• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: INDIA

రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూద్దాం !

16 Sunday Oct 2016

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, economic reforms, INDIA, Indian economy, Riding on flying horses

Image result for narendra modi on flying horse

సత్య

   రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూసే బాల్యం నాటి వూహలు, కథలు జీవితాంతం గుర్తుంటాయి. మన పూర్వీకులు పెట్రోలు, పైలట్లతో పని లేకుండా ఒక లోకం నుంచి మరో లోకానికి, పైకీ, కిందికీ, ఎటుబడితే అటు తిప్పుతూ ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు వుండే విమానాలలో తిరిగే వారని వయస్సు వచ్చిన వారికి, అందునా చదువుకున్న వారికి చెప్పటమే కాదు, వారి చేత నమ్మింప చేస్తున్న రోజులి. ఇక ప్రతిదానినీ ముందుగానే వూహించి చెప్పారంటున్న పోతులూరి వీరబ్రహ్మంగారి ప్రవచనాలను మనకు సరికొత్తగా అందించే మహానుభావుల సంగతి సరే సరి. ఈ కారణంగానే మన నిఘంటువులో అసాధ్యం అనే దానికి ఒక్క వుదాహరణ కూడా దొరకని తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాం.దీనికి తోడు సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత అది సంక్షోభ స్థాయికి చేరింది.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది తెలుగు సామెత. ఒక పేదవాడు పండుగకో, పబ్బానికో అని కొనుక్కున్న దుస్తుల మీద ఏదైనా పడితే మరకగా మారుతుందేమోనని ఎంత కంగారు పడిపోతాడో తెలిసిందే. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమ వ్యక్తిత్వాల మీద ఒక మరక పడితే తల్లడిల్లి పోతారని పాత పుస్తకాల్లో చదువుకున్నాం. అంతరించి పోతున్న అలాంటి వారు ఎక్కడన్నా కనపడతారేమోనని పాతాళభైరవి దురి&భిణి వేసి చూసినా కనిపించటం లేదు . ఇక ‘బ్రహ్మం గారు చెప్పినట్లు ‘ అధికారం రుచి మరిగిన మన రాజకీయ నాయకుల గురించి ఇక చెప్పుకోనవసరం లేదు. ఎన్ని మరకలు పడితే అంతగా మార్కెట్లో డిమాండు వుంటుందనే సత్యాన్ని బోధి చెట్టు కింద కూర్చోకుండానే తెలుసుకున్న అపర జ్ఞానులు. ఎదుటి వారి మీద మరకలు వేయటం, తాము వేయించుకోవటంలో ఆరితేరిన వారు. ఒక వ్యాపారి ‘మరకు మంచిదే ‘ అంటూ తన వుత్పత్తులను అమ్ముకోవటానికి ఒక మరక నినాదాన్ని సృష్టించి నిజంగా మరక పడటం మంచిదే అని జనం అనుకునేట్లుగా వాణిజ్య ప్రకటనలను తయారు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ వ్యాపారులు కూడా అలాంటి ఎక్కువ మరకలున్నవారి కోసం నిత్యం ఎదురు చూస్తూ కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సరకులకు ‘నియోజక వర్గ అభివృద్ధికోసం, కార్యకర్తల అభీష్టం మేరకు, మా నేత అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, స్వగృహ ప్రవేశం ‘ వంటి ఎన్నో ట్యాగులను కూడా రూపొందించిన మేథావులు.

    1848లో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు మానిఫెస్టోను కమ్యూనిస్టు పార్టీలు అనేక ముద్రణలు, ప్రపంచ భాషలన్నింటిలోనూ తర్జుమా చేయటం మామూలు విషయం. ఈ విషయంలో బైబిల్‌తో పోటీ పడేది ఏదైనా గ్రంధం వుందంటే అది ముమ్మాటికీ కమ్యూనిస్టు మానిఫెస్టో ఒక్కటే. కార్మికుల శ్రమ శక్తి నుంచి లాభాలను పిండుకోవటం గురించి తేటతెల్లం చేసిన ఆగ్రంధాన్ని, అది వ్యాపింపచేసిన భావజాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించని పెట్టుబడిదారుడు, బడా వ్యాపారి వుండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ అదే పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోకు మార్కెట్‌లో వున్న గిరాకీని బట్టి దానిని ముద్రించి లాభాలు ఆర్జించటమే అసాధారణం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పుకుంటున్న ఇండోనేషియాలో ఈనెలలోనే ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు మానిఫెస్టో గ్రంధాన్ని చూసిన మిలిటరీ గూఢచారులు ఇంకేముంది ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తున్నారంటూ పుస్తకాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి గంటల కొద్దీ విచారణ పేరుతో నిర్బంధించారు. దానిని ప్రచురించిన వారు అబ్బే మాకు కమ్యూనిజం ఏమిటి, దాన్ని వ్యాపింప చేయట ఏమిటి, అమ్ముడు పోయే పుస్తకాలన్నీ ప్రచురించటం, అమ్ముకోవటం తప్ప మాకేమీ తెలియదని చెప్పిన తరువాత వారిని వదలి వేశారు. తమకు లాభదాయకం అనిపించింది కనుకనే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టు వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించి లాభపడ్డారు. అదే సామ్రాజ్యవాదులు కమ్యూనిజాన్ని కూడా సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించి చైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే లాభం వస్తే వ్యాపారి అవసరమైతే తనను తానే అమ్ముకోవటానికి కూడా వెనుతీయని ‘త్యాగశీలి’.

   పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాల కోసమే కదా ఇండియాకు సముద్రమార్గం కనుగొనమని కొలంబస్‌ను పురికొల్పారు. దారి తెలియనపుడే అంతగా తహతహలాడిన వారు ఇప్పుడు ఎక్కడ లాభం వస్తుందో స్పష్టంగా తెలిసిన తరువాత అక్కడ వాలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? లాభానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఎప్పుడూ దేశ భక్తి వుండదు. లాభం వస్తే ప్రాణాలు హరించే వరదల్లో కూడా వెళ్లేందుకు సిద్దపడే వ్యాపారులు మన మార్కెట్లో ప్రవేశించేందుకు సామ,దాన,బేధో పాయాలను ప్రయోగించారు. వివిధ ప్రాంతాలలో వేర్పాటు, వుగ్రవాద శక్తులు వాటిలో భాగమే. కమ్యూనిజం అని మడి కట్టుకు కూర్చుంటే లాభాలు వస్తాయా మీ పిచ్చిగానీ అని అవగతం చేసుకున్న వారు ప్రపంచంలో అతి పెద్ద ఎగుమతి, దిగుమతి మార్కెట్టు కమ్యూనిస్టు చైనాను వదులుకుంటారా ? అలా వదులు కున్న వారు నిజంగా దేశ భక్తులే ! కుందేటి కొమ్మును సాధించ వచ్చు గాని అలాంటి వారిని ఎవరినైనా ఒక్కరిని చూపగలరా ? అమెరికా వ్యాపారులు పాతాళ భైరవిలోని దుష్ట గురువుల వంటి వారైతే, భారత వ్యాపారులు ఆ గురువు శిష్యుని వంటి వారు. అందుకే కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే దేశ భక్తికి గీటు రాయి అని వూరూ వాడా ప్రచారం చేసిన సంఘపరివారం తీరా తాము అధికారానికి వచ్చిన తరువాత అదే చైనాతో భాయీ భాయీ అన్నట్లుగా వాజపేయి హయాంలో వున్నారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దగ్గరయ్యారు. గతంలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారేమిటి అని ఎవరైనా అడుగుతారేమోనన్న భయంతో అనధికారికంగా చైనా వ్యతిరేకతను వ్యాపింప చేయటంలో కూడా వారే ముందుంటున్నారు. ముఖ్యంగా సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ఆపని చేస్తున్నారు. వారి ద్వంద్వ ప్రవత్తికి అది పెద్ద తార్కాణం.

   ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మీడియాలో దేశాలు, వ్యాపారం, వస్తువులు, దేశభక్తి గురించి చర్చ పొంగి పొర్లుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం మనుస్మృతి, బైబిల్‌,ఖురాన్‌లో చెప్పిందానికి తిరుగులేదు చర్చ లేకుండా పప్పుసుద్దల్లా పడి వుండటం, తలాడించాలని చెప్పే అపర వ్యాఖ్యాతలు, నిర్ధేశకుల నిరంకుశ భావజాలం కంటే ఏదో ఒక చర్చ జరపటం మంచిదే. మరకలు పడినా, కావాలని సిరాలు చల్లినా చర్చంటూ జరిగితే కదా తెలియని విషయాలు బయటికి వచ్చేది. మూఢ భక్తులు తమ మూఢ గురువు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే సహించరు, సామాజిక మీడియాలో వారికి ఇష్టం లేకపోయినా భిన్న వాదనలు, ప్రశ్నలు ఎదురవుతాయి. అవి వారిని మార్చకపోయినా ఎదుటి వారి వాదనలను కూడా వినాలనే సహనం గల ఆలోచనా పరులకు వుపయోగం కనుక ఆ చర్చలో ప్రతివారూ పాల్గొనాలి.

    ఈ నేపధ్యంలో కొన్ని అంశాలను చూద్దాం. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లూ అంతే దూరంలో వుంటుంది అన్న సూక్ష్మ విషయం కూడా తెలియని వారు కొద్ది రోజుల పాటు చైనా వస్తువులను కొనకుండా, అమ్మకుండా, వుపయోగించకుండా వుంటే చైనా మన కాళ్ల దగ్గరకు వస్తుందన్నంతగా కొంత మంది సూచనలు చేస్తున్నారు. ఇది నిజానికి కొత్త అయిడియా కాదు, అరువు తెచ్చుకున్నదే. మన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ పేరుతో ఒక పెద్ద అధ్యాయమే వుంది. దాన్నుంచి వచ్చిన ఆలోచన ఇది. ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన ఆ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే విదేశీ వస్తువుల వరదకు తలుపులు తెరిచారు.స్వదేశీ జాగరణ మంచ్‌పేరుతో ఒకవైపు కాస్త హడావుడి చేసినా ఆ విధానాన్ని బిజెపి పెద్దలు పూర్తిగా బలపరిచారు.తమకు అధికారం వచ్చిన తరువాత ఆ స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలియదు. కాంగ్రెస్‌ను తలదన్నేలా మరిన్ని సంస్కరణల పేరుతో విదేశీ వస్తువుల సునామీకి తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for Riding on flying horsesIndia

    భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా  పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు. ఆయన చేసిన వ్యాఖ్యలే కనుక ఏ రాజకీయ పార్టీనేతో, అభ్యుదయ భావాలు వున్నవారో చేసి వుంటే ఈ పాటికి దేశ ద్రోహుల, చైనా అనుకూల జాబితా పెరిగి పోయి వుండేది. భిన్నాభి ప్రాయాన్ని వ్యక్తం చేయకుండా వుండటం కోసం అలాంటి ముద్రలు వేయటం ఒక పదునైన ఆయుధం. ‘ చైనాకు మన ఎగుమతులు తక్కువగా వుండటమనేది సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు తగ్గిపోవటమే అసలు సమస్య. ఎగుమతుల నుంచి మనం తక్కువ ఆర్జిస్తున్నాము. వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలెట్స్‌ దిగుమతులకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నాము. చైనా వారి పద్దతి పూర్తిగా భిన్నమైనది. చైనా రైతు పొలాలకు నీటిని తీసుకు వచ్చే కాలువలలో నీరు సదా నిండుగా వుంటుంది.ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుర్గతి అతనికి లేదు. మన రైతులతో పోల్చితే చైనా రైతు వుత్పత్తి వ్యయం తక్కువ. అలాగే చైనా మన దేశంలో తన వుత్పత్తులను కుమ్మరించటం కూడా ఈ వాణిజ్యలోటుకు కారణం కానే కాదు. ఆర్జిస్తున్నదాని కంటే ఎక్కువగా వినియోగం చేసేలా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అప్పు చేసి పప్పుకూడు తినమంటున్నది. వాణిజ్య లోటుకు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి.’ ప్రస్తుత పరిస్థితులలో ఇలా చెప్పటం నిజంగా పెద్ద తెగింపే. ఇష్టంలేని వారు చెప్పింది ఇనుప రింగులతో , ఇష్టం వున్నవారు వుంగరాల చేతో మొట్టినట్లుగా వుంటుంది.

    భరత్‌ ఝన్‌ఝున్‌ వాలా రాసిన పై వ్యాసంతో పాటు ఆంధ్రజ్యోతిలో వి.శ్రీనివాస్‌ అనే రచయిత మరొక వ్యాసం కూడా దీని గురించే రాశారు. ‘ ‘దేైశభక్త రాజకీయాలతో ‘ సంబంధం వున్న ప్రతి నేతా ఇప్పుడు పాకిస్తాన్‌ అంతు చూడటం, చైనాకు బుద్ధి చెప్పటం గురించే మాట్లాడుతున్నారు. భారతీయులు నిష్టగా ‘చైనా వస్తు బహిష్కరణ వ్రతం ‘ ఒక్క నెల రోజులు పాటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలటం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో గణాంకాలు షికార్లు చేస్తున్నాయి. ఈ దీపావళికి చైనా టపాసులను ముట్టుకోబోమని ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలన్న ప్రబోధాలు వినవస్తున్నాయి. చైనాను దారిలోకి తెచ్చుకొనేందుకు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంలో భారత్‌ వున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చైనా వస్తువుల క్రయ విక్రయాల్లో భారీ లాభాలు మూట కట్టుకుంటున్న దేశీయ వ్యాపార కూటముల మాటేమిటి ? ఎవరి లాబీయింగ్‌ దేశీ మార్కెట్లో చైనా సరకులకు బాట వేసింది ? ఎవరి లాభ కాంక్ష దేశీయ చిన్న పరిశ్రమల వుసురు తీసింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న అసమతౌల్యం ఆర్ధిక రంగానికి విఘాతంగా మారుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు? చైనా ధోరణి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాలను దెబ్బతీసేట్లుగా వున్నప్పటికీ వాణిజ్య బంధం సడల కుండా ఎందుకు పోషిస్తోంది? మనం కొన్ని వస్తువులను బహిష్కరిస్తే మనకు అత్యవసరమైన కొన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేయట ద్వారా చైనా వుల్టా మనపై వత్తిడి చేయగల పరిస్ధితి ఇప్పుడు వుంది.’ ఇలా సాగింది. దీని అర్ధం ఏమిటో ఎవరికి వారు తీసుకోవచ్చు. ఎందుకంటే సూటిగా చెబితే ఇక్కడా దేశ భక్తి ముద్ర వేయటానికి కొందరు సిద్దంగా వుంటారు.

   దీనంతటికీ కారణం ఏమిటి అంటే పాచిపోయిన రోత పుట్టించే సమాధానం అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ అని కూడా చెబుతారన్నది తెలిసిందే. వసుధైక కుటుంబమనే విశాల భావన మనది అని చెప్పుకుంటూనే ఇరుగు పొరుగు దేశాలపై కాలు దువ్వే వారి సంగతి పక్కన పెడితే కాసేపు చైనా సంగతి వదిలేద్దాం. మన పరిశ్రమలను, మన రైతులను కాపాడు కోవద్దని లేదా దెబ్బతీయమని మన ప్రజాస్వామ్య వ్యవస్ధ చెప్పిందా లేదే ! దీనికంతటికీ కారకులు కాంగ్రెస్‌ నేతలే అని వెంకయ్య తన భాషా చాతుర్యాన్ని వుపయోగించి ప్రాసతో సహా చెప్పగలరు. మన దేశ పరిశ్రమలు, రైతులను దెబ్బతీసే దిగుమతులను నిరోధించటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవ్వాల్సింది నరేంద్రమోడీ సర్కారే కదా ? ఎందుకు నిలిపివేయలేదు ? దేశ భక్తి ఎక్కడికి పోయింది. ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యంతో వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలేట్లు దిగుమతి చేసుకోకపోతే మనకు రోజు గడవదా ? నరేంద్రమోడీకి తెలియదు అనుకుంటే అన్నీ ఎక్కువగా వున్న అపర కౌటిల్యుడు సుబ్రమణ్యస్వామి, ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటికి తగిన విధంగా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడి వంటివారి సేవలను ఎందుకు వుపయోగించుకోవటం లేదు ?

   ప్రియమైన పాఠకులారా ఇవేవీ నరేంద్రమోడీతో సహా ఎందరో మహానుభావులు ఎవరికీ తెలియకుండా జరుగుతున్నవి కాదు, అంత అమాయకులెవరూ లేరని ముందుగా మనం తెలుసుకోవాలి. ఆరు వందల సంవత్సరాల నాటి పెట్టుబడిదారీ మేథావులు తమ యజమానుల లాభాలకు కొత్త మార్కెట్ల కోసం కొలంబస్‌లను పంపించారు. ఆధునిక పెట్టుబడిదారీ మేథావులు అంతకంటే తెలివి గల వారు కనుక లాభాల వేటకు హైటెక్‌ పద్దతులను కనిపెట్టారు. గ్రామాలలో ధనిక రైతులు వ్యవసాయాలు మానేసి తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారంటే అర్ధం ఏమిటి ? సూటిగా చెప్పాలంటే పంట పండించకుండానే ఫలితాన్ని పొందటమే కదా ? స్వంతంగా వ్యసాయం చేస్తే ఎంత మిగులుతుంతో తెలియదు, కౌలుకు ఇస్తే వ్యవసాయం ఏమయినా, కైలు రైతు మట్టి కొట్టుకుపోయినా ఆ మొత్తం గ్యారంటీగా భూ యజమానికి వస్తుంది. అలాగే ఇంతకాలం లాభాలు సంపాదించి కవిలె కట్టలు గుట్టలుగా పెట్టుకున్న పెట్టుబడిదారులు ధనిక రైతులు లేదా భూస్వాముల కంటే మరింత మెరుగైన పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టకుండా, వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేయకుండానే కొత్త పద్దతుల్లో ప్రపంచంలో ఎక్కడ అవకాశం వుంటే అక్కడ లాభాలు పిండుకుంటున్నారు. అందుకు అనేక కొత్త పద్దతులు కనుగొన్నారు. నూతన ప్రపంచాన్ని కనుగొన్న ఆ కొలంబసే కనుక ఇప్పుడు తిరిగి వస్తే పెద్ద షాపింగ్‌ మాల్లో ఏం చేయాలో తెలియని పల్లెటూరి అమాయకుడిలా నోరెళ్ల బెట్టటం తప్ప జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోలేడంటే అతిశయోక్తి కాదు.

    అమెరికాలో ఒక కార్మికుడు ఒక గంట పని చేస్తే కనీస వేతనంగా ఏడు నుంచి పది డాలర్ల వరకు వుంది. ఒక డాలరు విలువ 67,68 రూపాయలు. అంటే రోజుకు ఎనిమిది గంటలు అంటే ఎనభై డాలర్లు సంపాదిస్తారు, దాదాపు ఐదు వేల రూపాయలు. కనీసంగా గంటకు 15 డాలర్లను సాధించుకోవాలని అక్కడి కార్మిక వర్గం పోరాటాలు చేస్తోంది. కొన్ని చోట్ల అంగీకరించారు. ఆ స్ధితిలో అమెరికా పెట్టుబడిదారులు రోజుకు కనీస వేతనంగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక కార్మికుడితో పని చేయించుకోవటం కంటే చౌకగా శ్రమశక్తి దొరికే చోట నెల మొత్తానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పనిచేయించుకున్నారనుకున్నా ఒక్కొక్క కార్మికుడి మీదే నెలకు యాభైవేల రూపాయలు మిగులుతాయి. జపాన్‌ వారు మన దేశంలో మారుతీకార్ల తయారీ (కూర్పు) కేంద్రాలు, కొరియా వారు శాంసంగ్‌ టీవీలు, ఫోన్ల తయారు చేసినా లాజిక్‌- మాజిక్‌ ఇదే. యుద్దనపూడి సులోచనా రాణి నవలల్లోని ఆరడుగుల అందగాడు ఒయ్యారాలు ఒలికించే ఇంపాలా కారులో దిగాడని ఒకపుడు మనం చదువు కున్నాం. ఇప్పుడు వాటి తాతలను మన దేశంలోనే తయారు చేయగల పరిస్థితి వుంది. కార్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి తెల్లవారే సరికి వాటిని బిగించి మన దేశంలో అమ్మటంతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాము.

   వీళ్లు కాకుండా మరికొందరున్నారు. వారు ఇప్పటికే మన వంటి దేశాలలో వున్న పరిశ్రమలు, వ్యాపార సంస్ధల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొంటారు. తెలుగు సినిమాల్లో విలన్లు చివరికి మనకు కనిపిస్తారు. వీరసలు ఎలా వుంటారో కూడా తెలియదు. మన విజయ మాల్య మాదిరి రోజుకు ఒక కిరాయి భామను పక్కనే పెట్టుకొని ఎక్కడో ఒక విహార కేంద్రంలో కూర్చొని కంప్యూటర్ల ద్వారా వుదయం పూట షేర్లు కొని గోలు చేసి లాభం వస్తే సాయంత్రానికి అమ్మి సొమ్ము చేసుకుంటారు. ముంబైలో లాభాలు రాలేదనుకోండి మరుసటి రోజు ఏ దక్షిణాఫ్రికాలోనో లేక ఏ బ్రెజిల్‌లోనో కొని అమ్ముతారు.

   ఇంకా కొందరు వున్నారు. విజయవాడ-హైదరాబాదు మధ్య కార్లు సర్రున దూసుకుపోయే రోడ్లు వేయటానికి మన దేశంలోని జిఎంఆర్‌ వంటి కంపెనీలకు డబ్బు పెట్టుబడిపెడతారు. వాటి చేత మన దగ్గర టో(తో) లు వలిచి పన్ను వసూలు చేయిస్తారు. వాటిలో తమ వాటా తాము పట్టుకుపోతారు. మరి కొందరున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి చేత తక్షణమే విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాలు పెట్టకపోతే అంధకారం అలుముకుంటుందని పెద్ద ఎత్తున వూదరగొట్టిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రాలు అలా పెట్టినవే. గ్యాస్‌ లేక అవి పనిచేయకపోయినప్పటికీ, ఒక్క యూనిట్‌ విద్యుత్‌ వుత్పత్తి చేయకపోయినా స్ధిర ఖర్చు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించిన విషయం తెలిసిందే. అధిక ధరలను చూపి నిర్మాణ ఖర్చును రెట్టింపుగా చూపుతారు. విదేశాలలోని తమ కంపెనీల నుంచే బొగ్గు దిగుమతి చేయించి సముద్రతీరంలోని ఏ నెల్లూరు దగ్గరో శ్రీకాకుళంలోనో విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ పెట్టిస్తారు. కాలుష్యాన్ని జనానికి వెదజల్లి లాభాలను మాత్రం పట్టుకుపోతారు. వాటికి అవసరమయ్యే యంత్రాలను కూడా విదేశాలలోని తమ కంపెనీలు లేదా ఏజంట్ల నుంచే తెప్పిస్తారు. మొత్తానికి వుత్పత్తి ప్రారంభించకుండానే తమ ఖర్చును రాబట్టుకుంటారు.వాటంగా వుంటే కొంతకాలం వుంటారు లేకపోతే ఎవరో ఒకరికి విక్రయించి తప్పుకుంటారు.

   1948 నుంచి 1970 దశకం వరకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందకుండా కమ్యూనిస్టు చైనాను అడ్డుకున్నాయి. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీతో విబేధాల కారణంగా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు తీరిన తరువాత 2000 సంవత్సరం నుంచి ప్రధాన భూభాగం చైనాలో విలీనం అవుతాయని ముందే నిర్ణయం అయింది. అక్కడ వున్న సంస్ధల పెట్టుబడులు, చైనీయుల పెట్టుబడుల గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిన పూర్వరంగంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఆకర్షణ, ప్రవాస చైనీయుల పెట్టుబడుల ఆకర్షణ, ఇతర పెట్టుబడిదారీ దేశాల నూంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్దిక వ్యవస్ధను పరిమితంగా విదేశీ సంస్థలకు తెరిచేందుకు సంస్కరణలను రూపొందించింది. తద్వారా కలిగే ఫలితాన్ని జనానికి చేరే విధంగా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు, ఇతర వ్యాపారాల నిర్వహణ వంటి విధానాలను రూపొందించింది. హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పెట్టుబడులు చెదరకుండా వుండేందుకు 2050 వరకు ఒకే దేశం రెండు ఆర్ధిక వ్యవస్ధల పేరుతో ప్రధాన భూభాగంలో సోషలిస్టు విధానం, హాంకాంగ్‌, మకావుల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించేందుకు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. దాంతో ప్రవాస చైనీయులు పెట్టుబడులతో పాటు, భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకు వచ్చారు. ప్రభుత్వం పరిశోధన-అభివృద్ధికి భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఇలా బహుముఖ చర్యలతో చైనా అనూహ్య అభివృద్దిని సాధించింది. అది కింది వరకు వూట మాదిరి కింది వరకు దిగే విధానాలు అనుసరించింది. ఈ కారణాలన్నింటితో చైనా నుంచి బుల్లెట్‌ రైళ్ల నుంచి బుల్లి బుల్లి దీపావళి చిచ్చు బుడ్ల వరకు మన వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంలోని బడా వ్యాపారులు తెల్లవారేసరికి లాభాలు కావాలంటే వాటిని దిగుమతి చేసుకొని సాయంత్రానికి అమ్మి రాత్రికి లాభాల లెక్కలు వేసుకోవచ్చు. ఫ్యాక్టరీలు పెట్టి, తయారు చేసి వాటిని అమ్ముకోవటం కంటే ఏది లాభం ? దీనికి మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ వంటి వారు పురచేయి అడ్డుపెడితే ఆగేవారు ఎవరైనా వుంటారా ? కావాలంటే వారిని ఎత్తి గోడవతల పారవేసి నోర్మూసుకొని చూస్తుండేవారిని గద్దెపై కూర్చో పెడతారు.

   అమెరికా,ఐరోపాలోని ధనిక దేశాలలోని వ్యాపారులు కూడా చైనా నుంచి సరకులు దిగుమతి చేసుకోవటం ద్వారా తమ లాభాలకు ఎలాంటి ఢోకా వుండదని గ్రహించి దానికే మొగ్గు చూపటంతో అటు చైనా ఇటు ధనిక దేశాలలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు లాభపడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు చైనాలో పెట్టుబడులు పెట్టటానికి వీలు కలిగింది. ఎగుమతులపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థలతో తలెత్తే చిక్కులేమిటో లాటిన్‌ అమెరికా అనుభవం నుంచి నేర్చుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం దేశీయంగా వినిమయాన్ని పెంచేందుకు వీలుగా పౌరుల ఆదాయాలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ కారణంగానే 2008లో ప్రారంభమైన పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధల సంక్షోభం పరిమితంగానే చైనాపై ప్రభావం చూపింది. బయటి దేశాల పరిశీలకులు ఈ కోణాన్ని చూడకుండా 2008 కంటే ముందున్న వేగం తగ్గింది కదా అని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఇప్పటికీ చైనాలో సమస్యలు వున్నట్లు చైనా నాయకత్వమే చెబుతోంది.వారేమీ దాచుకోవటం లేదు. ఇంకా తమది వర్ధమాన దేశమే అని చెప్పటంలో అర్ధం అదే. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన సంస్కరణలకు, చైనా సంస్కరణల విధానాలకు ఎంతో తేడా వుంది. భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి, రెక్కల గుర్రం ఎక్కి చుక్కలు లోకం చూడొద్దని అంటే నన్ను దేశ భక్తి లేనివాడిగానో, చైనా అనుకూల వాదిగానో చిత్రీకరించరు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆఫ్ఘనిస్తాన్‌కు మిలిటరీ సాయం అంటే తాలిబాన్లకు ఆహ్వానమే !

18 Sunday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

Afghanistan, INDIA, military supplies, Narendra Modi, talibans

Image result for MI-24/25 attack helicopters

అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ

సత్య

     అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్‌ వాలే అనే ఖలిస్తాన్‌ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది. తాలిబాన్లను తయారు చేసి చివరకు వారి చేతుల్లో చావు దెబ్బలు తిని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనలను వుపసంహరించుకున్న అమెరికా నిర్వాకాన్ని చూశాము. ఇంత జరిగాక వాటి నుంచి గుణపాఠాలేమీ తీసుకోకుండా నరేంద్రమోడీ సరికొత్త ప్రమాదకర క్రీడ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవటం లేదా ఏర్పరుచుకోవటానికి బదులు ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్ఞాలకు దిగి కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకొనే విధంగా ఎన్‌డిఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని ప్రమాదకర స్ధితిలోకి నెడుతోంది.

    కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆప్ఘనిస్తాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల సాయం చేయటానికి నిర్ణయించుకకుంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ న్యూఢిల్లీ పర్యటన సందర్బంగా ఆ మొత్తాన్ని ప్రకటించారు .అందుకు గాను వెంటనే అమెరికా సర్కార్‌ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల వరదలో ముంచెత్తింది. సాయం ప్రకటించింది మన దేశం, లబ్ది పొందేది ఆఫ్ఘనిస్తాన్‌. మధ్యలో అమెరికా పొగడ్తలు ఎందుకు ? వాటిని చూసి మీడియాలోని మోడీ భక్తులు కొందరికి ఒంటి మీద బట్టలు ఎందుకు నిలవటం లేదు. అష్రాఫ్‌ మన దేశ పర్యటనకు ముందు తాలిబాన్లు ఒక ప్రకటన చేస్తూ తమను అణచేందుకు ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి భారత్‌ మిలిటరీ సాయం అందచేస్తున్నదని దానిని నిలిపివేయాలని వినతితో కూడిన హెచ్చరిక చేశారు.

     మన అవసరాల కోసం మనమే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ఎవరిస్తామంటే వారి దగ్గర అందిన కాడికి అప్పు చేస్తున్నాం కదా ? అటువంటపుడు మనం మరొక దేశానికి సాయం చేయటం ఏమిటి ? మనమే విదేశాల నుంచి మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కదా వాటిలో కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్‌కు ఇవ్వటం ఏమిటి ? ఈ ఏడాది మార్చి నెలాఖరుకు మన విదేశీ అప్పు 485.6 బిలియన్‌ డాలర్లు. దానిలోంచి లేదా మనం చేయి చాపి తెచ్చుకున్న మొత్తంలోంచి ఒక బిలియన్‌ డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు సాయంగా ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్కరం తలకు 60 రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు. తాజా వందకోట్లతో కలిసి ఇంతవరకు మొత్తం సాయం 200 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, విద్య, వైద్య సాయం అందించటానికి అవసరమైన సాయం ఏ దేశానికి అందించినా ఎవరూ తప్పు పట్టరు. అయితే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైట్‌ వెలిగినట్లు ఇలాంటి సాయాలను ఏ దేశం కూడా చివరికి చైనా వంటి సోషలిస్టు దేశాలు సైతం వుత్తి పుణ్యానికే చేయవు. ఏదో ఒక ప్రతిఫలం ఇంకా చెప్పాలంటే తనకు అవసరమైన వాటి కోసమో లేదా తన దగ్గరవున్న వస్తువులకు మార్కెట్‌ కోసమో, రాజకీయ ప్రయోజనం కోసమో ఏదో ఒక లక్ష్యం లేకుండా వుండదు. ఆప్ఘనిస్తాన్‌తో మనకు సరిహద్దు సంబంధాలు లేవు, పొరుగు దేశం కాదు, మధ్యలో పాకిస్తాన్‌ వుంది.ఈ నేపధ్యంలో మోడీ సర్కార్‌ ఆర్ధిక సాయానికే పరిమితం కాకుండా మిలిటరీ ఆయుధాలు ఎందుకు అందిస్తున్నట్లు ? ఎవరికైనా సందేహం కలగక తప్పదు. పోనీ ఆర్ధిక, మిలిటరీ సాయం అందించటం ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి ? మన్‌కీ బాత్‌తో సహా ఎక్కడా మనకు చెప్పలేదు.

    మన దేశం గురించి చెప్పుకోవాలంటే గత రెండు దశాబ్దాలుగా చైనా తరువాత అత్యధిక సగటు వృద్ధి రేటుతో ముందుకు పోతున్న ఏకైక దేశం. అభివృద్ధి ఫలం అంతా కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లోకి పోతున్నది. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో బిలియనీర్లు సగటున 68శాతం వృద్ధి చెందితే మన దేశంలో 330 శాతం వుంది. ఇంత వేగంగా కొంత మంది చేతుల్లోకి డబ్బు చేరుతున్నది కనుకనే వారిని చూసి ప్రతివారూ ఏదో విధంగా తాము కూడా ఇలా చూసి అలా తిరిగే లోపల కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వుపయోగించలేము కనుక ఇతర ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అంతరిక్ష రంగంలో కూడా అనేక విజయాలు సాధించాము. పెద్ద మిలిటరీ, వైమానిక దళం వుంది. అయినా ధనిక దేశాల ముందు చేయి చాపుతున్నాం, మనకు వచ్చిన మొత్తంలో లేదా అప్పు చేసి కొంత మొత్తాన్ని మన దగ్గర చేయి చాచే వారికి ఇస్తున్నామన్న విషయం ‘నయా దేశ భక్తులతో’ సహా కొంత మందికి మింగుడు పడకపోవచ్చు. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2011లో మన దేశం చేయి చాస్తున్న వరుసలో ఆరవ స్ధానంలో వున్నాం. మనం 2011లో 3.2, 2012లో 1.6, 2013లో 2.4 బిలియన్‌ డాలర్లు తీసుకున్నాంhttps://thelogicalindian.com/story-feed/exclusive/know-everything-about-how-much-india-receives-and-donates-foreign-aid/  మన కంటే దరిద్రపు దేశాలకు ఇచ్చేందుకు 2015-16లో మన బడ్జెట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లు కేటాయించాం.మనం చేస్తున్న సాయంలో భూటాన్‌కు గణనీయ మొత్తం ఇచ్చాం. ముందే చెప్పుకున్నట్లు ఎలాంటి ప్రయోజనం లేకుండా కాదు సుమా ! మన సాయంతో వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తారు, 2020 నాటికి మన దేశం వారి నుంచి పదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. భూటాన్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం మరి ఆప్ఘనిస్తాన్‌ నుంచి మోడీగారు ఏం తెస్తారు ? వుగ్రవాదాన్ని, తాలిబాన్లనా ?

   ఆఫ్ఘనిస్తాన్‌ అంటే చాలా మందికి తెలిసినట్లు వుండి వివరాలు లోతుగా తెలియని దేశం. రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, ఎక్కడ కళేబరం కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ప్రపంచంలో మిలిటరీ, ఆర్ధిక, రాజకీయంగా కీలక ప్రాంతాలుగా వున్న వాటిని తమ ఆధీనం చేసుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు కూడా నిత్యం అలాగే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌లో పాగావేసేందుకు పూనుకున్న సమయంలో దానిని పసిగట్టిన మిలిటరీలోని అభ్యుదయ వాదులైన అధికారులు తిరుగుబాటు చేసి దేశాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ి పొరుగునే వున్న నాటి సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వటమే కాదు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, దానిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను అణచివేసేందుకు వారి ఆహ్వానం మేరకు మిలిటరీ సాయాన్ని కూడా పంపింది. ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో భాగంగానే అధికారంలో వున్న వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. అయితే మిలిటరీ అధికారులు కమ్యూనిజం పట్ల అభిమానం వున్నవారు నుక తాము కమ్యూనిస్టులం కాదని ఖండించలేదు. కమ్యూనిస్టుల కారణంగా ఇస్లాం మతానికి ముప్పు ఏర్పడింది, దానిని కాపాడుకోవాలంటే తాలిబాన్లుగా మారి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికన్లు ఒక పధకం ప్రకారం రెచ్చగొట్టారు. అందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌కు అలాంటి వారిని తరలించి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి సాయుధులను చేసి పంపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ముసుగులో తిష్ట వేయటానికి అమెరికా పూనుకుందన్న విషయం గ్రహించగానే మరో పొరుగు దేశం ఇరాన్‌ కూడా తన మద్దతుదారులను అక్కడ వుంచేందుకు అది కూడా తాలిబాన్లను తయారు చేసింది. మొత్తం మీద వారూ వీరూ తయారు చేసిన వారు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి, వారికి సాయంగా వచ్చిన సోవియట్‌ సేనల మీద దాడులు, వత్తిడి తెచ్చి చివరకు వుపసంహరించుకొనే విధంగా, వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటంలో జయప్రదం అయ్యారు. తరువాత ఆ తాలిబాన్లే అమెరికా, పాకిస్థాన్‌కు ఏకు మేకయ్యారు. వారిని నాశనం చేయటానికి అమెరికా సైన్యాన్ని దించి చావు దెబ్బలు తిన్నది, దేశాన్ని సర్వనాశనం చేసింది, చివరకు తాలిబాన్లను అదుపు చేయలేక ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సేనలను వుపసంహరించుకుంది. వుగ్రవాదులను గానీ, మరొక సంఘవ్యతిరేక శక్తుల అణచివేత గానీ ఆయా దేశాల అంతర్గత వ్యవహారం మాత్రమే. పొరుగువారు వెళ్లి ఆ పని చేయటం తగని పని. తమకు హాని చేసే వుగ్రవాదాన్ని రూపుమాపే శక్తి ఆ సమాజాలకు అంతర్గతంగానే వుంటుంది. కానీ అమెరికా ఆ పేరుతో అనేక దేశాలలో జోక్యం చేసుకొంటోంది, చావు దెబ్బలు తింటోంది. ఇప్పుడు వుగ్రవాద వ్యతిరేక పోరు, ఆప్ఘనిస్తాన్‌ పునరుద్దరణ పేరుతో అక్కడే తిష్టవేసింది. తాలిబాన్లను అణచివేసేందుకు తమతో పాటు ఇతర దేశాలు కూడా అన్ని రకాలుగా భాగం పంచుకోవాలని వత్తిడి తెస్తూ తన భారాన్ని తగ్గించుకుంటున్నది. ఆ వుచ్చులోకి భారత్‌ను లాగుతున్నది. నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి ముందు వెనుకలు చూడకుండా ఆ బాటలో ముందుకు పోతున్నది.

     ఆప్ఘనిస్తాన్‌ను అన్ని విధాలుగా నాశనం చేసింది అమెరికా, తామరతంపరగా తాలిబాన్లను సృష్టించి ప్రపంచంలో అనేక దేశాలకు వారిని ఎగుమతి చేసింది అమెరికా, గతంలో దేశ భక్తులుగా ప్రచారం చేసిన వారిని ఇప్పుడు టెర్రరిస్టులుగా చిత్రిస్తూ వారిపై పోరు, అభివృద్ధి పేరుతో జరిగే ఖర్చును ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని వత్తిడి తెస్తోంది అమెరికా. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలో నాశనమైన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించేందుకు అంగీకరించి నిర్మించింది. దానిని నరేంద్రమోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పుడు మరొక వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. ఇది కాకుండా ఇప్పటికే రష్యా తయారీ ఎంఐ-25 గన్‌షిప్‌ హెలికాప్టర్లను మూడింటిని పంపారు. మరొకదానిని పంపనున్నారు. తమకు మరిన్ని మారణాయుధాలు,ఎంఐ-35 గన్‌షిప్‌ హెలికాప్టర్లు కూడా కావాలని అక్కడి ప్రభుత్వం కోరుతున్నది. ఇలా ఆయుధాలు ఇవ్వటం ఇప్పటివరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నం. అమెరికా ఆదేశాల మేరకు తాలిబాన్లను తయారు చేసిన పాకిస్తాన్‌ తరువాత కాలంలో అమెరికా ఆదేశాల మేరకు ఆ తాలిబాన్లనే అణచివేయటం ప్రారంభించింది. తమ దేశంలో తలదాచుకున్న ఒసామాబిన్‌ లాడెన్‌ను హతమార్చటానికి అమెరికాకు తోడ్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ఐఎస్‌ వుగ్రవాదులు, తాలిబాన్లు కలిసి పాకిస్థాన్‌పై దాదాపు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారు.దానికి తోడు ఆఫ్ఘన్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితి. చాలా ప్రాంతాలపై ప్రభుత్వానికి అదుపు లేదు. తాలిబాన్లదే పెత్తనం. తెగల వారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిది ఆధిపత్యం. కాబూల్‌ గద్దెపై ఎవరుంటే ఆ తెగవారు చూసీ చూడనట్లు వుంటారు తప్ప మిగతావారు శత్రువులే. తమ అణచివేతకు తోడ్పడుతున్న పశ్చిమ దేశాలలో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులు దాడులకు పాల్పడటాన్ని చూస్తున్నాము. ఇప్పటికే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులతో నిత్యం కాశ్మీర్‌ రావణకాష్టంలా మండుతున్నది. ఇప్పుడు తాలిబాన్‌ -ఐఎస్‌ తీవ్రవాదులను కూడా మోడీ సర్కార్‌ ఆహ్వానించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మనదైన స్వతంత్ర విదేశాంగ విధానం మనకు వుండాలి తప్ప మరొక దేశం అది అమెరికా లేదా మరేదైనా దాని ప్రయోజనాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వుంటే నష్టపోయేది మనమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మేలుకోవటం మంచిది. మొండిగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ఎన్‌డిఏదే బాధ్యత అవుతుంది.

  చైనా ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే అది ప్రభుత్వ రంగ కంపెనీలకు ఆర్డర్లు సంపాదించుకుంటున్నది. దాని ద్వారా వచ్చే లాభం, ప్రయోజనం ప్రజలకు చెందుతుంది. బిల్‌ గేట్స్‌ వంటి కార్పొరేట్లు అంద చేసే సాయం వారి కంపెనీలకు ఆర్డర్లకోసం వుపయోగపడుతుంది. అమెరికా,జపాన్‌, బ్రిటన్‌ ప్రభుత్వాలు చేసే సాయం ఆ దేశాలలోని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు లంకె వుంటుంది. నరేంద్రమోడీ సర్కార్‌ వున్న ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం లేదా మూసివేతలకు పూనుకుంది. పెట్టుబడులు పెడుతున్నది ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే అంటే సాయం పేరుతో ఏటా బడ్జెట్‌ నుంచి కేటాయించే 160 కోట్ల డాలర్ల సాయంలో ఎక్కువ విదేశాలలో పెట్టుబడులు పెట్టే భారతీయ కార్పొరేట్లకు అందచేస్తున్న సబ్సిడీ అవుతుంది తప్ప మరొకటి కాదు. మన జనానికి సబ్సిడీలలో కోత, కార్పొరేట్లకు మోత !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో తగ్గుతున్న ఆరోగ్య భారం-భారత్‌లో పెరుగుతున్న రోగ రుణ భారం

23 Saturday Jul 2016

Posted by raomk in CHINA, Economics, Health, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

China, healthcare costs, healthy china, INDIA, world bank on china health

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-భారత్‌ సంస్కరణలకు తేడా ఏమిటి ?

25 Saturday Jun 2016

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

China, economic reforms, FDI, INDIA, subsidies

ఎం కోటేశ్వరరావు

      ఎదుటి వారి ప్రతికూలతలను తమ అనుకూలతలుగా మార్చుకోవటం లాభార్జనా పరుల నిరంతర ప్రయత్నం. జౌళి రంగంలో అటువంటి అవకాశాలనే తమ లాభాలకు వినియోగించుకోవాలని స్వదేశీ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు తహతహలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న లేదా ప్రచారం చేస్తున్నదాని ప్రకారం రానున్న మూడు సంవత్సరాలలో జౌళి రంగంలో 11 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే ఆ రంగంలో మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లు పెరుగుతాయి. కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష వుపాధి లభిస్తుంది. దీని కోసం ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటానికి, ఇంకా కొన్నివేల కోట్ల పన్ను, ఇతర పరోక్ష రాయితీలు ఇవ్వటానికి కొత్త ప్రోత్సాహక పధకాన్ని ప్రకటించింది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఇంత తక్కువ ఖర్చుతో అంత పెద్ద మొత్తం ప్రయోజనం కలుగుతుందంటే ఎవరు కాదంటారు? ఈ రంగంలో ఇప్పటికే మన కంటే ఎంతో ముందున్న బంగ్లాదేశ్‌ వంటి దేశాలు ఎంత పేదవైనా వాటి మార్కెట్‌ను నిలబెట్టుకోవటానికి ఇంతకంటే ఎక్కువ రాయితీలు ఇవ్వలేవా అన్నది అర్ధంగాని ప్రశ్న.

      మన ఆత్రాన్ని సొమ్ము చేసుకొనేందుకు, వూరించి ముందుకు దూకించేవారు ఎప్పుడూ వుంటారు. మన కేంద్ర ప్రభుత్వం రానున్ను మూడు సంవత్సరాలలో 17 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 40 దాటిస్తామని చెబుతుంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా మూడేండ్లలో 40 ఏమిటి పది సంవత్సరాలలో 150 బిలియన్‌ డాలర్ల సత్తా మీకు వుందని మన సిఐఐ(కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) నియమించిన అమెరికా సంస్ధ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బిసిజి) ఒక నివేదిక ఇచ్చింది.దాని ప్రకారం 2025 నాటికి భారత జౌళిరంగం 300 బిలియన్‌ డాలర్ల విలువకు చేరుతుందని, 150 బిలియన్‌ డాలర్ల విదేశీమారక ద్రవ్య ఆర్జనతో పాటు ఐదు కోట్ల మందికి అదనంగా వుపాధి కల్పించవచ్చని, వారిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది మహిళలు వుంటారని లెక్కలు చెప్పింది. దీనికి గాను అది చెప్పిన ఆధారాలు ఏమిటంటే చైనా యువాను విలువతో పాటు అక్కడ వేతనాలు పెరుగుతున్నాయి కనుక పరిశ్రమలు అక్కడి నుంచి తరలి పోతున్నాయి, అందువలన చైనాతో పాటు అలాంటి ఇతర దేశాల వాటిని భారత్‌ ఆకర్షిస్తే 280 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతుల మార్కెట్‌ను పట్టుకోవచ్చని ఆ నివేదిక మన ముందు ఒక రంగుల కలను సాక్షాత్కరింప చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, వియత్నాం దేశాలు ముందు పీఠీన వున్నప్పటికీ, ఆఫ్రికాలో ఇథియోపియా వంటి కొత్త కేంద్రాలు వునికిలోకి వస్తున్నప్పటికీ,అమెరికాలో తిరిగి పెద్ద ఎత్తున వుత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ భారత్‌కు ఈ అవకాశాలు వుంటాయని బిసిజి నమ్మబలికింది.

   మన జనానికి వుపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందే. అందుకు తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రజల, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చేయాలా అన్నదే సమస్య.స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్‌ తన గ్లాస్గో (పాత తరం వారికి గ్లాస్గో పంచెలు ఇప్పటికీ గుర్తు వుంటాయి) తదితర నగరాలలో వున్న వస్త్ర కర్మాగారాల కోసం మన దేశాన్ని పత్తి సరఫరా చేసే దేశంగానూ, అక్కడ తయారైన వుత్పత్తులను విక్రయించే మార్కెట్‌గానూ మార్చిందన్నది తెలిసిందే. అప్పుడు దాని వుత్పత్తులకు ప్రపంచంలోని వలస దేశాలన్నింటినీ మార్కెట్‌లుగా మార్చి తన పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చింది. ఇప్పుడు కూడా బ్రిటన్‌ తన కర్మాగారాలకు అవసరమైన పత్తిని ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అలా దిగుమతి చేసుకొని తన కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చి వుత్పత్తి చేయిస్తే అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు ఎలా వుంటాయి. అందువలన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చౌకగా శ్రమశక్తి దొరుకుతుందో అక్కడే తనకు కావాల్సిన దుస్తులను తయారు చేయించుకుంటే అదే లాభసాటిగా వుంటోంది కనుక ఏకంగా తన ఫ్యాక్టరీలను ఆయా దేశాలకు తరలించటం లేదా కొత్త ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేయిస్తున్నది.ఇదేదో బ్రిటన్‌ ఒక్కటే చేస్తున్నది కాదు, అన్ని ధనిక దేశాలదీ ఇదే బాట. నీరు పల్లంవైపు, పెట్టుబడిదారుడు లాభాలవైపు పయనిస్తాడు. గతంలో దేశాలను అక్రమించుకుంటే లాభాలు, ఇప్పుడు శ్రమశక్తితో తమకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటే, ఇతర దేశాల దగ్గర లేని ఆధునిక పరిజ్ఞానంతో తన దగ్గర తయారయ్యే వస్తువులకు మార్కెట్లను పట్టుకుంటే సిరులు, అందుకే పద్దతులను మార్చారు.

    అమెరికా వాణిజ్యవేత్తలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనాల నుంచి దుస్తులు, బొమ్మలు, ఇతర సామగ్రిని దిగుమతి చేసుకొని, తమ వద్ద పాతబడిపోయిన అణు కర్మాగారాలు, మిలిటరీ ఆయుధాలను మన వంటి దేశాలకు అంట గట్టి లాభాలు పొందుతున్నారు. ఇవేవీ లేకపోతే పెట్టుబడి పెట్టనవసరం లేదు, ఫ్యాక్టరీ కట్టనవసరం లేదు, వ్యాపార దుకాణాలూ తెరవనవసరం లేదు. లాభాల బాటలో వున్న మన వంటి దేశాల కంపెనీల వాటాలను వుదయం కొనుగోలు చేసి సాయంత్రానికి వాటి విలువ పెరిగితే అమ్ముకొనీ లబ్ది పొందుతున్నారు. ఈ పని చేయటానికి సూట్‌ కేసులతో మన ముంబయ్‌ రానవసరం లేదు, సినిమాలలో చూపినట్లు ఏ విలాస కేంద్రంలోనో మందు, మగువలతో కూర్చొని ఇంటర్నెట్‌తో మీటలు నొక్కితే చాలు.

    భారత్‌ను చైనాతో పోల్చితే కొంత మందికి తేళ్లూ జెర్రులు పాకినట్లుంటాయి. అది నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం దానికీ దీనికీ పోలికా అని రంకెలు వేస్తారు. చైనా మాదిరి సంస్కరణలను మన దేశంలో సంస్కరణలు అమలు జరిపితే వ్యతిరేకిస్తారు అని కమ్యూనిస్టుల మీద నిందలు వేసేటపుడు మాత్రం వారికి అప్పుడు చైనా కావాలి. కానీ వారే మరో సందర్భంలో త్వరలో మన దేశం చైనాను అధిగమించబోతోందని లొట్టలు వేసుకుంటూ చెబుతూ తమ జబ్బలను తామే చరుచుకొని శభాష్‌ అని చెప్పుకుంటారు.అంతెందుకు కమ్యూనిస్టులను వ్యతిరేకించే మన వ్యాపారులు గత కొద్ది సంవత్సరాలుగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతోనే వ్యాపారాలు చేసి లాభాలు పోగు చేసుకోవటం లేదా? వారికి అక్కడి కమ్యూనిజం అడ్డం రావటం లేదేం? ఇది అన్యాయం కదా !

    ‘ఆసియా బ్రీఫింగ్‌’ అనే ఒక పత్రిక వుంది. అదేమీ కమ్యూనిస్టు, వామపక్ష పత్రిక కాదు. పెట్టుబడిదారుల సేవలో వుంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో రెండు దేశాలలో వున్న కనీస వేతనాల గురించి ఒక పోలికను ఇచ్చింది.http://www.asiabriefing.com/news/2013/07/comparison-minimum-wages-in-china-and-india/ దానిలో రెండు దేశాలలోని కొన్ని ప్రధాన నగరాలలో కనీస వేతనాలు ఎలా వున్నాయో తెలిపింది. వాటిని దిగువ చూడవచ్చు.2013 జూలై 18న ప్రచురించిన ఆ వ్యాసంలో నాడు డాలరు విలువ రు.59.42గానూ, యువాన్లు 6.14గానూ వున్నాయి.

పట్టణం              నెలవేతనం స్ధానిక కరెన్సీ          అమెరికా డాలర్లలో

ఢిల్లీ                        6,448                                110

హైదరాబాదు              4,940                                  83

ముంబై                    4,940                                  83

జైపూర్‌                     4,030                                 68

అహమ్మదాబాదు         3,900                                 65

చెన్నయ్‌                  3,041                                51

షాంఘై                    1,620                                264

గ్వాంగ్‌జు                  1,550                                253

హాంగ్‌జౌ                   1,470                                240

టియాన్‌జిన్‌               1,500                                245

బీజింగ్‌                     1,400                                228

దలియన్‌                   1,300                               212

     కనీస వేతనాలపై కార్మికుల సంక్షేమ చర్యలకు గాను యజమానులు అదనంగా సగటున 30 నుంచి 50శాతం వరకు చెల్లించాలని, అదే భారత్‌లో గరిష్టంగా పదిశాతానికి మించి లేదని కూడా ఆ పత్రిక విశ్లేషణ పేర్కొన్నది. చైనాలో కనీస వేతనాలు, సంక్షేమ చర్యలకు యాజమాన్యాలు చెల్లించాల్సిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి తప్ప ఏదో ఒకసాకుతో కోత పెట్టటం లేదు. అందుకనే విదేశీ ప్రయివేటు యజమానులు చైనాలో తమకు గిట్టుబాటు కావటం లేదని సణగటం మొదలు పెట్టటమే కాదు, ఎక్కువ లాభాలు వచ్చే ప్రాంతాలకు వలసపోవటం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపకపోయినా లేక కోత పెట్టినా అక్కడ కార్మికులు ప్రతిఘటించటమే కాదు, అవసరమైతే సమ్మెలకు కూడా దిగుతున్నారు. కనీస వేతనాల పోలిక చేసిన ఆసియా బ్రీఫింగ్‌ పత్రిక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల కార్యకలాపాల ప్రారంభానికి భారత్‌ కీలకం అని మూడు సంవత్సరాల నాడే తన వ్యాఖ్యలో పేర్కొన్నది. అంటే ఘనత వహించిన నరేంద్రమోడీ అధికారానికి రాక ముందే అని వేరే చెప్పనవసరం లేదు.ఎఫ్‌డిఐలు ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ప్రపంచ పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చేందుకు 1992లో ఏర్పాటయిన డిజాన్‌ షిరా అండ్‌ అసోసియేట్స్‌ స్థాపకుడు క్రిస్‌ డేవన్‌ షైర్‌ విల్స్‌ రాసిన వ్యాసంలో పై వివరాలు పేర్కొన్నారు.

    కార్మికులకే కాదు, రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వటంలోనూ, సగటు దిగుబడులను పెంచే వంగడాలు, ఇతర పెట్టుబడులను సమకూర్చటంలోనూ అక్కడి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటున్నది. పత్తికి ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని ధరలను ఇవ్వటమే కాదు, వుత్పత్తి కేంద్రాలనుంచి కొనుగోలు కేంద్రాలకు చేర్చే రవాణా ఖర్చులను కూడా భరిస్తున్నది. ఇదంతా రెండు దేశాలలో సంస్కరణలు అమలు జరిగిన తరువాత తలెత్తిన పరిస్థితి. అందువలన ఏ సంస్కరణలను వ్యతిరేకించాలి? వేటిని సమర్ధించాలి ? కావాలంటే జనానికి మేలు చేసే సంస్కరణలకు ముందు తగిలిస్తున్నట్లు ప్రధాని పేరు తగిలించి అమలు జరపండి ఇబ్బంది లేదు. అవేమీ లేకుండా కార్మికులు కడుపుకట్టుకొని పెట్టుబడిదారులు,వ్యాపారులకు లాభాలు చేకూర్చాలని చూస్తే జనమే కాదు, దేశం కూడా నష్టపోతుంది.

   విచక్షణా రహితంగా విదేశీ కంపెనీలను, దిగుమతులను అనుమతిస్తే దేశీయ పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటాయి.అందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రక్షణ చర్యలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాలలో ఎక్కడ లాభసాటిగా అక్కడకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. జపాన్‌ తన సామాన్యుల కారు మారుతీ తయారీని భారత్‌లో ప్రారంభిస్తే విలాసవంతమైన జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ కార్ల ఫ్యాక్టరీని మన టాటా మోటార్స్‌ చైనాలోని చాంగుషులో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోమని చెబుతున్నారు.చైనా కూడా అదే పని చేసింది. అదే సమయంలో తన అంతర్గత వినియోగాన్ని కూడా పెంచే క్రమంలో తన పౌరుల ఆదాయాలను గణనీయంగా పెంచింది. అందుకే ప్రపంచ ధనిక దేశాలలో తీవ్ర మాంద్యంతో ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ దాని ఆర్ధిక వ్యవస్ధపై పెద్ద ప్రభావం పడలేదు. అటువంటి పరిస్థితి మన దేశంలో వుందా ? విధానాలు అందుకు అనుగుణంగా వున్నాయా ? గౌరవంగా బతికేందుకు అవసరమైన వేతనాలు పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గటం, స్వల్పవేతన వుద్యోగులు, కార్మికుల సంఖ్య పెరగటం దేనికి సూచిక ?

     సులభంగా వ్యాపారం చేసేందుకు అవకాశాల పేరుతో ప్రతి ఏడాదీ ప్రపంచబ్యాంకు ఒక సూచికను తయారు చేస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన సమయంలో ప్రపంచంలోని 189 దేశాలలో భారత్‌ 134వ స్థానంలో వుంది, దానిని 50లోపుకు చేరుస్తానని ప్రపంచ పెట్టుబడిదారులకు మోడీ హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అది 130 స్థానంలో వుంది. ఆ యావలో మోడీ కార్మికులకు, సామాన్య జనానికి, దేశం మొత్తానికి హాని కలిగించే విధంగా మన ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా బార్లా తెరిచేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌ వ్యాపారులు స్ధానిక రాజులు, రంగప్పలను లోబరుచుకొని మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు స్వతంత్ర పాలనలో ఏకంగా ప్రభుత్వమే జనం పేరుతో అన్ని దేశాల వారికి దేశాన్ని అప్పగించేందుకు పూనుకుంది. ఏడుపదుల స్వాతంత్య్రం వెనక్కు పోతోందా? ముందుకు పోతోందా ? ఏది దేశ భక్తి? ఏది దేశద్రోహం, ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండియా-ఇరాన్‌-చైనా సంబంధాలు

25 Wednesday May 2016

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chabahar, China, INDIA, india- iran-china relations, iran, port of Chabahar, Silk Road Train

సత్య

  గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలతో ఎక్కువగా ఎందుకు కాలం గడుపుతున్నారంటే వెంకయ్య నాయుడి వంటి శిష్య గణం విదేశీ పెట్టుబడుల కోసం అని వెనుకా ముందు చూసుకోకుండా చెప్పారు. మూడో సంవత్సరంలో అడుగుపెట్టబోయే ముందు ప్రధాని ఇరాన్‌ పర్యటన జరిపారు. ఈ సందర్బంగా వచ్చిన వార్తలేమిటి అక్కడ ఒక రేవును అభివృద్ధి చేయటంతో పాటు రానున్న రోజులలో 20 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు లక్షా 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అక్కడ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావాలని, వాటితో దేశాన్ని బాగు చేస్తామని చెబుతున్న పాలకులు మరోవైపు దేశం వెలుపలికి పెట్టుబడులను తరలించటం ఏమిటి ?

    దీనికి గాను జనానికి చెబుతున్నది ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించాలంటే పాక్‌ భూ భాగం గుండా వెళ్లాలని, ఆ దేశం మనకు ఇబ్బందులు కలిగించకుండా వుండాలంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని, అందుకు గాను గుజరాత్‌లో కాండ్లా రేవు నుంచి ఇరాన్‌లోని చబహార్‌ రేవుకు దగ్గరకు దగ్గర, తలనొప్పిలేని మార్గం అవుతుందని, దీనికి తోడు ఇరాన్‌ నుంచి మధ్య ఆసియా ద్వారా రష్యా వరకు రైలు మార్గంతో సరకు రవాణా సులభం అవుతుందని చెబుతున్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు, ఇతరులతో తలనొప్పిలేని మార్గాలను వెతుక్కోవటం కూడా మంచిదే. మన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇబ్బంది లేదు, తప్పులేదు, చేయదలచుకున్నదేదో చేసుకోక పొరుగుదేశాల గురించి నోటి దూల ఎందుకు ?

     అమెరికా కనుసన్నలలో నడుస్తున్న మనం ఇరాన్‌కు దూరంగా జరిగిన సమయంలో చైనా ఆ స్ధానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇరాన్‌కు తొలి సిల్కు రైలును విజయవంతంగా నడిపింది. చైనా తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లోని ఇవు నుంచి ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు 10,399 కిలోమీటర్ల దూరాన్ని కజకస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌ దేశాల గుండా ప్రయాణించి 14 రోజుల్లో రైలు 32 కంటెయినర్ల సరకును చేర్చింది. అదే సముద్రమార్గం ద్వారా చైనా షాంఘై నుంచి ఇరాన్‌ రేవు బందర్‌ అబ్బాస్‌కు ఓడ చేరుకొనేందుకు 45 రోజులు పడుతుంది. రెండు దేశాల మధ్య 2003-13 మధ్య వాణిజ్యం నాలుగు నుంచి 53 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రానున్న దశాబ్ద కాలంలో ఈ మొత్తాన్ని 600 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని జనవరిలో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ పర్యటన సందర్భంగా వుభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇరాన్‌తో మన వాణిజ్యం ప్రత్యక్షంగా 14 బిలియన్‌ డాలర్లు, మూడవ పక్ష దేశం ద్వారా చేసిందానితో కలిపితే 30 బిలియన్‌ డాలర్లకు మించి లేదు. చైనా నుంచి యూరేసియా ప్రాంతానికి రైలు ద్వారా సరకు రవాణా ఇరాన్‌కు ఆదాయం తెచ్చిపెడుతుంది. తన రైలు మార్గాన్ని వినియోగించుకున్నందుకు సరకు రవాణా సంస్ధలు చెల్లిస్తాయి. చైనాలోని ఇవు నుంచి స్పెయిన్‌లో మాడ్రిడ్‌ వరకు 13వేల కిలోమీటర్ల దూరం వరకు సరకు రవాణాకు అవకాశం వుంది. ఈ పూర్వరంగంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు చబహార్‌ రేవు ఒప్పందం అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇరాన్‌ తనకు ప్రయోజనం వున్న ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరుపుకుంటుందని గుర్తించాలి.

     మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన పారిశ్రామికవేత్తలు చబహార్‌లో అభివృద్ధి చేసేది పిచ్చుక గూడు అంత చిన్నది అనుకుంటే దానికి 100 కిలోమీటర్ల దగ్గరలోని పాకిస్థాన్‌ రేవు గ్వడార్‌ ప్రాంతంలో చైనా ఏకంగా పెద్ద రాజప్రాసాదమే ఏర్పాటు చేస్తున్నదట. నరేంద్ర మోడీ నిర్ణయం గురించి సంతోషం పట్టలేని ఒక తెలుగు పత్రిక ఈ ప్రాంతంలో హెచ్చుతున్న చైనా ప్రాబల్యానికి ఇది కళ్లెం వేసే నిర్ణయం అని జబ్బలు చరుచుకుంది. పాకిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేసే కారిడార్‌లో పెట్టుబడులు 46 బిలియన్‌ డాలర్లు అయితే చబహార్‌లో మనం పెట్టేది 50 కోట్ల డాలర్లని ఒక ఆంగ్ల పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది. అదే చబహార్‌ రేవు ఆధారంగా అక్కడ చైనా ఒక పెద్ద పారిశ్రామిక పట్టణాన్నే ఏర్పాటు చేసేందుకు అదే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది.

    చబహార్‌ రేవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పలుకుబడి పెంచుకోవాలని 2003లోనే వాజ్‌పేయి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకాలం ఎందుకు ముందుకు పోలేదు? స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక కాలవ తవ్వాలన్నా బ్రిటీష్‌ రాణీగారి అనుమతి కావాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశం ఏం చేయాలన్నా అమెరికా అనుమతి కావాలంటే ఇదేమిటి ఇలా అంటున్నారు అని చాలా మందికి కోపం రావచ్చు. కానీ ఇది నిజం. ఇరాన్‌తో మనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదు. ఎక్కడా మార్కెట్ల కోసం పోటీ పడలేదు, తగాదా లేదు. అమెరికా-ఇరాన్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం. ఇరాన్‌లోని చమురు మొత్తాన్ని స్వాహా చేయాలన్నది అమెరికా కల. దాన్ని ఇరానియన్లు అడ్డుకున్నారు. దాంతో ఇరాన్‌ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని చేపట్టిందనే పేరుతో దానిపై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధించింది అమెరికా. మన పాలకులు అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దాని వెనుకే నడుస్తున్నారు కనుక మనమూ ఇంతకాలం ఇరాన్‌కు దూరంగా వుండి అమెరికన్లను సంతోషపరిచాము. ఇప్పుడు ఇరాన్‌తో అమెరికన్లు రాజీకి వచ్చారు కనుక, ఇప్పుడు మనమూ మైత్రి గురించి కవిత్వం చెబుతున్నాము. వెన్నెముకలేని విదేశాంగ విధానం, అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో చౌకగా చమురు ఇస్తామని ఇరాన్‌ ముందుకు వచ్చినా అయ్యగారికి కోపం వస్తుందన్నట్లుగా తీసుకోలేదు.

    మా దేశంలో పరిశ్రమలు పెట్టండహో అని ప్రపంచమంతా తిరిగి రా రమ్మంటున్నాము. కానీ మన పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో ఇరాన్‌లో పరిశ్రమలు పెడతారట. నీరు పల్లమెరుగు- పెట్టుబడి లాభాలనెరుగు అని కొత్త సామెతను చెప్పుకోవాలేమో. పెట్టుబడి తనకు లాభాలు ఇచ్చే దేశ మాతలు లేదా పితలకు తప్ప స్వదేశ మాతా, పితలకు జై అనదు. అదేమీ చిత్రమో గానీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరిగిన కొద్దీ మన ఎగుమతులు, దేశంలో వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు నానాటికీ పడిపోతున్నాయి. పదిహేడు వుపరంగాలతో కూడిన వస్తూత్పత్తి రంగంలో 2013 ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో వచ్చిన ఎఫ్‌డిఐ 8.8 బిలియన్‌ డాలర్లయితే అదే కాలంలో 2014లో 6.8, 2015లో 4.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయితే ఇదే సమయంలో సేవారంగం, ఐటిలో ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగాయి. వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే పెట్టుబడులు మన మౌలిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇతర రంగాలకు వచ్చేవి లాభాలు దండుకొని తెల్లవారేసరికి మాయం అవుతాయి. గతేడాది మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో కేవలం 16శాతమే వస్తూత్పత్తి రంగానివి, ఇదే చైనాలో 43శాతం వున్నాయి. అందుకే అది ప్రపంచంలో ఎక్కడ బడితే అక్కడ తన పలుకుబడిని పెంచుకొనేందుకు అమెరికా ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర కార్యాచరణతో ముందుకు పోతున్నది, తన పారిశ్రామిక వుత్పత్తులకు మార్కెట్లను నిలబెట్టుకోవటమే కాదు, విస్తరించుకుంటున్నది. మరి మన పరిస్ధితి వున్న ఎగుమతులే గత 17 నెలలుగా పడిపోతున్నాయి. మార్కెట్లు లేకుండా స్వంత కార్యాచరణ, విధానాలు లేకుండా అమెరికా,ఐరోపా దేశాలకు జూనియర్‌ భాగస్వామిగా మారితే , అవే చైనా ధాటికి నిలవలేక విలవిల్లాడుతుంటే మనం ఎన్ని చబహార్‌లను అభివృద్ధి చేసినా ఫలితం వుంటుందా ?

    చైనా ఆర్ధిక వ్యవస్ధ గురించి అనేక మంది భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొంత మంది అక్కడ సోషలిస్టు వ్యవస్థలేదని అంటారు, మరికొందరు ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణంలో వుందని వ్యాఖ్యానిస్తారు. బ్రిటన్‌ నుంచి హాంకాంగ్‌, పోర్చుగీసు నుంచి మకావో దీవులను తిరిగి తన పాలన కిందకు తెచ్చుకున్న సమయంలో చైనా ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు అంటే 2049 వరకు అక్కడ వున్న వ్యవస్ధలను యధావిధిగా కొనసాగించేందుకు ఒప్పందం చేసుకుంది. అందుకే ఒకే దేశం-రెండు వ్యవస్ధలున్న దేశంగా చైనా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, ఇతర ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధ వుంది. ఇదొక నూతన ప్రయోగం. అది అనుసరించిన ప్రజానుకూల సంస్కరణల ఫలితంగా పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎంతో వేగంగా పురోగమిస్తోంది.అగ్రశ్రేణి పెట్టుబడిదారీ దేశాలతో వున్న ఆర్ధిక సంబంధాల రీత్యా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నది తప్ప పెట్టుబడిదారీ విధానం 2008 నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద మాంద్యానికి అది దూరంగా వుంది.

   చబహార్‌ రేవు అభివృద్ధిపై ఒప్పందం కుదుర్చుకోవటాన్ని గొప్ప అంశంగా చిత్రిస్తున్నారు. దీని వలన లాభం ఎవరికి అన్నది ప్రశ్న. చైనా కూడా అలాంటి ఒప్పందాలనే కుదుర్చుకుంటున్నది, అంతకంటే ఎక్కువ పెట్టుబడులే పెడుతున్నది. కొంత మంది వ్యాఖ్యాతలు చెబుతున్నదాని ప్రకారం అక్కడ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమే వుందనుకుందాం. అలాంటపుడు ఇలాంటి ఒప్పందాల వలన కలిగే లాభం ఏదైనా వుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది, ఆ మొత్తాన్ని చైనా సర్కార్‌ జనానికే ఖర్చు పెడుతుంది. మరి మన దేశం కుదుర్చుకొనే ఒప్పందాల వలన వచ్చే లాభం ఎవరికి జేబుల్లోకి పోతుంది. అంబానీ, అదానీ అండ్‌కోలకే కదా ? మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు వచ్చిన లాభాలను తిరిగి ఇక్కడ పెట్టుబడులుగా పెట్టకుండా బయటకు తరలిస్తున్నాయని విమర్శిస్తున్నాం, ఇప్పుడు అదే పని మన దేశ కార్పొరేట్‌ సంస్ధలు కూడా చేస్తున్నట్లే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పాలనలో నీరుగారుతున్న ‘సంతోషం’

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

China, INDIA, Pak, UN, world happiness index

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు తొంగి చూసినందుకు బాధగా వుందన్నట్లు మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనే జనం మన కంటే ఎక్కువ సంతోషంగా వున్నారట.

ఎం కోటేశ్వరరావు

    నిరోధం తప్ప చికిత్సలేని పరివార్‌ వైరస్‌ 2.014 బాధితులు వుపశమనం పొందేందుకు కూడా అవకాశం లేకుండా వరుసగా ప్రధాని నరేంద్రమోడీ వైఫల్యాలు వెల్లడవుతున్న కొద్దీ వారికి దిగులు పెరిగిపోతోంది. ఆ జాబితాలో తాజాగా ‘ ప్రపంచ సంతోష సూచిక 2016 ‘ చేరింది. అచ్చేదిన్‌ ఆయేగా అని సంతోష పడుతున్న వారిగా చచ్చే దిన్‌ అయా అన్న వార్త ఎలా వుంటుంది మరి.

     ఈనెల 20 ప్రపంచ సంతోష దినం. ఈ సందర్భంగా గురువారం నాడు ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2016 విడుదల అయింది. దానిలో వెల్లడించిన సూచిక ప్రకారం మన దేశం 156 దేశాలలో గతేడాది కంటే ఒకటి తగ్గి 118వ స్థానానికి పడిపోయింది. ఏడాది కాలంలో సంతోషం బాగా దిగజారిన పది దేశాలలో మనల్ని నిలపటం మోడీ సాధించిన ఘన విజయాలలో ఒకటి. మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు తొంగి చూసినందుకు బాధగా వుందన్నట్లు మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనే జనం మన కంటే ఎక్కువ సంతోషంగా వున్నారట. ఐక్యరాజ్య సమితి కోసం పాలనీయ లేదా నిరంతర అభివృద్ధి పరిష్కారాల నెట్‌ వర్క్‌( సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌ వర్క్‌ ) రూపొందించిన నివేదిక కనుక ఇదంతా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమని ఆరోపిస్తే కుదరదు. కమ్యూనిస్టుల పాలనలో జనానికి స్వేచ్ఛ లేక సుఖ సంతోషాలు వుండవు అని చెప్పేవారు అది 83వ స్ధానంలో వుందని, నిరంతరం అమెరికా , ఇతర దేశాలు అందచేసిన ఆయుధాలు, డబ్బుతో నిరంతరం ఇజ్రాయెల్‌ దాడులకు గురవుతూ ఏ రోజు కారోజు పొట్ట చేతబట్టుకు తిరిగే పాలస్తీనియన్లు కూడా మన కంటే మెరుగైన 108 స్ధానంలో పాకిస్ధాన్‌ 92, నేపాల్‌ 107, బంగ్లాదేశ్‌ 110, శ్రీలంక 117, మయన్మార్‌ 119వ స్థానంలో వున్నాయి.కరవుకు మారుపేరైన సోమాలియా కూడా 76వ స్థానంలో సంతోషంగా వుంది. అంతకంటే గమనించాల్సిన అంశం ఏమంటే 2013లో మన దేశం 111వ స్ధానంలో వుంది.

    ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభం చైనా కూడా పడిందని, దానిని అవకాశంగా తీసుకోవాలని ఇప్పటికే అభివృద్ధి రేటులో మెరుగ్గా వున్న మన దేశం చైనా స్ధానాన్ని వెనక్కు గొట్టి కొంత మంది చెబుతూ వుంటారు. సంతోష నివేదిక ప్రకారం సంతోషంలో వచ్చిన మార్పులు 2005-7 నుంచి 2013-15 వరకు భాగం ఒకటి పట్టిక 5 పేజీ(20) ప్రకారం సంతోషం తగ్గిన 126 దేశాలలో పందొమ్మిదవ స్థానంలో వున్న చైనాలో 0.525 సంతోషం తగ్గగా 120వ స్ధానంలో వున్న మన దేశంలో మైనస్‌ 0.750 తగ్గింది. మన తరువాత ఎమెన్‌, వెనెజులా,బోట్స్‌వానా, సౌదీ అరేబియా, ఈజిప్టు, గ్రీసు వున్నాయి.

    సంతోషంలో అగ్రభాగాన వున్న దేశాల విషయానికి వస్తే స్విడ్జర్లాండ్‌ను వెనక్కు నెట్టి డెన్మార్క్‌ ప్రధమ స్ధానంలో వుంది తరువాత స్విడ్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, ఫిన్లాండ్‌ వున్నాయి. సంతోష సూచికకు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారంటే తలసరి జిడిపి,ఆయుర్ధాయం, సామాజిక(ప్రభుత్వ) మద్దతు, జీవన ఎంపికకు స్వేచ్ఛలను పరిగణనలోకి తీసుకున్నారు.

    అమెరికా 13వ స్థానంలో ఆస్ట్రేలియా 9, ఇజ్రాయెల్‌ 11 కాగా చివరి స్ధానాలలో ర్వాండా,బెనిన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, టోగో, సిరియా,బురుండి వున్నాయి.మరింత సంతోషానికి ప్రభుత్వ విధానాల పట్ల మరింత శ్రద్ధ వుండాలన్న నూతన డిమాండ్‌ ప్రపంచ వ్యాపితంగా ముందుకు వచ్చిందని నివేదిక పేర్కొన్నది. అంటే దీనిని మరో విధంగా చెప్పాలంటే నయా వుదారవాద విధానాల పేరిట సామాజిక మద్దతును వుపసంహరించుకోవటం పెరిగిన కొద్దీ సంతోషం తగ్గిపోతూ వుంటుంది. ‘ఎక్కడైతే సంతోషంలో అసమానతలు తక్కువగా వున్నాయో అక్కడి సమాజాలలో జనం సంతోషంగా వున్నారని, 2005-2011తో పోల్చితే 2012-15 నాటికి సంతోష అసమానతలు గణనీయంగా పెరగటాన్ని కూడా కనుగొన్నామని, ఇది దాదాపు అన్ని ప్రాంతాలు, ప్రపంచ జనాభా మొత్తంలో ఇది కనిపించిదని’ నివేదిక పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

66.11 Per Cent Children Possess Abnormal Levels Of Sugar In India

14 Saturday Nov 2015

Posted by raomk in Health

≈ Leave a comment

Tags

diabetic, INDIA, Sugar

66.11 Per Cent Children Possess Abnormal Levels Of Sugar In India: Survey

A whopping 66.11 per cent of children possess “abnormal levels of sugar” in their body, found a pan-India survey.

Of the 17,000 children screened over a period of three years, a total of 51.76 per cent male children were found having abnormal HbAlc (an indicator of diabetic control) levels, with the highest prevalence among children in the western zone.

“Western Zone had highest percentage of abnormality with 68.48 per cent while eastern and northern zone had 61.48 per cent and 64.71 per cent, respectively. Among the four zones, southern India showed the lowest percentage of abnormality with 54.95 per cent,” said Leena Chatterjee, Director, Fortis SRL Labs and SRL Strategic Initiatives, which carried out the survey.

The findings of the survey, conducted between 2012-2014, were released today on the occasion World Diabetes Day.

The survey checked the response to diabetes therapy and diagnosis of pre-diabetes and diabetes in the children through HbA1c tests, said Chatterjee.

“Rapid urbanisation, change in eating habits and shifting more focus to indoor activities have resulted in dramatic lifestyle changes leading to chronic condition associated with abnormally high levels of sugar in children,” said Chatterjee.

Chatterjee asked people not to become alarmed with a diagnosis of pre-diabetes citing it is a warning sign and a chance to make changes for the better.

“We understand that it’s pretty difficult to cut out sugar completely, but one can start by skipping it in milk, choosing non-sugary breakfasts, avoiding juice beverages, and limiting bread, pasta and rice.

“It is essential that children and adolescents get themselves tested if they are overweight with body weight exceeding 120 per cent of the ideal weight or they have positive family history among first and second degree relatives and if they have signs of insulin resistance,” Chatterjee said.

According to World Health Organisation, 80 per cent of all new cases of diabetes are predicted to occur in the developing countries by 2025. In 2012, an estimated 1.5 million deaths were directly caused by diabetes and more than 80 per cent of diabetes deaths occur in low and middle income countries.

Share this:

  • Tweet
  • More
Like Loading...

India Rabi Crops Sowing Crosess 123 Lakh Hactare

14 Saturday Nov 2015

Posted by raomk in Economics, Farmers

≈ Leave a comment

Tags

INDIA, Rabi Crops

As per preliminary reports received for the fields, sowing of Rabi crops has started in various parts of the country. The total area sown under Rabi crops as on 13th November, 2015 is 123.28 lakh hectares.  Wheat has been sown/transplantd in 18.65 lakh hectares, pulses in 38.91 lakh hectare coarse cereals in 34.53 lakhhectares, oilseeds in 31.02 lakh hectares and Rice in 0.17 lakh hectares.

The details of the area covered so far and that covered during last year this time is as follows:                                                                                                                            Lakh hectare

Crop Area sown in 2015-16 Area sown in 2014-15
Wheat 18.65 42.88
Pulses 38.91 34.42
Coarse Cereals 34.53 27.74
Oilseeds 31.02 53.90
Rice 0.17 0.36
Total 123.28 159.30

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global crude oil price of Indian Basket was US$ 42.41 per bbl on 12.11.2015

14 Saturday Nov 2015

Posted by raomk in Current Affairs, Economics

≈ Leave a comment

Tags

crude oil price, INDIA

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 42.41 per barrel (bbl) on 12.11.2015. This was lower than the price of US$ 43.78 per bbl on previous publishing day of 11.11.2015.

In rupee terms, the price of Indian Basket decreased to Rs 2813.92 per bbl on 12.11.2015 as compared to Rs 2904.49 per bbl on 11.11.2015. Rupee closed at Rs 66.35 per US$ on 12.11.2015.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d