• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Literature.

ఆరు పదాలపై ‘ ఆంక్షలు ‘ రవీంద్రుని మానవత్వంపై ‘అసహనం’

13 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Amarthya sen, attack on journalists, Attack on media, ‘Argumentative Indian’, cbfc, cow politics, History, Intolerance, NCERT, Ravindranath Tagore, RSS, six words censor

సత్య

దేశంలో వాక్సభా స్వాతంత్య్రాలకు ముప్పు వస్తోందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అనేక మంది తమకు సంబంధించినవి కావన్నట్లుగా అసలు వాటి గురించి పట్టించుకోవటమే మానుకున్నారు. వీరిలో రెండు రకాలు అణచివేత, వివక్ష, విద్వేషానికి బలౌతున్నవారు ఒక తరగతి అయితే మేథావులం అనుకునే వారు రెండో తరగతి. మొదటి వారితో ఇబ్బంది లేదు, సమయం, సందర్భం వచ్చినపుడు తమ సత్తా ఏమిటో చూపుతారు. గడియారంలోని లోలకం మాదిరి అటో ఇటో వూగటం తప్ప నిలబడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రాని మేథావులతోనే అసలు సమస్య. వంది మాగధులు పొగడ్తలకు రాజులు, రంగప్పలు ఎలా పొంగిపోయేవారో, తమను విమర్శించేవారిని ఏం చేశారో చూశాము. ఆ రాజరికాలు, జమిందారీ వ్యవస్ధ పోయినా ఆ స్వభావం మాత్రం పాలకులలో ఇంకా సజీవంగానే కొనసాగుతోండటమే ప్రమాదకరం.

మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న చోట గుజరాత్‌, ఆవు, హిందు, హిందూత్వ,ఈ రోజుల్లో, ఇండియాలో అనే పదాలు వినిపించకూడదు, వాడకూడదు.పాఠ్య పుస్తకాలలో అరబ్బీ, ఆంగ్లం, వుర్దు పదాలను తీసివేయాలి. రవీంద్రనాధఠాగూరు ఆలోచనలు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఆత్మకధ వుండకూడదు, మొఘల్‌ చక్రవర్తుల దయాగుణం కలవారని, బిజెపి హిందూ పార్టీ అని, నేషనల్‌ కాన్ఫరెన్సు లౌకికవాద పార్టీ అన్న వర్ణలు వుండకూడదు.1984 దాడులపై మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన క్షమాపణ, గుజరాత్‌లో దాదాపు రెండువేల మంది ముస్లింలను చంపివేశారనే వ్యాక్యాలను పాఠ్యపుస్తకాలను తొలగించాలి. ఇలా రోజు రోజుకూ నిషేధిత పదాలు, భావనలు, ఆలోచనలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటన్నింటినీ బయటకు తెలియనివ్వకుండా సంబంధిత సంస్ధలు తమంతట తామే చేసినట్లుగా బయటకు కనిపించాలని కోరుకొనే శక్తులు తమ బండారం బయట పెట్టిన మీడియా గురించి రెచ్చిపోతున్నారు.

సుమన్‌ ఘోష్‌,                                 అమర్త్యసేన్‌                       పహ్లజ్‌ నిహ్లానీ

ముందుగా ఆరు మాటలపై ఆంక్షల గురించి చూద్దాం. వీటిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ పదవీకాల గడువు ముగియక ముందే కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రసూన్‌ జోషి అనే రచయితను నియమించింది. తన పదవీ నియామకంతో పాటు తొలగింపు కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానని నిహ్లానీ వ్యాఖ్యానించాడు. ఇక నేరుగా సాధారణ సినిమాల్లోనే అశ్లీల, అసభ్య దృశ్యాలను చూడవచ్చని వుక్రోషం వెలిబుచ్చారు. అసాంస్కృతిక లేదా మర్యాద తెలియని సేన చేతిలో కాలం చెల్లిన ఆయుధంగా వుపయోగపడిన వ్యక్తికి కేంద్రం ముగింపు పలికిందని ఒక పత్రిక వ్యాఖ్యాన శీర్షికలో పేర్కొన్నారు. చరిత్రను వెనక్కు నడపాలని చూస్తున్న, ఏది తినకూడదో, ఏ డ్రస్సు వేసుకోకూడదో, ఎప్పుడు బయట తిరగాలో ఇలా ప్రతి జీవన రంగంలో కాలం చెల్లిన ఆయుధాలతో ‘స్వయంసేవకులు’ మూలమూలనా రెచ్చిపోతున్న స్ధితిలో నూతన అధిపతి ఎలా పని చేయగలరో చూడాల్సి వుంది.

నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ గురించి సుమన్‌ ఘోష్‌ అనే ఒక దర్శకుడు ‘భారతీయ తార్కికుడు ‘ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దానికి కేంద్ర ఫిలింసెన్సార్‌ బోర్డు తాము చెప్పిన ఆరు పదాల కోతలకు అంగీకరిస్తేనే ప్రదర్శనకు అనుమతి సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పింది.పైన పేర్కొన్న మొదటి ఆరుపదాలు, వాటితో కూడిన వ్యాక్యాలను ఆ డాక్యుమెంటరీలో వినిపించకుండా చేయాలని జూలై 11న కోరింది. ఒక్క కోతకు కూడా తాను అంగీకరించటం లేదని ఒక నెల రోజుల తరువాత దర్శకుడు తిరస్కారాన్ని తెలిపాడు. తరువాత ఆ చిత్రాన్ని పునర్విచారణ కమిటీకి పంపుతారు. అదొక తతంగం, ఇంత జరిగాక దానిని ఏమి చేస్తారో వూహించనవసరం లేదు. కుక్క మనిషిని కరవటం సాధారణ విషయం. కానీ మనిషే కుక్కను కరవటం సంచలన వార్త. దేశంలో నేడున్న స్ధితిలో ఆరు పదాలపై ఆంక్షలు పెట్టటం సాధారణం.ఇంత రాద్ధాంతం జరిగాక వాటిని అంగీకరించి అనుమతిస్తేనే అది అసలైన వార్త అవుతుంది. చివరికి అదేమైనా అసలు ఆ పదాలపై ఎందుకు అభ్యంతర పెడుతున్నారన్నదే తెలుసుకోవాల్సిన, తేలాల్సిన అంశం.

సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలపై దేశమంతటి నుంచి అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఆ పదాలకు కోత పెట్టినందువలన దర్శకుడి సృజనాత్మకతకు, అమర్త్యసేన్‌ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. ఆ పదాలు భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని విస్పష్టంగా తిరస్కరించేవిగా వున్నాయని, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఒక భారతీయుడిపై నిర్మించిన డాక్యుమెంటరీలో రాజకీయాలు, మతం గురించి మందబుద్దితో చేసిన వ్యాఖ్యలను అనుమతిస్తే శాంతి, సామరస్యాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించామని వాదించారు. ఒక సందర్భంలో భారతీయ ప్రజాస్వామ్యం గురించి చేసిన ప్రస్తావనలో గుజరాత్‌ నేరాల గురించి పేర్కొన్నారని, దానిలో గుజరాత్‌ అనే పదం తీసివేయమని కోరామన్నారు. మరొక సందర్భంలో ఇండియాలో శత్రువు మతనాయకత్వమని చేసిన ప్రస్తావనలో ఇండియా అనే పదం వాడవద్దన్నామని, ఇండియాను హిందు అని భాష్యం చెప్పినందున హిందూ అనే పదాన్ని తొలగించాలని కోరామన్నారు. ఆవు గురించి మతానికి ముడిపెడుతూ నిరర్ధకమైన ప్రస్తావన చేసినందున ఆవు పదాన్ని వాడవద్దని కోరామని, ఈ రోజుల్లో వేదాలను దురభిమాన పద్దతిలో వినియోగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలో ఈ రోజుల్లో, వినియోగిస్తున్నారు అనే పదాలను తొలగించాలని కోరినట్లు నిహలానీ చెప్పారు. భారత హిందుత్వ వైఖరి నకిలీదని ఆగ్రహం కలిగించే విశేషణం వాడినందున దానిని కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ పదాలను తొలగించాలని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వత్తిడి లేదని, అలా కోరటాన్ని ప్రభుత్వ అనుకూల చెంచాగిరి చేసినట్లుగా చూశారని వ్యాఖ్యానించారు. ఆవు, హిందూత్వ గురించి చేసిన వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని, చిత్ర నిర్మాతలు భావ ప్రకటనా స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి స్వేచ్చ బాధ్యతతో కూడినదై వుండాలని కూడా వారు తెలుసుకోవాలని నిహ్లానీ అన్నారు. మీరు నోబెల్‌ బహుమతి గ్రహీత కావచ్చు జనం పవిత్రమైనవిగా భావిస్తున్న వాటిని తృణీకారంతో మాట్లాడితే మీపై దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా సెన్సార్‌ బోర్డు అధిపతి వ్యాఖ్యానించారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ లేకుండా పలు బహిరంగ స్ధలాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు, అది చట్టవిరుద్దం, భావ ప్రకటనా స్వేచ్చ మంచిదే చట్ట వుల్లంఘన మాటేమిటని నిహ్లానీ ప్రశ్నించారు.

సెన్సార్‌ బోర్డు అధిపతి ప్రస్తుతం దేశంలో మనువాద, సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న వాదనలను అధికారికంగా వ్యక్తం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారా లేక అధికారం ఆయనను ప్రభావితం చేసిందా అన్నది సమస్య. మొదటిదే వాస్తవమైతే అన్ని రంగాలలో తిరోగమనవాదులతో నింపే ప్రప్రకియలో భాగంగానే ఆయనను అక్కడ నియమించారని, లేకపోతే ఆయనపై వత్తిడి తెచ్చారని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. కొంత మంది పవిత్రంగా చూస్తున్నదానిని జనం మొత్తం చూస్తున్నారని చిత్రించటం, వాటితో విబేధించి వర్ణనలు చేస్తే దాడులు జరుగుతాయని చెప్పటమంటే పరోక్షంగా అదే చేయమన్న సందేశం తప్ప మరొకటి కనిపించటం లేదు. మతోన్మాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల తరగతికి చెందిన వారు చేస్తున్న దుర్మార్గాలన్నీ దేవుళ్లు, దేవదూతలు, దేవుని బిడ్డలో, ఆయా మతాల గ్రంధాలు చెప్పాయనో, శాశించాయనో, జనాభిప్రాయమనో, కోరారనో పేరుతో చేస్తున్నవే అని గమనించాలి.

ఆవు, వేదాలు, హిందూత్వల గురించి భిన్న అభిప్రాయాలు వెలువరించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, లేదూ కొత్తగా ప్రారంభించినా తప్పేమీ కాదు. తమ వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదని కొన్ని శక్తులు తమ అభిప్రాయాన్ని దేశం మొత్తం మీద రుద్దటం గతంలో నడవ లేదు, ఇప్పుడూ కుదరదు, అది ఏ రీత్యా చూసినా ప్రజాస్వామ్య వైఖరి కాదు. చర్చోపచర్చలు చేయవచ్చు, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు. ఏ వైఖరిని కలిగి వుండాలనేది లేదా ఏ వైఖరికీ బద్దులం కాకూడదనో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలితప్ప భిన్నాభిప్రాయం, భిన్న వ్యాఖ్యానం వినిపించకూడదని చెప్పటం ఏమిటి ? ఇక పహ్లజ్‌ నిహ్లానీ నియామకం, తొలగింపు ఏమి సూచిస్తున్నది. తన తిరోగమన భావాలను సమాజంపై రుద్ధితే వాటి ప్రభావం ఎలా వుంటుందో సంఘపరివార్‌ పరీక్షిస్తున్నది. రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే తమ మనసెరిగి నడుచుకున్నప్పటికీ నిహ్లానీని కొనసాగించటం నష్టదాయకం అని గ్రహించినట్లుగా కనిపిస్తున్నది. అన్ని రంగాలలో ఒకేసారి తమ అజెండాను రుద్దితే నష్టం కనుక బ్రిటీష్‌ వారి సేవలో నేర్చుకున్న విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా కాషాయ పరివారం కొంతకాలమైనా సినీరంగాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుందా అన్నది చూడాల్సి వుంది.

ఇక పాఠ్యపుస్తకాల నుంచి విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూరు అభిప్రాయాలు, కొన్ని భాషా పదాలు, ఇంకా ఏమేమి తొలగించాలో సూచిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి వుత్తన్‌ న్యాస్‌ రూపొందించిన డిమాండ్ల జాబితాను ఆ సంస్ధ నేత దీనా నాధ్‌ బాత్ర నాయకత్వంలో ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించారు. వాటిని ప్రముఖంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతర అనేక పత్రికలు ప్రచురించాయి. వాటిని చూసిన వారు ఇదేమి వైఖరని ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మీడియాపై చిందులు తొక్కుతున్నారు.

మీడియా సైద్ధాంతికంగా, వివక్షతో కూడినదే గాక దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పైన పేర్కొన్న సంస్ధ న్యాస్‌ జాతీయకార్యదర్శి అతుల్‌ కొథారీ ఆరోపిస్తే, మాజీ జర్నలిస్టయిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌కమ్యూనిసకేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన కెజి సురేష్‌ దాడి చేశారు. దొంగే దొంగని అరచినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వ్యవహారం వుంది. రవీంద్రుని భావాలను తొలగిస్తున్నారా అని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన దానికి ఒక స్వతంత్ర సంస్ధ అయిన ఎన్‌సిఇఆర్‌టి తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నట్లుగా అలాంటిదేమీ జరగబోవటం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఆ సంస్ధ ప్రతినిధులెవరూ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రంలో రవీంద్రుని గురించిన ప్రస్తావన లేదని, కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవాస్తవ వార్తలు ప్రచురించాయని, ఎక్స్‌ప్రెస్‌కు లీగల్‌ నోటీసు పంపుతామని న్యాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

తమ పత్రంలో లేని అంశాలను మీడియా పేర్కొన్నదని ఆరోపిస్తున్న పెద్దలు అసలు తాము సమర్పించిన దానిని బహిరంగపరిచి మీడియా చేసిన వక్రీకరణలను లోకానికి తెలియచేయవచ్చు. కానీ వారా పని చేయలేదు. అదేమీ రహస్యం కాదు, అయినా ఇంతవరకు దానిని అధికారికంగా బహిరంగపరచలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రాన్ని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు అందచేసినట్లు న్యాస్‌ ప్రతినిధులు అంగీకరించారు.దాని కాపీలను మిగతా వారికి అందచేస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. తాను రాసిన వార్తలపై ఎక్స్‌ప్రెస్‌ పత్రిక కట్టుబడి వుంది కనుకనే వారికి లీగల్‌ నోటీసు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. కనుక పత్రికా వార్తలు లేదా వ్యాఖ్యానాలతో విబేధిస్తున్న న్యాస్‌ తన పత్రంలో ఏం వుందో వెల్లడించాల్సిన బాధ్యత దాని మీదే వుంది.

తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ అని పేర్కొనటాన్ని కూడా న్యాస్‌ అభ్యంతర పెట్టింది. అసలు ఆర్‌ఎస్‌ఎస్సే నమోదిత సంస్ధ కాదు.జనాన్ని మభ్యపెట్టేందుకు లేదా వేరే ప్రయోజనంతో కావచ్చు, దానిలో పని చేసే ప్రముఖుల ఆధ్వర్యంలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. అవన్నీ వాస్తవానికి దాని కనుసన్నలలో పని చేసేవే అన్నది అందరికీ తెలిసిన సత్యం.ఆర్‌ఎస్‌ఎస్‌కు బిజెపి అనుబంధ సంస్ధ అని ఎక్కడా వుండదు. కానీ దాని నాయకులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. దానిలో సభ్యత్వాన్ని వదులుకోవాలని గతంలో జనతా పార్టీలో ఒక డిమాండ్‌ వచ్చినపుడు దానిలో విలీనమైన పూర్వపు జనసంఘనేతలెవరూ అంగీకరించలేదు. తరువాత వారంతా బిజెపిని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. సాంకేతికంగా అనుబంధం వుంటుందా అంటే వుండదు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె వంటి పార్టీలన్నీ తమ అనుబంధ సంస్ధలనాయకత్వాన్ని నియమిస్తూ బహిరంగంగానే ప్రకటిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలలో నాయకులుగా వున్న వారు అనేక ప్రజా సంస్ధలలో కూడా పని చేస్తూ వాటికి నాయకులుగా కూడా వుంటారు. అవి నిజానికి పార్టీ అనుబంధ సంస్ధలు కావు, పార్టీ సభ్యులు కాని వారు కూడా వాటిల్లో నాయకులుగా వుంటారు వాటిని అనుబంధ సంస్ధలని నిరూపించే ఆధారాలను ఎవరూ చూపలేరు. అయినా సిపిఎం అనుబంధ రైతు సంఘమనో, సిపిఐ అనుబంధ కార్మిక సంఘమనో మీడియాలో ప్రస్తావించటం చూస్తున్నాము. అయితే తమ అనుబంధ సంస్ధలు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకొనే వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న సంబంధాల గురించి అంజలీ మోడీ అనే జర్నలిస్టు స్క్రోల్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఆధారాలతో వివరించారు. అలాంటి వాటిలో ఒకటైన న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించిన ఐదు పేజీల పత్రంలో రవీంద్రుని పేరు ప్రస్తావించటాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆ పత్రపు ఐదవ పేజీలో’ రవీంద్రనాధ్‌ ఆలోచనా ధోరణిలో జాతీయవాదం-మానవతా వాదం మధ్య వైరుధ్యం వున్నట్లు చూపేందుకు ఒక ప్రయత్నం జరిగిందని ‘ న్యాస్‌ పేర్కొన్నది.

” ఎక్కడ ఆత్మ భయరహితంగా వుంటుందో ‘ అనే రవీంద్రుని కవిత, ఇతర అంశాలు ‘ జాతీయ సమగ్రతకు సవాళ్లు ‘ అనే శీర్షిక కింద సిబిఎస్‌యి ప్రచురించిన పదవ తరగతి ఆరవ యూనిట్‌ వర్క్‌బుక్‌లో వున్నాయి తప్ప ఎన్‌సిఇఆర్‌టి పుస్తకంలో కాదు. అయితే ఆర్‌ఎసెస్‌ సంస్ధ న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి ఇచ్చిన పత్రంలో తొలగించాలని లేదా సవరించాలని చెప్పింది వీటి గురించే. ఆ పాఠంలో చెప్పిందేమిటి ? ‘ మానవత్వం అన్నింటికంటే వున్నతమైనదని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయపడ్డారు. మతం ఒక ప్రమాదకర అంశంగా తయారైంది. అయితే స్ధిరత్వాన్ని సాధించాలంటే మత మౌఢ్యం,తీవ్రవాదాలను తొలగించాల్సి వుంది.’ అన్న వ్యాక్యం ఆ పాఠంలో వుంది.

పదకొండవ తరగతికి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ‘రాజకీయ సిద్ధాంతం ‘ అనే పాఠ్యపుస్తకంలో దేశ భక్తికి వున్న పరిమితుల గురించి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయాలను పొందుపరిచారు. ఎఎం బోస్‌కు ఠాగూరు రాసిన లేఖలోని అంశాలను దానిలో వుటంకించారు.’దేశభక్తి అంతిమ ఆశ్రయం దేవతలు(లేదా ఆధ్యాత్మికం) కారాదు, నేను మానవత్వాన్నే ఆశ్ర యిస్తాను.’ అని ఠాగూరు చెప్పారు. హిందీ అనువాదంలో దేశభక్తి అంటే జాతీయవాదం(రాష్ట్రవాద) అని, మానవత్వం అంటే మానవత అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొనే ఠాగూరు ఆలోచనల్లో వైరుధ్యం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ భావించి వుండవచ్చన్నది ఒక అభిప్రాయం.

ఈ వుదంతంలో ఒకటి మాత్రం స్పష్టం. ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదానికి ఠాగూరు ఆలోచనా ధోరణి పొసగదు. తాము చేప్పిన దేశభక్తి, జాతీయవాదం ప్రశ్నించవీలులేనివి అన్నట్లుగా వాటితో విబేధించేవారిని దేశద్రోహులుగానూ, పాకిస్ధాన్‌ లేదా చైనా అనుకూలురుగానో ముద్రవేసి దాడులు చేస్తున్నారు. ఆ పదాలకు సంఘపరివార్‌ లేదా దాని సమర్ధకులు చెబుతున్న భాష్యాలు వివాదాస్పదం, అభ్యంతరకరమైనవి.హిట్లర్‌ దృష్టిలో లేదా అనేక మంది ఐరోపా మితవాదుల దృష్టిలో ఇతర దేశాలపై రాజకీయంగా, ఆర్ధికంగా, మిలిటరీ తదతర అన్ని రంగాలలో జర్మనీ లేదా తమ దేశాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు పూనుకోవటమే జాతీయవాదం, దేశభక్తి. అందుకే జర్మనీ ఔన్నత్యాన్ని కాపాడేందుకంటూ వున్మాదాన్ని రెచ్చగొట్టిన హిట్లర్‌ ప్రపంచానికి ఎలా ముప్పుగా తయారైందీ చూశాము. అదే సమయంలో మన దేశంలో దేశభక్తి, జాతీయవాదం అంటే బ్రిటీష్‌ వారి వ్యతిరేకత, సర్వసత్తాక స్వతంత్ర ప్రభుత్వస్ధాపన. ఈ అవగాహనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకీభవించలేదు కనుకనే అది స్వాతంత్య్రానికి దూరంగా వుండిపోయింది. దాని నాయకులుగా వున్న సావర్కర్‌ వంటి వారు చివరికి బ్రిటీష్‌ వారికి లంగిపోయి, సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాంటి శక్తుల ప్రతినిధులే నేడు దేశభక్తి, జాతీయవాదానికి భిన్న భాష్యాలు చెబుతూ వాటిని అంగీకరించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న ప్రమాదకర పరిస్ధితి దేశంలో నేడు పెరిగిపోతోంది. తాము చెబుతున్న జాతీయవాదమే మానవత్వమని అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

దేశ చరిత్ర, వ్యక్తులు, భావజాలం వంటి సకల సామాజిక అంశాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ టీకా తాత్పర్యాలతో విబేధించే హక్కు ఇతరులకు ఎలా వుందో, ఇతరులు చెప్పిన వాటిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికీ వుంది. వాటి గురించి బహిరంగ చర్చ జరపాలి భిన్న పక్షాలు తమ వాదనలకు అవసరమైన రుజువులను చూపాలి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక అంశాలలో అది మానమ్మకం, మా మనోభావం, తరతరాల నుంచీ వస్తున్నదానిని ఎవరూ తిరస్కరించకూడదనే పేరుతో చర్చ నుంచి పారిపోతోంది. తన అజెండాను రహస్య పద్దతుల్లో అమలు జరిపేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే రాజ్యాంగ వ్యవస్ధలో తన భావజాలాన్ని ఏదో ఒక విధంగా అమలు జరిపే శక్తులతో నింపుతూ వారితో తన కార్యక్రమాన్ని అమలు చేయిస్తోంది.పైకి తాము జోక్యం చేసుకోవటం లేదని, తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తోంది.

ఎన్‌సిఇఆర్‌టికి సూచనలు, సిఫార్సులను సమర్పించిన న్యాస్‌ విషయమే చూద్దాం.దాని అధినేత తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం అని పేర్కొనటాన్ని విలేకర్ల సమావేశంలో తప్పు పట్టారు. పోనీ రెండు సంస్ధల మధ్య వున్న సంబంధం ఏమిటో సెలవివ్వండి అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, తమదీ వేర్వేరు స్వతంత్ర సంస్ధలని మాత్రమే చెప్పారు. శిక్షా సంస్కృతి వుత్తాన్‌ న్యాస్‌ అనే సంస్ధ రిజిస్టర్డు ఆఫీసు చిరునామా ఢిల్లీలోని నారాయణ విహార్‌లోని సరస్వతీ బాల మందిర్‌. ఆ పాఠశాలను నడుపుతున్నది విద్యాభారతి అనే మరొక సంస్ద. దాని వెబ్‌సైట్‌లో జీవితంలో ఒక లక్ష్యం వుండాలనే భావనతో 1952లో కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పిల్లల విద్యను చేపట్టినట్లు స్పష్టంగా రాసుకున్నారు. అంతే కాదు హిందుత్వకు కట్టుబడి ూండే, దేశభక్తిని చొప్పించే ఒక జాతీయ విద్యా వ్యవస్ధను కూడా అభివృద్ధి చేయటం తమ లక్ష్యంగా కూడా దానిలో చెప్పుకున్నారు. విద్యా భారతి మాజీ అధిపతి దీనా నాధ్‌ బాత్రా న్యాస్‌ స్ధాపకులలో ఒకరు. వీరందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి ఆ సంస్ధ పత్రిక ఆర్గనైజర్‌లో 2008లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం బృందావన్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కొంతమంది అధికారుల బాధ్యతలలో మార్పులు చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సరకార్యవాహక్‌ శ్రీ మోహన్‌ భగవత్‌ దిగువ మార్పులను ప్రకటించినట్లు దానిలో వుంది. ఆ జాబితాలో శిక్షా బచావో ఆందోళన్‌ నూతన అధిపతిగా అతుల్‌ కొథారీని నియమిస్తున్నట్లు వుంది. ఆయనే తరువాత ప్రస్తుత న్యాస్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఏమి చెప్పటానికైనా వెనుతీయరు. న్యాస్‌ పత్రంపై చర్చ జరిగితే ఆర్‌ఎస్‌ఎస్‌ నిజరూపం మరింతగా బహిర్గతం అవుతుంది, అది నష్టదాయకం కనుక ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు తొందరపడుతున్నారు, దానిలో భాగమే రవీంద్రుని భావజాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబోవటం లేదని రాజ్యసభలో ప్రకాష్‌ జవదేకర్‌ చేత చెప్పించటం. ఎన్‌సిఇఆర్‌టి దాని గురించి అధికారికంగా చెప్పేంత వరకు ఎవరేమి చెప్పినా దానికి విలువ లేదు. తన పత్రాన్ని వుపసంహరించుకున్నట్లు లేదా సవరించుకున్నట్లు న్యాస్‌ చెప్పేంత వరకు దీని గురించి ఎవరైనా చర్చించవచ్చు, ఆ తరువాత కూడా జరిగిందానిని ప్రస్తావించవచ్చు. తమను ప్రశ్నించే మీడియాను బిజెపి మంత్రులు, అనుయాయులు ప్రెస్టిట్యూట్స్‌ అంటూ కించపరుస్తున్న విషయం తెలిసిందే.(వళ్లమ్ముకొనే వారిని ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్స్‌ అంటున్నారు, తమను ప్రశ్నించే మీడియా వారు కూడా వారితో సమానం అంటూ ప్రెస్టిట్యూట్స్‌ అని దాడి చేస్తున్నారు)

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ న్యాస్‌ విషయానికి వస్తే తమ భావజాలానికి వ్యతిరేకమైనవి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాటిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నాయి. వుదాహరణకు ‘ మూడు వందల రామాయణాలు: ఐదు వుదాహరణలు, అనువాదంపై మూడు ఆలోచనలు ‘ అనే ఏకె రామానుజం వ్యాసాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ సిలబస్‌ నుంచి తొలగించాలని, వెండీ డోనిగర్‌ రాసిన ది హిందూస్‌ అనే పుస్తకాన్ని వుపసంహరించాలని న్యాస్‌ ఆందోళన చేసింది, కోర్టులకు ఎక్కింది. రామానుజన్‌ వ్యాసాన్ని తొలగించారు, రెండో పుస్తకాన్ని తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించిన దాని ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అంశాలుగా పేర్కొన్న వాటి సారాంశం ఇలా వుంది.

పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్రం

1984 ఘర్షణల గురించిన పేరా ఇలా అంతమౌతుంది.’ 2005లో పార్లమెంట్‌లో వుపన్యాసం సందర్భంగా సిక్కు వ్యతిరేక హింసాకాండలో రక్తపాతం జరగటం దానికి దేశం క్షమాపణలు చెప్పాలనటంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

రామాలయ ఆందోళనకు బిజెపి మరియు హిందుత్వ రాజకీయాల ఎదుగులకు సంబంధం వుందని ఒక పేరా చెబుతోంది. ఒక చోట బిజెపి ఒక హిందుత్వ పార్టీ అని మరొక చోట హిందుత్వ, హిందుపన్‌లు విడి సావర్కర్‌ కల్పితమని పేర్కొన్నారు. మరొక చోట బాబరీ మసీదును మీర్‌ బక్షి నిర్మించాడని….రాముడి జన్మస్ధలంలోని రామాలయాన్ని ధ్వంసం చేసి దానిని నిర్మించారని కొందరు హిందువులు విశ్వసిస్తారని వుంది. గోద్రాలో 2002లో జరిగిన వుదంతం గురించిన చోట ఒక రైలుకు నిప్పంటుకుందని…. దానికి ముస్లింలో కారణమనే అనుమానంతో’ అనే వ్యాక్యంలో నిప్పుంటుకుంది అనే పదాన్ని తగులబెట్టారు అని సవరించాలని, అనుమానం అనే పదాన్ని తొలగించాలని న్యాస్‌ కోరింది. మరొక చోట ‘ అటువంటి మారణకాండకు పధకాలు వేసిన వారికి కనీసం రాజకీయ పద్దతులలో(ఓటింగ్‌) ద్వారా ఒక పాఠం చెప్పేట్లు మనం చూడగలమా అని వుంది.

తొలగించాల్సిన భాషా పదాల జాబితాలో ఆంగ్లంలో వైస్‌ ఛాన్సలర్‌,వర్కర్‌, మార్జిన్‌, బిజినెస్‌,బాక్‌బోన్‌, స్టాంజా, రాయల్‌ అకాడమీ, వుర్దు లేదా అరబిక్‌ భాషలోని బేటార్‌టిబ్‌, పోషక్‌, తాకత్‌, ఇలాకా, అక్సర్‌, ఇమాన్‌, జోకిహిమ్‌,మెహమాన్‌-నవాజీ, చమర్‌, సారే ఆమ్‌, ఇవిగాక భ్రష్టపదాలుగా వుల్లు కహిన్‌కా, కాంబఖత్‌, బద్మాష్‌, లుచ్చే-లఫంగే, బహంగియోన్‌ వున్నాయి.

తొమ్మిదవ తరగతిలో రామధరీ సింగ్‌ దినకర్‌ ఒక ప్రేమికుని వాంఛలు అనే కవిత వలన పిల్లలు తప్పుదారి పడతారు,శీలాన్ని కోల్పోతారు కనుక, కేంద్ర ప్రభుత్వం చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ కార్యకలాపాలు దేశ ఐక్యతం, గణతంత్రానికి ముప్పు అని భావిస్తున్నందున పదకొండవ తరగతిలో ఆయన ఆత్మకథను తొలగించాలని కోరారు. కన్నడ కవయిత్రి అక్క మహా దేవి ఒక సంఘటనను పేర్కొంటూ దానికి నిరనగా తన దుస్తులను తొలగించినట్లు ఒక పాఠంలో వుంది. ఒక నగ్న మహిళను వర్ణించటం మహిళల స్వేచ్చ పేరుతో హిందూ సంస్కృతిని కించపరచటమే అని న్యాస్‌ వాదించింది.

చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాల సారం ఇలా వుంది. వేదాల అనంతర కాలంలో సాధారణంగా మహిళలను సూద్రులతో సమంగా పరిగణించారు. దేవుడి ముందు అన్ని మతాల వారు సమానమే అనే సులహ్‌ ఏ కుల్‌ విధానాన్ని అక్బర్‌ ప్రవేశపెట్టారు. వితంతువుల దురదృష్టాలు, సామాజిక బహిష్కరణల గురించి 19వ శతాబ్ది మహిళా వుద్యమకారిణి తారాబాయ్‌ షిండే రాసిన పుస్తకంలో పితృస్వామ్య వ్యవస్ధపై తీవ్ర విమర్శ వుంది. దానిని కూడా తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ కోరింది. మరొక పుస్తకంలో వర్ణాశ్రమ వ్యవస్ధ గురించిన ప్రస్తావన ఇలా వుంది. ‘పుట్టుకతోనే హోదా నిర్ణయమౌతుంది. వారు(బ్రాహ్మలు) జనం ప్రతిష్ట పుట్టుక మీదే ఆధారపడి వుందని గుర్తించేందుకు ప్రయత్నించారు… అలాంటి అర్హతల గురించి మహాభారతం వంటి అనేక పుస్తకాలలోని కధలతో పటిష్టపరిచారు.’ ఆర్యుల యుద్ధ దేవుడు ఇంద్రుడిపై మొహంజదారో చివరి దశలో స్త్రీ పురుషులను వూచకోత కోశాడనే ఆరోపణలున్నాయి. ఒక చోట మొగల్‌ కాలంలో పాలకులు జనం పట్ల ఎంతో వుదారంగా వుండేవారు, మొగలాయీ పాలకులందరూ ప్రార్ధనా మందిరాల నిర్మాణం, నిర్వహణకు నిధులు ఇచ్చారు. యుద్ధాల సందర్భంగా దేవాలయాలు నాశనమైతే తరువాత వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసేవారు.అని వుంది. ఇలాంటి వాటన్నింటినీ తొలగించాలి, సవరించాలి అని న్యాస్‌ పేర్కొన్నది.

ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం, మనువాద వ్యవస్ధను పరిరక్షించటం, తమ భావజాలానికి తగిన విధంగా లేక వ్యతిరేకంగా వుంటే రవీంద్రుని వంటి వారి ఆలోచనలను కూడా నూతన తరాలకు అందకుండా చూడటం, తమ దుష్ట చరిత్రను మరుగుపరచటానికి విద్యారంగాన్ని వినియోగించుకోవాలని కాషాయ దళాలు చూస్తున్నాయన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

30 Tuesday May 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Buddha, Dalit, manuvadis, mental slavery, soaps, Yogi Adityanath

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

అసంగ్‌ వాంఖడే

ఇదిగో నా నైవేద్యం

మనువు నన్ను మలినం గావించాడు

మీ అసహ్యబుద్ది

మాకు దుర్గంధం వంటి కులనామాన్నిచ్చి వెలివేసింది

గాయాల వాసనతోనే నేను ప్రకాశించాను

నాపై వున్నది అణచివేత జాడలు తప్ప మీ దుర్గంధం కాదు

మీ దేవుడి ప్రసన్నం కొరకు

ఈ రోజు నాకు షాంపూ, సబ్బులు ఇచ్చారు

మైనారిటీల హింస, మానభంగాలను వల్లించే

మీ కంపునోళ్లను కడిగేందుకు వాటినెప్పుడైనా వాడారా

మనువాదం, వర్ణాశ్రమ ధర్మం అని ప్రవచించే

బుద్ధి శుద్ధికి పుపయోగించారా

మీ కానుకలతో

మీరు నా మాన మర్యాదలను మంటగలిపారు

నా నైవేద్యంతో

మీ అహంభావ, గర్వాలను అసహ్యించుకుంటున్నా

మా బాబా సాహెబ్‌ చర్యలు

నా క్షణభంగురమైన వాసనలను శుద్ధి చేస్తాయి

నా కుల అణచివేత, వెలి గాయాలను సబ్బులు మరింత మండిస్తాయి

నాకు మీ సానుభూతి అవసరం లేదు

నాకు మీపై ద్వేషం కావాలి

నిరసన కేకల మధ్య

నా ఆత్మప్రతిష్ట గానం వినిపిస్తాను

అదే నాకు ఆత్మగౌరం, స్వాతంత్య్రాలను,

రణానికి స్వేచ్చ నిస్తుంది.

రెండు సార్ల తిండి కోసం

నేను నీ మలమూత్రాలను మోస్తాను

లేదంటే ఈ సర్వసత్తాక రాజ్యంలో

నేను ఆకలితో నిద్రపోవాలి

సబ్బులు, షాంపులు మీ అజా&క్షన ఆకలిని తప్ప

మా కడుపులను నింపవు

దేశ వెలుగుల ప్రసరణ కోసమే మీ ప్రభువు ఇక్కడున్నాడు

ఆయన ఆహ్లాదం కోసం మమ్మల్ని శుద్ధి చేశారు

భజనపరుల మాదిరి చిరునవ్వులు చిందించమన్నారు

మా అంతరంగం తన మౌనాన్ని వీడితే ఎలాంటి కంపనలు వస్తాయో తెలుసా ?

ఓ దేవుడా మా ఇంటిని చూసేందుకు దయచేయి

అది మీ కాషాయ అంగవస్త్రం కంటే శుభ్రంగా వుంటుంది

అయితే నీ అంతరంగం పరిశుద్ధంగా వున్నపుడు మాత్రమే మాట్లాడు

మనువును తగులబెట్టిపుడు మాత్రమే నవ్వు

నీ హృదయంలో నృత్యం చెయ్యి

నా నిశ్శబ్దం బద్దలు కాబోతున్నది

ఇప్పటికే వుషోదయమైంది

మీరు వెనుదిరిగి వెళ్లే ముందు ఇదే నా నైవేద్యం

నేను అంబేద్కర్‌, బుద్దుడు అనే సబ్బులను అర్పిస్తున్నాను

వెళ్లి మీ మానసిక బానిసత్వాన్ని శుద్ధి చేసుకోండి

మీ తాత్వికతలో మనువు చొప్పించిన కులాన్ని అంతం చేయండి

మీ కాషాయ అంగవస్త్రాన్ని తెల్లగా చేయండి

మా వైపు ఇద్దరు సూర్యులు వుండ కూడదు

మిమ్మల్ని భస్మం చేసేందుకు మా స్వంత సూర్యుడున్నాడు

కొద్ది రోజుల క్రితం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధుడు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సందర్భంగా దళితులకు సబ్బులు, షాంపూలు ఇచ్చి యోగి దర్శనానికి శుభ్రంగా స్నానం చేసి రమ్మని ఆదేశించారు. దానిపై న్యాయవాది, కవి అయిన అసంగ్‌ వాంఖడే స్పందనే ఈ కవిత. అనువాదం ఎం కోటేశ్వరరావు. నేను స్వతహాగా కవిని కాదు కనుక అనువాదంలో ఆ ఆవేశం వుండదు కనుక విమర్శకులు మన్నించాలి. అందువలన ఆంగ్ల మూలాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

Here is my offer
Manu made me unclean.
Your prejudiced mind makes me
reek of caste names and exclusion
I glow with the fragrance of sores,
I stink of oppression and not your shit.

To please your lord, you offered me
soap and shampoo today.
Have you ever used them to clean
those foul smelling tongues,
which talk of raping minorities and violence?
Or used them to clean those brains,
that preach Manuvād and varnashramadharma?

With your offer,
you have abused my dignity.
With my offer,
I am abusing your conceit.

Appropriators of my Babasaheb
act as my ephemeral cleansers.
Soap exacerbates my wounds
of caste oppression and exclusion,
I don’t want your sympathy,
I want your detestation.
I play the song of assertion
in the cries of protests;
It gives me dignity and freedom,
a freedom to fight for.

For two meals
I carry your faeces!
If I don’t, I will sleep
hungry in this Republic.
Soap and shampoo only feed your ignorance,
not my stomach.

Your lord is here to capture the nation’s spotlight
We are bleached, to look presentable;
We are told to cheer like minions,
What will tremble when my insides break their silence?

Oh Lord, come see my home!
It is cleaner than your bhagwa drape.
But talk only when your consciousness is clean;
Smile only when you burn the Manu
dancing in your heart.
For my silence is about to break,
It is dawn already.

Before you turn your back
here is my offer.
I offer you my soaps, Ambedkar and Buddha.
Go clean your mental slavery,
Go annihilate caste and the Manu infused in your reason,
bleach your bhagwa to white.
There cannot be two Suns on this side, and
We have our own, to incinerate yours.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లండన్‌లో ప్రయోగాత్మక నాటకం ‘ యువ మార్క్స్‌’

20 Thursday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Literature.

≈ Leave a comment

Tags

Karl Marx, Karl Marx and Friedrich Engels, Karl Marx comedy, London's new Bridge theatre, Young Marx

నాటికలో యువ మార్క్స్‌ పాత్రధారి రోరీ కిన్నియర్‌

ఎం కోటేశ్వరరావు

కారల్‌ మార్క్స్‌ ! 1848లో స్నేహితుడు ఫెడరిక్‌ ఎంగెల్స్‌తో కలసి కమ్యూనిస్టు ప్రణాళికను రచించి, విడుదల చేసిన నాటి నుంచి ప్రపంచంలో ప్రతి మూలా ప్రతి రోజూ వ్యతిరేకులో, సమర్ధకులో వారి పేర్లు, వాటితో విడదీయరాని కమ్యూనిస్టు భావజాలం గురించి చర్చించని, ప్రస్తావించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మానవ జాతి చరిత్రలో ఒక పెద్ద మలుపుకు కారణమైన ‘యువ కారల్‌ మార్క్స్‌ ‘ లండన్‌లో గడిపిన జీవితం గురించి ఒక నాటికను అక్టోబరు నుంచి ప్రదర్శించనున్నారనేది తాజా వార్త. నూతనంగా ప్రారంభమైన బ్రిడ్జి ధియేటర్‌ నుంచి వెలువడుతున్న తొలి ప్రదర్శన ఇది. థేమ్స్‌ నదిపై వున్న న్యూ బ్రిడ్జి ప్రాంతంలో 900 సీట్లతో కొత్తగా నిర్మించిన వాణిజ్య ప్రదర్శనశాల ఇది. గత పదిహేను సంవత్సరాలలో లండన్‌లో ధియేటర్లకు వచ్చి నాటకాలు చూసే ప్రేక్షకులు 25శాతం పెరిగినట్లు ఒక సర్వేలో తేలింది.

Nick Starr and Nicholas Hytner.

బ్రిడ్జి ధియేటర్‌ వ్యవస్ధాపకులు నిక్‌స్టార్‌, నికొలస్‌ హిట్నర్‌

నాటిక, నాటక, సినిమా తదితర కళారూపాల నిర్మాణానికి వృత్తాంతంగా మార్క్సు-ఎంగెల్స్‌లను ఎంచుకోవటమే ఒక ప్రత్యేకత. వారి గంభీర జీవితాలను, రచనల ద్వారా ప్రపంచానికి అందచేసిన సందేశాన్ని టిక్కెట్లు కొని చూసే వీక్షకుల ముందు రక్తి కట్టించటం సాహసం, పెద్ద ప్రయోగమే. లండన్‌లో మార్క్సు కుటుంబం అష్టకష్టాలు పడిందన్నది లోకవిదితం. అలాంటి జీవితం 1850 తొలిరోజుల గురించి ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారన్నదే ఆసక్తికరం. కుటుంబ జీవనం ఇబ్బందుల్లో పడింది, అప్పటికే జర్మనీ నుంచి అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయి కాళ్లు, చేతులు కాయలు కాచిన విప్లవకారుడు.నాటి పాలకవర్గాలు అత్యంత భయంకరమైన తీవ్రవాదిగా పరిగణించిన మార్క్స్‌ పశ్చిమ లండన్‌లోని సోహో ప్రాంతంలోని డీన్‌ వీధిలో ఎవరికీ తెలియకుండా జీవించిన రైల్వేలో వుద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, తదితర అంశాలను ఈ నాటికలో ప్రదర్శించనున్నారు. వ్యంగ్య, హాస్య రచనలు చేసే రిచర్డ్‌ బీన్‌, క్లైవ్‌ కోల్‌మెన్‌ ద్వయం గంభీరమైన కారల్‌మార్క్సు జీవితంలో వాటిని ఎలా చొప్పించారో చూడాల్సి వుంది. లండన్‌లోని ప్రఖ్యాత నేషనల్‌ ధియేటర్‌లో మాజీ డైరెక్టర్‌గా వున్న సర్‌ నికోలస్‌ హిట్నర్‌ ఈ నాటిక దర్శకుడు, బ్రిడ్జి ధియేటర్‌ సహ వ్యవస్దాపకుడు. రోరీ కిన్నియర్‌ మార్క్స్‌గా ఎంగెల్స్‌గా ఆలివర్‌ క్రిస్‌ నటిస్తున్నారు.

The Bridge theatre will open in October 2017

ప్రారంభానికి సిద్ధమైన బ్రిడ్జి ధియేటర్‌

ఏడాదికి కనీసంగా నాటకాలను ప్రదర్శించటం తమ లక్ష్యమని ‘యువ మార్క్స్‌’ తరువాత ప్రదర్శనకు సిద్దం చేస్తున్న ఎనిమిది నాటకాల పేర్లను కూడా నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. వీటిలో షేక్సిపియర్‌ రచన జూలియస్‌ సీజర్‌ తప్ప మిగిలిన వన్నీ కొత్త రచనలే. వాటిలో నాలుగింటిలో మహిళలే నటిస్తున్నారు. లండన్‌కు కొత్త నాటక సంస్ధల అవసరం వుందని, తాము ప్రజాకర్షకమైన,సాహసవంతమైన ఇతివృత్తాలతో వీక్షకులను వుద్వేగ భరితులను చేసే విధంగా, నిజంగా ఒక రాత్రిని మంచిగా గడిపామనుకొనే విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లండన్‌లో వాణిజ్య తరహా నాటక ధియేటర్లు తొమ్మిది వున్నాయి. కొత్త ధియేటర్‌ కొత్త ప్రాంతంలో రాకతో వాటి మధ్య పోటీ పెరగవచ్చని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హనుమాన్‌ గుడిలో వివాహం మాదిరి …….నోబెల్‌ ఎంపికలు ?

18 Tuesday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Literature., Opinion

≈ Leave a comment

Tags

nobel, nobel prize, nobel prize controversy

ఎంకెఆర్‌

      తన గుడిలో ఎవరైనా వివాహం చేసుకుంటే ఆంజనేయ స్వామికి ఎలా వుంటుంది. తన బ్రహ్మచారి వ్రతాన్ని భంగం చేశారనే ఆగ్రహం కలగదా ? విశ్వాసం వున్నవారు చెప్పాలి. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌కు పునర్జన్మంటూ వుంటే తన వాంఛలకు భిన్నంగా ఇవ్వటం ఏమిటని కమిటీ సభ్యులను తన పేరుతో ఇస్తున్న కొన్ని బహుమతుల విషయమై నిలదీస్తాడని మాత్రం చెప్పవచ్చు. తాజాగా స్వేచ్చా మార్కెట్‌ భావజాలపు ఆర్ధికవేత్తలిద్దరికి ఈ బహుమతి ఇచ్చారు. ప్రపంచవ్యాపితంగా ఏ కాంట్రాక్టు కార్మిక విధానాన్నయితే కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారో ఆ విధానంపై పని చేసిన వ్యక్తులు వారు. అది యజమానులకు మరిన్ని లాభాలు చేకూర్చి పెడుతోంది తప్ప కార్మికులకు కాదన్నది ఇప్పటికే విదితమైంది.కొన్ని సందర్భాలలో బహుమతుల ఎంపిక తీవ్ర విమర్శలకు దారితీసింది. మచ్చుకు కొన్నింటిని చూద్దాం.

    1918లో రసాయశాస్త్రంలో నోబెల్‌ బహుమతి తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం వ్యవసాయానికి అవసరమైన ఎరువుల తయారీలో వుపయోగిస్తున్న అమోనియాను పెద్ద మొత్తంలో తయారు చేసే ప్రక్రియను కనుగొన్న ఫిట్జ్‌ హెబర్‌కు బహుమతి ఇచ్చారు. అయితే సదరు శాస్త్రవేత్త మొదటి ప్రపంచ యుద్ధంలో మారణహోమానికి వినియోగించిన రసాయన క్లోరీన్‌ వాయువును కూడా కనుగొన్నాడు. యుద్ధంలో ఆ వాయువుతో రసాయన ఆయుధాలు తయారు చేసి ప్రయోగించటాన్ని ఆ పెద్ద మనిషి జీవితాంతం సమర్ధించాడు. అలాంటి వ్యక్తికి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే శాస్త్రవేత్తలకు ఇచ్చే బహుమతిని ప్రదానం చేయటం ఏమిటని తీవ్ర నిరసన వ్యక్తమైంది. డైనమైట్‌ను కనుగొన్న ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ దానితో పాటు ఇతర ఆయుధ వ్యాపారాలలో పెద్ద మొత్తం సంపాదించాడు. అయితే ఒక ఫ్రెంచి దినపత్రిక అతనిని ఒక ‘మృత్యు వ్యాపారి ‘ అని వర్ణించటాన్ని తట్టుకోలేకపోయాడు. దాంతో తాను సంపాదించిన దానిని శాంతియుత, ప్రజా ప్రయోజనాలకు వినియోగించేందుకు ఆ దిశగా కృషి చేసే వారికి ఇవ్వాలని తన సంపదతో ఒక ట్రస్టును ఏర్పాటు చేశాడు.

   వియత్నాంపై రసాయనిక దాడులతో సహా సకల దుర్మార్గాలకు నాయకత్వం వహించిన వారిలో అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసెంజరు ఒకడు. కాల్పుల విరమణ గురించి ఒకవైపు చర్చలు జరుపుతూనే మరో వైపు హానోయ్‌పై దాడులు జరపాలని స్వయంగా ఆదేశమిచ్చిన దుర్మార్గుడు. దురాక్రమణ, యుద్ధంలో ఓడిపోయిన అమెరికన్లు చివరకు ఒప్పందం చేసుకొని వియత్నాం నుంచి నిష్క్రమించిన విషయం తెలిసినదే. అలాంటి కిసింజరుకు, నాటి వుత్తర వియత్నాం నేత లీ డక్‌ థోకు కలిపి 1973లో వుమ్మడిగా శాంతి బహుమతిని ప్రకటించారు. దీనికి నిరసనగా బహుమతి తీసుకొనేందుకు లీ తిరస్కరించారు.కీసింజర్‌ను ఎంపిక చేయటాన్ని నిరసిస్తూ అవార్డు కమిటీ సభ్యులిద్దరు రాజీనామా చేశారు.

   పశ్చిమాసియాలో అశాంతికి కారణం ఇజ్రాయెల్‌ యూదు దురహంకారం, పాలస్తీనా దురాక్రమణ. వాటికి వ్యతిరేకంగా పోరాడిన పాలస్తీనా విమోచనా సంస్ధ నాయకుడు యాసర్‌ అరాఫత్‌. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత అమెరికన్ల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి విమర్శలకు గురైనప్పటికీ పోరాట యోధుడిగా అరాఫత్‌ పాత్రను చరిత్ర విస్మరించజాలదు. అలాంటి యోధుడికి, పాలస్తీనియన్లపై దుర్మార్గాలకు పాల్పడిన ఇజ్రాయెల్‌ ప్రధాని రాబిన్‌, విదేశాంగ మంత్రి పెరెజ్‌కు కలిపి 1994 శాంతి బహుమతి ప్రకటించారు. ఇంతవరకు స్వతంత్ర పాలస్తీనా కల నెరవేరలేదు. నిత్యం అరబ్బులపై దాడులు జరుగుతూనే వున్నాయి. ఒక నిర్భంధ శిబిరంలో వున్నట్లు వారి జీవితం వుంది.

    అధికారానికి వచ్చి కేవలం తొమ్మిదినెలలు మాత్రమే గడిచిన తరువాత 2009లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ‘శాంతి ‘ బహుమతి ఇచ్చారు. ఒబామాకు ఇస్తున్నది నోబెల్‌ బహుమతి, ‘జార్జి బుష్‌ అవార్డు ‘ కాదు అంటూ యుద్ధ,జాత్యంహంకార వ్యతిరేక వుద్యమ నేత బ్రెయిన్‌ బెకర్‌ దుయ్యబట్టారు. బహుమతి ఇవ్వటం ద్వారా ఒబామా బలపడతారని అనుకున్నాం, అదేమీ జరగలేదు, అనేక మంది ఒబామా మద్దతుదార్లు కూడా బహుమతి ఇవ్వటం తప్పిదమే అని భావించారు ‘ అని నోబెల్‌ సంస్ధ మాజీ డైరెక్టర్‌ గెయిర్‌ లాండెస్టెడ్‌ 2015లో తన ఆత్మకధలో రాసుకున్నాడు. మహాత్మాగాంధీకి శాంతి నోబెల్‌ బహుమతి ప్రదానం చేయకపోవటం అతి పెద్ద తప్పిదమని కూడా లాండ్‌ స్టెడ్‌ పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు రెండుసార్లు, తరువాత మూడు సార్లు ఆయన పేరును కమిటీ పరిగణనలోకి తీసుకున్నది. అయితే ప్రపంచానికి అధినేతగా వున్న బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన యోధుడిగా వున్న గాంధీని గుర్తించేందుకు నాటి కమిటీలోని పెద్దలు సుముఖత చూపలేదు. దీన్ని బట్టే నోబెల్‌ కమిటీ ఎంపికలు సైద్ధాంతిక, రాజకీయ ప్రాతిపదికన జరుగుతాయన్నది తేలిపోయింది.

     ఆరుదశాబ్దాల పాటు ప్రపంచంలో శాంతి, సామరస్యాలు, మానవహక్కుల పరిరక్షణకు చేసిన కృషి పేరుతో 2012లో ఐరోపా యూనియన్‌కు శాంతి బహుమతిని ప్రదానం చేశారు. వాస్తవానికి ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, లిబియా తదితర దేశాలపై అమెరికా నాయకత్వాన జరిపిన దుర్మార్గమైన దాడులు, లక్షలాది మంది ప్రాణాలు, నిర్వాసితులను చేసిన దుష్టత్వంలో ఐరోపా యూనియన్‌ అగ్రదేశాలన్నీ ముందున్నాయి. పొదుపు చర్యల పేరుతో అప్పటికే గ్రీసు పౌరుల నవరంధ్రాలను బిగించటం ప్రారంభించింది ఆ సంస్ధ. ‘నిరాయుధీకరణకు కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వాలన్న ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వాంఛకు వ్యతిరేకంగా ఈ బహుమతి ఇచ్చారని ‘శాంతికోసం పనిచేసే మామ్మల సంస్ధ ‘ ప్రతినిధి ఎల్సా బ్రిట్‌ ఎంగర్‌ వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్‌ ఆ పని చేయకపోగా ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువగా తయారు చేసే వాటిలో ఒకటిగా వుందన్నారు. గతంలో శాంతి బహుమతులు పొందిన ఆర్చిబిషప్‌ డెస్మండ్‌ టూటూతో సహా అనేక మంది ఈ బహుమతి ప్రకటనను విమర్శిస్తూ బహిరంగంగా ప్రకటన చేశారు.

    తాజా వివాద విషయానికి వస్తే ప్రపంచీకరణలో ఒక ముఖ్యాంశమైన కాంట్రాక్టు విధానం గురించి పరిశోధనలు చేసిన ఆర్ధికవేత్తలు ఆలివర్‌ హర్ట్‌, బెంట్‌ హామ్స్‌ట్రోమ్‌లను బహుమతికి ఎంపిక చేశారు. ప్రపంచీకరణ విఫలమైందని, ఆర్ధిక అంతరాలు ఎన్నటి కంటే పెరిగాయని థామస్‌ పికెటి వంటి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలే స్పష్టం చేయటం, అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, దానిలో భాగంగానే ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకొనేందుకు నిర్ణయించిన ఈ తరుణంలో ప్రజావ్యతిరేకమైన కాంట్రాక్టు సిద్దాంతానికి గౌరవం కల్పించటం నిజంగా గర్హనీయం. ఏ కృషి అయినా జనానికి వుపయోగపడేదిగా వుండాలి తప్ప వారి శ్రమను దోపిడీ చేసే వారికోసం పని చేసిన వారిని గొప్పవారిగా గుర్తించటం కంటే దురన్యాయం కంటే మరొకటి లేదు. కార్మికులను దోచుకొనే స్వేచ్చామార్కెట్‌ ఆర్ధిక సిద్దాంతాలకు పెద్ద పీట వేయటానికే స్వీడిష్‌ పెట్టుబడిదారులు నిర్ణయించి ఆ మేరకు ఈ బహుమతులను ప్రారంభించారు. నిజానికి ఆర్ధిక శాస్త్రవేత్తలను బహుమతి ఇవ్వాలని నోబెల్‌ కోరలేదు.ఈ బహుమతుల ప్రదానం ప్రారంభించిన 70 సంవత్సరాల తరువాత తొలిసారిగా 1969లో ఆర్ధిక రంగంలో ఇచ్చారు. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తిగా ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌కు పేరుంది. అలాంటి వ్యక్తి హృదయ పూర్వకంగా చెప్పాలంటే వ్యాపారాన్ని తాను అసహ్యించుకుంటున్నానని, తాను ఒక సోషల్‌ డెమోక్రాట్‌ అని ఒక సందర్భంగా చెప్పాడు. సోషల్‌ డెమోక్రాట్లు వ్యతిరేకించే స్వేచ్చా మార్కెట్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే వారికి తప్ప వ్యతిరేకించే వారికి ఇంతవరకు ఈ బహుమతి ఇవ్వలేదు.

   ఈ ఏడాది సాహిత్యరంగంలోతొలి సారిగా గీత రచనకు బహుమతి ప్రకటించిన అమెరికన్‌ పాప్‌ గాయకుడు, రచయిత బాబ్‌ డైలాన్‌ ఎంపికపై కొందరు విమర్శలు చేయటంతో డిసెంబరు పదవ తేదీన డైలాన్‌ బహుమతి స్వీకరిస్తారా లేదా అన్నది సందేహంలో పడింది. తాము బహుమతి ప్రదానం గురించి తెలిపేందుకు, స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు అనేక సార్లు ప్రయత్నించినా డైలాన్‌ నుంచి స్పందన లేదని తామింక ఆ ప్రయత్నాలు మానుకున్నట్లు నోబెల్‌ అకాడమీ కార్యదర్శి సారా డానియెస్‌ ప్రకటించారు.బహుమతి ప్రకటించిన రోజే లాస్‌ వేగాస్‌లో కచేరీ చేసిన డైలాన్‌ తనకు వచ్చిన బహుమతి గురించి ప్రస్తావించలేదు. ఆయన సాహిత్యానికి నోబెల్‌ బహుమతి స్ధాయి లేదని కొందరు ఆరోపించారు. డెభ్బై అయిదు సంవత్సరాల వయసులో కూడా కచేరీలు చేస్తున్న డైలాన్‌ తన పాటలతో ఎన్నో తరాలను ప్రభావితం గావించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాచ్‌మన్ల జాతి పిత నరేంద్రమోడీ

29 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, Literature., Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, tdp, tdp mahanadu, telugudesam, YS jagan

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వర్గంలో గోబెల్స్‌తో కాషాయం భేటీ

08 Tuesday Mar 2016

Posted by raomk in Current Affairs, Literature.

≈ Leave a comment

Tags

Bjp nationalism, Gobbles, nationalism, RSS, saffron Sainik

చివరి భాగం

సత్య

    రంగు రంగుల పూల చొక్కా వేసుకొని మత్తెక్కించే మదన వాసనల సెంటు గుభాళిస్తుండగా గోబెల్స్‌ దిగాడు. వెనుకే జూనియర్‌ రంభ కూడా వుంది. చొంగ కార్చుకుంటూ నోరెళ్ల బెట్టిన కాషాయం గోబెల్స్‌ బదులు ఆమెను ఆబగా చూశాడు. ఇదేం పాడుబుద్ది , ఒకరి ఇలాకాలో వున్న దాన్ని ఇలా చూస్తాడు , ఆ మాత్రం నీతి లేదా అనుకుని చీదరించుకొని కాషాయాన్ని కోపంగా చూస్తూ తలపై చీర కొంగు కప్పుకొని పైకి వెళ్లి పోయింది.

     దాంతో గతుక్కుమన్న కాషాయం నాజీ వందనం చేయటం కూడా మరిచి పోయి అలవాటు ప్రకారం గురువుగారూ అంటూ గోబెల్స్‌ కాళ్లమీద పడిపోయాడు. ఇది వూహించని గోబెల్స్‌ కాళ్లు లాగి పడవేయటానికి వచ్చిన వాడేమో అనుకొని అంతే వేగంగా వెనక్కు తగ్గాడు, దాంతో కాషాయం నేలమీద పడి మోచేతులూ , ముక్కు బద్దలు కొట్టుకున్నాడు.

    దులుపుకుంటూ లేచి నేను సార్‌ కాషాయాన్ని అన్నాడు. గోబెల్స్‌ సాలోచనగా నఖశిఖ పర్యంతం చూశాడు. అక్కడక్కడా స్వస్తిక్‌ బొమ్మలు కనిపిస్తున్నాయి. వెంటనే ఎవరో తోటి జర్మన్‌ అనుకుని తాను ఇక్కడికి వచ్చే 70ఏళ్లు దాటింది కదా, తోటి నాజీలందరూ విచారణ తప్పించుకొనేందుకు ఎటెటో వెళ్లి పోయి రకరకాల వేషాలు వేశారని తెలిసింది, గనుక ఎవరో గుర్తుకు రావటంలేదు ,అయినా ఎవరు నువ్వు అని అడిగితే బాగుండదని వై గెట్‌ ఎస్‌ డిర్‌ అన్నాడు. అర్ధంగాని కాషాయం తనను కాదనుకున్నాడు. వెర్రిమొహం వేసుకు చూశాడు. ఎలా వున్నారు మీరు అని గోబెల్స్‌ జర్మన్‌ భాషలో అడిగాడు. వెంటనే స్పందన లేకపోవటంతో వచ్చిన వాడు తెలుగు వ్యక్తి అని గ్రహించాడు.

    స్వర్గం అంటే తినటం, తాగటం రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమల వంటి వారో లేక వారు బిజీగా వుంటే జూనియర్స్‌తోనో విచ్చల విడిగా తిరగటమే కదా. మన వాడు జర్మనీలో కూడా అలాంటి గ్రంధసాంగుడే గాక మంచి మాటకారి కూడా. కనుక పలు భాషల భామలతో సంబంధాలు పెట్టుకోవాలంటే దాదాపు ముఖ్యమైన భాషలన్నీ నేర్చుకున్నాడు. వాటిలో తెలుగు ఒకటి. వెంటనే జర్మన్‌ యాసలో కాషాయం ఎలా వున్నారు, బాగున్నారా అని అడిగాడు.

    అసలు గోబెల్స్‌ దర్శనం దొరకటమే గొప్ప అనుకుంటే ఇంత ఆప్యాయంగా పలకరింపా అని కాషాయం మరింతగా తబ్బిబ్బు అయిపోయాడు. బాగున్నా బాగున్నా అంటూ ఆనందబాష్పాలు రాల్చాడు

    ఈ మధ్య ఏపికి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుల గుర్తింపు, సింగపూర్‌, మలేషియా, తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు, హైదరాబాదు పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మార్చటం, భూపంపకం వంటి వార్తలను ఇంటర్‌నెట్‌ తెలుగు పేపర్లలో చదివి తెలుగు వారంటే అల్ప సంతోషులనే భావం ఏర్పరచుకున్నాడు గోబెల్స్‌ . అది బయటకు రానివ్వకుండా మన వాళ్లంతా క్షేమమేనా అని అడుగుతూ బోయ్‌ నాకు విస్కీ మన కాషాయానికి మంచి నీళ్లు పట్రా అని…. సారీ మీరు కూడా విస్కీ తీసుకుంటారా ? ఈ మధ్య మీ దగ్గర ఎక్కడ బడితే అక్కడ విస్కీ దొరుకుతోందటగా అన్నాడు. ఈలోగా బోయ్‌ వెళ్లటం ఒక చేత్తో విస్కీ, మరో చేత్తో మంచినీళ్లు తెచ్చాడు.

    ఫరవాలేదు సార్‌ ఫరవాలేదు సార్‌ అన్నాడే గానీ విస్కీ వద్దనలేదు, నాక్కూడా విస్కీ తెస్తే నీ సొమ్మేమైనా పోయిందా అన్నట్లు మొహం పెట్టి ఇష్టం లేకుండానే మంచినీళ్ల గ్లాసు అందుకున్నాడు కాషాయం. ఇంతలో ఒక సేవకుడు వచ్చి గోబెల్స్‌ చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే కాషాయం మీరు ఎలా వచ్చారు, ఎక్కడ దిగారు అని అడిగాడు గోబెల్స్‌.

    సార్‌ నేను వేద కాల విమానంలో నేరుగా వచ్చాను, వూర్వశీ నిలయంలో రూమ్‌ రిజర్వు చేసినట్లు చెప్పారు, వీలైతే మీ దగ్గరే మంచి రూం ఇప్పిస్తే అన్నట్లు చూశాడు. దానిని పట్టించుకోనట్లుగా ఓకే అయితే మనం సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడే కలుద్దాం అంటూ మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచాడు గోబెల్స్‌.

    ఓకే సార్‌ నేను మూడు గంటలకే వస్తా, వద్దు వద్దు మేము సమయ పాలన పాటిస్తాము,మీరు ముందూ,వెనుకా రావద్దు ,సరైన సమయానికి , సరైన చోటికి రండి అని నవ్వుతూ గోబెల్స్‌ మెట్లు ఎక్కాడు. సార్‌ సార్‌ అంటూ పరుగెత్తి రెండు మెట్లు ఎక్కి తాను తెచ్చిన పరిచయ లేఖను అందచేశాడు కాషాయం.

      సాయంత్రం అనుకున్న సమయానికి ఇద్దరూ వచ్చారు. పొద్దున్నే ఎవరో ఏమిటో తెలిసింది కనుక ఈ సారి పరస్పరం నాజీ వందనాలు చేసుకున్నారు. తన్మయత్వంలో కాషాయం తాను అసలు ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు.

     చెప్పండి కాషాయం ఇప్పుడు మీ మిత్రులంతా అమెరికన్స్‌ కదా ! మా జర్మన్లతో పని పడింది అంటే ఏదో ప్రత్యేకత వుండి వుంటుంది, ఏమిటో చెప్పండి.

    ఏం లేదు సార్‌ మేం ఏం చేసినా కొద్ది రోజుల్లోనే జనానికి వాస్తవం ఏమిటో తెలిసి పోతోంది.మా కార్యక్రమాలన్నీ దెబ్బతింటున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మా ఏబివిపి పోరగాడు తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. కానీ అది వాస్తవం కాదని వెంటనే పోలీసులు తేల్చేశారు. మీ హయాంలో పార్లమెంట్‌ భవనాన్ని మీరే తగుల పెట్టుకొని ఆ దుర్మార్గానికి కమ్యూనిస్టులే పాల్పడ్డారని చాలా కాలం ఎలా నమ్మించారు సార్‌?

     చూడు కాషాయం ఆ రోజులే వేరయ్యా ! ఇప్పటికీ దాన్ని నమ్మే ఫూర్‌ ఫెలోస్‌ వున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు…..అయినా మీతో వచ్చిన చిక్కు ఇదే …పాడిందే పాడరా అని మీ తెలుగు వారు ఒక సామెత చెబుతారు కదా అంటే అర్ధం నన్ను ఆదర్శంగా తీసుకోవాలి తప్ప నాలాగే చేయకూడదు.

    అదే సార్‌ మేము ఎన్నోసార్లు మా శాఖల్లో ఇదే చెప్పాము. మన పధకాలన్నీ ఎదురు తంతున్నాయి, కొత్త పద్దతులు నేర్పండి అంటే వినకుండా మనం మనుస్మృతి మార్చలేనట్లే అవి కూడా అంతే అంటూ తాతల కాలం నాటివే నేర్పుతున్నారు…… మీరు ఏవనుకోను అంటే నేను ఒకటి చెబుతా…..

అనుకోను లేవయ్యా చెప్పు.

కాదు, ప్రామిస్‌,

ప్రామిస్‌,

అమ్మతోడు .

అమ్మతోడు అంటే భారత మాత తోడు… ఒకే విసుగ్గా అన్నాడు గోబెల్స్‌.

    అక్కడికీ నేను ఒకసారి ఆ గోబెల్స్‌ పద్దతులు మనకు ఎందుకు ? మన వేదాల్లోనే అన్నీ వున్నాయంటున్నారు కదా వాటిని వెలికి తీసి అందచేయకూడదా , మన దేశ భక్తి వెల్లడి అవుతుంది, మిగతా దేశాల వారు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా అన్నాను. మీరు ఏమీ అనుకోవటం లేదు కదా అన్నది అన్నట్లు చెప్పాను.

     ఏముందయ్యా ఇందులో అనుకోవటానికి, మనం ఇప్పుడు స్వర్గలోక వాసులం. మనలో మనమాట అలాంటి పుక్కిటి పురాణాలు అన్ని దేశాలలో వున్నాయి. అవన్నీ మూసిన గుప్పిట వంటివి. అవి మూసి వున్నంత వరకే ఆసక్తి, తెరిస్తే విరక్తి . అయినా దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లు అలాగే వుంటాయ్‌. అది సరేగాని ఆ ఎంజాయ్‌ జోషి,అదే సెక్స్‌ సిడీ పెద్దమనిషి ప్రేమరోగ్‌ నిందాచార్య ఏం చేస్తున్నారయ్యా ఇప్పుడు, ఎక్కడున్నారు ?

    ఏం చెప్పమంటారు సార్‌ మా ఓడీ సాబ్‌ సిడి ట్రిక్కు ప్రదర్శించి జోషీ గారిని ఇంటికి పంపారు, ఇప్పుడాయన గోళ్లు గిల్లుకుంటూ ఎక్కడ వుభయం దొరికితే అక్కడ అన్నట్లు అక్కడా ఇక్కడా వుంటూ తన దగ్గరికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తుంటారు. నిందాచార్య పరిస్ధితి మరీదారుణం.ప్రేమ ఫెయిలయింది. దేశభక్తి అంటే స్వదేశీ జాగరణ మంచ్‌, స్వదేశీ జాగరణ మంచ్‌ అంటే దేశభక్తి అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ! కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది, ఇప్పుడు స్వదేశీ జాగరణ మంచ్‌ అంటే దేశద్రోహం అన్నట్లుగా మారిపోయింది. అందుకు ఎవరూ మాట్లాడటం లేదు. మా ఓడీ సాబ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పుడు ఓడీ విదేశీ జాగరణ మంచ్‌ హవా నడుస్తోంది.

     బాధ పడకు కాషాయం, అంతా దేవుడి లీల. ఏ ఛానల్‌లో మంచి సీరియల్‌ వస్తుందంటే దాన్ని నొక్కినట్లుగా పై వాడు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు.కింది వారు ఎలా ఎక్కడ వుంటారో తెలియదు.

    అదేసార్‌ నకిలీ సీడీతో జోషీ గారిని ఇంటికి పంపినట్లే జెఎన్‌యులో కూడా అదే ట్రిక్కు చేసి వామపక్ష విద్యార్ధులను దెబ్బతీద్దాం అని చూశాం.ఇపుడు చూడండి దొరికి పోయార? సీతనే మా రాముడు ఆరోజు అగ్ని పరీక్షకు పంపాడు. తెలివి తక్కువతనం కాకపోతే ఇప్పుడు సీడీలను పరీక్షించకుండా వుంటారా ? ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి నకిలీ సీడీలు తయారు చేసిన వాళ్లమీద, వాటిని ప్రసారం చేసిన వారి మీద కేసులు పెడతానంటున్నారు. పరువూ పోయె కేసులూ వచ్చే అన్నట్లుంది.

     కాషాయం మీ వారి మీద కేసులను చూసీ చూడనట్లు పొండి అని చెప్పే పెద్దలు మీ దగ్గర అధికారంలో వున్నారు. మా పరిస్ధితి చూడు రెండవ ప్రపంచ యుద్ధంలో నేరాలంటూ మా మీద పెట్టిన కేసులను ఇంకా కొనసాగిస్తూనే వున్నారు. అందువలన కర్మ చేసిన వాడు ఫలితం అనుభవించక తప్పదని గీతా కారుడు చెప్పలేదా ?

   సార్‌ మీదో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్‌ ఇంకా మీతో చాలా మాట్లాడలని వుంది.ఆ రోజుల్లో మీరు మీడియాను ఎలా అదుపు చేశారు.

     ఈ రోజుల్లో మాదిరి టీవీలు లేవయ్యా, అప్పుడే ప్రయోగాలు జరుగుతున్నాయి. జనానికి అందుబాటులో లేదు. అందువలన రేడియాను పూర్తిగా మా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు మీకు ప్రతి టీవీలో గోలగోల గోస్వామి లాంటి వారు తామర తంపరగా కనపడుతున్నారు. మీ వారి పని సులభం అవుతోంది. అలాంటివారిని ఇంకా ఇంకా పెంచండి. చెప్పుకోకూడదు గానీ నిజానికి నేను వారి ముందు మరుగుజ్జును.చూడు కాషాయం మనం స్వర్గంలో వున్నాం అన్నీ ఒకే రోజు మాట్లాడుకుంటే మిగతా రోజుల్లో బోరు కొడుతుందయ్యా ఖాళీ దొరికినపుడల్లా కొన్ని చెప్పుకుందాం. రంభ నుంచి కబురు రాక ముందే వెళితే మంచిది.

ఓకే సార్‌ .

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వర్గంలో గోబెల్స్‌తో కాషాయం భేటీ

07 Monday Mar 2016

Posted by raomk in Literature.

≈ Leave a comment

Tags

Bjp nationalism, Gobbles, nationalism, RSS, saffron Sainik

భాగం ఒకటి

సత్య

    భూలోకం నుంచి నేరుగా వేద కాలపు విమానంలో ఒక్కడే వచ్చిన కాషాయం స్వర్గం ద్వారం దగ్గరకు రాగానే జిపిఆర్‌ఎస్‌ చూసుకున్నాడు. తాను దిగాల్సిన భవనం తన కిందే వున్నట్లు గ్రహించిన కాషాయం విమానంలోంచే కిందికి చూశాడు.అంతే విమానం వెంటనే భావాన్ని గ్రహించి చటుక్కున కిందికి దిగటమేమిటి, ఆటోమాటిక్‌గా డోరు తెరుచుకోవటం క్షణ కాలంలో జరిగిపోయాయి.

     బృందావనం గేటెడ్‌ కాలనీకి పెద్ద గేటు, దానిలోంచి లోపలకు చూస్తే పెద్దగా వెతుక్కొనే పని లేకుండానే ‘రంభ సుఖ నివాస్‌’ పెద్దక్షరాలతో సంస్కృతంలో రాసి వుంది. విమానాన్ని గేటు ముందు ఆపగానే సాబ్‌ రోడ్డు అవతల పార్కింగ్‌ ప్లేస్‌ వుంది , ఇక్కడ మెంబర్స్‌ విమానాలను మాత్రమే అనుమతిస్తారు సాబ్‌ అంటూ ఒక సెక్యూరిటీ గార్డు వచ్చాడు.

   వేదకాలపు విమానాలకు రన్‌వేలు, పైలట్లు, ఇంధనంతో పని లేకపోవటంతో చిన్న పిల్లలు బొమ్మ విమానాలను తిప్పినట్లు వెంటనే రయ్యి మంటూ పైకి లేపి పక్కనే వున్న పార్కింగ్‌ ప్లేస్‌లో వుంచి తాళం చెవిని అక్కడి సిబ్బందిపైకి విసిరి వచ్చాడు కాషాయం.

     సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి రిసెప్షన్‌ ఎక్కడా అని అడిగాడు కాషాయం. జాతీయ జండాలోని మూడు రంగుల ముక్కలతో కుట్టిన పెద్ద చొక్కా పెరిగిన బొర్రను దాచలేకపోతోంది, దాని కింద కాషాయ పైజామా, ఒళ్లంతా స్వస్తిక్‌, కమలం పూల పచ్చబొట్లతో వున్న కాషాయాన్ని చూసి సెక్యూరిటీ పన్నెండు గంటల డ్యూటీ భారాన్ని కూడా మరిచిపోయి గోలీ సోడా కొట్టినపుడు వచ్చే సౌండ్‌ మాదిరి కిసుక్కున నవ్వాడు. స్వర్గమన్న తరువాత రకరకాల వారు వస్తుంటారు, వారు మన అతిధులు కనుక చూసి మర్యాదగా వుండాలి నవ్వినా, అమర్యాదగా ప్రవర్తించినా వుద్యోగం వూడుతుందని స్వర్గలోక సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ హెచ్చరిక గుర్తుకు రావటంతో పాపమా ముసలి గార్డు ముఖం మాడిపోయింది. అయినా చిరునవ్వు పులుముకొని ఆయియే సాబ్‌ అని గేటు తీసి రిసెప్షన్‌ ఎక్కడుందో చూపాడు.

    విలాసంగా వెళ్లిన కాషాయానికి వెంటనే అక్కడ వున్న ఒక యువతి లేచి పారిజాత పువ్వు అందిస్తూ బావగారూ బాగున్నారా అని నవ్వుతూ పలకరించింది. అది స్వర్గలోక మర్యాద అని తెలియని, తానెవరో తెలియకుండానే తనకింత ఘనస్వాగతం పలికారని, తెలిస్తే ఇంకెత గా వుంటుందో అని కాషాయం వుబ్బి తబ్బిబ్బు అయ్యాడు. అదే వూపులో రిసెప్షన్‌లో వున్న యువతిని చూసి ఒకసారి కాలర్‌ ఎగుర వేసి గోబెల్స్‌ గారిని కలవాలి అని అంటూ ఒక లెటర్‌ తీసి ఆమెకు అందిస్తూ బల్లమీద దరువేస్తూ అటూ ఇటూ చూస్తున్నాడు. ప్లీజ్‌ సార్‌ శబ్దం చేయవద్దు అని సైగ ద్వారా చెప్పి లెటర్‌ చూడకుండానే ఇదేమిటి అని అడిగింది.

   వెంటనే భూలోకం అమిత్‌ షా రికమెండేషన్‌ లెటర్‌, ముందు చదవండి మీకే తెలుస్తుంది అన్నట్లు సైగ చేశాడు కాషాయం. ఒకసారి స్వర్గానికి రావటం అంటేనే ఇక్కడి వసతులు అన్నీ మీకు వుచితంగా అందుబాటులో వుంటాయని అర్ధం.సిఫార్సులు అవసరం లేదు, భూలోకపు అలవాటును బట్టి లేఖలు తెస్తున్నారు. ఖాళీని బట్టి రూమిస్తాము, రంభా, వూర్వశుల్లో అందుబాటులో వున్న వారిని మీరు ఎంపిక చేసుకోవచ్చు ఓకే. అంటూ లేఖను విప్పకుండానే చెత్త బుట్టలో పడేసింది. ఇక మీకు ఏ గోబెల్స్‌ కావాలి అని అడిగింది.

    అదేమిటి ఎంత మంది వున్నారు, గోబెల్స్‌ అంటే ఒక్కడే కదా ఈ మాత్రం తెలియదా అన్నట్లు చూశాడు. లేదు సార్‌ హిట్లర్‌ కాలంలో అతనొక్కడే , ఇప్పుడో ఎక్కడో ఒకటీ అరా తప్ప ప్రతి టీవీ, ప్రతి పత్రికలో , ఇతర అనేక రంగాలలో ఒకరికి ఇద్దరు, ఇద్దరు నలుగురి మాదిరి తామర తంపరగా తయారయ్యారు, మీకు తెలియదు అసలు గోబెల్స్‌ వారిని చూసి సిగ్గు పడుతూ వుంటారు, ఆయనా వున్నారు. అందుకే మీకు ఎవరు కావాలి అని రిసెప్షనిస్టు అడగ్గానే మా ఆది గురువు అదే జర్మన్‌ మినిస్టర్‌ అన్నాడు కాషాయం.

     అక్కడ కూర్చోండి అంటూ రిసెప్షనిస్టు వలయాలుగా తిరిగే ఒక సోఫా చూపింది. ఇంటర్‌ కామ్‌లో రంగేళీ రాజా జి స్షెషల్‌ అని పెట్టేసింది. స్వర్గం రాజ్యాంగం ప్రకారం అక్కడకు వచ్చిన వారందరూ గతాన్ని గుర్తుంచుకోవచ్చు తప్ప పాత బంధాలను ముందుకు తేకూడదు.ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని అంటే వారి మాడు పగలగొడతారు, అవి స్వర్గవాసుల స్వేచ్ఛకు అడ్డు పడతాయి. వావి వరసలు వుండవు. రోమ్‌ వెళ్లినపుడు రోమన్‌లా వుండాలన్నట్లు స్వర్గంలో ప్రతివారూ రంభ, మేనకల కోసం తపించి పోతుంటారు. ముందు తాత, తరువాత కొడుకు ఆ తదుపరి మనవడు వచ్చినపుడు ముగ్గురూ ఒకే రంభ కోసమో, మేనక కోసమో పోటీ పడితే సమస్యలు వస్తాయి. అందువలన బంధాలు, బంధుత్వాలు ఇక్కడ నిషిద్ధం. అందుకే భూలోక పేర్లను పక్కన పెట్టి శాస్త్రీయ నామాలు తగిలిస్తారు. అందుకే అలా కబురంపింది. పావు గంట తరువాత అటువైపు నుంచి కాల్‌ రావటంతో గోబెల్స్‌ లైన్‌లో వున్నారంటూ కాషాయానికి ఫోన్‌ అందచేసింది .

    వెంటనే నేను సార్‌ కాషాయాన్ని అంటూ భూలోకంలో పరిచయం వున్న మాదిరి పెద్దగా చెప్పాడు. ఏమూడ్‌లో వున్నాడో తెలియదుగానీ వెంటనే గోబెల్స్‌కు అర్ధం కాలేదు, మరోసారి కాషాయం అదే చెప్పాడు. దాంతో అటు వైపు నుంచి రిసెస్పనిస్టు సార్‌ పది నిమిషాల్లో అక్కడికే వస్తారు వెయిట్‌ చేయండి అని చెప్పి పెట్టేసింది.

    ఈ మధ్య కాషాయం మంచి హుషారులో వున్నాడు. ఇంతకాలం తాను జాతీయ వాదినని చెప్పుకోవటానికి సిగ్గు పడేవాడు. ఎందుకంటే తమ గురువులందరూ బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన వారే అని బయట పడటంతో నోట మాట వచ్చేదే కాదు. జనానికి మతి మరుపు అని గట్టిగా నమ్ముతాడు కనుక కొంత కాలం తామంతా భగత్‌ సింగ్‌ , చంద్రశేఖర్‌ అజాద్‌ అనుయాయులం అని చెప్పుకు తిరిగాడు. వారిని వురి తీసినపుడు మీ పూర్వీకులు ఏం చేశారు, ఎక్కడున్నారు?మతం తప్ప మరొకటి పట్టని మీకూ మతం,దేవుడిపై నమ్మకంలేని కమ్యూనిస్టు భగత్‌సింగ్‌కూ అసలు సంబంధం ఎక్కడ అని తలోదిక్కునా ప్రశ్నించటంతో కాషాయం కుదేలై పోయి మాట్లాడటం మానేశాడు.

     ఇప్పుడు బస్తీమే సవాల్‌ నేనే అసలైన జాతీయ వాదిని, కాదన్నవాడిని ఖతం చేస్తా అని వీరంగం వేస్తున్నాడు. మాటి మాటికీ జాతీయ జెండా ఎగురవేయటానికి సిద్దం సుమతీ అంటున్నాడు.ఇంతలో జరగరాని ఘోరం జరిగి పోయింది. ప్రమాదంలో ప్రాణం పోయింది.

     ఈ మధ్య ప్రతి సంస్ధకూ అధిపతుల నియామకం సందర్భంగా వచ్చిన వారికి ఎక్కడో అక్కడ పరివార్‌ మచ్చ వుంటే సరే లేకపోతే ముద్రవున్న వారిని వెతికి మరీ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు కూడా బెనారస్‌ విశ్వవిద్యాలయ విసీ మాదిరి మరక మంచి అని ఎత్తి మరీ చూపుతున్నారు. వుగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా స్వర్గంలోకి వుగ్రవాదులు ముఖ్యంగా ఇస్లామిక్‌ తీవ్రవాదులు ప్రవేశించకుండా తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఏజన్సీకి కూడా అలాంటి ఒక ముద్రగాడినే అధిపతిగా నియమించారు. ఆ పెద్దమనిషి కొన్ని ఖాళీ పత్రాలు ఇచ్చి నేరుగా స్వర్గానికి పంపాలనుకున్న కాకీ నిక్కర్ల పేర్లు అందులో రాసి అందచేయమన్నారు. ఆ రూటులో వచ్చే వారికి పాసింజరు ఫ్లైట్లకు బదులు వేదకాలపు రెక్కలు లేని సింగిల్‌ సీటరు విమానం కూడా అంద చేస్తారు.అదిగో కాషాయం అలా వచ్చాడు.అందుకే అంత టెక్కు. గోబెల్స్‌తో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ………….(ఇంకా వుంది)

Share this:

  • Tweet
  • More
Like Loading...

Read Hatred in the belly: Politics behind the appropriation of Dr Ambedkar’s writings

05 Saturday Dec 2015

Posted by raomk in Communalism, History, Literature., NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

Annihilation of Caste, BR Ambedkar, Round Table India

 roundtableindia.co.in/

Ambedkar Age Collective

hitbamazon

Dear friends, we’re happy to announce the release of our first book, Hatred in the belly: Politics behind the appropriation of Dr Ambedkar’s writings, published by The Shared Mirror Publishing House. It is available on amazon here. 

Hatred in the belly, as you know, is a compilation of the debates triggered by the attempted appropriation of Babasaheb’sAnnihilation of Caste, which were featured on Round Table India.

Hatred in the belly is a Telugu phrase (kaDupulO kasi) taken from a speech delivered by poet Joopaka Subhadra, in Hyderabad, on the appropriation of Babasaheb Ambedkar’s Annihilation of Caste. The speech, included in this volume, aptly summarises the deep-seated hostility of Brahminic India towards the Dalit Bahujan. Similarly, the other essays and speeches collected in this volume, written and delivered by a number of writers, academics, students, and activists (referred to as the Ambedkar Age Collective in this book), unfurl before you a critical tapestry dissecting the hegemonic brahminic discourse which works towards delegitimizing the radical legacy of Amebdkarite thought. The most stark example of these efforts, from the ‘left’ and the ‘right’ of the Indian political spectrum, is the Navayana edition of Babasaheb’s AoC with an ‘introduction’ by Arundhati Roy.

The works collected here emerged as spontaneous reactions to the Roy-Navayana project from multiple locations and in multiple languages. The varied interventions, which began online, and the discursive terrains it opened up offer us a glimpse of the ways through which the marginalised resist continued attempts made at hegemonising their knowledge and lives by the brahminic oppressors irrespective of their political leanings.

Authors include: Bojja Tharakam, Adv. Dr. Suresh Mane, Anoop Kumar, U. Sambashiva Rao, Sunny Kapicadu, K K Baburaj, Joopaka Subhadra, Dr. K Satyanarayana, Anu Ramdas, Kuffir, Gurinder Azad, Shakyamuni, Dr Sangeeta Pawar, Dr O.K. Santhosh, Dr B. Ravichandran, Dalit Camera: Through Un-Touchable Eyes, Karthik Navayan,  Vaibhav Wasnik, Nilesh Kumar, Asha Kowtal, Nidhin Shobhana, Gee Imaan Semmalar, Syam Sundar, Murali Shanmugavelan, Praveena Thaali, Dr Karthick RM, Huma Dar, Joby Mathew, James Michael, Akshay Pathak, Vinay Bhat, Yogesh Maitreya, Thongam Bipin, Sruthi Herbert, Gaurav Somwanshi, Kadhiravan, Rahul Gaikwad, Joe D’Cruz.

Buy the book on Amazon here: http://www.amazon.in/gp/product/8192993000/ref=olp_product_details?ie=UTF8&me

Product details

Paperback: 263 pages
Publisher: The Shared Mirror Publishing House; First Edition edition (2015)
Language: English
ISBN-10: 8192993000
ISBN-13: 978-8192993003

 

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d