుంటుంది. ఇంకొకటి కాల్‌మనీ కేసులో తప్పించుకుతిరుగుతున్న తన ఇంటి పక్క స్నేహితుడితో కలసి విదేశాలకు వెళితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అన్న లోకోక్తి ఒక్క వైసిపి నేతలకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఫిర్యాదు చేసింది స్వంత పార్టీ ఎంపి కేశినేని నాని అని అసలు కాల్‌మాఫియా గురించి బయట పెట్టింది తామేనని చెప్పుకుంటున్న ఎంఎల్‌ఏ గారు అలాంటి మాఫియాలోని ఒకడైన తన స్నేహితుడిని గుర్తించలేకపోయారా ? స్నేహితులతో విదేశాలకు వెళ్లటమే తప్పా అని ఇప్పుడు అమాయకంగా అడిగితే ఎవరైనా నమ్ముతారా ?

మరో అధికార పార్టీ ఎంఎల్‌సి బుద్ధా వెంకన్న తాను ఇరవై సంవత్సరాలుగా తన తమ్ముడితో కలసి లేనని చెప్పారు. ఇది అంతగా అతుకుతుందా ? పోనీ లెండి తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పినట్లు కాల్‌ ముఠాలో లేడు అని చెప్పలేదు. తమ్ముడు తప్పుదారి పట్టినపుడు అన్నగా ఎందుకు మందలించలేదు, దాన్నుంచి ఎందుకు తప్పించలేదు అన్నదే సమాధానం రాని ప్రశ్న. కేశినేని నాని ఫిర్యాదు చేసేంత వరకు ఆపని మిగతావారు ఎందుకు చేయలేకపోయారు అన్నది అపూర్వ చింతామణి లేదా తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి ఒక్కలౌతుందన్న భేతాళుడి ప్రశ్న. తాను వైసిపి అరాచకాలను ఎదుర్కొంటున్న కారణంగానే జగన్‌ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పటం కొంచెం ఎక్కువగా వుంది. మిగతా ఎంఎల్‌ఏలు వైసిపిని ఎదుర్కోవటం లేదా ? వైసిపి కాల్‌ మనీ మాఫియాను మీరు ఎందుకు వుపేక్షించినట్లు ?

కాల్‌ మనీ వార్తలు చదువుతుంటే రామాయణంలో పిడకల వేటలా ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ ఎన్‌ పటేల్‌ బ్యాంకర్లకు ఇది మంచి బేరాలు వచ్చే సమయం అని తిరుపతిలో వెంకన్న సన్నిధిలో చెప్పారు. మరిచి పోయా అసలు వెంకన్న పెద్ద వడ్డీ కాసులవాడు కదా ! జనానికి అప్పులు ఎలా తీసుకోవాలి అన్న విద్య తక్కువగా వున్న కారణంగా వారు కాల్‌ నాగుల వలలోచిక్కుకుంటున్నారని, దీన్ని చూస్తుంటే తమ బ్యాంకులకు మంచి బేరాలు తగిలే అవకాశాలున్నాయని చెప్పారు. జనానికి రుణ విద్య తెలియక కాదు, బ్యాంకర్లు పెట్టే నస, తిరగలేక లేక మాత్రమే వడ్డీ వ్యాపారుల వలలో పడుతున్నారు. ఆస్ది తనఖా పెట్టినా సామాన్యులకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు కావూరి సాంబశివరావు వంటి వారికి వేల కోట్ల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తారు. సామాన్యులు గడువులోగా కట్టకపోతే సామాన్లు బయటపడవేసి చుట్టుపక్కల వారి ముందు అవమానాల పాలు చేసే బ్యాంకర్లు సాంబశివరావు వంటి వారిని బాబ్బాబు అని బతిమిలాడుకుంటారు. ఏమైనా మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో జనం ఎదుర్కొంటున్న ఒక ముఖ్య సమస్యపై అసెంబ్లీలో గొడవల రూపంలో అయినా చర్చ జరుగుతోంది. కనీసం ఒక్కరినైనా శిక్షించి పుణ్యం కట్టుకుంటే అదే పదివేలు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చట్టం తనపని తాను చేసుకుపోతుంది, అబ్బ చా !!

16 Wednesday Dec 2015

Posted by raomk in AP NEWS, Current Affairs, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, AP CM, call money, Law, YS jagan

 

ఎంకెఆర్‌

ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఇసుక మాఫియా వార్తలు, నిన్న విజయవాడలో కల్తీ మద్యంతో మరణాలు, అదే విజయవాడలో కాల్‌ మనీ మాఫియా చేతుల్లో ఎన్నో కుటుంబాలు, ఎందరో మహిళల బలి. ఎప్పుడూ ! ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుండగానే సుమా !! అలా తన పని తాను చేసుకుపోతున్నారనే కారణంతోనే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌పై సెలవు వేటుతో కాల్‌ మనీ కాటు పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఒక దారుణానికి అధికార పక్షం, మరో ఘోరానికి ఒక ప్రతిపక్ష మాజీ ఎంఎల్‌ఏ కారణం, అత్యంత నీచమైన మరో దుర్మార్గానికి పాలకపార్టీ ఎంఎల్‌ఏలు, నాయకులు వారితో చేతులు కలిపిన పెద్దలు కారణం ! చట్టం తన పని తాను చేసుకుపోతూనే వుంది.

ఏ పార్టీ వారైనా ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు ,చట్టం తనపని తాను చేసుకుపోతుందని అధికార పార్టీనేత వువాచ ! అధికార పార్టీలోని ఎంఎల్‌ఏలు, కార్యకర్తల పేర్లు బయట పెట్టాలని ప్రతిపక్ష నేత డిమాండ్‌ !! విజయవాడ కాల్‌మనీ గురించి ముందే నిఘా సంస్ధలు నివేదించవలసి వుండాల్సింది, వారిది వైఫల్యం. ముఖ్యమంత్రి ప్రకటన. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే జరిగాయి.

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారు పరిపాలిస్తుంటే వారు తమకు అవసరమైన మేరకు చట్టాలు చేసుకున్నారు తప్ప జనం కోసం కాదని మన తాత ముత్తాలందరూ వారికి వ్యతి రేకంగా పోరాడిన వారే. అశేష త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. మన చట్టాలు మనం చేసుకున్నాం అని చెప్పారు పెద్దలు. తీరా చూస్తే అనేక పాత బ్రిటీష్‌ వాడి చట్టాలకు మన రంగు కండువాలు కప్పి కొద్దిగా మేకప్‌ చేసుకున్నాం, కొత్త సీసాలో పాతసారా పోసుకున్నాం తప్ప ప్రజోపయోగ చట్టాలుగా వాటిని చెప్పలేం. ఎందుకంటే చట్టం ఎప్పుడూ అధికారంలో వున్న వారికి చుట్టంగా పని చేయటం తప్ప మనకు మరొక విధంగా తెలియదు.

బాబరీ మసీదును కూల్చటం వాస్తవం, మనమందరం చూశాము. దానిని కూల్చినవారు ఆ పేరు చెప్పి గాక రామాలయ నిర్మాణానికి కరసేవ పేరుతో మరొక ప్రార్ధనా స్దలాన్ని కూల్చివేశారు.(ఆ శక్తులే నేడు మత సహనానికి తామే ప్రతీకలం తమను సహనం లేని వారని అనవద్దు అని బెదిరించటం వేరే సంగతి) మసీదు కూల్చివేసిన వారిని ఇంతవరకు శిక్షించలేదు. అయినా చట్టం తనపని తాను చేసుకుపోతోంది.

గుజరాత్‌లో గోద్రా రైలు బోగీ దురంతం( ఎవరు చేశారన్నది వివాదాస్పదం) ఆ పేరుతో ఆ రాష్ట్రంలో మైనారిటీలపై మారణకాండ, వేలాది మంది హత్య, ఆస్తుల విధ్వంసం. ఆ కేసులు ఏమయ్యాయి? ఎంత మందిని శిక్షించారు? ఎంత కాలమైంది. చట్టం తనపని తాను చేసుకుపోతూనే వుంది.

మధ్యప్రదేశ్‌లో పరీక్షలు, వుద్యోగాల కుంభకోణం, వాటిని బయట పెట్టిన వారిని కొంత మందిని గుర్తు తెలియకుండా చంపేస్తే మరికొందరు నిత్య ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు. దానిని దర్యాప్తు చేస్తున్నవారు, దాని గురించి వార్తలు రాద్దామని వెళ్లిన విలేకరితో సహా దాదాపు 70 మంది అనుమానాస్పదంగా మరణించారు.చిత్రమేమిటంటే అక్కడా చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే ఇవన్నీ జరిగాయి.

సల్మాన్‌ ఖాన్‌ నిర్దోషి, జయలలిత నిర్దోషి, ఇలాంటి పెద్దలు ఎందరో, ఎన్నో కేసులు ఇంకా సాగుతూనే వున్నాయి. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోయిన ఫలితమే అని తెలుసుకోవాలి.

ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు ఎందుకు జరిగి వుండేవి. చట్టం తన పని తాను చేసుకుపోతే ఇంతకాలంగా ఇప్పుడు బయటికి వచ్చిన అక్రమాలు ఎందుకు వెల్లడి కాలేదు, చట్టం ఏం చేసిందో కాంగ్రెస్‌, వైసిపి తెలుగుదేశం నాయకులు చెబుతారా ?అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టం తనపని తాను ఎప్పుడైనా చేసుకుపోయిందా ? నిజంగా పని చేసి వుంటే ఇన్ని దారుణాల గురించి మనం ఎందుకు వినాల్సి వచ్చింది? అంటే చట్టాన్ని పని చేయనివ్వకుండా అయినా ఎవరో ఒకరు చేసి వుండాలి లేదా అది ముసలి ఎద్దయినా అయి వుండాలి. తమ వారే కాల్‌ మనీ రాకెట్‌లో వున్నారని తేలటంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుకు వైరాగ్యం వచ్చి తెల్లవారిన తరువాత పొద్దుగూకక మానదు, బతికిన మనిషి చావకతప్పదు అన్నట్లుగా చట్టం గురించి చెబితే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? కాల్‌ మనీ దురాగతాలకు ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకుంటామని అధికార పక్ష పెద్దలు చెప్పటం పెద్ద జోకు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిఘా వ్యవస్ధ విఫలం అయిందని వ్యాఖ్యానించారంటే నేను బాగానే పని చేస్తున్నా, యంత్రాంగమే కదలటం లేదని తన బాధ్యతను తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న నేరాలు,ఘోరాల గురించి జనానికి కంతటికీ తెలిసిన విషయాలు నిఘా యంత్రాంగానికి తెలియవని చెప్పటం గడసరి తనం. విజయవాడలోనే మకాం వేస్తున్నా, అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నా అని చెప్పే ముఖ్యమంత్రి తీరు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. అధికార పార్టీ తమ నేతల పేర్లు రాగానే ముందు వారిని పార్టీ నుంచి పక్కన పెట్టాలి. ఆ పని చేయకుండా ఏ పార్టీవారైనా వదలం అని కబుర్లు చెబితే చాలదు. గద్దెపై ఎవరున్నా పాలకులకు మన రాష్ట్రంలో అటువంటి విశ్వసనీయత లేదు, ఒక వేళ వుందని ఎవరైనా చెప్పుకున్నా అది అనేక అతిశయోక్తులలో అదొకటి మాత్రమే. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పిన అధికార పార్టీ కాల్‌మనీ కేసు వివరాలు పూర్తిగా బయటకు రాక ముందే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను సెలవుపై ఆకస్మికంగా పంపటం, ఆయన స్ధానంలో మరొకరిని ఇంఛార్జిగా నియమించటం జనానికి ఎలాంటి సందేశం పంపుతున్నది ? ఆయన ఎప్పుడో సెలవు అడిగారని ఇప్పుడు మంజూరు చేశామని చెబుతున్నారు. అందులో నిజం వుందో లేదో తెలియదు. కాల్‌మనీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాపితంగా దాడులు జరుగుతున్న సమయంలో దానిని ముందుగా బయట పెట్టి అరెస్టులు చేయించిన అధికారిని ఆకస్మికంగా సెలవుపై పంపితే ఎలాంటి సందేశం జనంలోకి వెళుతుందో తెలియనంతటి అమాయకుడు చంద్రబాబు నాయుడని ఎవరూ అనుకోరు, పోనీ ఆయన సలహాదారులకు కూడా బుర్రపని చేయలేదా ?

బాబు మాఫియాను నడిపిస్తున్నారని వైసిపి నేత జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ గురించి అది అధికారయుతంగా బయటకు రాకముందే ఎందుకు గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు ? తన కుటుంబానికి ఒక పెద్ద పత్రిక, టీవీ ఛానల్‌ వున్నాయే అవైనా ఎందుకు బయట పెట్టలేదు? ఏదైనా ఒక ఘోరం జరిగినపుడు ఎవరు దానికి బాధ్యులో వెంటనే వెల్లడి చేసే పద్దతి, లేదా సాంప్రదాయం వుంటే మీ తండ్రి హయాంలో జరిగిన అక్రమాల వెనుక ఎవరున్నది ఎందుకు వెల్లడించలేదు జగన్‌ గారూ అని అడిగితే ఏం చెబుతారు? ముందు మీపై మోపిన కేసులకు సంబంధించి మీరు నిజాలు చెప్పి మిగతా కేసుల నిందితుల గురించి అడిగితే మీకు విస్వసనీయత వుంటుంది.

ఇక కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా వుండి ఎన్నికలకు ముందు, తరువాత తెలుగుదేశంలో చేరిన నాయకులు కాల్‌మనీ, కల్తీ మద్యం వంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

విజయవాడ కాల్‌మనీ మాఫియా గురించి బయటకు రాగానే రాష్ట్రమంతటా వడ్డీ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయి. మంచిదే, కానీ విజయవాడలో పట్టుబడిన, లేదా దాని వెనుక వున్న అధికారపార్టీ నాయకులపై తీవ్రతను నీరు గార్చేందుకు, కేసులకు బలం లేకుండా చేసేందుకే ఈ దాడులని కొందరు చెబుతున్నారు. అసలే అప్పుపుట్టని ఈ రోజుల్లో ఇలా దాడులు చేస్తే ఎవరైనా అప్పిస్తారా ? అప్పులేకపోతే అవసరాలు వున్న వారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? అప్పుతీసుకున్న వారు ఇచ్చిన వారి షరతులకు(అనుచిత సంబంధాలకు అంగీకరించటంతో సహా) లొంగటం ఇవాళ కొత్తగా ప్రారంభమైందా, కాల్‌ మనీ డబ్బు ఎగ్గొట్టమని నాయకులు చెబుతున్నారు అప్పుడు వడ్దీకి ఇచ్చిన కుటుంబాలు ఏమి కావాలి అని వాదించే వారు కూడా బలంగా వుండటం మన సమాజ దౌర్బాగ్యం.

స్వయం సహాయక సంఘాలు బాగా పని చేస్తున్నాయి, వారి అవసరాలకు డబ్బు బాగా సమకూరుతోంది, ఆ ఘనత మాదే అని చెప్పుకున్న ఏ పార్టీ వారైనా కాల్‌మనీ కాలనాగులకు జనం చిక్కటం, మహిళలు మానాలు పోగొట్టుకోవటం ఎవరి పుణ్యం? కొంపదీసి ఇది కూడా చట్టం తన పని తాను చేసుకుపోయిన ఫలితమే అంటారా ? అదే అయితే అలాంటి చట్టాలు అవసరమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d