ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

పవన్‌ ‘‘కల్యాణానంద’’ స్వామికి ఓ ప్రశ్న : హతవిధీ ! ఇలాంటి ‘‘సనాతనుల’’ సరసనా మీరు చేరింది !! రేపిస్టులు, హంతకులకు సన్మానాలు !!!

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


తాను పక్కా సనాతనవాదినంటూ పవన్‌ కల్యాణ్‌ ఊగిపోతూ చెప్పారు, చెబుతూనే ఉంటారు. ఎందుకంటే సనాతనవాదం పులి స్వారీ వంటిది. ఒకసారి పులినెక్కిన వారు అది ఎక్కడికి తీసుకుపోతే అటు పోవాల్సిందే. ఊహలు, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, సినిమాలు, సాహిత్యంలో తప్ప చరిత్రలో పులిని అదుపుచేసిన వారు ఎవరూ లేరు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తానం ఎలా ఉంటుందో చూద్దాం. వారాహి ప్రకటన సందర్భంగా చేసిన సనాతన విన్యాసాల మీద సామాజిక మాధ్యమంలో అనేక మంది అంతకంటే ఎక్కువగా స్పందించి చీల్చి చెండాడుతూ సంధించిన ప్రశ్నలకు ఎక్కడా సమాధానం రాలేదు.బహుశా ఇలా జరుగుతుందని అనుకొని ఉండరు.భావజాల పోరులో ఎదుటి వారి మీదికి బంతిని ఎంత వేగంగా విసిరితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. తగ్గేదేలేదని చరిత్ర నిరూపించింది. సనాతన ధర్మమునందు విడాకులు లేవు అంటూ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలనుపవన్‌ కల్యాణ్‌ సుభాషితాలను కలిపిన ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. దాన్ని తనకు వర్తింప చేసుకొని ఎలా సమర్ధించుకుంటారో తెలియదు.

పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద విరుచుకుపడిన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే సనాతనులకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పుకొనే వారు చేసిన పనికి సభ్య సమాజం సిగ్గుపడిరది. అఫ్‌కోర్సు వారిలో కట్టర్‌ హిందూత్వవాదులు ఉండరనుకోండి. ప్రముఖ జర్నలిస్టు, పురోగామివాది, హిందూత్వ వ్యతిరేకి అయిన గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన కేసులో నిందితులైన పరశురామ్‌ వాగ్మోరే, మనోహర్‌ యెదవే అనే వారిని కర్ణాటక సనాతన లేదా హిందూత్వశక్తులు విజయపురాలో 2024 అక్టోబరు 11న సన్మానించాయి. గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబరు ఐదవ తేదీన కాల్చిచంపారు. బెంగలూరు సెషన్స్‌ కోర్టు అక్టోబరు తొమ్మిదవ తేదీన జారీ చేసిన ఆదేశాల మేరకు ఎనిమిది మంది నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో మొత్తం 18 మందిలో 16 మంది బెయిలు మీద బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరిలో శరద్‌ కలాస్కర్‌ అనే వాడు మహారాష్ట్ర హేతువాది నరేంద్ర దబోల్కర్‌ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా లోపలే ఉన్నాడు. వికాస్‌ పాటిల్‌ అనే వాడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు కన్నడ పత్రిక వార్తా భారతి కథనం ప్రకారం తమ స్వస్థలం విజయపుర వెళ్లినపుడు కాళికాదేవి గుడిలో పూజలు చేశారు, సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌), శ్రీరామ్‌ సేన కార్యకర్తలు వారికి సన్మానం చేశారు, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హిందూత్వ నేతలు వారిద్దరినీ ఆరేళ్లుగా అన్యాయంగా జైల్లో ఉంచారని, విజయదశమి సందర్భంగా వారిని విడుదల చేయటం సంతోషమని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఈ వార్తను చదివారో లేదో తెలియదు. ఒకవేళ చదివినా ఆ కేసులోని వారు ఇంకా నిందితులే తప్ప నేరం రుజువు కాలేదుగా అని లా పాయింట్‌ తీసి ‘‘సనాతనుల’’ను సమర్ధించవచ్చు. అందుకే మరికొన్ని ఉదంతాలను పేర్కొనాల్సి వస్తోంది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానూ అనే మహిళపై గోద్రా అనంతర మారణకాండ సందర్భంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన సంగతి తెలిసిందే. అత్యాచార కేసులో నేరగాండ్లలో పరివర్తన కలిగి మంచివారుగా మారారంటూ అక్కడి సనాతనవాదుల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఆ సందర్భంగా వారిని సనాతన ధర్మాన్ని లేదా హిందూత్వను కాపాడేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకొనే విశ్వహిందూపరిషత్‌ నేతలు వారికి సన్మానం చేసి, మిఠాయిలు పంచారు. సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం అత్యాచారం కేసులో యావజ్జీవిత శిక్షపడిన వారు జైల్లో ఉండాల్సిందే. అయితే సదరు సదాచార సనాతనుల కేసులో ఆ తీర్పు రాక ముందే శిక్ష విధించినందున తరువాత వచ్చిన తీర్పు వారికి వర్తించదని, పాత నిబంధనల ప్రకారం వారి సత్ప్రవర్తకు మెచ్చి మేకతోలు కప్పి ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే సుప్రీం కోర్టు ఆ చర్యను తప్పు పట్టి నేరగాండ్లను తిరిగి జైలుకు పంపింది. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని ఒకనాడు నినదించిన మన సభ్యసమాజం నేడు నేరగాండ్లకు పూలదండలు వేసి సత్కరిస్తే మౌనంగా ఉండిపోయిందంటే మన చర్మాలు ఎంతగా మొద్దుబారిందీ తెలుస్తున్నది. దేన్నయినా సమర్ధించే బాపతు తయారవుతున్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ ఏమంటారో ? అంతేనా !

సకల కళావల్లభుడిగా పేరుగాంచిన హంతకుడు, ఇద్దరు మహిళలపై అత్యాచార నేరగాడు డేరా సచా సౌదా ప్రవచకుడు గర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా) జీవిత ఖైదు అనుభవిస్తూ బెయిలు మీద వచ్చినపుడు హర్యానా బిజెపి నేతలు ఆశీస్సులు పొందారు. అతగాడి అనుచరుల ఓట్లు పొందేందుకు గాను తాజా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్‌ మీద బిజెపి ప్రభుత్వం విడుదల చేసిందనే విమర్శలు వచ్చాయి.2018లో జమ్మూలోని కథువాలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి మద్దతుగా అక్కడ హిందూ ఏక్తా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శన తెలిసిందే.మహిళను దేవతగా కొలిచే సమాజంలో దాని గురించి రోజూ ప్రవచనాలు చెప్పేశక్తులే ఈ ఉదంతాలకు పాల్పడ్డాయంటే దేశం ఎటుపోతోందని కాదు, కొంత మంది ఎటు తీసుకుపోతున్నారో జనం ఆలోచించాలి. రామ్‌ రహీమ్‌కు 2017లో శిక్ష పడిరది, అప్పటి నుంచి ఉత్తరాదిన ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పెరోలు ఇవ్వటం గమనించాల్సిన అంశం.

బిల్కిస్‌ బానూ ఉదంతంలో నేరగాండ్లను సమర్దించటంలో మతాన్ని కూడా జోడిరచిన దుర్మార్గం, దాన్నినిస్సిగ్గుగా సమర్ధించిన ఉన్మాదం కనిపిస్తుంది. వారంతా సనాతనులే.మతాలతో నిమిత్తం లేకుండా అత్యాచారం ఎవరి మీద జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే. తమ నేతల ప్రమేయం ఉన్న ఉదంతాల పేరెత్తటానికి సనాతన నరేంద్రమోడీ సిగ్గుపడి ఉంటారు. 2014లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఢల్లీి నిర్భయ కేసును పేరు పెట్టి ప్రస్తావించిన ఆ పెద్దమనిషి తమ ఏలుబడిలో జరిగిన కథువా, ఉన్నావో అత్యాచారాల తరువాత మాట్లాడుతూ సాధారణ పరిభాషలో ఖండిరచారే తప్ప వాటి ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఎందుకంటే కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాల్సి ఉండగా విమర్శలు పెరగటంతో తీరికగా తరువాత రాజీనామా చేయించారు. ఉన్నావో ఉదంతంలో బిజెపి ఏంఎల్‌ఏ దోషి, ఇప్పుడు జీవిత కాలఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏమీ తెలియని అమాయకుడు, అన్యాయంగా ఇరికించారంటూ అతగాడిని రక్షించేందుకు అనేక మంది ఎంఎల్‌ఏలు, బిజెపి పెద్దలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎడిఆర్‌ అనే స్వచ్చంద సంస్థ మహిళల మీద నేరారోపుణలు తమ మీద ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్న 48 మంది ఎంఎల్‌ఏలు, ముగ్గురు ఎంపీల వారిలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి రోజూ కబుర్లు చెప్పే బిజెపికి చెందిన వారు 14 మంది, తాము కూడా అదే బాటలో నడుస్తామని చెప్పే శివసేనకు చెందిన వారు 7గురు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు ఆరుగురు ఉన్నారు.

హర్యానాలోని ఆరు జిల్లాలు, పక్కనే ఉన్న పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో డేరా బాబా అనుచరులు ఉన్నారు. ప్రధానంగా దళిత సామాజిక తరగతికి చెందిన వారు. వారి ఓట్ల కోసం పడేపాట్లు ఇవి.వ్రతం చెడ్డా బిజెపికి ఫలం దక్కలేదని పరిశీలకులు చెబుతున్నారు.డేరా బాబా పలుకుబడి ఉందని భావిస్తున్న ఆరు జిల్లాల్లో 28 అసెంబ్లీ సీట్లుండగా బిజెపి గెలిచింది పది చోట్ల మాత్రమే, కాంగ్రెస్‌ 15 గెలుచుకుంది. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర బిజెపి ప్రభుత్వం డేరాబాబాకు పదకొండుసార్లు బెయిలు ఇచ్చి బయటకు వదిలింది. ఏడు సార్లు వేర్వేరు చోట్ల ఎన్నికలకు ముందు బెయిలు ఇచ్చారు. తాజాగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అదే జరిగింది. బిజెపికి ఓటు వేయాల్సిందిగా అనుచరులకు సందేశం పంపాడు. అతగాడి ఆశ్రమం ఉన్న సిర్సా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సీట్లలో బిజెపికి ఒక్కటి కూడా దక్కలేదు. మూడు కాంగ్రెస్‌కు రెండు ఐఎన్‌ఎల్‌డికి వచ్చాయి. బిజెపితో పోటీ పడి కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా డేరాబాబా ఆశీసుల కోసం ప్రదక్షిణలు చేశారు. సనాతనవాదుల మందలో కొత్తగా చేరిన పవన్‌ కల్యాణ్‌ తాను ఎన్నో చదివానని చెప్పిన తరువాత ఆ వాదాన్ని భుజానవేసుకున్నారు గనుక అమాయకుడని అనుకోలేం. సినిమా రంగం మనిషి, అక్కడ ఏ ఫార్ములా నాలుగు డబ్బులు తెస్తే పొలోమంటూ మిగతావారూ దాన్నే అనుసరిస్తారు.

సనాతనంహిందూత్వ ఫార్ములా ఓట్లు రాల్చేదిగా ఉందని బిజెపి దాన్ని ఎప్పటి నుంచో రంగంలోకి తెచ్చింది. సవ్యసాచి మాదిరి సినిమాలతో పాటు రాజకీయాలను కూడా చేయాలనుకుంటున్నారు గనుక పవన్‌ కల్యాణ్‌ సనాతన ఫార్ములాను ఎంచుకున్నారని భావించవచ్చు. దీని వెనుక ఉన్న కారణాల గురించి కూడా చర్చ జరుగుతున్నది. మర్రి చెట్టువంటి చంద్రబాబు నాయుడి నీడలో ఎంతకాలం ఉన్నా ఎదుగూ బొదుగూ ఉండదు కనుక తాను ప్రత్యేకంగా కనిపించాలంటే సనాతనాన్ని భుజాన వేసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆధారపడిన తాము ఆంధ్రప్రదేశ్‌లో హిందూత్వ అజెండా అమలు జరిపితే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చు గనుక శిఖండిలా పవన్‌ కల్యాణ్ణు రంగంలోకి దించిందని కూడా చెబుతున్నారు. హిందూమతంలో సంస్కరణలు తేవాలని ఆర్య(మహత్తర)సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతిని సనాతన వాదులు కుట్ర చేసి చంపారనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది తాము వేదాలను ప్రమాణంగా తీసుకుంటామని అదే సనాతన ధర్మమని అందమైన ముసుగువేసుకుంటారు. ఇది వేదకాలం కాదు, మనువాదులు అమలు జరుపుతున్న కుల,మత సమాజం.వేదాలను ప్రామాణికంగా తీసుకొనే వారేమీ కులమతాలకు అతీతంగా లేరు గనుక ఉన్న దుర్మార్గపూరిత వ్యవస్థను ఏదో ఒక పేరుతో సమర్ధించేవారిగానే పరిగణించాలి. పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ తెగకు చెందిన వారే. అయితే ఐదు పదులు దాటిన ఆ పెద్దమనిషి గ్రహించాల్సిందేమంటే హిందూత్వ నినాదం పనిచేయటం వెనుక పట్టు పట్టిన తరుణంలో దాన్ని ఎంచుకున్నారు. ఆయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలోనే బిజెపి మట్టి కరచింది.వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా పడిపోయింది.


మహనీయుడు అంబేద్కర్‌ దృష్టిలో సనాతన ధర్మం అంటే వేద,బ్రాహ్మణిజం అన్నది స్పష్టం.ఆయన కాలంలో కులమతాలు, అంతరాలు లేవని చెబుతున్న వేదకాలము లేదూ వేదాలకు అనుగుణంగా పాలనా లేదు.మనువాదం మాత్రమే ఉంది. అందుకే వేదాల జోలికి పోకుండా మనుధర్మ శాస్త్రాన్నే తగులపెట్టారు. మనువాదులు తాము చెప్పేదానినే సనాతన ధర్మమని భాష్యం చెబుతున్నారు, ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తున్నది వారే. అందువలన ఎవరైనా సనాతనాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మను ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్లే, దాన్ని పరిరక్షించాలని, విమర్శించేవారిని సహించబోమని పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెబుతున్నారంటే అంబేద్కర్‌ను కూడా వ్యతిరేకించుతున్నట్లే. ఉనికిలో లేని వేదకాల సనాతనంతో ఎవరికీ ఇబ్బంది లేదు,అమలులో ఉన్న మనుసనాతనం, అది సృష్టించిన వివక్షను నిర్మూలించాలా లేదా ?

తైవాన్‌ అంశంలో గీత దాటితే అంతే సంగతులు-సైనిక విన్యాసాలతో అమెరికాకు చైనా హెచ్చరిక !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

స్వాతంత్య్రం పేరుతో అమెరికా, ఇతర దేశాల అండచూసుకొని రెచ్చిపోతున్న తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పాలకులను హెచ్చరిస్తూ సోమవారం నాడు చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా తన తొలి విమానవాహక యుద్ద నౌక, పలు విమానాలు, మిలిటరీ నౌకలు,డ్రోన్లు, ఆయుధాలతో తన సత్తా ఏమిటో పశ్చిమ దేశాలకు వెల్లడిచేసింది.తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటు కోరుతున్న శక్తులకు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా ఇది గట్టి హెచ్చరిక. జాయింట్‌ స్వోర్డ్‌ 2024బి పేరుతో జరిపిన విన్యాసాల్లో అవసరమైతే తైవాన్‌ దిగ్బంధం, దాడులు ఏలా చేయగలమో చూపింది. గతంలో కూడా విన్యాసాలు జరిపినప్పటికీ దీనికి ప్రాధాన్యత ఉన్నట్లు భావిస్తున్నారు. చైనా పిఎల్‌ఏ తూర్పు కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ లీ షీ మాట్లాడుతూ ఒకేసారి త్రివిధ దళాల సమన్వయంతో భూ, గగనతల, సముద్ర దాడులు, రేవులు, ఇతర ప్రాంతాల దిగ్బంధనం ఎలా చేయగలమో పరీక్షించి చూపినట్లు, ఇది గట్టి హెచ్చరిక అని చెప్పాడు. తైవాన్‌ నాయకత్వం పదే పదే తమ రక్షణ గగనతలం అని చెప్పుకుంటుందని, దాన్ని ఎలా చీల్చి చెండాడగలమో చూపటమే లక్ష్యంగా పలు వైపుల నుంచి దాడులను సమన్వయం ఎలా చేసేదీ చైనా త్రివిధ దళాలు చూపాయి. అందుకే ఉమ్మడి ఖడ్గం అని పేరు పెట్టారు. మెడ మీద వేలాడే ఖడ్గం లేదా సుత్తి మాదిరి రూపాందించారు. చైనాతైవాన్‌ మధ్య ఉన్న జలసంధిలో రెండు ప్రాంతాలు, తూర్పున రెండు, ఉత్తర, దక్షిణాన ఒక్కొక్క జోన్‌గా ఈ విన్యాసాలు జరిగాయి. గతం కంటే వీటిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలో ఉన్న రేవుల ద్వారా తైవాన్‌ సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నది. ఆ రేవులను దిగ్బంధనం కావించి ఆర్థిక లావాదేవీలను మిలిటరీ ఎలా దెబ్బతీయగలదో ఈ సందర్భంగా ప్రదర్శించారు.


తైవాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ తాము కూడా తమ దళాలతో గమనించామని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తాము 153 విమానాల గమనాన్ని పరిశీలించామని, 90సార్లు తమ గగన తలంలోకి ప్రవేశించాయని,కొన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు చెప్పాడు. ఏడు నౌకలు, మరో నాలుగు ఇతర నౌకలు తైవాన్‌ దీవి చుట్టూ చక్కర్లు కొట్టాయని ఆరోపించాడు. ఈ ఏడాది మే నెలలో పిఎల్‌ఏ ఒకసారి విన్యాసాలు నిర్వహించింది.అక్టోబరు పదవ తేదీన తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ అధ్యక్షుడు లాయ్‌ మాట్లాడుతూ చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ తమకు ప్రాతినిధ్యవహించదని, దానికా హక్కు లేదంటూ తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని పేర్కొన్నాడు. విన్యాసాలు పౌరులకు వ్యతిరేకంగా కాదని, వేర్పాటువాద శక్తులను హెచ్చరించేందుకేనని, వారికి చీమ చొరబడేంత అవకాశం కూడా ఇచ్చేది లేదని, శాంతియుతంగా విలీనానికే ప్రాధాన్యత ఇస్తామని చైనా చెప్పింది. ఒకే చైనా విధానానికి అనుగుణంగా తైవాన్‌ దీవి చుట్టూ పహరాకు నౌకా దళాన్ని నిరంతర వినియోగిస్తూనే ఉంటామని కూడా స్పష్టం చేసింది.


తైవాన్‌ ప్రాంతంలో చైనా అంతర్భాగమే అంటూనే శాంతియుతంగా విలీనం చేసే సమయం ఆసన్నం కాలేదంటూ అమెరికా నాటకాలాడుతోంది. బలవంతం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని పదే పదే ప్రకటిస్తోంది. చైనా అంటే తైవాన్‌లో ఉన్న ప్రభుత్వమే అని ఐరాస 1971వరకు గుర్తించింది. అంతకు ముందు దశకంలో సోవియట్‌ యూనియన్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన వివాదాలను అవకాశంగా తీసుకొని చైనాను తమవైపు తిప్పుకోవచ్చు అనే రాజకీయ ఎత్తుగడతో అసలైన చైనాకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ప్రధాన ప్రాంతాన్నే గుర్తించేందుకు అమెరికా పావులు కదిపింది. దాంతో భద్రతా మండలిలో 1971లో శాశ్వత సభ్యదేశంగా కమ్యూనిస్టు చైనాను గుర్తించారు. అయితే ఆ సమయంలో జరిగిన చర్చలు, నిర్ణయాల్లో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలని పేర్కొన్నారు. దాన్ని సాకుగా చూపుతూ అలాంటి సమయం ఇంకా రాలేదని గత ఐదు దశాబ్దాలుగా అమెరికా భారీ ఎత్తున ఆయుధాలను అందచేస్తూ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూస్తున్నది.బలవంతంగా విలీనం చేసుకుంటామంటే తైవాన్‌లో ఉన్న చిప్స్‌ పరిశ్రమలను పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించింది. తప్పనిసరైతే తప్ప రెండు కోట్ల 30లక్షల జనాభా ఉన్న తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకోబోమని చైనా చెబుతున్నది. బ్రిటన్‌, పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత ప్రపంచ ఆర్థిక కేంద్రాలలో ఒకటైన హాంకాంగ్‌, ఆసియా లాస్‌వేగాస్‌గా పేరుమోసిన జూద కేంద్రం మకావు దీవులు చైనా ఆధీనంలోకి వచ్చాయి.వాటిని వెంటనే చైనా సమాజంలో కలిపితే వచ్చే సమస్యలను, అక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులను గమనంలో ఉంచుకొని యాభై సంవత్సరాల పాటు 2047వరకు అక్కడ ఉన్న వ్యవస్థలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాన్నే ఒకేదేశంరెండు వ్యవస్థలుగా పిలుస్తున్నారు. ప్రత్యేక పాలనా యంత్రాంగాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలను కూడా జరుపుతున్నారు. తైవాన్‌ పట్ల కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పినప్పటికీ అమెరికా ఇచ్చిన ఆయుధాలు, అవసరమైతే జోక్యం చేసుకుంటామన్న మాటలను నమ్మి అక్కడి పాలకులు పదే పదే ససేమిరా అంటున్నారు. చైనా తాజా మిలిటరీ విన్యాసాల పూర్వరంగమదే.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరు ఎలా మన అంతర్గత అంశమో తైవాన్‌ కూడా చైనా స్వంత విషయమే. దానిలో జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దం. మన పాలకులు ఎప్పుడైనా ఆక్రమిత కాశ్మీరును విముక్తం గావిస్తామని ప్రకటిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఏడున్నర దశాబ్దాలుగా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎందుకు అంటే కారణాలనేకం, తైవాన్‌ విషయంలో కూడా చైనా అదే మాదిరి బలప్రయోగానికి పూనుకోవటం లేదు. అది వారు తేల్చుకోవాల్సిందే. ఆక్రమిత కాశ్మీరు అంశంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటున్నట్లుగానే తైవాన్‌ విషయంలో అమెరికా అంతకంటే ఎక్కువగా వేలు పెడుతోంది.పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు మిలిటరీ, ఆయుధాలు లేవు, అదే తైవాన్‌కు యుద్ద విమానాలు, క్షిపణులు, నౌకాదళం పూర్తి స్థాయి మిలిటరీ ఉంది. ప్రతి ఏటా అమెరికా సమకూరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మిలిటరీ శక్తి ఉన్న 145 దేశాలలో తైవాన్‌ 24వదిగా ఉంది. సర్వీసులో మొత్తం 2.15లక్షల మంది సైనికులు, 50వేల మంది పారా మిలిటరీ, మిలిటరీలో 35వేల మంది వైమానిక దళ సిబ్బంది,40వేల మందితో నౌకాదళం ఉంది, 286 యుద్ధ విమానాలుండగా వాటిలో ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు 229 సిద్దంగా ఉంటాయి, ఇవిగాక కొన్ని హెలికాప్టర్లు ఉన్నాయి. నాలుగు జలాంతర్గాములతో సహా 93 రకాల మిలిటరీ నౌకలు ఉన్నాయి. ఇలాంటి శక్తితో తలపడితే ప్రాణనష్టం ఎక్కడ జరిగినా మరణించేది చైనా పౌరులే. అందుకే ప్రతి రోజూ రెచ్చగొడుతున్నా చైనా నాయకత్వం ఎంతో సంయమనంతో ఉంటోంది.


అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తాజా పరిణామాలపై మాట్లాడుతూ తైవాన్‌ జలసంధి, ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలకు ముప్పు రాకుండా చైనా సంయమనం పాటించాలని బోధ చేశాడు. తైవాన్‌ పాలకుడు లాయ్‌ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యలు అక్కడి ప్రజలకు నష్టదాయకమని చైనా పేర్కొన్నది. రాజకీయ స్వప్రయోజనాల కోసం తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటమే తైవాన్‌ జాతీయ దినోత్సవం పేరుతో చేసిన లాయ్‌ ఉపన్యాసమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ చెప్పారు. మే నెలలో లాయ్‌ బాధ్యతలు చేపట్టాడు, అతనొక ప్రమాదకర వేర్పాటు వాది అని అప్పుడు చైనా వర్ణించింది. అమెరికా కూడా తక్కువ తినలేదు. అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా 2022లో తైవాన్‌ పర్యటన జరిపి తమ మద్దతు వారికే అన్న సందేశమిచ్చారు. చైనా నాయకత్వ తీరు తెన్నులను చూసినపుడు అనివార్య పరిస్థితుల్లోనే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది తప్ప అనవసరంగా వ్యవహరించదు. రానున్న ఐదు సంవత్సరాల్లో చైనా ఎలాంటి దాడులు చేయదని తాము నమ్ముతున్నట్లు సెప్టెంబరు నెలలో చేసిన ఒక సర్వేలో 61శాతం మంది తైవాన్‌ చైనీయులు చెప్పినట్లు వెల్లడైంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల తమ ఆర్థిక సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయుధ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం తద్వారా ఆయుధ అమ్మకాలను పెంచుకోవటం చూస్తున్నదే. అందుకే ఏదో ఒక మూల అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు.దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తైవాన్‌, దీవులు, అంతర్జాతీయ సముద్రమార్గంలో స్వేచ్చగా రవాణా తదితరాల పేరుతో చిచ్చుపెట్టేందుకు పూనుకున్నారు.తాను అండగా ఉంటానంటూ దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలను నమ్మించేందుకు,చైనాను బెదిరించేందుకు అమెరికా కూడా పదిరోజుల పాటు సాగేమిలిటరీ విన్యాసాలను ప్రారంభించింది. చైనా విన్యాసాలు బాధ్యతారహితం, ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేవిగా, భారీ ఎత్తున జరిగినట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ఆరోపించింది.తైవాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో కలసి పదిరోజుల పాటు అమెరికా నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.


తైవాన్‌ భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించాలంటూ అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి ఎల్‌బ్రిడ్జ్‌ కోల్బీ రాసిన విశ్లేషణను మే 11వ తేదీన తైపే టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. చైనా దురాక్రమణను అడ్డుకోవాలంటే మరింత ఎక్కువగా రక్షణ ఖర్చు పెంచాలని తైవాన్‌కు సూచించాడు.తమకు తైవాన్‌ అవసరం ఎంతో ఉన్నప్పటికీ దాని కోసం త్యాగాలు చేయాలని తమ నేతలు అమెరికన్లను అడిగే స్థితి లేదన్నాడు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలోని టోకియో, సియోల్‌ వంటి జనసమ్మర్ధం గల ప్రాంతాలకు సమీపంలోని అమెరికా సైనిక స్థావరాల మీద అణ్వాయుధాలను ప్రయోగించి ధ్వంసం చేస్తామని చైనా బెదరించిందని ఆరోపించాడు. అటువంటి పరిస్థితిలో తాము నేరుగా చైనా యుద్ధ విమానాలను ఎదుర్కోనేందుకు సిద్దం కాదని, రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఇస్తున్న మాదిరిగానే పరోక్షంగా సాయం అందచేస్తామని తైవాన్‌ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
. ఐక్యరాజ్యసమితి 1949లో రూపొందించిన దేశాల హక్కులు, విధులకు సంబంధించిన ముసాయిదాలో ప్రతి దేశం అంతర్గత, విదేశీ వ్యవహరాలను ఎలా నిర్వహించాలో స్పష్టంగా పేర్కొన్నది. బయటి నుంచి ఎలాంటి జోక్యం, వత్తిడి లేదా మార్గదర్శనానికి తావు లేకుండా సాయుధ దళాల నియామకంతో సహా అనేక అంశాలు దానిలో పొందుపరిచారు. ఐరాస తీర్మానం ప్రకారం తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే, అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉన్నప్పటికీ దాని మీద పూర్తి అధికారం చైనాదే. అందువలన అంతర్గతంగా వేర్పాటు వాదాన్ని అదుపు చేయటంతో పాటు తైవాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా అంతర్జాతీయ నిబంధనలు అనుమతించిన మేరకు ఆధిపత్యం చైనాకే ఉంది.

కావమ్మ మొగుడి కథ పునరావృతం అవుతోందా ? నరేంద్రమోడీ అద్భుత శక్తులెక్కడ ! ప్రశ్నిస్తున్న ప్రపంచ మీడియా !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీగారి మాటలను చూస్తే దేశం వెలిగిపోతోంది. భజన బృందాన్ని చూస్తే మోడీ విశ్వగురువు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లెక్కలను చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నది. ఎవరి మాటలను నమ్మాలి ? తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను బట్టి జనమే తేల్చుకోవాలి. దేశంలో మాకు తిరుగులేదు అని బిజెపి చెబుతుంది. దాన్ని గుడ్డిగా నమ్మేవారున్నారు, చేసేదేముంది ! ఆ గోమాతే కనువిప్పు కలిగించాలి. వారికి వివరాలు తెలియకనా ? 2014లో బిజెపికి స్వంతంగా వచ్చిన ఓట్లు 31శాతం, ఎన్‌డిఏ కూటమి మొత్తానికి 38.5శాతం, 2019లో బిజెపికి 37.36శాతం, కూటమికి 45.3శాతం, 2024లో బిజెపికి 36.56శాతం కాగా కూటమికి 42.5శాతం వచ్చాయి. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం, జనసేన ఓట్లు కొత్తగా కలిసినా బిజెపికి, మొత్తంగా కూటమి ఓట్లశాతం తగ్గింది. దీన్ని చూస్తేమోడీ ప్రభావం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? ఇవి సాధారణ అంకెలు, ఆల్జిబ్రాకాదు గనుక అర్ధంగాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే వేద గణికులను సంప్రదించవచ్చు.


ఇక్కడ ఒక పొట్టి పిట్టకత చెప్పాలి. ఊరంతా ఎప్పుడో వెళ్లిపోయిన కావమ్మ మొగుడులా ఉన్నావంటే కామోసు కామోసనుకొని కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్ర ఇస్తే నాదారిన నేపోతా అన్నాడట సన్యాసివేషంలో వచ్చిన ఒక పెద్దమనిషి. ప్రధాని నరేంద్రమోడీ దగ్గర అద్భుత శక్తులు ఉన్నట్లు ఇంతకాలం నమ్మిన ఊరూవాడా ఇప్పుడు అనుమానంగా చూస్తోంది.‘‘ నరేంద్రమోడీ తన అద్భుత శక్తి కోల్పోయారా ?’’ అంటూ ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ పత్రిక ‘‘ఎకానమిస్టు ’’ 2024అక్టోబరు పదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణను ప్రచురించింది. ప్రపంచ ఆర్థిక అంశాలను ప్రచురించే ఆ పత్రికే అనుమానాన్ని వ్యక్తం చేసిన తరువాత అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని వేరే చెప్పనవసరం లేదు. తరువాత కథ ఎలా ఉంటుంందో తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఏండ్ల తరబడి జరిగిన ప్రచారాన్ని చూసిన నరేంద్రమోడీ నిజంగా తాను దేవదూతననే నమ్మారు. నమ్మటం ఏమిటి ! చరిత్రలో అనేక మంది మాదిరి స్వయంగా ప్రకటించుకున్నారు. 2024 మే పదవ తేదీన వారణాసి పర్యటన సందర్భంగా న్యూస్‌ 18 అనే టీవీ ఛానల్‌తో మోడీ మాట్లాడారు. దాన్లో ఏం చెప్పారు ‘‘ నా మాతృమూర్తి బతికి ఉన్నపుడు నేను దేహసంబంధంగానే(సాధారణ మానవుల్లా) పుట్టానని అనుకొనేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటినీ అవలోకించుకుంటే దేవుడు తనను పంపాడని నిర్ధారణకు వచ్చాను. కేవలం నా భౌతికదేహం నుంచైతే ఈ శక్తి వెలువడదు, దేవుడు నాకు ప్రసాదించాడు.నేను ఎప్పుడే పనిచేసినా దేవుడే నన్ను అలా నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను.’’ అని చెప్పారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత అనేక మందిలో మోడీ అద్భుత శక్తుల గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ క్షణం తీరిక లేకుండా విదేశాలన్నీ తిరిగారు.ఎక్కువ సమయం విమానాల్లోనే గడిపారు. ఎందుకంటే యుపిఏ హయాంలో ప్రపంచంలో కోల్పోయిన భారత ప్రతిష్టను తిరిగి తీసుకురావటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అని చెప్పారు. జనం నిజమే కామోసనుకున్నారు. కానీ వాస్తవాలను చూస్తే వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో వచ్చిన విదేశీ పెట్టుబడులు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గిపోయాయి. పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏమైంది, విదేశాల్లో పెరిగిన ప్రతిష్ట ఎందుకు తగ్గినట్లు, విశ్వగురువుగా భుజకీర్తులు తప్ప పెట్టుబడులు ఎందుకు రావటం లేదు. వెనుదిరిగి చూస్తే జరిగిన ప్రచారం అంతా మాయ, కనికట్ట్లు అనిపిస్తోంది. విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుతున్నాయంటే మన దేశానికే కాదు, ప్రపంచమంతా తగ్గటం లేదా అని దబాయించారు. ఇది నిజమా ? ఒక దగ్గర తగ్గితే మరో దగ్గర పెరుగుతున్నాయి. డబ్బునెవరూ మురగపెట్టుకోవటం లేదు. ఐరాస విడుదల చేసిన 2024 ప్రపంచ పెట్టుబడుల నివేదిక ఏం చెబుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 2022లో ఎనిమిదవ స్థానంలో ఉన్న మనదేశం 2023లో ఒక్కసారిగా 15వ స్థానానికి దిగజారింది. స్వల్పంగా తగ్గినప్పటికీ అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను కొనసాగించాయి. అమెరికాకు వచ్చిన పెట్టుడులు 332 నుంచి 311 బిలియన్‌ డాలర్లకు(6.32శాతం) తగ్గగా చైనాకు వచ్చినవి 189 నుంచి 163కు(13.75శాతం) తగ్గాయి, కానీ మనదేశానికి 49 నుంచి 28 బిలియన్‌ డాలర్లకు(42.85శాతం) తగ్గాయి. ఎఫ్‌డిఐల రాకపోకలు వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడ లాభం ఎక్కువగా ఉంటే అక్కడకు పోతాయి.ద్రవ్య పెట్టుబడికి ఒక ప్రాంతమంటూ ఉండదు. లాభం ఉందా లేదా అని చూసుకొని ఉదయం ఆస్ట్రేలియాలో ఉంటే మధ్యాహ్నం భారత్‌, సాయంత్రానికి అమెరికా వెళ్లిపోతుంది. పరిశ్రమలకు అలా కుదరదు.


గాల్వన్‌లోయ సరిహద్దు ఉదంతం తరువాత చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులన్నీ భారత్‌కు మూకుమ్మడిగా తరలి వస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియాలో కతలు కతలుగా కబుర్లు చెప్పారు. ఆమేరకు మన ఎఫ్‌డిఐలు పెరిగిన దాఖలాలు లేవు.‘‘ చైనా, భారత్‌ల నుంచి బయటకు వెళుతున్న పెట్టుబడులతో ఇతర దేశాలు లబ్దిపొందుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్గ్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ 2024,ఏప్రిల్‌ 23) రాశారు. అంతే కాదు, చైనా వద్ద ఆపార సాంకేతిక సత్తా, అరుదైన మెటీరియల్‌, పారిశ్రామిక పునాది ఉన్నదని, దానికి ఎఫ్‌డిఐలు నిలిచిపోవచ్చు కూడా, అక్కడి నుంచే భారీ మొత్తాలలో పెట్టుబడులు బయటకు వెళుతున్నాయి,దానికి ఎఫ్‌డిఐ అవసరం లేకపోవచ్చు, భవిష్యత్‌ ఉన్న పరిశ్రమలను స్వంతంగా నిర్మించుకోగలదని కూడా రాశారు. మనదేశంలో నైపుణ్యం తప్ప సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, ఉత్పాదక వ్యవస్థలు లేవని, మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళితే ఎక్కువ నష్టం మనకే ’’ అని కూడా గార్గ్‌ పేర్కొన్నారు. ఆయనేమీ మోడీ వ్యతిరేకి కాదు.


చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశలో ఉందని సోషల్‌ మీడియాలో సంచలనాత్మక శీర్షికలతో కతలు చెప్పేవారు మనకు కొల్లలుగా ఉన్నారు. అఫ్‌కోర్సు గుడ్డిగా వాటిని నమ్మేవారు ఉండబట్టే పదే పదే అలా చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం సమాచారం వెల్లడిరచకతప్పటం లేదు. సమాచారం కొత్తగా ఉన్నప్పటికీ మోడీ అభిమానులను ఇబ్బంది పెట్టే పాత సమస్యలనే అది జనం ముందుంచుతున్నది. వాటికి ఇంకే మాత్రం నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లే కారణం అనటానికి అవకాశం లేదు. జనం గడ్డిపెడతారు. ఇది చైనా కాదు భారత యుగం అని భజన చేసేందుకు కుదరదు. రానున్న రోజుల్లో ఇబ్బందులకు ఆరంభ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా చెప్పక తప్పలేదు. ఈ కారణంగానే వడ్డీరేట్ల తగ్గింపు మీద ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.అయితే ఎన్ని ఇబ్బందులున్నా వర్తమాన సంవత్సర వృద్ధి రేటు 7.2శాతం ఉంటుందని చెబుతోంది. కరోనా తరువాత గొప్పగా ముందుకు పోతోందన్న వృద్ధి రేటు వడిదుడుకులకు లోనవుతున్నది. జనవరిమార్చి నెలల్లో వృద్ధి రేటు 7.8శాతం ఉండగా ఏప్రిల్‌జూన్‌లో 6.7కు పడిపోయింది. బొగ్గు,ముడిచమురు, విద్యుత్‌ వంటి ఎనిమిది కీలక రంగాల తీరును చూస్తే మూడు సంవత్సరాల్లో మొదటి సారిగా ఆగస్టులో దిగజారింది. పారిశ్రామిక, సేవారంగాలలో ఎదుగుదల లేని కారణంగా ఉపాధి కోసం జనాలు తిరిగి వ్యవసాయం వైపు మరలు తున్నారు. మోడీ గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది అన్నది ఎండమావి అన్నది ఈ పరిణామం తెలుపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 201819లో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు శ్రామికశక్తిలో 43శాతం ఉండగా అది 202324నాటికి 46శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 12 నుంచి 11శాతానికి తగ్గింది. సెప్టెంబరు నెలలో నిరుద్యోగుల శాతం 7.8గా సిఎంఐఇ పేర్కొన్నది. ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన గురించి మోడీ చెప్పిన కబుర్లన్నీ వంచన తప్ప మరొకటి కాదు.ఉన్న ఉపాధి కోల్పోయి 6.8కోట్ల మంది వ్యవసాయ రంగానికి మరలినట్లే. పరిశ్రమలు, సేవారంగాల్లో యాంత్రీకరణతో పాటు వ్యవసాయంలో కూడా రోజు రోజుకూ యంత్రాల వినియోగం పెరుగుతున్నది. ఉదాహరణకు గతంలో పురుగు మందులను మనుషులే చల్లేవారు, ఇప్పుడు డ్రోన్లు ఆపని చేస్తున్నాయి. వాటిని ఇతర అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. డ్రోన్‌ దీదీ తదితర పథకాల పేరుతో డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీ ఇస్తున్నది, అవింకా పెరిగితే ఉపాధి ఇంకా తగ్గుతుంది. డ్రోన్‌ పరిశ్రమలు పెరిగితే ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు తప్ప అంతకంటే ఎన్నో రెట్లు వ్యవసాయ కూలీలకు తగ్గే పని రోజులు, ఆదాయం గురించి మాత్రం మాట్లాడరు. మరోవైపు పారిశ్రామిక రంగంలో ఇస్తున్న సబ్సీడీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు భారీ మొత్తాలలో ఉండే పరిశ్రమలకు తప్ప ఉపాధి ఎక్కువగా దొరికే వాటికి వెళ్లటం లేదని అభివృద్ధి అధ్యయనాల మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్థికవేత్త అభిషేక్‌ ఆనంద్‌ చెప్పారు.


ముడిచమురు ధరలు పీపాకు పది డాలర్లు పెరిగితే జిడిపిలో 0.4శాతం తగ్గిపోతుంది. అదే తగ్గితే అంతే మేరకు పెరుగుతుంది. చమురు ధరలు పెరిగితే సబ్సిడీల మొత్తం కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి రాయితీ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో జిడిపి పెరిగినట్లు కనిపిస్తున్నది. అది తాత్కాలికమే అని వేరే చెప్పనవసరం లేదు. మూలధన పెట్టుబడి ఏ ఆర్ధిక వ్యవస్థకైనా ఎంతో ముఖ్యం. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 30శాతం మూలధన పెట్టుబడి ఖర్చు తగ్గిందని, అదే ఏప్రిల్‌ఆగస్టు నెలలకు 19.5శాతం తగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1.8శాతం తగ్గింది, ఇది గత 42నెలల్లో అధ్వాన్నపని తీరు. జిఎస్‌టి వసూళ్లు పెరుగుతున్నాయి, అవి కూడా సెప్టెంబరులో 6.5శాతమే, 2021 తరువాత ఇంత తక్కువ పెరుగుదల లేదట.ఉత్పత్తి, సేవారంగాల పిఎంఐ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది అదే నెలలో 9.3శాతం మేరకు వాహనాల అమ్మకాలు తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ వెల్లడిరచింది.వీటిని వినిమయానికి ఒక సూచికగా పరిగణిస్తారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నాలుగు నెలలుగా పడిపోతూనే ఉన్నాయి, 43నెలల్లో అధ్వాన్నంగా తేలింది. కార్ల నిల్వలు పెరిగిపోవటంతో వాటిని వదిలించుకొనేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించటం రోజూ పత్రికల్లో కనిపిస్తున్నదే.పండుగల తరుణంలో పరిస్థితి మెరుగుపడుతుందనే ప్రకటనలు ప్రతి ఏటా తెలిసిందే.

ప్రపంచ మీడియా నరేంద్రమోడీ అద్భుత శక్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తోంది ? ఎన్నికల్లో మోడీ ఆకర్ష ఆకర్ష మంత్ర ప్రభావం, గొప్పగా ప్రచారం చేసుకున్న ఎఫ్‌డిఐ, దేశ ఆర్థిక రంగం ఎలా ఉందోపైన చెప్పుకున్న విషయాలన్నీ మన గోడీ మీడియా చర్చలు పెట్టకపోతే, విశ్లేషణలు రాయనంత మాత్రాన, నా కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తా అన్న ముసలమ్మ మాదిరి ఉంటే సూర్యోదయంఅస్తమయం ఆగుతుందా ? హర్యానా ఎన్నికల్లో బిజెపికాంగ్రెస్‌ మధ్య ఓట్లతేడా ఒకశాతం లోపే. ఒక స్థానంలో పోటీ చేసిన సిపిఎం, 89 చోట్ల బరిలో దిగిన కాంగ్రెస్‌కు కలిపి వచ్చిన ఓట్లు 39.34శాతం కాగా, బిజెపికి 39.94 ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్‌ కలుపుకొని వెళ్లి ఉంటే దానికి వచ్చిన 1.79శాతం ఓట్లు తోడైతే అక్కడా బిజెపి బొక్కబోర్లా పడి ఉండేదే. ఈ చిన్న మతలబు ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా ?హర్యానా, జమ్మూకాశ్మీరు ఎన్నికల అనుభవాలను చూసిన తరువాత రాబోయే మహారాష్ట్ర,ఢల్లీి, రaార్కండ్‌, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి.

వారెక్కడ-మనమెక్కడ : 77 ఏండ్ల భారత్‌ – 75 సంవత్సరాల చైనా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అంటే అన్నారని తెగ గుంజుకుంటారు గానీ మన దేశంలో తెలివి తేటలు ఎక్కువగా ఉన్న కొందరు పడక కుర్చీల్లో కూర్చొని అభివృద్ధిప్రజాస్వామ్యం, నియంతృత్వాలకు ముడిపెట్టి భలే సొల్లు కబుర్లు చెబుతారు. అదే నిజమైతే నిజాం సంస్థానం, బ్రిటీష్‌ పాలనలోని ఇండియా అభివృద్ధిలో ఎక్కడో ఉండి ఉండాలి. అంతెందుకు మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటివి మన కళ్ల ముందే అమెరికాను మించిపోయి ఉండాలి. ఎందుకు ఇదంతా అంటే..... చైనా 2024 అక్టోబరు ఒకటి నుంచి ఏడు వరకు 75 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన ఉత్సవాలు జరుపుకున్నది. మనదేశం రెండు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాన్ని రెండు సంవత్సరాల ముందే జరుపుకుంది. రెండు దేశాల మధ్య ఇష్టం ఉన్నా లేకున్నా పోలిక తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ పూర్వరంగంలో చైనా మాదిరి మనదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదంటే మనది ప్రజాస్వామ్యంవారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని తడుముకోకుండా ఠకీమని చెబుతారు.
బిజినెస్‌ టుడే పత్రిక కమ్యూనిస్టులది కాదు, 2024 ఆగస్టు 25న గత రెండు దశాబ్దాల్లో భారత్‌చైనా ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేసిందీ వివరిస్తూ ఒక విశ్లేషణ చేసింది.దానిలో ఉన్న కొన్ని వివరాల సారం ఇలా ఉంది. 1980లో చైనా తలసరి జిడిపి 307 డాలర్లు కాగా దాదాపు దానికి రెండు రెట్లు ఎక్కువగా 582 డాలర్లు భారత్‌లో ఉంది. 2024లో అది తారుమారై(పిపిపి పద్దతిలో) 25,01510,123 డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ సమాచారం మేరకు ప్రస్తుత ధరల ప్రకారం 2024లో చైనా జిడిపి విలువ 18.53లక్షల కోట్ల డాలర్లు. 1980లో 303 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది ఈ కాలంలో 61 రెట్లు పెరిగింది. భారత్‌ 186 బిలియన్‌ డాలర్ల నుంచి 21రెట్లు మాత్రమే పెరిగి 3.93లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మోడీ ఏలుబడి పదేండ్లలో 2.04లక్షల కోట్ల నుంచి 3.93లక్షల కోట్ల డాలర్లకు పెరగ్గా చైనాలో 10.5 నుంచి 18.53లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.ప్రస్తుతం చైనా రుణభారం జిడిపిలో 88.6శాతం కాగా భారత్‌కు 82.5శాతం.1995లో చైనా రుణం 21.6శాతం కాగా భారత్‌కు 71శాతం ఉంది.యుపిఏ పాలనా కాలంలో రుణం 84.9 నుంచి 67.1శాతానికి తగ్గితే మోడీ ఏలుబడిలో అది 82.5శాతానికి పెరిగింది. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 2023లో మూడున్నరలక్షల కోట్ల డాలర్లు లేదా 14శాతం ఉంది. అదే భారత్‌ వాటా కేవలం 0.78లక్షల కోట్ల డాలర్లు మాత్రమే అని మెకెన్సీ నివేదిక పేర్కొన్నది.


‘‘ ప్రపంచాధిపత్యం గురించి మరచిపోండి, భారత్‌ సమీప భవిష్యత్‌లో చైనాను అందుకోలేదు ’’ అనే శీర్షికతో 2023 ఆగస్టు 18వ తేదీన హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక ఒక విశ్లేషణ ప్రకటించింది.దాన్లో ఉటంకించిన, వెల్లడిరచిన అభిప్రాయాల సారం ఇలా ఉంది. భారత్‌ గురించి సానుకూలంగా చెబుతున్న అంచనా ప్రకారం చైనా (57లక్షల కోట్ల డాలర్లు) తరువాత అమెరికా(51.5లక్షల కోట్ల డాలర్లు )ను వెనక్కు నెట్టి భారత్‌ (52.5లక్షల కోట్ల డాలర్లు) రెండవ స్థానం సంపాదించటానికి 50 సంవత్సరాలు పడుతుంది.భారత్‌ ప్రపంచాధిపత్యం గురించి నరేంద్రమోడీ 75వ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో చెప్పారు. కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన చెప్పిన పథకాలు కాగితాల మీదే ఉన్నాయి. భారత జిడిపి వాస్తవ వృద్ధి రేటు 2040వరకు ఏటా 8శాతం, తరువాత 5శాతం వంతున వృద్ధి చెందితే ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు రెండుశాతమే ఉంటే అమెరికాను అధిగమించటానికి 2073వరకు భారత్‌ ఆగాలని కొలంబియా విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త అరవింద్‌ పనగారియా చెప్పారు. ఇవన్నీ రానున్న 50 ఏండ్లలో ఇలా లేదా అలా జరిగితే అన్న షరతుల మీద చెప్పినవే.2000 సంవత్సరంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత వాటా ఒకశాతం కాగా చైనా 7శాతంతో ఉంది. అదే 2022 నాటికి 331శాతాలతో ఉన్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో రెండు15శాతాలతో ఉన్నాయి.


‘‘ భారత్‌ నూతన చైనా కాదు(ఇంకా) ’’ అనే శీర్షికతో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2024 మే ఎనిమిదవ తేదీన ఒక విశ్లేషణ రాసింది.దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భారత ఆర్థిక వ్యవస్థపైకి లేస్తుందా అన్న ప్రశ్నతో ప్రారంభించి అనేక మంది ఆమెరికా కార్పొరేట్స్‌ ఆ విధంగా ఆలోచిస్తున్నారని అయితే ఇది అరగ్లాసు నిండిన కథ మాత్రమే అని వ్యాఖ్యానించింది.ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలు, కొందరు ఆర్థికవేత్తలు పేర్కొన్న పురోగతి అంకెలు, అంచనాలను పేర్కొంటూ ఇదంతా నిండిన అరగ్లాసు గురించిన పొగడ్తలుగా పేర్కొంటూ ఇతర దేశాలతో పోల్చితే పనితీరు చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది.భారత తలసరి జిడిపి అమెరికాతో పోలిస్తే 30వంతు, చైనాతో 12వ వంతు, ఇప్పుడున్న వృద్ధిరేటు ప్రకారం అమెరికా తలసరి జిడిపిలో నాలుగోవంతుకు చేరాలంటే భారత్‌కు 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇందర్‌మిత్‌ గిల్‌ అంచనా వేశారు. ఇది జరుగుతుందనే గ్యారంటీ కూడా లేదు.ఇండోనేషియా తలసరి జిడిపి 5,270 డాలర్లను చేరుకోవటానికే భారత్‌కు దశాబ్దాలు పడుతుంది.


ఫారిన్‌ పాలసీ అనే పత్రికలో అమెరికా హార్వర్డ్‌ కెనడీ స్కూలు ప్రొఫెసర్‌ గ్రాహం అలిసన్‌ 2023 జూన్‌ 24వ తేదీన ‘‘ భారత్‌ తదుపరి అగ్రరాజ్యంగా మారేందుకు చైనాను అధిగమిస్తుందా ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ చేశాడు. అలాంటి అవకాశం లేదని నాలుగు ఇబ్బందికరమైన అంశాలు చెబుతున్నాయని పేర్కొన్నాడు. ఏప్రిల్‌ నెలలో (2023) ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్‌ వెనక్కు నెట్టేసినపుడు పరిశీలకులు ఆశ్చర్యపోయారు. ప్రపంచ అగ్రరాజ్యంగా కూడా మారుతుందా అన్నారు.జనాభాతో పాటు గత రెండు సంవత్సరాలుగా చైనా వృద్ధి రేటు 5.5శాతం ఉంటే భారత్‌లో 6.1శాతం ఉంది, ఈ అంకెలు ఎంతో ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. భారత్‌ వేగంగా అభివృద్ది చెందుతుందని చెబుతున్నదానిని బుర్రలకు ఎక్కించుకొనే ముందు ఇబ్బందికరమైన నాలుగు వాస్తవాలు ఉన్నాయని తెలుసుకోవాలి.


మొదటిది,1990 దశకంలో భారత్‌లో పెరుగుతున్న యువజనాభాతో ఆర్థిక సరళీకరణ విధానం ఒక ‘‘ ఆర్థిక అద్బుతాన్ని’’ సృష్టిస్తుందని విశ్లేషకులు పెద్దగా చెప్పారు. అమెరికాలో భారత్‌ను ఎంతో ఆలోచనాత్మకంగా విశ్లేషించే జర్నలిస్టుల్లో ఒకరైన ఫరీద్‌ జకారియా ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో 2006లో తాను కూడా అలాంటి భావానికి లోనైనట్లు ప్రస్తావించాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న స్వేచ్చామార్కెట్‌ ప్రజాస్వామ్యంగా భారత్‌ను అప్పుడు దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక వర్ణించింది, త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ చైనాను దాటిపోతుందని నాటి భారత వాణిజ్య మంత్రి చెప్పారు.భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ అద్భుతం జరగలేదని జకారియా చెప్పాడు. రెండవది, గత రెండు సంవత్సరాలలో అసాధారణ వృద్ధితో భారత్‌ ప్రపంచ ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో క్లబ్‌లో చేరినప్పటికీ చైనాతో పోల్చితే చాలా చిన్నది. మూడవది, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత శాస్త్ర విద్యార్థులు భారత్‌ కంటే చైనాలో రెండు రెట్లు ఎక్కువ ఉన్నారు.పరిశోధనఅభివృద్ధికి జిడిపిలో భారత్‌ 0.7శాతం ఖర్చు చేస్తుండగా చైనాలో రెండుశాతం ఉంది. ప్రపంచంలోని ఇరవై పెద్ద టెక్‌ కంపెనీలలో నాలుగు చైనాలో ఉన్నాయి.భారత్‌లో ఒక్కటి కూడా లేదు. ఐదవ తరం మౌలిక సదుపాయాల్లో సగం ఒక్క చైనాయే ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఒక్కశాతమే ఉంది.కృత్రిమ మేథ ప్రపంచ పేటెంట్లలో చైనా 65శాతం కలిగి ఉండగా భారత్‌ వాటా మూడుశాతమే. నాలుగవది, ఒక దేశ సత్తాను విశ్లేషించేటపుడు జనాభా ఎందరని కాదు, కార్మికశక్తి నాణ్యత ఎంత అన్నది ముఖ్యం.చైనా కార్మికశక్తి ఉత్పాదకత ఎక్కువ. దుర్భరదారిద్య్రాన్ని చైనా పూర్తిగా నిర్మూలించింది.1980లో ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం 90శాతం మంది చైనీయులు దారిద్య్రంలో ఉన్నారు.నేడు దాదాపు లేరు.భారత్‌లో పదిశాతం మందికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.చైనాలో రెండున్నరశాతం పోషకాహారలేమితో ఉంటే భారత్‌లో 16.3శాతం ఉన్నారు. పిల్లలో పోషకాహారలేమి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటని ఐరాస నివేదిక చెప్పింది. 195051లో మన ఆహారధాన్యాల ఉత్పత్తి 51మిలియన్‌ టన్నులు కాగా ఇప్పుడు 329 మి.టన్నులకు పెరిగింది, అదే చైనాలో 113 నుంచి 695 మిలియన్‌ టన్నులకు పెరిగింది. రెండుదేశాల జనాభా ఒక్కటే, ఎక్కడ జనాల కడుపు నిండుతున్నట్లు ?


ఈ విధంగా కమ్యూనిస్టులు కానివారు చైనా 75 ఏండ్ల ప్రస్తాన ప్రాధాన్యతను తమదైన అవగాహనతో చెప్పారు. చైనాను దెబ్బతీయాలని కమ్యూనిస్టు వ్యతిరేకులు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ కొంత మందికి అతిశయోక్తిగా కనిపించవచ్చుగానీ దెబ్బతీస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే ముప్పు అని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల క్రితం కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా వాటా కేవలం నాలుగు కాగా, నేడు 19శాతం ఉంది.1990దశకం వరకు పేద, వర్ధమాన దేశాలన్నీ పశ్చిమ ధనికదేశాల మీద ఆధారపడ్డాయి.గడచిన పదిహేనేండ్లుగా పరిస్థితి మారుతోంది.చైనా ప్రభావం పెరుగుతోంది. అది స్వయంగా ప్రారంభించిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ), ఆసియన్‌ మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్‌(ఎఐఐబి), న్యూడెవలప్‌మెంట్‌ బాంకు వంటి సంస్థలు కూడా పేద దేశాలకు సాయపడుతున్నాయి.అయితే కొన్ని చైనా ఎగుమతులు, ప్రాజక్టులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలో నూతన అవకాశాలను వెతుక్కుంటున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలతో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా చైనాను దెబ్బతీస్తే అది వర్దమానదేశాల మీద ప్రభావం చూపుతుంది.


ఎవరు అవునన్నా కాదన్నా, ఎంతగా గింజుకున్నా చైనాను కాదనలేని స్థితి.యావత్‌ ప్రపంచం హరిత ఇంథన దిశగా మారుతున్నది. దానికి చోదకశక్తిగా డ్రాగన్‌ ఉంది. మూడు నూతన వస్తువులుఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియమ్‌అయాన్‌ బ్యాటరీలు, సోలార్‌ సెల్స్‌` రంగాలలో మిగతాదేశాలన్నీ ఇప్పటికైతే దాని వెనుక నడవాల్సిందే. చిన్నవీ పెద్దవీ చైనా మౌలికవసతుల ప్రాజెక్టులు 190దేశాలు, ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. నిమిషానికి ఎనిమిది కోట్ల యువాన్ల (కోటీ 14లక్షల డాలర్లు) మేర వాణిజ్య కార్యకలాపాల్లో చైనా ఉంది. గంటకు 11.2 కోట్లు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నది. రోజుకు 3,377 కోట్ల యువాన్ల మేర విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.


ఇక గడచిన ఏడు దశాబ్దాల్లో చూస్తే చైనా పేద, వెనుకబడిన దేశంగా ఉన్నంత కాలం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు అది ముప్పుగా కనిపించలేదు. చివరకు కమ్యూనిస్టుల పాలనలో ఉన్నదే అసలైన చైనా అనటమే కాదు, రెండు చైనాలు లేవంటూ ప్రకటించటమే కాదు, భద్రతా మండలిలో తమ సరసన శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు అంగీకరించాయి. అది ఎప్పుడైతే పుంజుకొని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందో అప్పటి నుంచి ‘‘ ముప్పు ’’ గా పరిగణిస్తూ కుట్ర సిద్దాంతాలను జనాల మెదళ్లలో నాటుతున్నారు. నిజానికి చైనా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. సాధారణ తలసరి జిడిపి 2023లో అమెరికాలో 76వేల డాలర్లుంటే చైనాలో 12,720 మాత్రమే. వివిధ రంగాలలో దాని వృద్ధి వేగాన్ని చూసి తమ గుత్తాధిపత్యానికి గండిపడుతుందని అవి భయపడుతున్నాయి. తాము రూపొందించిన ఆట నిబంధనలే అమల్లో ఉండాలి, ఎప్పుడు ఎలా మారిస్తే వాటిని ప్రపంచమంతా అంగీకరించాలి, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తమకు ముప్పువచ్చినట్లు చెబుతారు. అది ఒక్క చైనా విషయంలోనే అనుకుంటే పొరపాటు. మనదేశం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరించటం అమెరికా కూటమికి గిట్టని కారణంగా వ్యతిరేకించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. పంజాబ్‌, కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదులను రెచ్చగొట్టింది కూడా దానిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ వారి వైపే మొగ్గుతున్నా పూర్తిగా తమ చంకనెక్కలేదని రుసరుసలాడుతున్నాయి.తామిచ్చిన మద్దతుతో ఉక్రెయిన్‌ జెలెనెస్కీ ఏ విధంగా రష్యాకు వ్యతిరేకంగా ఒక పావుగా మారాడో చైనాకు వ్యతిరేకంగా మనదేశం కూడా అలాంటి పాత్రనే పోషించి ఘర్షణకు దిగాలని అవి కోరుకుంటున్నాయి. దానికి మన దేశంలో ఉన్న కార్పొరేట్‌ శక్తులు అంగీకరించటం లేదు. దానికి కారణం వాటికి చైనా మీద ప్రేమ కాదు, చౌకగా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందాలనుకోవటమే !

కేరళ సిఎంతో కయ్యానికి కాలుదువ్వుతున్న గవర్నర్‌ : లేని అధికారం చెలాయించబోయి అభాసుపాలైన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తనకు లేని అధికారాన్ని చెలాయించబోయి కేరళ గవర్నర్‌ అభాసుపాలయ్యారు.ఉక్రోషం పట్టలేక కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మలప్పురం జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా బంగారం స్మగ్లింగ్‌,దానితో సంబంధాలున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై, సిఎం పినరయి విజయన్‌ చెప్పినట్లు హిందూ పత్రికలో ఆపాదించిన అవాస్తవ అంశాలను అధారం చేసుకొని గవర్నర్‌ సిఎం మీద దాడికి దిగారు. సదరు పత్రికలో వచ్చిన అంశాలపౖౖె నేరుగా 2024 అక్టోబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తనకు నివేదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్‌, డిజిపి షేక్‌ దర్వేష్‌ సాహిబ్‌లను గవర్నర్‌ ఆదేశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు.అంతకు ముందు ఇదే అంశం గురించి వివరించాలని, తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని సిఎంకు గవర్నర్‌ లేఖ రాశారు. అయితే ఆ పత్రిక విజయన్‌కు ఆపాదించిన మాటలను ఆయన చెప్పలేదని సవరించుకున్న తరువాత కూడా దాన్నే పట్టుకొని కక్ష సాధించాలని గవర్నర్‌ ప్రయత్నించటం గమనించాల్సిన అంశం. మలప్పురం గురించి సిఎం చెప్పని అంశాలు తమ వార్తలో చోటు చేసుకున్నాయని, ఒక పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏజన్సీకి చెందిన వ్యక్తి సిఎంపేరుతో వాటిని కలిపి రాయమని కోరినట్లు ఆ పత్రిక రాసింది. అయితే సిఎం తన ప్రచారం కోసం ఒక ఏజన్సీని నియమించారంటూ ప్రతిపక్షం దాని మీద రాద్దాంతం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ఏజన్సీని నియమించలేదని ముఖ్యమంత్రి విజయన్‌ స్పష్టం చేశారు. సిఎంకు రాసిన లేఖకు ఎలాంటి స్పందన లేకపోవటంతో అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశించారు.‘‘ దొంగబంగారంతో వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ సిఎం చెప్పారని, అలాంటి పనికి పాల్పడుతున్నవారెవరు, వారిపై తీసుకున్న చర్య ఏమిటి ?వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సిఎంను కోరాను.‘‘ కొద్ది రోజులు వేచి చూశాను. రాష్ట్రంలో చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నట్లు నాకు కనిపిస్తోంది, సిఎం తన బాధ్యతను విస్మరించారు. నాకు తెలియకుండా ఎందుకు దాచాలని చూస్తున్నారో తెలియటం లేదని విలేకర్లతో గవర్నర్‌ ఆరోపించారు. అధికారులకు గవర్నర్‌ ఆదేశించటంపౖౖె రాజభవన్‌కు సిఎం ఒక లేఖ రాస్తూ అలా నేరుగా పిలిచే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగీకారంతోనే సీనియర్‌ అధికారులను పిలవాలని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలను చూపి తనకు సమాచారం ఇవ్వకుండా ఉండజాలరని, రాష్ట్రపతికి నివేదించాల్సి ఉన్నందున వివరణ ఇవ్వాల్సిందేనని సిఎంకు మరొక లేఖ రాశారు. కోరిన సమాచారం ఇవ్వకపోతే నిబంధనలు, రాజ్యాంగబద్దమైన విధి నిర్వహణను ఉల్లంఘించినట్లు అవుతుందని గవర్నర్‌ బెదిరించారు.


తనకు చెప్పకుండా కొన్ని విషయాలను దాస్తున్నారన్న గవర్నర్‌ ఆరోపణలపై సిఎం పినరయి విజయన్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. తనను పక్కన పెట్టి తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు. సత్యదూరమైన, ఆధారంలేని అంశాలతో గవర్నర్‌ చేసిన ఆరోపణల కారణంగా గౌరవ ప్రదమైన రీతిలో నిరసనతెలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి తానెలాంటి బహిరంగ ప్రకటన చేయలేదని, గవర్నర్‌ వక్రీకరించిన కథనంపై ఆధారపడ్డారని స్పష్టం చేశారు. కేరళ వెలుపల దొంగబంగారాన్ని పట్టుకున్న వివరాలను కొన్నింటిని తాను సేకరించానని దొంగరవాణా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, గణనీయ మొత్తంలో పన్నుల ఎగవేత జరుగుతుందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా హెచ్చరించానని పేర్కొన్నారు. విమానాశ్రయాల ద్వారా జరుగుతున్న దొంగబంగార రవాణాను అరికట్టాల్సిన ప్రాధమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్‌శాఖదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను దాని గురించి అడగకూడదని, అయినా ముఖ్యమంత్రితో నిమిత్తం లేకుండా రాష్ట్ర అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు.


అక్టోబరు ఏడవ తేదీ సోమవారం నాడు కేరళ అసెంబ్లీలో జరిగిన అనూహ్య పరిణామంతో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తమ ఎత్తుగడ వికటించటంతో అల్లరికి దిగింది. దాంతో స్పీకర్‌ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.తాము సంధించిన 49 ప్రశ్నలను నక్షత్ర గుర్తు కలవిగా పరిగణించి సభలో ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా స్పీకర్‌ కార్యాలయం వాటిలో ఎక్కువ భాగం రాతపూర్వక సమాధానాలు ఇచ్చే ప్రశ్నలుగా మార్చివేసిందంటూ ప్రశ్నోత్తరాల సమయంలో యుడిఎఫ్‌ సభ్యులు గొడవకు దిగారు. ఆ సందర్భంగా స్పీకర్‌కు దురుద్ధేశ్యాలను ఆపాదించటంతో పాటు పోడియం ముందుకు వెళ్లి అల్లరి చేశారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేత సతీశన్‌ తన స్థానంలోకి వెళ్లారు. అయితే కొందరు కాంగ్రెస్‌ సభ్యులు అల్లరి కొనసాగిస్తుండగా అసలు ప్రతిపక్ష నేత ఎవరూ, మీరందరూ నేతలేనా అని ప్రశ్నించటాన్ని సతీశన్‌ తప్పుపడుతూ తమను అవమానించారని, స్పీకర్‌ ఎఎం శంషీర్‌ పరిణితిలేకుండా మాట్లాడారని, ఆ పదవికే అవమానమని తీవ్రంగా ఆరోపించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అవినీతి పరుడని ఆరోపించారు. తమ ప్రశ్నల స్వభావాన్ని మార్చినందుకు నిరసనగా ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత, యుడిఎఫ్‌ సభ్యుల తీరును ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ప్రతిపక్ష నేత దిగజారిన వ్యక్తని పదే పదే ప్రదర్శించుకుంటున్నారని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రతిపక్షనేతను చూడలేదని దుయ్యబట్టారు. స్పీకర్‌ మీద చేసిన విమర్శలను ఖండిరచాలన్నారు. తనను అవినీతి పరుడని ప్రతిపక్ష నేత అంటే కుదరదని సమాజం అంగీకరించదని అన్నారు.


ప్రశ్నోత్తరాల బహిష్కరణ తరువాత జీరో అవర్‌లో సభలో ప్రవేశించిన యుడిఎఫ్‌ సభ్యులు మరోసారి అల్లరికి దిగారు. ప్రతిపక్ష నేత సతీశన్‌ మాట్లాడుతూ తనపై సిఎం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, సిఎం మాదిరి అవినీతి పరుడు కాకుండా చూడమంటూ తాను ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్ధిస్తానని చెప్పుకున్నారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు తమ వెంట తీసుకువచ్చిన బానర్‌ను ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులను అడ్డుకొనేందుకు కొందరు అధికారపక్ష సభ్యులు కూడా ముందుకు రావటంతో స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. హిందూ పత్రిక ప్రతినిధితో సిఎం ముఖాముఖి మాట్లాడినదానిని వక్రీకరించి వార్త రాశారు. సిఎం చెప్పని అంశాలను ఒక ప్రజాసంబంధాల సంస్థ ప్రతినిధి జోడిరచమని కోరగా రాసినట్లు సదరు పత్రిక తరువాత తప్పును సవరించుకుంటూ పెద్ద వార్తను ఇచ్చింది. అసలు తామే సంస్థను నియమించలేదని, అవసరం కూడా లేదని విజయన్‌ స్పష్టం చేసినప్పటికీ దాని గురించి సభలో అల్లరి చేసేందుకు కాంగ్రెస్‌ ఎత్తువేసింది. దానిలో భాగంగా ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అక్కడే కాంగ్రెస్‌ పప్పులో కాలేసింది. ఇతర అంశాల మీద ప్రతి పక్షాలు ఇచ్చిన వాటిని చర్చకు అంగీకరించారు తప్ప నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలతో కూడిన వాయిదా తీర్మానాలను ఏ రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఆమోదించిన దాఖలాలు ఇంతవరకు లేవు. బహుశా చరిత్రలో మొదటి సారిగా కేరళలో జరిగింది. తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరిస్తారని, కనీసం సభలో ఉంచరని, దాన్ని అవకాశంగా తీసుకొని అల్లరి చేయాలనే ఎత్తుగడతో వచ్చిన కాంగ్రెస్‌ను ఊహించని విధంగా సిఎం దెబ్బతీశారు. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని, మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడుగంటల పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించటానికి అంగీకరిస్తూ విజయన్‌ ప్రకటించారు. ఆ తరువాత జీరో అవర్‌లో సభలోకి వచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు తాము అనుకున్నదొకటి అయింది ఒకటని గ్రహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనపేరుతో సభలో గందరగోళం సృష్టించి సభను వాయిదాపడేట్లు చేశారు. ఇలాంటి తీర్మానాలపై చర్చ తరువాత చివరగా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు, అంతటితో చర్చ ముగుస్తుంది. ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికారపక్షం పూర్తిగా సమాయత్తమైందని గ్రహించి తమ ఆరోపణల బండారం బయటపడుతుందని భావించిన కాంగ్రెస్‌ అల్లరికి దిగిందన్నది స్పష్టం.


వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మద్దతుతో మలప్పురం జిల్లా నుంచి రెండుసార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు పివి అన్వర్‌ గత కొద్ది నెలలుగా సంఘటన నుంచి వెళ్లిపోయేందుకుగాను సిపిఎం, సిఎం, ఇతరుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతగాడిని చేర్చుకొనేందుకు కాంగ్రెస్‌ కూడా సిద్దంగా లేదు. దాంతో డిఎంకెలో చేరి కేరళలో ఆ పార్టీ ఏర్పాటు, లేదా తమిళనాడు ముస్లింలీగుతోనైనా చేతులు కలపాలని పావులు కదిపారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సత్సంబంధాలు కలిగిన డిఎంకె నేత స్టాలిన్‌ అందుకు అంగీకరించలేదు, కనీసం అన్వర్‌ కలుసుకొనేందుకు సమయం కూడా ఇవ్వలేదు. అక్కడి ముస్లిం లీగ్‌ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అది కూడా విముఖత చూపింది. దాంతో డిఎంకె అనే పేరు వచ్చేట్లుగా డెమోక్రటిక్‌ మువ్‌మెంట్‌ ఆఫ్‌ కేరళ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని రాజకీయాలు నడపాలని అన్వర్‌ నిర్ణయించుకున్నారు.డిఎంకె నేతలు ధరించే రంగు కండువాలను కప్పుకొని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.


మలప్పురం జిల్లాలో బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని, వచ్చిన సొమ్మును దేశవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి మాట్లాడి జిల్లాను అవమానించారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేశారు. సిఎం అలాంటి ఆరోపణలు చేయలేదని, అసలు ఆ జిల్లాను ఏర్పాటు చేసిందే కమ్యూనిస్టులని, నాటి కాంగ్రెస్‌ నేతలు జనసంఘంతో కలసి జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారని, అలాంటి పార్టీతో ముస్లింలీగ్‌ స్నేహం నెరుపుతున్నదని సిపిఎం తిప్పికొట్టింది. ఆ జిల్లా గురించి మాట్లాడేందుకు ఎవరికీ యాజమాన్య హక్కులు లేవని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. తాము మెజారిటీ, మైనారిటీ మతోన్మాదాలు రెండిరటినీ వ్యతిరేకిస్తామని అన్నారు. రెండవ సారి విజయన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపక్ష యుడిఎఫ్‌, ఇతర శక్తులు ఒక అవకాశవాద కూటమిగా చేతులు కలిపి మీడియాలో కొన్ని సంస్థల మద్దతుతో 1957నాటి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విముక్తి ఆందోళన మాదిరి రెచ్చగొట్టేందుకు పూనుకున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నది. వెనుకబాటు తనంతో ఉన్న కారణంగా ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్‌ ప్రత్యేక జిల్లాగా మలప్పురాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఒక చిన్న పాకిస్తాన్ను ఏర్పాటు చేస్తున్నారంటూ నాడు జనసంఫ్‌ు పార్టీ ఆరోపించిందని, దానితో చేతులు కలిపింది కాంగ్రెస్‌ అని చెప్పారు. ఒకప్పుడు ముస్లింలు, కమ్యూనిస్టులను పోలీసులుగా తీసుకొనేవారు కాదని నంబూద్రిపాద్‌ అధికారానికి వచ్చిన తరువాత పరిస్థితి మారిందన్నారు. సిపిఎంలో దేవుడిని నమ్మేవారు, నమ్మని వారు కూడా పని చేయవచ్చని, తమ మద్దతుతో రెండు సార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు అన్వర్‌ ఇప్పుడు జమాతే ఇస్లామీ, ఎస్‌డిపిఐ, యుడిఎఫ్‌ మద్దతుతో అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు గోవిందన్‌ చెప్పారు. ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ రెండూ కూడా ఎన్‌డిపిఐ భావజాలంతో ముస్లింలను సమీకరిస్తున్నాయని విమర్శించారు. అలప్పూజ, పాలక్కాడ్‌ జిల్లాల్లో పోలీసులు గట్టిగా జోక్యం చేసుకున్న తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌`ఎస్‌డిపిఐ మతహింస అదుపులో ఉందని, అవి రెండూ సిపిఎం మీద రాజకీయదాడి చేస్తున్నాయంటే మతశక్తులకు వ్యతిరేకంగా తాము పనిచేస్తున్నదానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ ఓట్లు బిజెపికి పడిన కారణంగానే త్రిసూర్‌లో ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.

కేరళలో మీడియా వివాదాల తయారీ కేంద్రంగా మారిందని సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. వయనాడ్‌లో జరిగిన ప్రకృతి విలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ఇచ్చారని ఆ కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. తప్పుడు వార్తల కారణంగా రాష్ట్రం అనర్హమైన సాయం పొందేందుకు చూస్తోందనే తప్పుడు అభిప్రాయం కలుగుతోందని అన్నారు. వీటి ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటమేనని, వాటిని ఆధారం చేసుకొని ప్రతిపక్షం విమర్శలకు దిగుతున్నదని అన్నారు. కేంద్రానికి సమర్పించిన మెమోరాండాన్ని నిపుణులు రూపొందించారు తప్ప మంత్రులు కాదని, దానిలోని అంకెలనే తీసుకొని మీడియా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నదని అన్నారు. విధ్వంసం నుంచి కోలుకొనేందుకు రాష్ట్రం చూస్తుంటే టీవీ ఛానల్స్‌ రేటింగ్స్‌ పెంచుకొనేందుకు ఛానల్స్‌ చూస్తున్నాయన్నారు.

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

చమురు ధరలపై మాటతప్పటం, మడమ తిప్పటానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్రమోడీ ! సనాతనం సంగతి తరువాత పవన్‌ కల్యాణ్‌ ముందు జనం సంగతి చూస్తారా ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియాలో తలెత్తిన తాజా పరిస్థితి కారణంగా ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బ్రెంట్‌ రకం ముడి చమురు ధర అక్టోబరు ఒకటి నాలుగువ తేదీన ఈ విశ్లేషణ రాస్తున్న సమయానికి 70.40 నుంచి 78.66 డాలర్లకు పెరిగింది. ఒక్క మనమీదే కాదు, చమురు దిగుమతి చేసుకొనే అందరి పరిస్థితి అదే. అయితే పెరుగుదల లేకపోగా తగ్గినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా మన జేబులను కొల్లగొడుతున్నది.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినపుడు దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, కానీ 912 రోజులుగా ప్రతి రోజూ పెట్రోలు బంకులో కొల్లగొడుతుంటే ఎంత అని ఎవరూ పట్టించుకోవటం లేదు. అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాదనుకుంటే వదిలేద్దాం ! నరేంద్రమోడీని వ్యతిరేకించేవారికి అలా కావాల్సిందే అని ఎవరైనా అంటే సరే, దేశంకోసంధర్మం కోసం అంటూ మోడీని కొలిచేవారికి, ఆరాధించేవారికి కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా క్షవరం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రష్యా నుంచి మనం చమురు దిగుమతుల కారణంగా 202223 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 2,500 కోట్ల డాలర్లు (తాజా రూపాయి మారకపు విలువలో చూస్తే రెండు లక్షల కోట్ల మేరకు) కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది. పోనీ ఈ మేరకు వినియోగదారులకు ఒక్క పైసా అయినా మోడీ తగ్గించారా ? 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన మేరకు సవరించకుండా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని ఎందుకు పక్కన పెట్టారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ? మోడీ అలాంటి పెద్దలను, గద్దలను పక్కన పెడదాం, అసలు జనంలో ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వస్తున్న వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలను తప్పించుకొనేందుకు ఎక్కడికి పోవాలి ? పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది.


పశ్చిమ దేశాల ఆంక్షలను పక్కకు నెట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా కలుగుతున్న ఆర్థిక లబ్ది పూర్తిగా జనానికి దక్కుతున్నదా ? లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన అవసరాల్లో కేవలం రెండు శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఇప్పుడు 40శాతం దాటింది. ఈ మొత్తాన్ని ఎవరు దిగుమతి చేసుకుంటున్నారు. ఉదాహరణకు 2024ఏప్రిల్‌ నెలలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు పదిన్నరలక్షల పీపాలు దిగుమతి చేసుకుంటే అంబానీ రిలయన్స్‌, నయారా అనే మరో ప్రైవేటు సంస్థ ఎనిమిది లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాయి. ఈ దామాషా ప్రతి నెలా స్వల్పంగా మారుతున్నది. దీని అర్ధం ఏమిటి ? ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటే ఆ రాయితీ సొమ్ము జనానికి దక్కుతుంది, ప్రైవేటు వారిని అనుమతిస్తే వారి జేబుల్లోకి పోతుంది. నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానం ఇప్పుడు జనం కంటే అంబానీ, నయారా కంపెనీలకు లబ్ది చేకూర్చటమే ప్రధాన కర్తవ్యంగా ఉంది. రవాణా ఖర్చుతో సహా రష్యా నుంచి మనదేశం చేరటానికి ఒక పీపా ధర 2024లో 76.39 డాలర్లు కాగా, ఇతర దేశాల చమురు ధర 85.32 డాలర్లు ఉంది.(ఇండియన్‌ బాస్కెట్‌ రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ప్రైస్‌ అని గూగుల్‌ తల్లిని అడిగితే బిడ్డా కృత్రిమ మేధ వీక్షణం ఇలా ఉంది అంటూ ఆంగ్లంలో సమాచారం అందిస్తుంది. వినిపిస్తుంది, అడిగిన సమయాన్ని బట్టి ధరలు మారుతుంటాయి). ప్రైవేటు కంపెనీలు ఇలా తక్కువ ధరకు కొని ఏం చేస్తున్నాయంటే శుద్ధి చేసి డీజిల్‌, పెట్రోల్‌ ఇతర ఉత్పత్తులను పోటీ ధరలకు ఐరోపా దేశాలకు ఎగుమతులు చేసి అక్కడా లాభాలు పిండుతున్నాయి. ఈ విషయాలేవీ మన్‌కి బాత్‌లోనో ఎన్నికల ప్రచారంలోనో మోడీ మనకు చెప్పరు, గోడీ మీడియా ఇలాంటి వాటి మీద చర్చ పెట్టదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. ఇది గోడదెబ్బ అనుకుంటే చెంపదెబ్బ ఎలా కాడుతున్నారో తెలుసా ? మోడీ అధికారానికి వచ్చిన 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ (పిపిఏసి) సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి సెస్‌ల పేరుతో రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 202324నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు.


ప్రారంభంలోనే చెప్పుకున్నట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకటి రెండు సార్లు తప్పితే రోజువారీ ధరలను సవరించటం నిలిపివేశారు. మోడీ మీద ఎంత మోజున్నా ఇలా చావబాదుతుంటే భరించటం ఏమిటో అర్ధం కావటం లేదు. చమురు బిల్లు మన రూపాయల్లో 12.6లక్షల కోట్ల నుంచి 10.97లక్షల కోట్లకు తగ్గింది, కేంద్ర సర్కార్‌కు రు.1.64 కోట్లు మిగిలింది. పోనీ ఈ మేరకైనా వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు. వంట గ్యాస్‌ వంటి ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలన్నీ ఇదే విధంగా తగ్గాయి. దిగుమతుల మొత్తం స్వల్పంగా పెరిగినప్పటికీ కేంద్రానికి భారం తగ్గింది. బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు కానీ దోపిడీ కూడా చేయకూడదు కదా ! చమురు కొనుగోలులో తగ్గిన మేరకు వినియోగదారులకు అందించకుండా మిగిలిన సొమ్మును దేనికి ఖర్చు చేస్తున్నది ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు, సబ్సిడీల కోసం, వారు తీసుకున్న రుణాలు ఎగవేసినపుడు బాంకులకు నిధులు సమకూర్చటం కోసం వాటిని మళ్లిస్తున్నది. దీన్ని ఎవరైనా కాదనగలరా ? గతంలో సెస్‌లను భారీగా ఎందుకు అలా పెంచారంటే దేశ రక్షణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని బిజెపి పెద్దలు దబాయించేవారు. ఆ భారాలను తగ్గించలేదు, ధర తగ్గినా రేట్లు అలాగే ఉంచారు. మన దేశం 202223లో 15,750 కోట్ల డాలర్లు చెల్లించి చమురు దిగుమతి చేసుకుంది. మరుసటి ఏడాది చమురు బిల్లు 13,240 కోట్ల డాలర్లకు తగ్గింది.ఈ మేరకు మోడీ సర్కార్‌ వినియోగదారులకు ధరలు తగ్గించిందా ?ఎందుకు తగ్గించ లేదు. చమురు బిల్లు తగ్గటానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి 40శాతం దిగుమతులను రాయితీ ధరలకు పొందటం. తాజాగా బాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదికలో చెప్పినదాని ప్రకారం 2022 ఏప్రిల్‌ మొదటి వారంలో ఇంథన ధరలను చివరి సారిగా సవరించిన తరువాత ముడి చమురు ధరలు 20శాతం తగ్గాయి.2023 సెప్టెంబరు నుంచి 2024 మార్చినెల మధ్య లీటరు డీజిలు ధర రు.9 తగ్గింది.దీని వలన ఏటా లక్షకోట్ల రూపాయలు లేదా జిడిపిలో 0.3శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లేదా లాభం సమకూరుతున్నట్లు దానిలో పేర్కొన్నారు. గతంలో రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీని ఈ విధంగా పూడ్చుకున్నట్లయిందని కూడా అది అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పింది. ఇంథన ధరలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందని కూడా పేర్కొన్నది. పీపాకు పది డాలర్లు తగ్గితే ఏటా 1,300 కోట్ల డాలర్ల మేర ప్రభుత్వానికి మిగులుతాయి. ఇప్పుడున్న డాలరు మారకం (రు.84) ప్రకారం లక్షా తొమ్మిది వేల కోట్లు మిగులుతాయి. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.

2013-14—-105.52
2014-15--- 84.16 2015-16—– 46.17
2016-17--- 47.56 2017-18—– 56.43
2018-19----69.88 2019-20—– 60.47
2020-21----44.82 2021-22—–79.18
2022-23----93.15 2023-24—– 82.58
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం.2022 ఏప్రిల్‌ ఆరున ఢల్లీిలో లీటరు పెట్రోలు రు.105.41, డీజిల్‌ రు.96.67గా సవరించిన వాటిని మే 22వ తేదీన రు.96.72, 89.62 చొప్పున సవరించారు. ఈ ధరలను 2024 మార్చి నెల 21వరకు కొనసాగించి మరుసటి రోజు నుంచి రెండేసి రూపాయల చొప్పున తగ్గించారు.తరువాత ధరలలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. వివిధ రాష్ట్రాలలో ఉన్న వాట్‌ ప్రకారం ధరలలో తేడాలు ఉంటాయి. ఉదా రెండు తెలుగు రాష్ట్రాలలో లీటరు పెట్రోలు రు.109 ఉంది. ప్రకటించిన విధానం ప్రకారమైతే ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అనేక సార్లు సవరించి ఉండాల్సింది.ఏప్రిల్‌ నెలలో 89.44 డాలర్లు ఉన్నది కాస్తా సెప్టెంబరుకు 73.69కి తగ్గింది, పదహారు డాలర్లు తగ్గినా పదహారు పైసలు కూడా తగ్గించలేదు.


ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించారు. కమ్యూనిస్టులు తెల్లారిలేస్తే ఇలాంటి పిలుపులే ఇస్తుంటారు వారికి అలవాటైపోయింది అని పట్టించుకోని జనం నిజమే కదా కొత్త హీరో వచ్చాడు అనుకున్నారు.(జనం స్పందించనంత మాత్రాన కమ్యూనిస్టులు పిలుపులు ఇవ్వటం, కార్యకర్తలతో నిరసన తెలపటం మానుకోలేదు) 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీశారు. తరువాత నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని 2024 ఎన్నికల వరకు నిలదీశారు, తాటవలిచారు. కేంద్రానికి చెందిన సమస్యలపై నిలదీయరేమి అన్నపుడు మేము అధికారంలోలేము కదా అని తప్పుకున్నారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి. వందశాతం స్ట్రైక్‌ రేటు ఉంది. జనం సమస్యలను వదలి సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారమెత్తారు. తనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మానవత్వం అంటూ కబుర్లు చెప్పిన మీరు ఇదేమిటి స్వామీ అంటే ముందునేను సనాతన హిందువును అంటున్నారు, ఆ ముక్క ఎన్నికల ముందు చెప్పలేదు. సినిమా స్క్రిప్ట్‌ మారిపోయింది. పోనీ హిందువులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నారా ? రాష్ట్రంలో తొంభై శాతం హిందువులే ఉన్నారు. ధరలు, దరిద్రం, నిరుద్యోగాలను భరించటం కూడా అదే శాతం ఉంది. కేంద్రం, రాష్ట్రం మోపుతున్న భారాలను కూడా భరిస్తున్నారు. వారికేమీ రాయితీలు లేవు. నాలుగువేల మంది విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు పూనుకుంటే మొత్తం సిబ్బందికి అలవెన్సులు కోత పెడుతుంట ఇదేం అన్యాయం అనటానికి హీరోకు నోరు రాలేదు. పెడుతుంటే నిలదీయలేదు. వరదలతో భారీగా నష్టపోయిన విజయవాడ, ఇతర ప్రాంతాల్లో జనాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ఒక్క పైసా విదల్చకపోయినా అడిగింది లేదు. అమరావతి నిర్మాణానికి పెద్ద మొత్తంలో గ్రాంట్లు తెస్తామంటూ ప్రగల్భాలు పలికి పదిహేనువేల కోట్ల అప్పు ఇప్పిస్తామంటే అబ్బో ఇదే మహాభాగ్యం అన్నట్లు భజన చేస్తున్నారు. పోలవరం బాధితులకు నష్టపరిహారం సంగతి తేల్చకున్నా నోరు విప్పరు. ఇంథన ధరలు కేవలం రాష్ట్ర సమస్య కానప్పటికీ వినియోగించే పెద్ద రాష్ట్రాలలో ఒకటి గనుక మిగతా అంశాలతో పాటు చమురు ధరల తగ్గింపును పవన్‌ కల్యాణ్‌ నిలదీస్తారా ? ఇంథన కొనుగోలు సర్దుబాటు చార్జీల పేరుతో 2022`23 సంవత్సరానికే రు.8,113 కోట్లు చెల్లించాలని మూడు డిస్కామ్‌లు కోరాయి. ఇది గాక మరుసటి సంవత్సర మొత్తం మరో పదకొండువేల కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా, జగన్‌ చేసిన పాపం అంటూ జనం నెత్తిన బాదుతారా ? సమస్యలను పక్కదారి పట్టించేందుకు సనాతన ధర్మ కబుర్లతో కాలక్షేపం చేస్తారా ? చంద్రబాబు ఎలాగూ నోరువిప్పరు. పవన్‌ కల్యాణ్‌ హీరో అని నిరూపించుకుంటారా ?

లడ్డు రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు : లీకు వీరుడు చంద్రబాబు పప్పులో కాలేశారా ?

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్‌ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్‌ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్‌ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్‌ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్‌ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్‌ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.


నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.


దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్‌ గౌర్‌ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్‌ రాజ్‌ (గతంలో అలహాబాదు) అలోప్‌ శంకరిదేవి, బడే హనుమాన్‌, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్‌ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్‌ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్‌ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్‌ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్‌ మహంత్‌ బల్బీర్‌ జి మహరాజ్‌ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్‌ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ చెప్పారు.

మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్‌ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్‌ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్‌ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.


బిజెపి బీఫ్‌ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్‌ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్‌ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్‌ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్‌ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్‌ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్‌ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.

లెబనాన్‌ ఆక్రమణ బాటలో ఇజ్రాయెల్‌ – ప్రతిగా ఇరాన్‌ క్షిపణి దాడి !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

లెబనాన్‌, గాజాలపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా మంగళవారం నాడు క్షిపణులతో జరిపిన తమ దాడి ముగిసిందని ఇరాన్‌ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌ వైపు నుంచి దాడులు కొనసాగితే తాము మరింత గట్టిగా స్పందిస్తామని పేర్కొన్నది. తమ శత్రువు మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ సేనలు లెబనాన్‌లో ప్రవేశించి దాడులను కొనసాగిస్తున్నాయి. వేలాది మంది నివాసాలు వదలి వెళ్లాలని ప్రకటించాయి.దాడులను తిప్పికొడుతున్న హిజబుల్లా ప్రకటించింది. బుధవారం నాడు కూడా దాడులు కొనసాగాయి. అటు ఇజ్రాయెల్‌, ఇటు లెబనాన్‌లో జరిగిన నష్టాల వివరాలు వెల్లడికాలేదు. ఇజ్రాయెల్‌పై జరుగుతున్న క్షిపణి దాడులను అడ్డుకోవాలని అమెరికా మధ్యప్రాచ్యంలో తిష్టవేసిన తన సేనలను అమెరికా ఆదేశించింది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజా పరిణామాలతో ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు అక్టోబరు ఒకటిన 70.4 డాలర్లుగా ఉన్నది రెండవ తేదీన 74.78డాలర్లకు పెరిగింది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

గత శనివారం నాడు లెబనాన్‌లోని హిజబుల్లా పార్టీ నేత హసన్‌ నస్రల్లాతో పాటు మరికొందరిని ఇజ్రాయెల్‌ హత్య చేసింది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 1,873 మంది మరణించారని, 9,134మంది గాయపడినట్లు ప్రకటించారు. 1960లో జన్మించిన నస్రల్లా 1992లో హిజ్‌బుల్లా బాధ్యతలను స్వీకరించి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అందుకు ముందు నేతగా ఉన్న అబ్బాస్‌ ముసావీని కూడా ఇజ్రాయెల్‌ ఇదే విధంగా హత్య చేసింది.1997లో జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో నస్రల్లా పెద్ద కుమారుడు హడీ మరణించాడు. 2006లో ఇజ్రాయెల్‌తో జరిపిన 33 రోజుల పోరులో నస్రల్లా నాయకత్వంలో సాధించిన విజయంతో పలుకుబడి పెరిగింది. తాజా హత్యలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా సామ్రాజ్యవాద దుష్టత్వాన్ని మరోమారు ప్రపంచానికి వెల్లడిరచింది. అది అందచేసిన సమాచారం, విద్రోహుల కారణంగానే ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌లలో తమ వ్యతిరేకులను ఇజ్రాయెల్‌ హతమార్చుతోంది.అమెరికా అండ చూసుకొని గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకిస్తున్న ఇరుగుపొరుగుదేశాలన్నింటి మీదా తెగబడుతోంది. ఈ పూర్వరంగంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. లెబనాన్‌పై ప్రత్యక్ష దాడి వెనుక కారణాలేమిటన్నది ఆసక్తి కలిగించే అంశం. యుద్ధం చెలరేగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారటం ఖాయంగా కనిపిస్తోంది.లెబనాన్‌ తరువాత ఎమెన్‌ మీద దాడులకు దిగవచ్చని చెబుతున్నారు. ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో మారణకాండకు ఏడాది నిండ నుంది, ఆ తరువాత పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ చెప్పలేము. గడచిన రెండు నెలల కాలంలో ఇజ్రాయెల్‌ చేసిన హత్యలు, దాడుల గురించి ఇరాన్‌, సిరియా, హమస్‌, హిజబుల్లా తక్కువ లేదా తప్పుడు అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోందన్న కొందరి విశ్లేషణలను కొట్టిపారవేయలేము. అందుకే వ్యూహాలను తిరిగి రచించుకొనేందుకు కొంత వ్యవధి పట్టవచ్చు.

మధ్యప్రాచ్య పరిణామాలు భారత్‌తో సహా అనేక దేశాల మీద ఆర్థిక ప్రభావాలు చూపుతాయి.ముడి చమురు ధరలు పెరుగుతాయన్నది వాటిలో ఒకటి.1973లో ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా చమురు ఉత్పత్తి దేశాలు చమురును ఒక అస్త్రంగా ఉపయోగించాయి. దానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా, జపాన్‌, కెనడా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు చమురు ఎగుమతులను నిలిపి వేశాయి. దాంతో పీపా ధర మూడు నుంచి 11 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పెరుగుదల, దానితో పాటు ఆర్థిక వ్యవస్థల కుదేలు జరగవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఎమెన్‌లోని హౌతీలు జరుపుతున్నదాడులతో ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాకు ఆటంకం కలుగుతూ ఆఫ్రికా గుడ్‌హోప్‌ ఆగ్రం చుట్టూ తిరిగి రావటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. గతేడాది అగస్టు పదకొండవ తేదీతో ముగిసిన వారంలో 70 ఓడలు ఎర్ర సముద్రం బాబ్‌ అల్‌ మండాబ్‌ జల సంధి గుండా ప్రయాణించగా ఈ ఏడాది అదే వారంలో కేవలం 23 మాత్రమే వచ్చినట్లు ఐఎంఎఫ్‌ రేవుల విభాగం గుర్తించింది. పరిసర దేశాల్లోని చమురు క్షేత్రాలు, శుద్ధి కేంద్రాల మీద దాడులు జరిగితే సంక్షోభం తలెత్తవచ్చు. చరిత్ర పునరావృతం కావచ్చు గానీ ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము.ఈ కారణంగానే భిన్న దృశ్యాలతో రాగల పరిణామాలను అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరు ఏడవ తేదీన హమస్‌దాడులు, ఆ పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ పర్యవసానాల గురించి ప్రపంచబ్యాంకు మూడు అంచనాలు చెప్పింది, వాటినే ఇప్పుడు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వల్ప ఆటంకం ( లిబియాలో అంతర్యుద్ధం జరిగిన 2011 ఏడాది మాదిరి) ప్రపంచ చమురు సరఫరాలోలో ఐదు లక్షల నుంచి ఇరవైలక్షల పీపాల వరకు రోజుకు తగ్గవచ్చు, చమురు ధరలు మూడు నుంచి 13శాతం పెరగవచ్చు. రెండవది (2003లో ఇరాక్‌ సమయంలో మాదిరి) సరఫరా 30 నుంచి 50లక్షల పీపాల వరకు తగ్గవచ్చు, ధరలు 21 నుంచి 35శాతం పెరుగుదల, మూడవది 1973 చమురు సంక్షోభం మాదిరి ఎనభైలక్షల పీపాల మేరకు సరఫరా తగ్గుదల, 56 నుంచి 75శాతం మేరకు ధరలు పెరగవచ్చు.

ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్‌ మారణకాండకు ఏడాది నిండుతుంది.ఇప్పటి వరకు 41,586 మంది మరణించగా 96,210 మంది గాయపడ్డారు, పది వేల మంది జాడ కనిపించటం లేదు.లక్షలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ఐరాస నిర్వహించే సహాయశిబిరాలు దేన్నీ దాడులలో వదలటం లేదు. అయినప్పటికీ హమస్‌ సాయుధులను అంతం చేస్తామన్న ఇజ్రాయెల్‌ పంతం నెరవేరే సూచనలు కనిపించటం లేదు. ఇదే సమయంలో పాలస్తీనా దురాక్రమణ, గాజా మారణకాండను వ్యతిరేకిస్తున్న హిజబుల్లాను అణచేపేరుతో లెబనాన్‌ మీద వైమానికదాడులకు దిగింది.దాని అధిపతి, ఇతర ముఖ్యనేతలను హతమార్చవచ్చు తప్ప పూర్తిగా అణచివేయటం ఇజ్రాయెల్‌ తరం కాదని అందరూ చెబుతున్నారు. ఎందుకు అంటే హమస్‌తో పోల్చితే దాని పోరాట యోధులు, ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే. ఇజ్రయెల్‌ మిలిటరీతో పోల్చితే దాని ఆయుధాలు, సాయుధుల సంఖ్య చాలా తక్కువ అని కూడా గమనించాలి.హిజబుల్లా దగ్గర 30 నుంచి 50వేల మంది వరకు ఉన్నారని అంచనా. అయితే తమ యోధుల సంఖ్య లక్షకు పైబడే అని ఇటీవల హత్యకు గురైన నస్రల్లా గతంలో ప్రకటించాడు. ఐదు నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే క్షిపణులు లక్షా ఇరవైవేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లు అంచనా, ఇవి గాక ఇరాన్‌ సరఫరా చేసిన మానవరహిత విమానాలు కొన్ని, ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు క్షిపణులను ప్రయోగించే సంచార వాహన వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతం మీదనైనా దాడికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇజ్రాయెల్‌ వద్ద త్రివిధ దళాల రెగ్యులర్‌ మిలిటరీ, రిజర్వు దళాల మొత్తం 1,69,500 నుంచి 6,34,500 మంది ఉన్నారు. తమ మీదకు వదిలే క్షిపణులను ముందుగా లేదా మధ్యలో గుర్తించి కూల్చివేసే ఆధునిక రక్షణ వ్యవస్థలు, భారీ క్షిపణులు, వందలాది విమానాలు, నౌకలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగనుందో అనే భయంతో వణికిపోయే జనం, వారి రక్షణకు ప్రతి నగరంలో భూగర్భ గృహాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు ఇంత బలం ఉన్నప్పటికీ తన రక్షణ కోసం అవసరం అంటూ గతంలో దక్షిణ లెబనాన్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇరాన్‌లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చిన తరువాత 1979లో షియా ముస్లిం తెగకు చెందిన కొద్ది మందితో హిజబుల్లా (దేవుడి పార్టీ)ను ఏర్పాటు చేశారు. అయితే 1982లో ఇజ్రాయెల్‌ దురాక్రమణకు పాల్పడిన తరువాతే అది ప్రాచర్యంలోకి వచ్చింది. 1985లో లెబనాన్‌ అంతర్యుద్ధం సందర్భంగా అక్కడి వివిధ షియా సంస్థలన్నీ హిజబుల్లా నాయకత్వంలో ఐక్యమయ్యాయి. తరువాత ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ పోరును ప్రారంభించింది.2006లో ఇజ్రాయెల్‌ వైదొలగే వరకు అది పోరుబాటలో ఉంది. ఈ క్రమంలోనే అది రాజకీయ సంస్థగా కూడా రూపుదిద్దుకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తన సాయుధ విభాగాన్ని కొనసాగిస్తున్నది. దీనికి లెబనాన్‌ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది.ప్రస్తుతం సంకీర్ణ మంత్రివర్గంలో ఇద్దరు సభ్యులు, 128 మందితో ఉన్న పార్లమెంటులో 15 స్థానాలతో హిజబుల్లా పెద్ద పక్షంగా ఉంది.

పలు చోట్ల తనను వ్యతిరేకించే సంస్థల నేతలను దొంగదెబ్బలతో హత్య కావించటం, పేజర్లు, వాకీటాకీలను పేల్చి లెబనాన్‌లో హిజబుల్లాపై దాడుల ద్వారా తనకు ఎదురులేదని ఆప్రాంతంలోని వ్యతిరేకులను బెదిరించటమే ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్యవాద శక్తుల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడొస్తాడన్నట్లు చరిత్ర రుజువు చేసింది.నస్రల్లా ఉన్న బంకర్‌ను బద్దలు చేసేందుకు అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌15 విమానాలతో వెయ్యి కిలోల బరువుండే 85బాంబులను ప్రయోగించి హత్యచేశారు. నాలుగు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. నస్రల్లా హత్యతో అనేక మంది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని జో బైడెన్‌ అన్నాడు. ఈ చర్యలన్నీ ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించే అమెరికా కుట్రలో భాగం తప్ప మరొకటి కాదన్నది పదే పదే చెప్పనవసరం లేదు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఒక మాప్‌ను చూపుతూ దానిలో ఉన్న లెబనాన్‌, ఇరాన్‌, సిరియా, ఇరాక్‌ ఒక చీడ అంటూ దాన్ని దాన్ని తొలగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పాడు.అమెరికా మద్దతుతో అనేక మంది అనుకుంటున్నదాని కంటే ముందే ఈ కలను సాకారం చేస్తామని కూడా చెప్పాడు. పాలస్తీనా ఉనికే లేని నూతన మధ్య ప్రాచ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు. నస్రల్లాను చంపిన బాంబుదాడి జరిపిన విమానపైలట్‌ మాట్లాడుతూ తాము ప్రతివారినీ, ప్రతి చోటా దెబ్బతీస్తామన్నాడు. ఎలాగైనా సరే ప్రపంచాన్ని గెలుచుకుంటామంటూ అమెరికా చెబుతున్నది కూడా అదే.


తాజా దాడుల విషయానికి వస్తే హిజబుల్లాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియా చిత్రిస్తున్నప్పటికీ వాటి తీరుతెన్నులను చూస్తే సామాన్య జనం మీదనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారు. వేలాది గృహాలను నేలమట్టం చేశారు. గాజా, బీరూట్‌, లెబనాన్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న సాయుధ సంస్థలు తమ ఆయుధాలను సొరంగాల్లో దాస్తున్నాయి తప్ప పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నట్లు సాధారణ పౌరుల ఇండ్లలో కాదు. అయితే ప్రతిఘటన పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న కారణంగా పరిస్థితి అడవుల్లో మాదిరి ఉండదని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఇజ్రాయెల్‌ దాడులు చేసినపుడు పౌరులు ఇండ్లను ఖాళీచేయాలని పదే పదే చెబుతోంది. గాజాలో మాదిరే బీరూట్‌, పరిసరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా విమోచన సంస్థ(పిఎల్‌ఓ) లెబనాన్‌ నుంచి తమ మీద దాడులు జరుపుతోందని, అందువలన రక్షణగా కొన్ని ప్రాంతాలు తమకు అవసరమంటూ 1982 ఇజ్రాయెల్‌ ఆక్రమణలకు పూనుకుంది. నిజానికి సిరియా`లెబనాన్‌ మధ్య వివాదం ఉన్న గోలన్‌ గుట్టలను 1967 తరువాత 1973, 1981లో కూడా కొత్త ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఇప్పటికీ ఆ ప్రాంతం దాని ఆక్రమణలోనే ఉంది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఆక్రమిత ప్రాంతాల పౌరులకు ప్రతిఘటించే హక్కును గుర్తించారు. ఆ విధంగా ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని లెబనాన్‌ ప్రాంతాల విముక్తికి తాము పోరాడుతున్నట్లు హిజబుల్లా చెబుతోంది. నస్రల్లా మరణం తరువాత ఉపనేత నయిమ్‌ ఖాసిం దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ నస్రల్లా మరణ సమయంలో 20 మంది నేతలతో సమావేశం జరుగుతున్నదని వారంతా మరణించారని ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ మిలిటరీ కమాండర్‌, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల డిప్యూటీ కమాండర్‌, భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పాడు. 2006లో మాదిరే ఇజ్రాయెల్‌ను వెనక్కు కొడతామని విజయం మనదే అని ప్రకటించారు.