• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

ప్రధాని నరేంద్రమోడీ ముందున్న సవాళ్లు, సమస్యలూ !

29 Wednesday May 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Indian economy, Issues and Challenges before Narendra Modi, Narendra Modi, pakoda, pakoda self employment

Image result for Issues and Challenges before Narendra Modi

ఎం కోటేశ్వరరావు

రాజకీయనేతలు, ప్రత్యేకించి ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులు క్లిషంగా వున్నపుడు తమ అధికారాన్ని పదిల పరచుకొనేందుకు జాతీయవాదాన్ని ఒక సాధనంగా చేసుకుంటారు అని రిచర్డ్‌ ఎన్‌ హాస్‌ అనే అమెరికన్‌ దౌత్యవేత్త చెప్పారు. అమెరికన్ల దృష్టిలో జాతీయ వాదం అంటే ఒక దేశం లేదా ప్రపంచ మీద లేదా మార్కెట్‌ మీద ఆధిపత్యం చెలాయించాలనే వాదం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి జాతీయ వాదం. అదే జాతీయ వాదం మరొక దేశం కూడా కలిగి వుంటే జరిగేది ఘర్షణే. అయితే మన దేశంలో జాతీయవాదులుగా చెప్పుకొనే బిజెపి, సంఘపరివార్‌ది అటువంటిది కాదు, హిందూత్వ జాతీయ వాదం. దాని మంచి చెడ్డలను పక్కన పెడితే హాస్‌ చెప్పిన ఆర్ధిక, రాజకీయ క్లిష్ట పరిస్ధితులు ఏ జాతీయవాదులకైనా వర్తిస్తాయి. అధికారం ఒక ముళ్ల కిరీటం, నరేంద్రమోడీ రెండవసారి దాన్ని మరోసారి ధరించబోతున్నారు. ఆయన ఘనతను జాతీయ వాదుల విజయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణించింది. ప్రస్తుతం నరేంద్రమోడీకి రాజకీయ క్లిష్ట పరిస్ధితులు లేవు. ఎందుకంటే ఆ పార్టీకే సంపూర్ణ మెజారిటికీ మించి లోక్‌సభలో సీట్లు వచ్చాయి. మరికొద్ది నెలల్లో రాజ్యసభలో కూడా మెజారిటీ రానుందనే వార్తలను మనం చూశాము. అందువలన నరేంద్రమోడీ ముందు ఆర్ధిక పరమైన, ఇతర సవాళ్లు ఏమి వున్నాయి, వాటి స్వభావం ఏమిటన్నది చూద్దాం.

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీలు లేదా అధికారం కోసం పాకులాడే పార్టీలు గానీ అర్ధసత్యాలను, అసత్యాలనే చెబుతాయి. నిజం చెప్పే వారిని పరిగణనలోకి తీసుకొనే లేదా వారు చెప్పే అంశాలనైనా చర్చించే స్ధితిలో ప్రస్తుతం మన జనం, మీడియా లేదు. ఎన్నికలు ముగిశాయి కనుక వాస్తవ దృక్పధంతో సమస్యలను చూడటం అటు జనానికి, ఇటు నరేంద్రమోడీ పది కాలాలపాటు వుండాలని కోరుకొనే వారికి కూడా అవసరం.

ఆర్ధిక అంకెలే అసలు సమస్య !

తన పాలనా కాలంలో సూట్‌ కేస్‌ కంపెనీలలో చాలా వాటిని మూసివేయించానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషించాల్సిన అంశమే. అయితే ఆ బోగస్‌ కంపెనీలు ఇచ్చిన సమచారాన్ని కూడా కలిపి అభివృద్ధి అంకెలను తయారు చేశారని, అందుకే అభివృద్ధి జరిగినట్లు కనిపించినా ఆచరణలో వుపాధి పెరుగుదల కనిపించలేదన్న ఒక విమర్శ వుంది. ఎన్ని మరుగుదొడ్లు కట్టించిదీ, ఎన్ని గ్యాస్‌ పొయ్యిలు ఇచ్చిందీ, ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసిందీ, ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందీ ఏ బిజెపి కార్యకర్తను అడిగినా గడగడా చెప్పారు గాని, వాగ్దానం చేసినట్లుగా ఎన్ని వుద్యోగాలు కల్పించారు అంటే తయారు చేసిన అంకెలు సక్రమంగా లేవని, వాస్తవ స్ధితిని ప్రతిబింబించే లెక్కలను తయారు చేస్తున్నామని నరేంద్రమోడీయే స్వయంగా చెప్పారు కనుక వాటిని వెల్లడించాలి. పకోడీల బండి పెట్టుకోవటం కూడా వుపాధి కల్పనలో భాగమే అని చెప్పినందున ఎంత మంది పకోడీలు, బజ్జీలు , టీ అమ్ముతూ వుపాధి పొందుతున్నారు అనే వాటితో సహా అన్ని వివరాలు తెలుసుకోవటం జనానికి సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది.

రెండువేల పదమూడో సంవత్సరం జూన్‌ తరువాత మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరం మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక గతేడాదితో పోల్చినప్పుడు నిరపేక్షంగా 0.1శాతం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వ ద్ధి ఫిబ్రవరిలో కేవలం 0.07మాత్రమే ఉంది. అలాగే జనవరిలో 1.7శాతం, డిసెంబరులో 2.6శాతం, నవంబరులో 0.3శాతంగా నమోదు అయింది. క్లుప్తంగా చెప్పాలంటే కొంతకాలంగా పారిశ్రామిక వ ద్ధి మందగిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. పారిశ్రామిక రంగంలో పాతవైనా, కొత్త పరిశ్రమల్లో అయినా ఆధునిక యంత్రాలను, కంప్యూటర్లు, రోబోట్లను ప్రవేశపెడుతున్నారు. గుమస్తాలు చేయాల్సిన పనులను కంప్యూటర్లు చేస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల లాభాల రేటు తగ్గలేదు, నష్టాలు వచ్చి ఫలానా తరహా పరిశ్రమ మూతపడింది అనే సమాచారాన్ని కూడా పాలకులు మనకు చెప్పలేదు కనుక అంతా బాగుందనే అనుకోవాలి. ఇక్కడే సమస్య వస్తోంది.

రైతు లేనిదే రాజ్యం లేదు !

పదిహేను సంవత్సరాల క్రితం దేశ జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 21శాతంగా వున్నది కాస్తా ఇప్పుడు 13శాతానికి పడిపోయింది. అయితే ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య ఆ దామాషాలో తగ్గలేదు. దేశంలో పనిచేసే వారిలో 55శాతం మంది అంటే 26 కోట్ల మంది వ్యవసాయ రంగంలో వున్నారు. అంటే జనాభాలో సగానికి పైగా దాని మీదే ఆధారపడి వున్నట్లు లెక్క. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగంలో తలెత్తిన సమస్యలు అనేక రాష్ట్రాలలో రైతులను రోడ్ల మీదకు తెచ్చాయి. నరేంద్రమోడీ కంటే తెలంగాణాలో చంద్రశేఖరరావు సర్కార్‌ రైతు బంధుపేరుతో ఎక్కువ మొత్తాలు చెల్లించిన నిజామాబాదులో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరగురించి చేసిన ఆందోళన, ఎన్నికల్లో దాని పర్యవసానాలను ఏ పాలకులైనా గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ మంతటా వ్యవసాయ పంటల ధరలు తగ్గుతున్నాయని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ గణాంకాలు చెబుతున్నాయి. మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కాదు. ప్రాణం పోకుండా చేసే ప్రాధమిక చికిత్స వంటివే. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అరుంధతి నక్షత్రంలా వుంది. వ్యవసాయ రంగంలో రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే యాంత్రీకరణ అవసరం అని యంత్రాలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. అవి పారిశ్రామికవేత్తల, వాణిజ్యవేత్తల జేబులు నింపుతున్నాయి తప్ప రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది పెద్ద ప్రశ్న. మరోవైపున యాంత్రీకరణ కారణంగా వ్యవసాయ కార్మికులకు వుపాధిపోయి వారంతా నిరుద్యోగసేనలో చేరుతున్నారు. చేతివృత్తుల వారి పరిస్ధితీ అంతే. అందువలన ఈ పెద్ద సమస్యను పరిష్కరించకుండా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్న పరిస్ధితినే నరేంద్రమోడీ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది.

Image result for Narendra Modi, pakoda

నిరుద్యోగ సమస్య తీరు తెన్నులేమి !

నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారనే విమర్శను మోడీ సర్కార్‌ ఎదుర్కొన్నది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధిచిన సమాచారాన్ని ప్రచురించటానికి తిరస్కరించటం సహజంగానే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏదైనా మూసి పెడితే పాచిపోతుంది అని తెలిసిందే. ఆ సమస్య మీద సంబంధిత వున్నత అధికారి రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వ గణాంక కార్యాలయం నుంచి లీక్‌ అయిన నివేదిక ప్రకారం నిరుద్యోగం 6.1శాతందాకా ఉంది. ఇది గత 45సంవత్సరాలలో అత్యంత గరిష్టం. ఏప్రిల్‌లో నిరుద్యోగం రేటు 7.6శాతం ఉందని ద సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. నిరుద్యోగం రేటులో చలనాలు నిరుద్యోగం ఏ దిశగా పయనిస్తుందో సూచిస్తాయని తెలుసుకోవాలి. కేవలం రేటుతో సమస్య తీవ్రత తెలియదు. ఎందుకంటే భారతదేశంలో అనేకమందికి పూర్తి కాలం ఉద్యోగం ఉండటం, పూర్తి కాలం ఉద్యోగం లేకపోవటం కాకుండా ఉద్యోగిత కొంతకాలమే ఉంటుంది.

దేశంలో జనాభా 136 కోట్లు, వారిలో పని చేయగలిగిన వారు 15-64 సంవత్సరాల వయసు వారు అనుకుంటే 91 కోట్ల మంది వుంటారు.అయితే వారంతా వుద్యోగాల కోసం చూస్తారని కాదు గాని మన వంటి దేశానికి, ఏ పాలకులకు అయినా అదొక పెద్ద సమస్య అని చెప్పక తప్పదు. దీన్ని పరిష్కరించకుండా, వాగ్దానం చేసిన మాదిరి ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాలు కల్పించకుండా జనానికి ‘మంచి రోజులు ‘ రావు కదా ! నల్లధనాన్ని వెలికి తీసి బాత్‌రూముల్లో, మంచల మీద దాచిన సొమ్మును చలామణిలోకి తెచ్చి వుత్పాదక, వుపాధి అవసరాలకు అందుబాటులోకి తెస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. అలాగే పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎగవేతలను అరికట్టేందుకు అని చెప్పి జిఎస్‌టిని ప్రవేశపెట్టారు. దాని వలన పెద్ద ఎత్తున వుపాధి పోయిందని జనం గగ్గోలు పెడితే ఒక చర్య ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, కొద్ది రోజులు ఆగాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పడినా జనం వాటిని మరచిపోయి నరేంద్రమోడీకి ఓటేశారు. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ రూపంలో జనానికి వుపయోగపడుతున్నాయో చూపించాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌ ముందు వుంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్ధ మోడీ సర్కార్‌ కంటే ముందే ఏర్పడింది. అనేక అంశాలను అది ఎప్పటికపుడు వెల్లడిస్తోంది. అలాంటి సంస్ధ ఇచ్చిన లెక్కల ఆధారంగానే 2014లో నరేంద్రమోడీ రెండు కోట్ల వుద్యోగ కల్పన వాగ్దానం చేసినట్లు మరచి పోరాదు. 2016లో పెద్ద నోట్ల రద్దు, తరువాత జిఎస్‌టి పర్యవసానాల కారణంగా 2018లో కోటీ పదిలక్షల మందికి వుపాధి పోయిందని ఆ సంస్ధ చెప్పింది. ఆ సంస్ధతో పోల్చితే ప్రభుత్వానికి వున్న పెద్ద యంత్రాంగం అసలు వాస్తవాలను బయట పెట్టాలి. లేకపోతే విశ్వసనీయత సమస్యను సర్కార్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భవిష్యత్‌ కోసం నాకు ఓటు వేయండని నరేంద్రమోడీ స్వయంగా కోరిన విషయాన్ని మరచిపోరాదు.

ఇండియా స్పెండ్‌ వెబ్‌ సైట్‌ విశ్లేషణ ప్రకారం అనేక నెలలుగా నిరుద్యోగశాతం ఏడుశాతానికి అటూ ఇటూగా వుంది. ప్రతి ఏటా 1.2కోట్ల మంది వుద్యోగార్ధులు అడ్డామీదకు వస్తున్నారు.వారిలో కేవలం 47.5 లక్షల మందికి మాత్రమే పని దొరుకుతోంది.దేశ జనాభాలో 80శాతం హిందువులే వున్నారు, అంటే నిరుద్యోగుల్లో కూడా వారి వాటా అంతకు తగ్గదు. ఈ సమస్య ఏ క్షణంలో అయినా పేలే టైంబాంబు వంటిది, అది పేలకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. కాబట్టి నిరుద్యోగితను తగ్గించటానికి ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యాలి.ఏం చేస్తారో ఎన్నికల్లో చెప్పలేదు. ఇప్పుడా పని చేసి యువతకు భరోసా కల్పించాలి.

ధనమేరా అన్నిటికీ మూలం !

నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలు, రేపిన ఆశలు వేటిని నెరవేర్చాలన్నా కావాల్సింది ధనం.సంపదల సృష్టి లేకుండానే నోట్లను ముద్రిస్తే ప్రయోజనం లేదు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగా ఎంతకాలం చెప్పుకుంటాం అంటూ ఎన్‌డిఏ కొత్త ఎంపీల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మన దగ్గర మంత్రదండాలేమీ లేవు.

పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం 77.6శాతం ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్చిలో ఇది 0.4శాతం తగ్గింది. క్యాపిటల్‌ గూడ్స్‌ 8.7శాతం, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ 5.1శాతం, ఇంటర్‌మీడియట్‌ గూడ్స్‌ 2.5శాతం క్షీణించటం, కన్సూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 0.3శాతం పెరగటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వ ద్ధి కేవలం 3.6శాతంగా నమోదైంది. 2017-18 సంవత్సరంలో నమోదైన 4.4శాతంతో పోల్చినప్పుడు ఇది తక్కువ. అయితే ఆర్థిక సంవత్సరంలోని తరువాతి నెలల్లో మాంద్యం తీవ్రమైంది.

ఎగుమతులు, వినియోగమూ పెరగాలి !

మాంద్య పరిస్ధితులు ఏర్పడినపుడు అభివృద్ది రేటు పెరగకపోగా పతనం అవుతుంది. మనది ఎగుమతి ఆధారిత వ్యవస్ధ కాదు. అనేక దేశాల వ్యవస్ధలతో పోల్చుకుంటే మన ఎగుమతులు పరిమితమే. మేకిన్‌ ఇండియా పేరుతో గత ఐదు సంవత్సరాలలో జరిగిందేమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. మన ద్రవ్యోల్బణం అదుపులో, తక్కువగా వుందని మన పాలకులు, అధికారులు తరచూ చెబుతుంటారు. అంటే ధరల పెరుగుదల కూడా తక్కువగా వుందని అర్ధం.అలాంటపుడు వినియోగం పెరగాలి, వినియోగం పెరిగితే పైన పేర్కొన్న విధంగా తయారీ రంగం వెనుక పట్టు పట్టదు. వివిధ రంగాల సమాచారాన్ని విశ్లేషించినపుడు గత నాలుగు నెలల కాలంలో మన వినియోగం తగ్గుతోందన్నది స్పష్టం. అది విదేశీ దిగుమతులైన బంగారం, రాళ్లు, ఆభరణాల వంటివి అయితే మనకే లాభం కాని మనదేశంలో తయారయ్యే వస్తు వినియోగం తగ్గితే అది ప్రమాదకరం. మారుతీ కంపెనీ మిగిలిపోతున్న కార్లను తగ్గించుకొనేందుకు వుదారంగా కార్మికులకు ఒకరోజు సెలవు ఇచ్చిందని వార్త చదివాము. ఒకవైపు మన మధ్యతరగతి మార్కెట్‌ బ్రహ్మాండంగా వుందని చెప్పుకుంటున్నపుడు మారుతీ కార్లెందుకు అమ్ముడుపోవటం లేదు, లేదా మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశాలకు ఎందుకు ఎగుమతి కావటం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

Image result for Challenges before Narendra Modi

పర్యవసానాలు ఎలా వుంటాయి !

కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నా 1991 నుంచి అనుసరిస్తున్నది నయా ఉదారవాద విధానాలే. ఆ విధానం మార్గాంతరం లేని స్థితికి చేరుకోగా, దాని స్థానాన్ని ఆక్రమించటానికి దేశీయ మార్కెట్‌ ఆవిర్భవించనప్పుడు ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలవలెనే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒక అనిశ్చిత స్థితిలో కూరుకుపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం భారత, చైనా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ఇది ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటం కారణంగా జరుగుతోంది. అయితే తగ్గిన ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటంవల్ల ఏర్పడిన దుస్థితిని పాక్షికంగానైనా సరిదిద్దటానికి దేశీయ మార్కెట్‌ను విస్త తపరచలేదు. అలా జరగకపోగా అదే సమయంలో గ్రామీణ నైరాశ్యంవల్ల, ఎగుమతుల వ ద్ధి మందగించటం వల్ల ఏర్పడే ద్వితీయ శ్రేణి ప్రభావాల కారణంగా, నిరర్ధక ఆస్తుల పరిమాణం పెరగటంవల్ల, ఇతర విషయాలతోపాటుగా దీనివల్ల పారిశ్రామిక వ ద్ధి మందగించటం వల్ల పెద్ద ఎత్తున అవసరమయ్యే వ్యయాలకు అందుబాటులో వుండే రుణ సౌకర్యం బలహీనపడింది. పర్యవసానంగా దేశీయ మార్కెట్‌ కూడా కుదింపునకు గురయింది. వేరేమాటల్లో చెప్పాలంటే ఎగుమతుల వ ద్ధిలో ఏర్పడిన మందగమనానికి విరుగుడుగా తుల్యాన్ని సాధించనందున దేశీయమార్కెట్‌ కుదింపునకు గురయింది. దానితో ఎగుమతుల వ ద్ధి మరింతగా దెబ్బతింది. కన్‌స్యూమర్‌ డ్యూరబుల్‌ రంగం కుదింపునకు గురికావటం, కన్‌స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్‌ రంగం గత ఏప్రిల్‌తో పోల్చినప్పుడు స్తంభించటమనే వాస్తవాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి నాటికే కుదింపునకు గురైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు క్షీణిస్తున్నాయని సూచిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు తరువాత తెలుస్తాయని మూడు సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అంతకు ముందే పెట్టుబడుల కోసమే తరచూ విదేశీ ప్రయాణాలు చేశానని మోడీ చెప్పారు. మరి వాటి ఫలితాలు, పర్యవసానాలను ఇప్పుడు జనానికి చూపాలి, లేకపోతే వేరే విధంగా అర్ధం చేసుకొనే ప్రమాదం వుంది.

బ్యాంకింగ్‌ రంగం ఎందుకు సమస్యల్లో వుంది?

అంతా బాగుంది అని చెప్పుకుంటున్న ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్ధులు ఎందుకు పెరిగాయి అంటే గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులే కారణం అని చెప్పారు. అదింకేమాత్రం చెల్లదు. నిబంధనల ప్రకారం గడువు మీరి వాయిదాలు చెల్లంచని వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించటం, వాటి ఆస్ధులను స్వాధీనం చేసుకొని సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లు కూడా చెప్పినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా లక్షల కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత రెండు సంవత్సరాలుగా దాదాపు రెండులక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు బదలాయించింది. ఎన్నడూ లేని స్ధాయిలో 2018డిసెంబరు నాటికే నిరర్ధక ఆస్తులు ఎనిమిది క్షల కోట్లకు చేరాయి. రుణాలు ఇస్తాం తీసుకోండి అంటూ ఇటీవలి కాలంలో టెలిమార్కెటర్లు జనాన్ని ఫోన్ల మీద చంపుతున్నారు. బ్యాంకులు తమ దగ్గర డబ్బు నిల్వవుంచుకుంటే వాటికి వడ్డీ దండుగ. అందుకే అవి వెంటపడుతున్నాయి. అయినా వాటి ఫలితాలు ఆర్ధిక రంగం మీద పెద్దగా ప్రతిఫలించటం లేదు. ఈ ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలు గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున ఉపశమన పథకాలను ప్రవేశపెడతామని మాట ఇచ్చాయి. దానితో తప్పకుండా దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అది పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరింపబడటానికి దారితీస్తుంది. చిన్న రైతు కుటుంబాలకు చెందిన 12కోట్లమందికి వార్షికంగా తలసరి 6000రూపాయలను అందిస్తానని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో మరింత ముందుకుపోయింది. న్యారు పథకం ద్వారా అత్యంత అథమస్థాయిలో గల 5కోట్ల కుటుంబాలకు నెలకు 6000 రూపాయలు అంటే సంవత్సరానికి రూ.72,000 సమకూరుస్తానని మాట ఇచ్చింది. ఈ పథకాలవల్ల దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అయితే ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమంటే ఈ పథకాలకు అవసరమైన వనరులను ఎలా సమకూరుస్తారు అనేదే.

సంపన్నుల నుంచి అధికంగా వసూలు చేయాలి !

సంపన్నులపై పన్ను వేయటం ముఖ్యంగా భారతదేశంలో అస్థిత్వంలో కూడా లేని సంపదపై పన్నును విధించటం ద్వారా గణనీయమైన స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. వనరులను సమకూర్చుకోవటానికి ఇది మనముందున్న స్పష్టమైన మార్గం. అయితే దీనిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వనరులను సమకూర్చుకోవటం అంత కష్టం కాదని, అయితే నయా ఉదారవాద వ్యవస్థలో వనరులను అన్వేషించటం కష్టతరమౌతుందని కాంగ్రెస్‌ పార్టీ న్యారు పథకాన్ని ప్రకటించినప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌ నర్మగర్భంగా అన్నారు. ఆ విధంగా ఒకవేళ ఈ పథకానికి కావలసిన వనరులను విత్తలోటుతో కూడా పాక్షికంగా సమకూర్చుకోవచ్చనుకున్నా అటువంటి విత్తలోటు స్థూల జాతీయోత్పత్తిలో అనుమతించబడిన 3.4శాతం పరిమితిని మించుతుంది. అప్పుడు అది భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించటానికి దారితీస్తుంది. దానితో విదేశీ మారకపు చెల్లింపుల శేషం(బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌)కు చెందిన కరెంట్‌ ఖాతా లోటును పూడ్చటం కష్టమవుతుంది. అమెరికా ఆదేశం మేరకు భారతదేశం బహిరంగ మార్కెట్‌ కంటే చౌకగా లభించే ఇరాన్‌ చమురును కొనుగోలు చేయకపోతే ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. అమెరికా ఆదేశాన్ని పాటిస్తానని మోడీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలవల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుంది. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే కరెంటు ఖాతా లోటు మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ దీనికి అదనంగా విత్తలోటులో పెరుగుదల పరిమితిని మించితే భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ పడిపోయి దేశంలోకి వచ్చే ద్రవ్య ప్రవాహాలు ఎండిపోతాయి. ఈ లోటును సాధారణ మార్గాలలో పూడ్చగలుగుతామనే ఆశ నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక విపరీత స్థితిలో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ముంచుకొస్తున్న మాంద్యాన్ని అధిగమించా లంటే కరెంటు ఖాతా లోటును పూడ్చటం దానికి కష్టమౌతుంది. మరోవైపు మాంద్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఇప్పటికే తీవ్రంగావున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది.ఈ సమస్యను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా అధిగమిస్తుందన్నది శేష ప్రశ్న !

మైనారిటీలకు భరోసా కల్పించాలి !

ఏ దేశంలో అయినా మైనారిటీలు అభద్రతకు గురౌతారు. ఇది అంతర్జాతీయంగా వున్న పరిస్ధితి. మన దేశంలో అంతకంటే ప్రత్యేక పరిస్ధితులు వున్నాయి. మెజారిటీ జనాన్ని సంతుష్టీకరించేందుకు మైనారిటీల మీద దాడులు చేస్తున్నా పట్టించుకోలేదనే విమర్శ ప్రభుత్వం మీద ఇప్పటికే వుంది. ఎన్నికలు ముగియటంతోనే మైనారిటీలను వేధించే శక్తులు విజృంభిస్తున్నాయని తాజాగా జరిగిన రెండు వుదంతాలు స్పష్టం చేశాయి. బీహార్‌లో పేరు అడిగి మరీ తుపాకితో దాడి చేసిన వుదంతం, దేశ రాజధాని పక్కనే వున్న గురుగ్రామ్‌లో జై శ్రీరాం అనేందుకు తిరస్కరించినందుకు దాడి, మధ్య ప్రదేశ్‌లో ఆవు మాంసం కలిగి వున్నారంటూ జరిగిన దాడులు పరిమితమే అయినా దేశ వ్యాపిత చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి శక్తులను తక్షణమే అదుపు చేయలేకపోతే జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో సబ్‌ కా విశ్వాస్‌( అందరి విశ్వాసం) సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంటే అందరి అభివృద్ధికి అందరితో కలసి పనిచేస్తామని చెప్పిన మాటలను ఆచరణలో నిరూపించుకోవాలి.

నోటి తుత్తరను అదుపు చేయాలి !

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు మిగతా పార్టీల కంటే బిజెపి వారి మీదనే ఎన్నికల సంఘం ఎక్కువగా చర్యలు తీసుకున్నది. తీసుకోవాల్సినన్ని, తీవ్ర చర్యలు లేవనే విమర్శలు సరేసరి. దేశ నాగరికత, విలువలకు ప్రతీక అని వర్ణించిన సాధ్వి ప్రజ్ఞ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని కీర్తించటం తెలిసిందే. దానిని బిజెపి ఆమోదించకపోవటం కాదు, అసలు అలాంటి శక్తులను భవిష్యత్‌లో ఎలా అదుపు చేస్తారన్నదే సమస్య. ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో అలాంటి వారి గురించి మోడీ చేసిన హెచ్చరికను తు.చ తప్పకుండా అమలు చేయాలి.

Image result for Issues and Challenges before Narendra Modi

ఇరుగు పొరుగుతో సంబంధాలు !

ఇరుగు పొరుగుతో సంబంధాలు సజావుగా వుంటే దేశం అనేక విధాలుగా లబ్ది పొందుతుంది.ముఖ్యంగా ఆయుధాలు, మిలిటరీ ఖర్చును తగ్గించుకోవచ్చు.ఆ సొమ్మును వుపాధి కల్పన, సంక్షేమానికి వినియోగించుకోవచ్చు. వుగ్రవాద సమస్యను ఎన్నికల ప్రచారానికి, ఓట్ల లబ్దికి వినియోగించుకున్నారన్న విమర్శలు దాస్తే దాగేవి కాదు. నిజానికి అవి నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మేలు చేసేవి కాదు. పాక్‌తో సంబంధాలు నిరంతర సమస్యలు తెచ్చిపెడుతున్నవే. అయితే నిరంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రెచ్చగొట్టటాన్ని జనం కొంత మేరకు అర్ధం చేసుకుంటారు. మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. వుగ్రవాది మసూద్‌ అజహర్‌ విషయంలో చైనా అనుసరించిన వైఖరి రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యల పట్ల వర్తించే విధంగా వుండాలి. అందుకు సంఘపరివార్‌ నోటి తుత్తర బ్యాచిని అదుపు చేయాల్సి వుంటుంది.

ఇక చివరిగా విదేశాంగ విధానం గురించి చెప్పుకోవాల్సి వస్తే అమెరికాతో మరింతగా కలసి ముందుకు పోతే మనకు సమస్యలే తప్ప రిగే ప్రయోజనం లేదు. మా దేశానికి వస్తూ మాకేమి తెస్తారు, మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తారనే వైఖరే దానిది. అమెరికాలో వున్న మన వారి కుటుంబీకులు వుద్యోగాలు చేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజంగా ఆందోళన కలిగించేవి. ఒక మిత్ర దేశంగా చేయాల్సినవి కాదు. ఇప్పటికే వాణిజ్యంపై అమెరికా నియంత్రణలను ప్రవేశపెడుతున్నది. భారతదేశం కూడా అమెరికా కార్యశీలత నీడలో అటువంటి నియంత్రణలను ప్రవేశపెట్టి వుండాల్సింది. అయితే నయా ఉదారవాదం మార్గాంతరంలేని స్థితికి చేరుకున్నదనే వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించినట్టు కనపడటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దాని లక్షణం. అంటే సంపన్నులు మరింత సంపన్నులౌతారు, మిగిలినవారు మరింత దిగజారి పోతారు. అటువంటి పరిస్ధితి రానున్న రోజుల్లో మరింత వేగిరం కానున్నది. దీనిని మోడీ ఎలా ఎదుర్కొంటారన్నది నిజంగా పెద్ద సవాలే. ప్రారంభం అమెరికా దౌత్యవేత్త చెప్పిన అంశంతో ప్రారంభమైంది. ముగింపు కూడా దానితోనే చేద్దాం. జాతీయ వాదం ఇతరులను అణచివేసేందుకు ఒక మార్గం అని అమెరికా సామాజికవేత్త చోమ్‌ నోమ్‌స్కీ చెప్పారు. నరేంద్రమోడీ అందుకు తన జాతీయ వాదాన్ని వినియోగించరని ఆశిద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జన తీర్పులు అన్ని వేళలా సరిగానే వుంటాయా ?

25 Saturday May 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Adolf Hitler, are the people's verdict always perfect ?, India elections 2019, Naredra Modi, people's verdicts, RSS

Image result for are the people's verdict always perfect

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావధాన్ల మాదిరి ఓటర్లు తీర్పు చెప్పారు. కేంద్రంలో పాత పాలకులే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచనున్నారు. కొన్ని కొత్త ముఖాలు, పాత ముఖాలు కొత్త వేషాలతో జనం ముందుకు వస్తారు. ఎన్నికల ప్రచారంలో వారూ, వీరూ అందరూ కలసి గత ఐదేండ్లలో తాము చేసింది సరైనదే అని సమర్ధించుకున్నారు కనుక విధానాలు, వైఖరిలో పెద్ద మార్పు వుండదు. సంస్కరణలను ఎంత వేగంగా అమలు జరిపితే అంతగా తలెత్తే పర్యవసానాల గురించి జనానికి పెద్దగా పట్టలేదన్నది స్పష్టం. కష్టాలు, నష్టాలను భరించటమే దేశభక్తి అనుకుంటున్నారు. ప్యూడల్‌ సమాజపు అవశేషాలు ఇంకా మనలను వెన్నాడుతున్నాయి గనుక గత జన్మల్లో చేసిన పాపాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి అనే వేదాంతంలో వున్నారు.

ఎందుకు అంటే, మన దేశంలో యోగులు, యోగినులు, బాబాలు, గురువులు ఇలా ఏ పేరైనా పెట్టండి. అంతా భక్తులు, అభిమానులుగా వచ్చే జనాన్ని మాయలో పడవేసినపుడు వారు మిగతా వాటి గురించి దేనినీ ఆలోచించరు, పట్టించుకోరు, ఎవరైనా హేతువాదులు ఇదేమిటి అని ప్రశ్నించినా సహనం కోల్పోయి అవాంఛనీయ చర్యలకు సైతం దిగటాన్ని మనం చూశాం. మన కళ్ల ముందే ఆశారాంబాపు, డేరాబాబా,కల్కి భగవాన్‌ ఇలా ఎందరో జనాన్ని ఎలా భక్తులుగా, వున్మాదులుగా మార్చుకున్నారో, ఎలా రెచ్చగొట్టారో చూశాము. వారంతా కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఇప్పుడు బిజెపి అనే ఆశ్రమం, మోడీ అనే గురువు దేశమంతటా గణనీయమైన సంఖ్యలో జనాన్ని అటువంటి మాయలోకి నెట్టారు. గతంలో అనేక ఆశలతో మోడీకి ఓటు వేస్తే అవి అడిఆశలయ్యాయని అనుభవం చెబుతున్నా తిరిగి ఓటు వేశారు. అంటే దీన్ని మరో విధంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలలో పలు ఎత్తుగడలతో జనాన్ని తన భక్తులుగా, ప్రశ్నించని మత్తులోకి దించటంలో సఫలమయ్యారు. సమస్యల సంగతి తరువాత చూసుకుందాం ముందు మన మతానికి ముప్పు ఏర్పడిందట దాన్ని రక్షించుకుందాం అనే కుహనా ప్రచారం మాయలో పడిన జనం తమకు తెలియకుండానే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు, ఓట్లు వేశారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని పార్టీ, కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

జనం తీర్పును తప్పు పట్టకూడదు అనే ఒక వైఖరి ఫలితాలపై చర్చల సందర్భంగా వెల్లడైంది. ఇది దొంగను కూడా గారు అని మర్యాదగా పిలవాలి కదా అనే అతి మంచితనం కలిగిన వారు, తీర్పు మీద చర్చలోతుల్లోకి పోకూడదని భావించే వారు గెలిచిన వారిని, గెలిపించిన వారిని అభినందించాలి అనే వైఖరితో వచ్చిన సమస్య ఇది. న్యాయమూర్తులకు వుద్ధేశ్యాలను ఆపాదించకూడదు గానీ వారి తీర్పుల మంచి చెడ్డల మీద వ్యాఖ్యానించేందుకు ప్రజాస్వామ్యం హక్కునిచ్చింది. జన తీర్పుకు సైతం అదే వర్తిస్తుంది. జనానికి దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. పని గట్టుకొని తప్పు పడితే ప్రయోజనం లేదు, అలాగని సమర్ధించనవసరమూ లేదు. వారి తీర్పు పర్యవసానం గురించి విమర్శనాత్మకంగా వైఖరిని చెప్పే హక్కును కలిగి వుండాలి.

అత్యాచారాలు,హత్యలకు కారకులైన ఆశారాంబాపు, డేరాబాబాల నిజస్వరూపం బయట పడేంతవరకు వారి మీద మాట పడనివ్వని రాజకీయ పార్టీలను చూశాము. వారి మీద నేర ఆరోపణలే తప్ప అవి రుజువు కాలేదుగా అని సమర్ధించి వారికి సాష్టాంగ పడిన వారిని, వారి మద్దతుతో ఓట్లు పొందిన వారినీ చూశాము. సామాన్యుల విషయానికి వస్తే గుడ్డిగా నమ్మి వారి మీద చిన్న విమర్శ చేసినా సహించక ఎంతకైనా తెగించిన వారిని చూశాము.

హిట్లర్‌ వంటి నరహంతకులను కూడా అధికార అందలం ఎక్కించింది జనమే.చరిత్రలో నియంతలు, నరహంతకులను జనం ముందుగా గుర్తించిన దాఖలాలు లేవు. చరిత్ర పాఠాలను సక్రమంగా తీసుకొని జాగ్రత్తలు పడుతున్నదీ లేదు. ఐరోపాలో హిట్లరూ, ముస్సోలినీ, ఫ్రాంకో, లాటిన్‌ అమెరికా, కొన్ని ఆఫ్రికన్‌, ఆసియా దేశాలలో ఇలా ఎందరినో జనం చూశారు. అలాంటి శక్తులకు అధికారం వస్తే ఏమి జరుగుతుందో మిగతా ప్రపంచం కంటే అలాంటి పాలనల్లో మగ్గిన వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటి అనేక దేశాలలో, ఆ నియంతలకు బలైన దేశాలలో ఫాసిస్టు శక్తులు పెరుగుతున్న తరుణమిది. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులు, వదలని మాంద్య పరిస్ధితులు వున్నపుడు వాటిని మార్చి అచ్చే దిన్‌( మంచి రోజులు) తెచ్చే దేవదూతలుగా నిరంకుశ శక్తులు ముందుకు రావటం గత చరిత్ర. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే పరిస్ధితిని ఆసరా చేసుకొని ఆశక్తులు తలెత్తుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది పాత రూపం, పాత పద్దతుల్లోనే వుండనవసరం లేదు, వుండదు కూడా. మితవాద భావజాలానికి వూతమిస్తున్నదీ, దాని వెంట నడుస్తున్నదీ కూడా జనమే. అంటే జనం కూడా తప్పులు చేస్తారు అని చరిత్రే చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముందే చెప్పుకున్నట్లు అలాంటి తప్పు మెజారిటీ చేస్తే మెజారిటీ, తక్కువ మంది చేస్తే మైనారిటీ చేశారనే చెప్పాలి.

మధ్యయుగాల నాడు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలు జరిగాయని చరిత్ర చదువుకున్నాము. క్రైస్తవులకు చెందిన పవిత్ర భూమిని ముస్లింలు ఆక్రమించారని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1095లో పోప్‌ రెండవ అర్బన్‌ పిలుపు మేరకు కానిస్టాంటినోపుల్‌ రాజధానిగా వున్న బైజాంటైన్‌ రాజ్య రాజు తొలి మత యుద్ధాన్ని ప్రారంభించాడు.అవి 1291వరకు సాగాయి. పవిత్ర ప్రాంతాల స్వాధీనంలో విఫలమయ్యాయి. తరువాత ముస్లిం రాజులు విజృంభించి 150 సంవత్సరాల తరువాత బైజాంటైన్‌ రాజ్యాన్నే స్వాధీనం చేసుకొని ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 20వ శతాబ్దం వరకు తిరుగులేకుండా ఏలారు. మత యుద్ధాలను సమర్ధించాలా లేదా అనేదాన్ని పక్కన పెడితే దానికి పవిత్ర ప్రాంతాలను మరొక మతం వారు స్వాధీనం చేసుకున్నారనే ఒక సాకు వుంది. నిజానికి ఆ ప్రాంతాలను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. పవిత్ర ప్రాంతాలుగా వర్ణితమైన చోట ఒక నాడు యూదు మతాన్ని జనం అవలంభించారు, అదే చోట యూదుమతం మీద తిరుగుబాటు లేదా విబేధించిగానీ క్రైస్తవం, తిరిగి అదే కారణాలతో క్రైస్తవం పరిఢవిల్లిన చోటనే ఇస్లాం మతం వునికిలోకి వచ్చింది తప్ప ఎవరో వచ్చి ఆ ప్రాంతాలను ఆక్రమించలేదు. మతం ఒక మత్తు, అది ఎక్కిన వారికి వేరే ఏమీ పట్టదు కనుక అబ్రహామిక్‌ మతాలుగా వున్న యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల పెద్దలు చరిత్రలో మారణకాండకు కారకులయ్యారన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో మతాల చరిత్ర చూసినా ఆ ఛాయలు కనిపిస్తాయి.

మన దేశంలో కూడా మత యుద్ధాలకు గతశతాబ్దిలో నాంది పలికారు. అయితే క్రైస్తవ మతయుద్ధాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు జరిగితే ఇక్కడ హిందూ మత పునరుద్దరణ పేరుతో ప్రారంభమైంది. దానికి గాను హిందూ మత ప్రార్ధనా మందిరాలను ముస్లింలు ఆక్రమించి వాటిని మసీదులుగా మార్చారనే ఆధారాలు లేని వివాదాలను ముందుకు తెచ్చారు. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు జన్మించాడని, అక్కడే రామాలయం వుండేదని తమ నమ్మకం అని చెబుతారు. నిజానికి మొఘల్‌ , ఇతర ముస్లిం పాలకులు దేవాలయాలను నాశనం చేసి మసీదులుగా మార్చి లేదా నిర్మించి వుంటే ఆలయాలేవీ మిగిలేవి కాదు. ఇతర మతాల వారు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు, మతమార్పిడులకు పాల్పడుతున్నారు అనే పేరుతో వారి మీద బస్తీమే సవాల్‌ అంటూ అన్ని రకాల దాడులు చేస్తున్నారు. మెజారిటీ మతానికి ముప్పు ఏర్పడింది అనే ఒక అభిప్రాయాన్ని గణనీయమైన సంఖ్యలో కలిగించటంలో జయప్రదమయ్యారు. అలాంటి వారికి మరొక అంశం పట్టదు. బెంగాల్‌ రాష్ట్ర విభజనకు బ్రిటీష్‌ వారు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ దాన్ని కొందరు హిందూ-ముస్లిం విభజనగా చూశారు. హిందువుల హక్కల పరిరక్షణ పేరుతో 1910దశకంలో ప్రారంభమైన హిందూమహాసభ, తరువాత 1925లో వునికిలోకి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ హక్కుల స్ధానంలో హిందుత్వ పరిరక్షణగా మార్చివేశారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అది చివరికి నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రీకరణను అమలు జరిపి హిందూ మతానికి ముప్పు ఏర్పడిందని నిజంగానే నమ్మేట్లు చేశారు. వందల సంవత్సరాల మొగలాయీల, బ్రిటీష్‌ వారి పాలనలో దేశంలో ఎన్ని మతమార్పిడులు జరిగినప్పటికీ 80శాతం మంది హిందువులుగానే వున్నారు.ఎన్నడో వందల సంవత్సరాల నాడు మతం మార్చుకున్నవారు కూడా హిందువులే అన్నది హిందూత్వ వాదుల అభిప్రాయం. దానిలో పాక్షిక సత్యం వుండవచ్చు, పంచముల పేరుతో గణనీయమైన జనాన్ని సామాజిక, ఆర్ధిక అణచివేతకు గురించి చేసిన హిందూ మనువాదమే దానికి కారణం. ఒక వేళ హిందూత్వ వాదులు కోరుకుంటున్నట్లు ఎవరైనా ముస్లింలు, క్రైస్తవులు తిరిగి హిందూమతంలోకి వారిని ఏ కులంలో చేర్చుకుంటారు. ఇప్పటికే వున్న వందలు, వేల కులాలకు తోడుగా ముస్లిం, క్రైస్తవ కులాలను ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం ఏముంది. అలా మారి వారు బావుకునేదేముంది?

మత యుద్ధాలు రెండు వందల సంవత్సరాలు సాగాయంటే సామాన్యులు పాల్గొన కుండా సాధ్యమేనా ? మరి ఆ సామాన్యులు చేసింది మంచా, చెడా ? చెడే అని చరిత్ర తీర్పు చెప్పింది. వారెందుకు ఆ చెడ్డపని చేశారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. చరిత్ర కారుడు గిల్స్‌ కానిస్టేబుల్‌ అభిప్రాయం ప్రకారం మత యుద్ధాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎవరి కారణాలు వారికున్నాయి. క్లారివాక్స్‌కు చెందిన సెయింట్‌ బెర్నాడ్‌ 1140వ సంవత్సరంలో శక్తిశాలి సైనికుడు లేదా యుద్ద వీరుడు అనే పేరుతో రాసిన దానిలో నీవు ఇప్పుడు యుద్దం చేయాల్సిన తరుణం వచ్చింది. నీవు గనుక విజయం సాధిస్తే అది కీర్త నీయం అవుతుంది. ఒక వేళ జెరూసలేము కొరకు పోరాటంలో మరణించావనుకో నీవీ స్వర్గంలో ఒక చోటును గెలుచుకుంటావు, పవిత్ర నగరాన్ని మత ద్రోహుల నుంచి విముక్తి చేసి యాత్రీకులకు దారి ఏర్పాటు చేయాలంటే దాన్ని విముక్తి చేయాలన్న పోప్‌ పిలుపులను నీవు పాటించాలి అని పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి క్షమాపణ పొందటానికి పాల్గొనాలి. మత యుద్ధాల్లో పాల్గొన్న ఎవరినైనా క్షమిస్తానని పోప్‌ ఒక అవకాశం ఇచ్చారు. అనేక యుద్ధాల్లో ఎందరి ప్రాణాలనో తీసిన రాజులకు ఇది అవసరంగా కనిపించింది. యుద్ధంలో పాల్గొనటం ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు, ఒక సాహసం చేసినట్లు వీరత్వాన్ని ప్రదర్శించటానికి అవకాశం దొరుకుతుంది అని కొందరు భావించారు. తలిదండ్రుల నుంచి వారసత్వంగా భూములు, సంపదలు పొందే అవకాశం లేని కుమారులు విదేశాల్లో భూములు, సంపదలు పొందవచ్చని పాల్గొన్నారు. ఈ యుద్దంలో పాల్గొంటే స్వేచ్చ నిస్తామని పోప్‌ వాగ్దానం చేశారు కనుక బానిసలు, ఫ్యూడల్‌ శక్తుల వద్ద బందీలుగా వున్న రైతులు అందుకోసం దాడుల్లో భాగస్వాములయ్యారు. తమకు తలనొప్పిగా వున్న సామంత రాజులు, లేదా రాజకుటుంబీకులను వదలించుకొనేందుకు వారిని మతయుద్ధాలకు పోవాల్సిందిగా రాజులు ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం మత యుద్దాల వెనుక ప్రధాన లక్ష్యం మతపరమైనదే అయినప్పటికీ పాల్గొన్న అనేక మందికి పైన పేర్కొన్న సంపదలు, భూమి, అధికారం వంటి ఆకాంక్షలు కూడా వున్నాయి. జెరూసలెమ్‌కు వెళ్లే దారిలో కానిస్టాంటినోపుల్‌ సమీపంలోని ఎడేసా అనే ప్రాంతం లేనప్పటికీ దాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు అక్కడి క్రైస్తవులను కూడా హతమార్చటాన్ని అందుకు తార్కాణంగా చూపారు.

మన దేశంలో మత యుద్దాన్ని ప్రోత్సహిస్తున్న వారి వెనుక బయటికి కనిపించని అంశాలెన్నో వున్నా పైకి చెబుతున్నది మాత్రం హిందూ మత రక్షణ. ఇది పవిత్ర యుద్దం అని భావిస్తున్నవారికి తెలియని ఆవేశం, మతానికి ఏదో ముప్పు వచ్చి పడుతోందన్న మానసిక భయం తప్ప పైన పేర్కొన్న మతయుద్ధాలలో మాదిరి సంపదలు, భూములు, రాజ్యాల వంటి లక్ష్యాలు వున్నాయని చెప్పలేము, వారికి హిందూత్వ శక్తుల ముసుగు అజెండా ఏమిటో తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. ఎవరైనా మాకు తెలుసు అంటే విద్వేషం తలకు ఎక్కించుకున్న వారు తప్ప వేరు కాదు. వివేచనలేని ఆవేశం, గుడ్డి నమ్మకాలు, గుడ్డి ద్వేషంతో బాబరీ మసీదును కూల్చివేసింది, లేదా గోరక్షణ పేరుతో దాడుల్లో, మత ఘర్షణల్లో పాల్గొంటున్నదీ సామాన్యులే. వీరిలో కేంద్ర ప్రభుత్వ విధానాల వలన నష్టపోతున్న రైతు బిడ్డలు, వ్యవసాయ కార్మికులు, వృత్తులు అంతరించి నిరుద్యోగ సైన్యంలో చేరుతున్న చేతివృత్తుల వారూ, నిరుద్యోగులూ, ధరల పెరుగుదల వలన బతుకు అతలాకుతలం అవుతున్నవారూ అందరూ వున్నారు. వారెవరూ ఓటు వేయకుండా బిజెపి, దాని మిత్రపక్షాలకు అన్ని ఓట్లు ఎలా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అంతు తెలియని అంశమేమీ కాదు. దాన్నుంచి జనాన్ని ఎలా మళ్లించాలనేదే అసలైన సమస్య.

జనం ఆమోదం పొందటం వేరు, జనం చేత ఆమోదింప చేయటం, మాయలో పడవేయటం వేరు. రెండోదాన్ని ఆంగ్లంలో మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌ అంటున్నారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మాయలో పడవేసి జనం చేత తలూపించటం. సంఘటితమైనదిగా పైకి కనిపించకుండా అది సామాజిక లేదా సాంప్రదాయ మాధ్యమాల ద్వారా, మౌఖిక ప్రచారం, ప్రతిదానినీ వాణిజ్యీకరణ ద్వారా కొన్ని సిద్ధాంతాలు, పదసమూహాలు, రూపాలు లేదా నమ్మకాలు వేటినైనా సరే ఎలాంటి వివరణ అడగకుండా, హేతుబద్దమైన ప్రశ్నలు లేకుండా ఆమోదం తెలిపేట్లు, విధేయత చూపేట్లు, మొగమాటం పెట్టి తలూపేట్లు చేసే విధానం ఇప్పుడు ప్రపంచ సమాజాన్ని వూపివేస్తున్నది. అందుకు మనది మినహాయింపు కాదు. మచ్చుకు ఏమిటీ మీకు ఎయిడ్సా అన్నట్లుగా మీ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపుతున్నారా, మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారా , మీకు కారు కూడా లేదా అని ఎవరైనా అడిగితే ఎదుటి వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా టీవీ ఛానల్స్‌ చర్చల్లో ప్రజల సమస్యల మీద జరిగిన చర్చ లెన్ని, రాజకీయ వివాదాలు, ఆరోపణలు,ప్రత్యారోపణలపై చర్చలెన్నో పరిశీలించండి. అంటే యాజమాన్యాల ప్రయోజనాలకు నష్టం లేని లేదా పాలకులకు ఆగ్రహం కలిగించని అంశాల చుట్టూ చర్చలను పరిమితం చేయటం, బలవంతంగా చూపటం వాటికి అలవాటు చేయటం దీనిలో భాగమే. టీవీ ఛానల్స్‌, పత్రికలను మనం డబ్బు చెల్లించే పొందుతున్నాం. మనం డబ్బు చెల్లించేటపుడు మనకు కావాల్సింది పొందుతున్నామా లేదు, డబ్బిచ్చి మరీ వారు చూపింది చూస్తున్నాం, ఇచ్చిన వార్తలను చదువుతున్నాం. వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే సమాచారం వాస్తవమైనదా కాదా అనే విచక్షణతో ఎందరు పరిశీలిస్తున్నారు. ఎవరు, ఏమిటి,ఎక్కడ,ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఆరు ప్రశ్నలను అడగలేని బలహీనతకు లోనైన స్ధితిలోకి మనల్ని నెట్టారంటే అతిశయోక్తి కాదు. మన పిల్లలకు వాటిని నేర్పుతున్నామా అంటే లేదు. మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాము, మీరు కూడా చేయండి. మేము కూడా ప్రశ్నించలేదు అంటూ ప్రశ్నించే తత్వాన్ని మొగ్గలోనే తుంచి వేస్తున్నాం. అలాంటి తరం మా పెద్దలు పాలకులను నిలదీయలేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అంటే దేశం ఎటుపోతుంది.ప్రతి కొన్ని సంవత్సరాలకు తమను అణచివేసే అసామాన్య ప్రతినిధులెవరో నిర్ణయించుకొనేందుకు అణచివేతకు గురయ్యే వారు అనుమతిస్తారు అని కారల్‌ మార్క్స్‌ చెప్పారు. ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోందా? గతంలో కాంగ్రెస్‌ను అనుమతిస్తే ఇప్పుడు మతవాదుల వంతు వచ్చిందా ?

Image result for people's verdict, hitler

బ్రిటీష్‌ వారు, అంతకు ముందు మొగల్స్‌, ఇతరులు మన దేశాన్ని ఆక్రమించటం గురించి, దీర్గకాలం పాటు మన సమాజం విదేశీ ఆక్రమణను వ్యతిరేకించకపోవటం, ప్రతిఘటన, స్వాతంత్య్ర పోరాటం, దీర్ఘకాలం కాంగ్రెస్‌ పాలన కొనసాగటం, అసలు స్వాతంత్య్రవుద్యమంతో ప్రమేయం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు తామే అసలైన జాతీయవాదులమని చెప్పటం, ప్రత్యామ్నాయ విధానాల వంటి ప్రతి అంశాన్ని పైన చెప్పిన ఆరు ప్రశ్నలతో మన సమాజంలో కొందరైనా విశ్లేషించి వైఖరులను నిర్దేశించుకొన్న రోజునే సమాజ మార్పుకు నాంది అవుతుంది. ఇది ఎలా అన్నది ఒక సమస్య. జనానికి ఇలాగే కావాలి అని జనాన్ని తిడితే ప్రయోజనం లేదు. పాలకుల విధానాలతో పాటు సమాజంలో జనాన్ని ప్రభావితం చేస్తున్న అన్ని రంగాల మంచి చెడ్డలతో పాటు జనంలో వుండే అవకాశవాదాన్ని కూడా మిత్ర వైరుధ్యంలో భాగంగా చర్చించాలి. మేథావులు ప్రజారంగంలోకి రావాలి, ఈ రంగంలోని కార్యకర్తలు మేథోపరమైన అధ్యయనాలను చేసి వాస్తవిక పరిస్ధితులకు అనుగుణంగా మేళవించి విశ్వసనీయతను పొందటం ద్వారానే జరుగుతుంది. దీని అర్ధం పరస్పరం పాత్రలను మార్చుకోవాలని కాదు. ఒకరి అనుభవాన్ని మరొకరు వుపయోగించుకొని ఆచరణాత్మక వైఖరిని, ఎత్తుగడలను అనుసరించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భగవద్గీత కంటే గాడ్సే గ్రంధమే వారికి ముఖ్యం !

20 Monday May 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

bhagavad gita, Godse, Mahathma Gandhi, Narendra Modi, Nathuram Godse, Prahgya Thakoor, RSS, why i killed gandhi

Image result for gandhi

ఎం కోటేశ్వరరావు

మనిషిని కుక్క కరవటం సాధారణం, మనిషి కుక్కను కరవటమే వార్త అన్నది పాత చింతకాయ పచ్చడి. అధ్యక్షులు, ప్రధానులు, ఛాన్సలర్‌లు ఇలా ఏ పేరుతో వున్నా వారు అబద్దాలు చెప్పటం సాధారణం, ఎన్ని నిజాలు చెప్పారన్నదే వార్త అన్నది కొత్త చింతకాయ పచ్చడి. ఏప్రిల్‌ 29వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదివేలకు పైగా అబద్దాలు చెప్పారని వాషింగ్టన్‌ పోస్టు ఫాక్ట్‌ చెక్కర్‌( వాస్తవాలు, అవాస్తవాలను కనుకొనే వ్యవస్ధ) వెల్లడించింది. ట్రంప్‌ అధికారంలో వున్న 827రోజుల్లో ఈ రికార్డు నెలకొల్పారు. ఆయన పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సరికి ఆ సంఖ్య ఇరవై వేలకు చేరుతుందా, పాతికవేలు అవుతుందా అన్నది ఇప్పుడు అసలైన వార్తగా మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్‌ 25-27 తేదీల మధ్య అంటే మూడు రోజుల్లో ట్రంప్‌ మహాశయుడు 171 అబద్దాలు లేదా వక్రీకరణలకు గానీ పాల్పడ్డారట. రోజుకు 57 అబద్దాలు చెప్పటం అంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు, ఇదొక రికార్డు. మరి మన దేశంలో ఇలా అబద్దాలు చెప్పేవారిని కనుక్కొనే వ్యవస్ధలను ఒక్క బడాపత్రిక లేదా ఛానల్‌ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? పాకేజీలు ఆగిపోతాయనా ? ఏమో !

అబద్దాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయటం నిత్యజీవితంలో ఒక భాగమైంది. సామాజిక మాధ్యమాల్లో నేను సైతం ఫేస్‌బుక్కుకు, ట్విటర్‌కు ఫేక్‌ పోస్టును సమకూర్చాను అన్నట్లుగా పరిస్ధితి వుంది. అబద్దాల కోరు ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తటం, కౌగిలింతల దౌత్యం, మమేకం అయ్యే వారికి ట్రంప్‌ లక్షణాలు అబ్బకుండా ఎలా వుంటాయి. మనలోని అసహ్యాన్ని, దుష్టాలోచనలను కనిపించకుండా వేసుకొనేది ముసుగు. అది పలు రూపాలు, వ్యక్తీకరణలు, ఇతరత్రా వుంటుంది. కొన్ని శరీరాల నుంచి వెలువడే దుర్గంధం, చెడువాసనల నుంచి ఇతరులను రక్షించేందుకే అత్తర్లను తయారు చేశారని కొంత మంది చెబుతారు. భారతీయ సంస్కృతికి, నాగరికతకు వారసురాలు అని స్వయంగా మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రశంసలు అందుకున్న ప్రజ్ఞా ఠాకూర్‌ మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే గొప్ప దేశభక్తుడు అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే దేశంలో తొలి వుగ్రవాది, అతను హిందువు అని ప్రముఖ చలన చిత్ర నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వుండి, అసత్యాలతో బెయిలు మీద బయటకు వచ్చి, బిజెపి అభ్యర్ధిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ‘యోగిని’ ప్రజ్ఞ తీసిన దెబ్బకు దెబ్బ అది. ఆమె మీద కేసు తేలేంత వరకు యోగిని ముసుగు వేసుకున్న మహిళ అంటే తప్పు లేదు. అయితే డేరాబాబా, ఆశారాంబాపు వంటి హంతకులు, అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేంతవరకు వారి మీద మాటపడనివ్వలేదు సరికదా వారితో అంటకాగారు బిజెపి వారు అని గుర్తు చేయటం అవసరం. ప్రజ్ఞ ఠాకూర్‌ నోటి నుంచి వెలువడిన దుర్గంధాన్ని కప్పి పుచ్చేందుకు బిజెపి క్షమాపణ అనే అత్తరు పూసింది.దుర్గంధం సహజలక్షణం, అత్తరు తాత్కాలికం, మళ్లీ మళ్లీ పూసుకుంటే తప్ప ఫలితం లేదు. ఆమె అత్తరు పూసుకున్నప్పటికీ నేను ఆమెను ఎప్పటికీ క్షమించను అన్న నరేంద్రమోడీ అతిశయోక్తి అలంకార ప్రయోగాన్ని చూసి నవరసాల నటుడు కమల్‌ హసనే కాదు, యావత్తు దేశ, ప్రపంచ సినీ రంగం తమకు 56అంగుళాల ఛాతీ గలిగిన కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, గాయకుడు, దర్శకుడు, నటుడు ఒకే వ్యక్తిలో దొరికారని సంతోషించక తప్పదు. మరో విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ రెండింటికీ చెడ్డ రేవడి అయ్యారు.ఆయన చేసిన ప్రకటనను మిగతా వారే కాదు మోడీ భక్తులు కూడా నమ్మరని వేరే చెప్పనవసరం లేదు.ఒక మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా అంతిమంగా ఎక్కడ ముగిసింది అనేది ముఖ్యం. వినాయక దామోదర సావర్కర్‌ అందరు యువకుల మాదిరే స్వాతంత్య్ర వుద్యమంలోకి వచ్చారు. అండమాన్‌ జైలుకు పంపగానే పిరికిబారి అనేక మంది మాదిరే బ్రిటీష్‌ వారికి లొంగిపోయారు, లేఖల మీద లేఖలు రాశారు, చివరికి తెల్లవారి దయాదాక్షిణ్యాలతో బయట పడ్డారు. అలాంటి వ్యక్తినే దేశభక్తుడు అని కీర్తిస్తున్నవారు, గాడ్సేను దేశభక్తుడు అనటంలో ఆశ్చర్యం ఏముంది? జనానికి మతిమరుపు ఎక్కువ అని జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ఎప్పుడో నిరూపించారు. ఆయనను అనుసరించేవారు వేరే దారిలో ఎలా నడుస్తారు?

Image result for gandhi godse

రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌హసన్‌ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియదు గానీ ఇప్పటి వరకైతే గాడ్సే గురించి వ్యాఖ్యానించి ఎవరెటువైపు వుంటారో తేల్చుకోవాల్సిన సవాలును మన జాతి ముందుంచారు. ఇప్పుడు సమస్య గాంధీ కాదు, గాడ్సే అయ్యారంటే అతిశయోక్తి కాదు. మహాత్మాగాంధీ, ఆయన సిద్ధాంతాలు, ఆచరణ గురించి గతంలోనే చర్చ జరిగింది. తొలుత ఆయనను అనుసరించిన ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ వంటి వారు తరువాత కమ్యూనిస్టులయ్యారు. ఆయన ఆశయాలనే పాటిస్తున్నామని చెప్పేవారు ఇప్పుడెక్కడ వున్నారో చూస్తున్నాము. స్వాతంత్య్రవుద్యమంలో ఆయనతో విబేధించిన వారు సైతం ఆయనను జాతి పితగా, మహాత్ముడిగా పిలవటాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదు, ప్రశ్నించలేదు. స్వాతంత్య్రం వుద్యమంలో ఆయనతో కొంత కాలం నడచిన కొందరు వ్యక్తులు లేదా నడచినట్లు చెప్పుకొనే వారు, దూరంగా వున్నవారు తరువాత కాలంలో హిందూత్వవాదులుగా మారారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఆయన పాత్రను సవాలు చేశారు, చేస్తున్నారు. ఆయన మహాత్ముడని ఎవరు చెప్పారు, జాతి పిత ఎలా అయ్యారు అని ప్రశ్నిస్తూనే వున్నారు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను సంఘీయులందరూ ‘వీర’ బిరుదుతో కలిపి పిలుస్తారు. వారు తగిలించటం తప్ప ఆ బిరుదును ఎవరిచ్చారో చెప్పమనండి. సదరు సావర్కర్‌ వేరే పేరుతో తన చరిత్రను తానే రాసుకొని దానిలో తన వీరత్వం గురించి కూడా జోడించారు. అంటే స్వంతడబ్బా కొట్టుకున్నారు. మహాత్మా గాంధీ ఎక్కడా ఆ స్ధాయికి దిగజారలేదు. మహాత్ముడిని హతమార్చిన వాడిని దేశభక్తుడు అంటూ అధికార పార్టీ ప్రసిద్ధ వ్యక్తి ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.ఆమెను సమర్ధిస్తూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేస్తున్న వారందరూ చౌకీదార్‌ నామం తగిలించుకున్న నరేంద్రమోడీ అనుయాయులే. వారందరి చేత బిజెపి లేదా దానికి మార్గదర్శనం చేస్తున్నామని చెప్పుకొనే సంఘపరివారం, నరేంద్రమోడీ క్షమాపణ చెప్పిస్తారా, చెప్పినా వారిని కూడా క్షమించనని నరేంద్రమోడీ అంటారా ? బంతి ఆయన కోర్టులోనే వుంది. ఐదేండ్లలో ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడేందుకు ధైర్యం చేయని వ్యక్తి, ఐదేండ్ల గడువు ముగిసేలోగా అమిత్‌ షా పత్రికా గోష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు స్ధాయికి దిగిపోయారు. ప్రతమూ చెడింది, ఫలితమూ రాలేదు. మరోసారి ఆలిండియా రేడియోలో మనసులోని మాట చెప్పేందుకు అవకాశం వుంటుందో తెలియదు, ఎలా వెల్లడిస్తారనేది ఆయనకే వదిలేద్దాం !

ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులుగా లేదా దాని ప్రభావానికి లోనైన వారి విశ్వసనీయత ఎల్లవేళలా ప్రశ్నార్దకమే. వారు ముసుగు మనుషులు. వారు చెప్పే ఆదర్శాలు, అందుకు విరుద్దమైన ఆచరణే దానికి నిదర్శనం. ఇలాంటి వారి తీరు, తెన్ను మనకు ఇటలీ,జర్మనీలోని ఫాసిస్టులు, నాజీల్లోనూ వారి బాటలో నడిచే నియంతల్లో మాత్రమే కనిపిస్తుంది. బిజెపిలో వాజ్‌పేయి ఒక ముసుగు వంటి వారు, నిజమైన నేత అద్వానీయే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు గోవిందాచార్య మన్‌కీ బాత్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతవై వుండి కూడా నిజాలు చెబుతావా నీకెంత ధైర్యం అన్నట్లుగా సదరు ఆచార్యను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గాడ్సేను దేశభక్తుడని ప్రజ్ఞ వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. మహాత్ముడి హత్య కుట్రలో భాగస్వామి అని తీవ్ర విమర్శలు వచ్చిన, శిక్ష పడకుండా కేసునుంచి తప్పించుకున్న విడి సావర్కర్‌ను నరేంద్రమోడీ స్వయంగా దేశభక్తుడు అని కితాబిచ్చారు. ఆ సావర్కర్‌ స్వాతంత్య్ర సమర కార్యకర్తగా అండమాన్‌ జైలుకు వెళ్లి అక్కడ వుండలేక బ్రిటీష్‌ సర్కార్‌కు లేఖలు రాసి తాను ప్రభుత్వానికి విధేయుడనై వుంటాను, సహకరిస్తాను అని లొంగిపోయిన పిరికి పందగా జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంఘపరివార్‌ పెద్దలు ఏమి చెబుతారంటే ఒక ఎత్తుగడగా అలా లేఖలు రాశారు తప్ప ఆయన లొంగలేదు అంటారు. అంటే సావర్కర్‌ ఒక ముసుగు వేసుకున్నట్లు ఆయన శిష్యులే అంగీకరించటం. లేదా శిష్యులే ఆయనకు ఆ ముసుగు వేశారని అనుకోవాలి. ఆ పెద్దమనిషి వేసుకోవటం ఏమిటి ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంగా తమకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలకు పాల్పడం, తమది సాంస్కృతిక సంస్ధ అని ఒక అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి తమ మీద వున్న నిషేధాన్ని ఎత్తివేయించుకుంది. ఇది దేశ చరిత్రలో అతి పెద్ద ముసుగు.గత ఏడు దశాబ్దాలుగా దాని వెనుక అది ఎన్ని రాజకీయాలు నడిపిందో, ఏమి చేసిందో, ఎలాంటి శక్తులను సృష్టించి దేశం మీదకు వదలిందో, అనేక మతకల్లోలాలు, గుజరాత్‌ మారణకాండ, బాబరీ మసీదు కూల్చివేత, అనంతర పరిణామాల్లో తెలిసిందే.

మహాత్మాగాంధీ హత్యానంతరం దానిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం కారణంగా నాటి ప్రభుత్వం నిషేధం విధించింది. వల్లభాయ్‌ పటేల్‌ నాడు హోం మంత్రి. ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టించిన విషపూరిత వాతావరణమే గాంధీ హత్యకు దారితీసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. నిషేధం మీద సంతకం చేసింది, తరువాత ఎత్తివేసింది కూడా ఆయనే.గోల్వాల్కర్‌తో సహా అనేక మందిని జైలులో వేశారు. ఆ సమయంలో వున్నత స్ధాయిలో జరిగిన కుట్ర లేదా అధికారంలో వున్న పెద్దల కారణంగా కానీ నిషేధం ఎత్తివేశారు. దానికి గాను ప్రభుత్వం పెట్టిన షరతు ఏమిటి? హింసాకార్యకలాపాలనుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ వైదొలగాలి, రాతపూర్వకమైన నిబంధనావళితో అది బహిరంగ కార్యకలాపాలు నిర్వహించాలి. రాజకీయాలను వదలి పెట్టాలి, జాతీయ పతాకాన్ని గౌరవించాలి, భారత్‌ను లౌకిక దేశంగా గుర్తించాలి. ఆ మేరకు గోల్వాల్కర్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పుడు భారత్‌ను లౌకిక దేశంగా గుర్తిస్తున్నారా అన్న ప్రశ్నకు ఒక హిందువుకు దేశం ఎల్లవేళలా లౌకిక రాజ్యమే అని సమాధానమిచ్చాడు. నాటి ప్రభుత్వానికి సమర్పించిన నిబంధనావళిలో తమది సాంస్కృతిక సంస్ధ అని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని కార్యకలాపాలు, ఆచరణ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానానికి విరుద్దమే. అన్నింటికీ వక్రీకరణలే. అందుకే దేశంలో, ప్రపంచంలో వున్న అనేక ముసుగు సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దది. దాని రహస్య అజెండాను అమలు చేసేందుకు అప్పటి వరకు రాజకీయ సంస్ధగా వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగంగా జనసంఘ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూవాహిని, దుర్గావాహిని వంటి అనేక సంస్ధలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాటిలో వున్న వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించే ధైర్యం దానికి లేదు. గాంధీని చంపింది హిందూమహాసభకు చెందిన గాడ్సే అని చెబుతారు. అదే హిందూమహాసభకు చెందిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో జనసంఘ్‌ను ఏర్పాటు చేశారు. అంటే సాంకేతిక ఆటంకాలను తప్పించుకొనేందుకు తప్ప నిజానికి దానిలో దీనిలో పనిచేసేది ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలిపెట్టలేదని కుటుంబసభ్యులే చెప్పారు. పోనీ వారేమైనా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వ్యతిరేకులా అంటే కాదు. అందువలన వారికి అలాచెప్పాల్సిన అవసరం లేదు.

ట్రంప్‌ పెద్ద అబద్దాల కోరైతే మన దేశ నేతలను ఏమనాలి. నిత్యం వందల కుహనా వార్తలు, అసత్యాలు, అర్ధసత్యాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నదెవరు? ఎవరికి అనుకూలంగా వస్తున్నాయో వారే ఆ పని చేస్తున్నారు. వాటి పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని మేథావులు గుర్తించటం లేదు. అలాంటి సమాజంలో నియంతలు, నిరంకుశులు పెరగటం చాలా సులభం. గతంలో సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి జవహర్‌లాల్‌ నెహ్రూ మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్ర చారం చేశారు. అది 2016లో ఎన్నికలకు ముందు ప్రారంభమై ఎన్నికలు ముగిసే వరకు సాగింది. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు బిజెపిలో చేరారు. బెంగాల్లో ఆయన గురించి ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని ఆపని చేశారు. పోనీ కేంద్ర ప్రభుత్వం సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి నిజాలేమైనా బయట పెట్టిందా అంటే ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర గతంలో బహిర్గతం కాని పత్రాలను కొన్నింటిని బహిర్గతం చేయటం తప్ప జరిగిందేమిటి?

సంఘపరివార్‌ శక్తులు బయట చేస్తున్న తప్పుడు ప్రచారాలనే అదే పరివార్‌ సభ్యుడైన నరేంద్రమోడీ పార్లమెంట్‌ వేదికగా చేసుకొని అవే విషయాలను చెప్పారు. సర్దార్‌ పటేల్‌ గనుక నాడు ప్రధాని అయి వుంటే కాశ్మీరు పూర్తిగా మన చేతుల్లోనే వుండేది అన్నారు. ఇది చరిత్రకు విరుద్ధం. చరిత్రను వక్రీకరించటానికి కొందరు వ్యక్తులు అవసరం. అందుకే నెహ్రూ, గాంధీని ఎన్నుకున్నారు. గాంధీని నేరుగా తిడితే పరువు దక్కదు కనుక ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో, నెహ్రూమీద ప్రత్యక్షంగా దాడి చేస్తున్నారు. అసలు మనకు స్వాతంత్య్రం రాక ముందే ఏర్పడిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం రావటానికి నెహ్రూ కారకుడని స్వయంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీలో పచ్చి అబద్దమాడారు.భారత ఫాసిజం చర్చిల్‌ మాదిరి ముసుగు ధరించిందని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ 1998ఫిబ్రవరి 15న బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి గురించి రాసింది. సౌమ్యుడంటూ చిత్రించిన వాజ్‌పేయి నికార్సయిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. బాబరీ మసీదు కూల్చివేతకు బాధ్యులైన ఎవరి మీదా పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ మీద చర్య లేదు. ఇప్పుడు ప్రజ్ఞ మీద అలాగే ఇతర బిజెపి నేతల మీద పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ లేవు.

Image result for gandhi godse

సంఘపరివార్‌ కార్యకర్తలు నేతలు, కార్యకర్తలు హిందూమతానికి చెందిన గ్రంధాలు ఎంత మంది చదివారో తెలియదు, సెల్‌ఫోన్లలో భగవద్గీత అయినా వుందో లేదో చెప్పలేము గానీ ఇప్పుడు వారి సెల్‌పోన్లలో గాంధీని నేను ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం వుందంటే అతిశయోక్తి కాదు. వారు దానిని బలవంతంగా ఇతరులకు పంపుతున్నారు. ఆ మధ్య మన ఇతిహాసాలలో హింస వుంది, హిందువులు హింసకు అతీతులు కాదు అని చేసిన వ్యాఖ్య మీద రగడ జరిగింది. భారత, రామాయణాలు చదివిన వారు ఎంత మంది హింసకు పాల్పడ్డారు లేదా వుగ్రవాదులయ్యారు అని సంఘీయులు అడ్డు సవాళ్లు విసిరారు. మహాత్మా గాంధీ, నాధూరామ్‌ గాడ్సే ఇద్దరూ భగవద్గీతను చదివిన వారే ఒకరు ప్రాణాలను బలిదానమెందుకు ఇచ్చారు, మరొకడు ప్రాణాలు ఎందుకు తీసినట్లు ? భగవద్గీత నుంచి ఏమి నేర్చుకున్నట్లు? కేసు విచారణ సమయంలో తన చర్యకు సమర్ధనగా భగవద్గీతనే వుదాహరించాడు. అందుకే సంఘీయులు ఇప్పుడు దాన్ని జనాల మెదళ్లకు ఎక్కించటానికి పుస్తక రూపంలో వచ్చిన గాడ్సే వాదననే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా గాంధీ మీద అభిమానం, గౌరవం వుంటే అలా చేస్తారా? రాజకీయంగా, ఓట్ల పరంగా నష్టం అనే భయంతో క్షమాపణ చెప్పించటం, చెప్పినా నేను క్ష మించను అని మోడీ అనటం తప్ప నిజంగా వారి మనసులో గాడ్సే మీద భక్తి, అభిమానమే వుంది. జనంలో జరగాల్సిన ప్రచారం ఎలాగూ జరిగిపోయింది, గాడ్సేకు రావాల్సిన ప్రచారం వచ్చింది, మరి కొంత కాలం గాడ్సే గురించి చర్చ జరుగుతుంది తప్ప గాంధీ గురించి కాదు. గాడ్సే మీద జరిగే చర్చ తమ ముసుగును మరింత తొలగిస్తుంది అనుకుంటే బిజెపి మరో ముసుగు వేసుకుంటుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం. మతోన్మాదం, వుగ్రవాదం, తీవ్రవాదం పులి స్వారీ వంటివి. ఒకసారి వాటిని ఎక్కిన వారు లేదా ఎక్కించుకున్నవారు వాటిని అదుపు చేయాలి లేదా వాటికే బలికావాలి. చరిత్రలో అలాంటి పులులను ఎక్కిన వారు ఎవరూ అదుపు చేయలేక వాటికే బలయ్యారన్నది తెలిసిందే.ప్రజ్ఞ మీద వెల్లడైన వ్యతిరేకతను పక్కదారి పట్టించటానికి ఆడిన నాటకం క్షమాపణ, దాన్ని ముందే చెప్పుకున్నట్లు బయటి వారే కాదు, పెద్ద చౌకీదారు మోడీ చేసిన ప్రకటనను పిల్ల చౌకీదార్లు గౌరవించటం లేదు. గాడ్సేను కీర్తిస్తూనే వున్నారు. అలాంటి వారు అవసరమైతే మోడీని కూడా పక్కన పెడతారు. వున్మాద లక్షణం అది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత, రామాయణాల పేరుతో మత రాజకీయాలు !

09 Thursday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, communalism, CPI(M), Hindu Supremacists, mahabharata, pragya thakur, ramayana, SITARAM YECHURY, violence

Image result for communal politics with mahabharata, ramayana epics

ఎం కోటేశ్వరరావు

కొన్ని సంఘటనలను, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను వక్రీకరించటం ఆ పేరుతో తమ అజెండాను అమలు జరపటం సంఘపరివార్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల్లో దేవుళ్లు, దేవతల పేర్లను ప్రస్తావించి ఓట్లడగటం నిబంధనల వుల్లంఘన కిందికి వస్తుంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు, వారి అనుచర గణాలు ఈ ఎన్నికల్లో ఎన్ని సార్లు ఆ పేరుతో ప్రతిపక్షాలపై దాడి చేశాయో, రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాయో చూస్తున్నాము. జై శ్రీరామ్‌ అని భారత్‌లో గాక పాకిస్ధాన్‌లో అంటామా అని అమిత్‌ షా, బెంగాల్లో జై శ్రీరామ్‌ అనటమే నేరమైంది, మా వాళ్లను జైల్లో పెడుతున్నారని నరేంద్రమోడీ నానా యాగీ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యను ఆధారం చేసుకొని టీ అమ్మే వారు ప్రధాని కాకూడదా అంటూ తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి అదేమిటో మోసగాండ్లలో చాలా మంది పేర్ల చివర మోడీ అనే వుంది అని రాహుల్‌ గాంధీ చేసిన విమర్శను పట్టుకొని నన్ను అంటే అనండిగానీ నా వెనుక బడిన మోడీ కులం మొత్తాన్ని దొంగలంటారా అని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో కులాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జై శ్రీరాం నినాదం చేస్తే జైల్లో పెడతారా అనే యాగీ కూడా బెంగాల్లో, ఇతర చోట్ల ఓట్ల వేటలో భాగమే. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారానికి వెళుతుండగా భద్రతా ఏర్పాట్లను దాటి ముగ్గురు యువకులు ముందుకు వచ్చి మమతా బెనర్జీ కారు ముందు జై శ్రీరాం అంటూ నినాదాలు చేసి ఆమెను అడ్డుకోబోయారు. రెచ్చి పోయిన ఆమె వెంటనే కారు దిగి ఇప్పుడు రండి అంటూ కేకలు వేశారు. ఆ యువకులు పారిపోయారు. తరువాత పోలీసులు వారిని పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో విచారించి వదలి వేశారని మీడియా వార్తలు వచ్చాయి. ఈ వుదంతాన్ని సాకుగా చేసుకొని రాముడిని వీధుల్లోకి తెచ్చి ఓటర్లను రెచ్చగొట్టేందుకు బిజెపి పెద్దలు పూనుకున్నారు. కేరళలో కూడా అయ్యప్ప స్వామి పేరుతో నినాదాలు చేస్తూ హింసాకాండకు పాల్పడిన వారి మీద కేసులు పెడితే భక్తులను అడ్డుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. భక్తి ఒక ముసుగు, దేవుడి పేరు ఒక సాకు తప్ప ఇంకేమైనా వుందా ?

మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ అక్కడ పోటీ చేస్తున్న మాలెగావ్‌ పేలుళ్ల నిందితురాలు, బిజెపి అభ్యర్ధి ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. హిందువులకు హింస మీద విశ్వాసం లేదు అని ఆమె మాట్లాడటం గురించి సీతారామ్‌ స్పందించారు. ఈ దేశంలో ఎందరో చక్రవర్తులు, రాజులు యుద్ధాలు చేశారు.రామాయణం, మహాభారతాలు కూడా ఎన్నో యుద్ధాలు, హింసతో నిండి వున్నాయి. ఒక ప్రచారకురాలిగా మీరు ఇతిహాసాల గురించి చెబుతారు. అయినా హిందువులు హింసకు పాల్పడరని అంటారు. దీనికి వెనుక వున్న తర్కం ఏమిటి ? హిందువులు హింసకు పాల్పడరనేది ఒక అవాస్తవం, దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తొలి దశ ఎన్నికలు అయిపోయాయి. తిరిగి వారి అసలైన అజెండా 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు, వివాదాస్పద స్ధలంలో రామమందిర నిర్మాణం, వుమ్మది పౌర స్కృతి వంటి అంశాలకు వారు తిరిగి వచ్చారు. మూడవ దశ ఎన్నికల తరువాత భోపాల్‌లో ప్రజ్ఞా ఠాకూర్‌ను అభ్యర్ధిగా నిలబెట్టటం ప్రజలలో మనోభావాలను రెచ్చగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. ఇదీ సీతారామ్‌ ఏచూరి వుపన్యాసంలో ఒక అంశం సారాంశం.

Image result for mahabharata, ramayana , violence

దీనిలో రామాయణ,భారతాల ప్రస్తావనను మాత్రమే ముందుకు తెచ్చి మతధోరణులును రెచ్చగొట్టేందుకు తద్వారా మిగిలిన దశల్లో ఓట్ల లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఏచూరి చేసిన విమర్శలో రెండో భాగానికి సమాధానం లేదు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారు అన్ని మతాల్లో వుంటారని తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోడీ వక్రీకరిస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు.’ ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వున్న వ్యక్తిని అభ్యర్ధిగా బిజెపి నియమించిన అంశం మీద భోపాల్‌లో నేను చెప్పిన దానిని ఆయనకు అలవాటైన పద్దతుల్లో వక్రీకరించారు. వుగ్రవాదానికి మతం వుండదు, హింసాత్మక ప్రవృత్తి వున్న వారు అన్ని సామాజిక తరగతుల్లో వుంటారు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారాతాల్లో కూడా అలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. మతపరమైన విభజనను మరింత పెంచేందుకు మోడీ అసత్యాలు చెబుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ఏచూరి భోపాల్‌ వ్యాఖ్యలు హిందూమతాన్ని కించపరిచేవిగా వున్నాయని, మనోభావాలను దెబ్బతీశాయని ఇంకా ఏవేవో చేశాయని చెబుతూ కార్పొరేట్‌ రామ్‌దేవ్‌ బాబా, ఇంకా చిల్లర మల్లర ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వ్యక్తులు కొన్ని చోట్ల పోలీసు కేసులు దాఖలు చేశారు. సంఘపరివార్‌ ఎత్తుగడల్లో కేసులు దాఖలు చేసి కోర్టుల చుట్టూతిప్పే చౌకబారు చర్య ఒకటి. అయితే ఆ కేసులు నిలుస్తాయా లేదా, వాటికి ఎవరూ భయపడక పోయినప్పటికీ మీడియాలో ప్రచారం పొందవచ్చని, వివాదాలు జనం నోళ్లలో నానుతూ వుండాలనేది వారి లక్ష్యం. వారికి శివసేన తాళం, పక్కవాయిద్యాలుగా పని చేస్తున్నది.

Image result for mahabharata, ramayana , violence

ఈ సందర్భంగా తమ రాజకీయాలేవో తాము చెప్పుకోకుండా అనవసరంగా సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యలు చేశారంటూ కొందరు కపటంతో కూడిన సలహాలు ఇస్తున్నారు. అంటే తాము చెప్పిందే వేదం, పాడిందే పాట అంటూ కొంత మంది వక్రీకరణలకు, విద్వేష ప్రచారానికి పూనుకుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రపంచంలో ఎక్కడా ఇలా కూర్చోలేదు, అది అసలు మానవ స్వభావానికే విరుద్దం. ఒక రాయికి, నోరు లేని పశువుకు, మనిషికి ఇంక తేడా ఏముంది. అనవసరంగా వ్యాఖ్యలు చేశారని కాదు, ఆయన అన్నదాంట్లో వున్న అసందర్భం, అసమంజసం ఏమిటన్నది చెప్పకుండా చేయకుండా వుంటే బాగుండేది , మనోభావాలను దెబ్బతీయటం, ఓట్లు పొగొట్టుకోవటం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది చచ్చిన చేపల బాట తప్ప బతికిన చేపల ఎదురీత కాదు. భిన్న అభిప్రాయం అనేది భారతీయ సంస్కృతిలో భాగం. దానికి వేల సంవత్సరాల నాడే చార్వాకులు లేదా లోకాయతులు నాంది పలికారు. వారిని భౌతికంగా నాశనం చేస,ి వారు రాసిన గ్రంధాలను ధ్వంసం చేసిన వుగ్రవాద చరిత్ర నాటి మత పెద్దలది, వారికి మద్దతు ఇచ్చిన రాజరికాలది. అయినా సరే ప్రతి తరంలోనూ ఛాందసాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే శక్తులు పుట్టుకు వస్తూనే వున్నాయి. భావజాలాన్ని అంతం చేయటం ఎవరి వల్లా కాదన్నది చరిత్ర చెప్పిన సత్యం.పురోగామి భావజాలానికిి ప్రతీకలుగా వున్నవారిలో ఏచూరి ఒకరు. గతంలోఎందరో రామాయణ, మహాభారతాలను విమర్శనాత్మకంగా చూడలేదా ? చోళరాజు కుళోత్తుంగుడు శైవమతాభిమాని. వైష్ణవులను ఇతరులను సహించని కారణంగానే రామానుజుడు పన్నెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం లేదా హోయసల రాజుల ఆశ్రయం పొందాడని చరిత్రలో లేదా ? అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో జరిగిన మారణకాండను చూసిన తరువాత మారు మనసు పుచ్చుకొని బౌద్ధమతాన్ని అవలంభించాడన్న చరిత్ర చెబుతున్నదేమిటి? కుళోత్తుంగుడు, అశోక చక్రవర్తి, లేదా శైవ, వైష్ణవ మతాభిమానులైన చక్రవర్తులకు వేదాలు, పురాణాలు, భారత, రామాయణాలు తెలియవా, వారు వాటిని చదివిన తరువాతనే కదా శైవ, వైష్ణవ మత యుద్దాలకు, ప్రార్ధనా మందిరాల విధ్వంసకాండ, కూల్చివేతలకు, మారణకాండకు పాల్పడింది. మరి వాటిలోని మంచి నుంచి వారేమి నేర్చుకున్నట్లు ? అలాంటి మారణకాండకు పాల్పడకుండా వారిని ఆ గ్రంధాల భావజాలం నిలువరించలేదే. ఒకనాడు ఒకరిని ఒకరు అంతం చేసుకోవాలని చూసిన వారు నేడు హిందూ మతం పేరుతో వారు శైవులైనా, వైష్ణవులైనా రాజీపడి ఇతర మతాల మీద దాడికి పూనుకుంటున్నారు.

Image result for mahabharata, ramayana , violence

ఇతిహాసాలైనా, పురాణాలు, వేదాలు, భగవద్గీత వంటి హిందూ మత గ్రంధాలైనా, ఇతర మతాలకు చెందిన బైబిల్‌ పాత మరియు కొత్త నిబంధనలు, ఖురాన్‌, సిక్కుల గురుగ్రంధమైనా మరొకటి అయినా ఎవరినీ వుగ్రవాదులుగా మారమని, ఇతరులను అంతం చేయమని చెప్పలేదు. వాటిని చదివినవారందరూ వుగ్రవాదులుగా మారి వుంటే ఈ పాటికి ప్రపంచంలో ఏ ఒక్కడూ మిగిలి వుండేవారు కాదు. ప్రపంచంలో అత్యధికంగా 230 కోట్ల మంది క్రైస్తవులు, 180 కోట్ల మంది ముస్లింలు, 115 కోట్ల మంది హిందువులు, అసలు ఏ మతం లేని వారు 120 కోట్ల మంది వున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పేదాని ప్రకారం ఖురాన్‌ హింసను ప్రేరేపిస్తున్నదని చెప్పేదే వాస్తవం అయితే ప్రపంచంలో 180 కోట్ల మంది వుగ్రవాదులుగా మారి వుండాలి. ఐఎస్‌ వుగ్రవాదులు ముస్లింలే, వారు చంపుతున్నదీ సిరియా,ఎమెన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాల్లోని జనాన్నే కాదా ? సౌదీ అరేబియా ముస్లిం దేశం మరొక ముస్లిం దేశం ఎమెన్‌ మీద యుద్దం చేస్తున్నది, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో సహకరిస్తున్నది. అలా చేయమని ఖురాన్‌ చెప్పిందా ? అమెరికాను, ఐరోపా దేశాలను పరిపాలించింది క్రైస్తవులే, ప్రపంచాన్ని ఆక్రమించుకున్నది క్రైస్తవ దేశాలకు చెందిన వారే. అనేక ప్రాంతీయ యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్దాలకు కారకులైన హిట్లర్‌, ముస్సోలినీ వంటి వారందరూ క్రైస్తవులే. యుద్ధాలు చేయమని, జనాన్ని చంపమని బైబిల్‌ బోధించిందా? అదే అయితే ఇతర మతాలకు చెందిన దేశాల మీద వారికి వారే ఎందుకు యుద్ధాలు చేసుకున్నట్లు ? ఈ రోజు ప్రపంచంలో దాదాపు 40దేశాలలో జోక్యం చేసుకుంటున్న అమెరికన్లు మత రీత్యా క్రైస్తవులే. బరాక్‌ ఒబామా అయినా, డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా ఆ విధానంలో మార్పు లేదు. భారత, రామాయణాలు, భగవద్గీత, పురాణాలను చదివిన నరేంద్రమోడీ మరి నరహంతక చర్యలకు పాల్పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతలతో స్నేహం చేయమని ఆ గ్రంధాల్లో చెప్పాయా? ఆ దారుణాలను ఎందుకు ఖండించరు, అలాంటి శక్తులకు దూరంగా ఎందుకు వుండరు ? ముస్లింలు, క్రైస్తవులను ద్వేషించమని, వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టమని భారత రామాయణాలు చెప్పలేదే, మరి వాటిపేరుతో హిందూత్వశక్తులు చెలరేగిపోతుంటే ఆ దేవుళ్లు,దేవతలు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు.

Image result for mahabharata, ramayana , violence

తాను బాబరీ మసీదు పైకి ఎక్కానని, దాని కూల్చివేతలో భాగస్వామి అయ్యానని, దేవుడు తనకు ఇచ్చిన అవకాశమదని, మరోసారి దొరికితే తిరిగి పాల్గొంటానని స్వయంగా టీవీ ఇంటర్య్యూలో ప్రజ్ఞ చెప్పటం అంటే బాబరీ మసీదు కూల్చివేత నేరాన్ని అంగీకరించటమే. సాంకేతికంగా కేసుల్లో నిందితులుగా వున్నప్పటికీ బహిరంగంగా అంగీకరించిన వారిని నేరస్తులు అనే జనం అంటారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇతరుల సాయం వుంటే తప్ప నడవలేనంటూ కాన్సర్‌ చికిత్సకోసం బెయిలు ఇవ్వాలని కోరిన ఆమె ఎవరి సాయంతో పని లేకుండా ఎన్నికల ప్రచారం అంటూ భోపాల్‌ వీధుల్లో తిరిగి రెచ్చగొడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నిషేధం విధిస్తే గుళ్లు, గోపురాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇదేమంటే పూజలు చేసుకోనివ్వరా అంటూ మనోభావాలను రెచ్చగొడుతున్న ఆమెను అబ్దాలకోరు అనాలా, నిజం చెప్పని మనిషిగా భావించాలా ? వుగ్రవాద కేసులో ఆమె జైల్లో వున్నారు. నిందితులు ముస్లింలు, క్రైస్తవులు అయితే వారికి ఆ మతాలను తగిలించి వుగ్రవాదులు అని మీడియా రాస్తున్నది, చూపుతున్నది. ఆ లెక్కన ప్రజ్ఞను హిందూ వుగ్రవాది, హిందూ వుగ్రవాదం అనాలా లేదా ? అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో వుగ్రవాద చర్యలకు పాల్పడిన శ్వేతజాతీయులకు శిక్షపడకుండా లేదా నామమాత్రంగా వేసే విధంగా ముందే పోలీసులు మతిస్ధిమితం లేని వ్యక్తి అని చెబుతారు. మీడియా కూడా జీహుజూర్‌ అంటూ అలాగే రాస్తున్నట్లుగా ప్రజ్ఞను కూడా మతిలేని స్దితిలో వున్నట్లు పేర్కొనాలా ? ఇలాంటి ఆమె దేశ సంస్కృతికి ప్రతీక అని నరేంద్రమోడీ అభివర్ణించటాన్ని ఏమనాలి? మహోన్నతమైన దేశ సంస్కృతి గురించి గర్వపడుతున్నవారి మనోభావాలు గాయపడ్డాయా లేదా? లేకపోతే ఇలాంటి వారే ప్రతీకలైతే మన సంస్కృతి కూడా అలాంటిదేనా అని ఎవరైనా అనుకుంటే తప్పు ఎవరిది?

ప్రజ్ఞ ఇంకా నిందితురాలే తప్ప నేరం రుజువు కాలేదు కదా , ఆమె తన మతం గురించి మాత్రమే చెప్పింది కదా ? ఇలాంటి వాదనలను బిజెపి వారు తెస్తున్నారు. ఇది పచ్చి అవకాశవాదం, తర్కానికి కట్టుబడనిది. అదే ఇతర మతాలకు చెందిన వారైతే కేసులు నమోదు చేసిన వెంటనే నేరస్తులనే ముద్రవేస్తున్నారు. నిర్ధారించేస్తున్నారు.అయినా కేసుల్లో ఇరుక్కొన్న వివాదాస్పదులైన వారు తప్ప మరొకరు బిజెపికి దొరకలేదా ? ఇదే పార్టీ పెద్దలు గతంలో ఆశారాంబాపు, డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ వంటి కరడు గట్టిన నేరస్ధులందరినీ నేరం రుజువు కాలేదు కదా అని సమర్ధించారు. వారి ఆశీర్వాదాలు పొందారు, వారితో తమకు ఓట్లు వేయించాలని సిఫార్సులు చేయించుకున్నారు. వారికి శిక్షలు పడిన తరువాత ఏ బిజెపి నేత అయినా వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా అలాంటి వారిని సమర్ధించినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారా? లేదే ? రేపు ప్రజ్ఞ నేరం రుజువైతే ఏమిటి?

Image result for pragya thakur

హిందువుల మీద సీతారాం ఏచూరి ఇలాంటి దాడులు చేయటం వల్లే కమ్యూనిస్టులు వున్న పలుకుబడి కూడా కోల్పోతున్నారు. అనే శాపనార్ధం ఒకటి. భారత, రామాయణాల్లో వున్న సంఘటనలు, పాత్రల మీద విమర్శలు లేదా వ్యాఖ్యలు చేసింది కమ్యూనిస్టులొక్కరే కాదే, ఎన్‌టిరామారావు సినిమాల్లో ఎన్ని డైలాగులు వున్నాయో తెలియదా, మరి అలాంటి వ్యక్తి పార్టీ పెట్టిన ఆరునెలల్లోనే అధికారానికి వచ్చారు. దానికేమంటారు? ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌ నేతలెవరూ భారత, రామాయణాలను విమర్శించలేదు, వాటికి కట్టుబడే వున్నారు. మరి ఆ పార్టీ నేడు ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఎందుకు దిగజారినట్లు ? దాన్నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని బిజెపి ఎందుకు చెబుతున్నట్లు ? నిజానికి సంఘపరివార్‌ లేదా ప్రజ్ఞ వంటి వారి శాపాలకే అంత శక్తి వుంటే రామాయణ విషవృక్షం అనే గ్రంధం రాసిన రంగనాయకమ్మ దశాబ్దాల తరువాత కూడా అదే వుత్సాహంతో ఇంకా రాస్తూనే వున్నారే. ప్రజ్ఞ చెప్పినట్ల హేమంత కర్కరే మాదిరి ప్రాణాలు తీయకపోయినా కనీసం ఆమె కలాన్ని పని చేయకుండా చేయలేకపోయిన నోటి తుత్తర సరుకని అనుకోవాలి. ఎందరో సాధ్వులుగా దేశమంతా తిరుగుతున్నవారు, పీఠాలు పెట్టుకున్నవారు వున్నారు. ఆశారాం బాపు, డేరా బాబాలు ఎందరో మానవతుల శీలాలను హరించారు,హత్యలు చేశారు. శీలం, ఏకత గురించి కబుర్లు చెప్పే ఇలాంటి సాధ్వులు ఒక్కడంటే ఒక్కడినీ శపించలేదేం. ప్రాణాలు తీయకపోయినా జీవచ్ఛవాలుగా మార్చి మరొకడు అలాంటి పనికి పాల్పడకుండా చేయవచ్చు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మసీదుల్లో, రైళ్లలో అమాయకుల ప్రాణాలు తీసే తీవ్రవాద చర్యలు గాక తామక తంపరగా తయారవుతున్న తోటి యోగులతో కలసి దుష్టసంహారం కోసం శాపాలు పెట్టమనండి.

చివరిగా భారత, రామాయణాల గురించి ఒక్క మాట. ఒక్క భారతం ఏమిటి ఏ పురాణం చూసినా ముగింపు ఏమిటి దుష్ట సంహారం పేరుతో హింసాకాండలేగా. అసలు యుద్ధమే సమర్దనీయం కాదు. ధర్మ యుద్దమని కొన్నింటికి పేరు. నిజానికి ధర్మ యుద్దమైతే రెండువైపులా వారు గాక అధర్మంవైపు వారే మరణించాలి కదా ? మహా భారత యుద్ధంలో ఏడు అక్షౌహిణులు పాండవుల తరఫున పదకొండు అక్షౌహిణులు కౌరవుల తరఫున పాల్గొన్నాయి. ఒక వ్యాఖ్యానం ప్రకారం 18 అక్షౌహిణుల్లో 47,23,920 సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రధాలు వున్నాయి. మరొక కధనం ప్రకారం కురు పాండవ యుద్దంలో మరణించిన వారి సంఖ్య 166 కోట్ల 20వేల మంది అని, బతికిన వారు 2,40,165 మంది అని యుధిష్టరుడు (ధర్మరాజు) చెబుతాడు. అంటే ఇంత మందిని బలిపెట్టినది ధర్మ యుద్దం ఎలా అవుతుంది. వంద మంది కౌరవ సోదరులను హతమార్చి వుంటే సరిపోయేదానికి ఇంత మందిని బలిపెట్టాలా ? మరొక కధనం ప్రకారం బతికింది పన్నెండు మందే అని ఎక్కడో చదివాను. ఇక రామాయణం. ఇది చెబుతున్నదేమిటి? రాముడు వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపాడు. అంటే చంపదలచుకున్నవాడిని ఎలాగైనా అంతం చేయవచ్చు అన్ననీతిని బోధించినట్లే కదా, నేడు జరుగుతున్న నేరాలన్నీ దాదాపు ఇలాంటివే కదా. ధర్మ యుద్దం అంటే ఒక తేదీ, స్ధలం నిర్ణయించుకొని ముఖాముఖీ తలపడటం ఎక్కడైనా జరుగుతోందా? రామ రావణ యుద్దంలో ఎందరు మరణించిందీ స్పష్టంగా తెలియదు. కానీ రావణుడి ఆయువు పట్టు విభీషణుడి ద్వారా తెలుసుకొని రాముడు చంపాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. ప్రత్యర్ది పార్టీల ఆర్ధిక ఆయువు పట్టు ఎక్కడుందో తెలుసుకొని ప్రభుత్వ సంస్ధల ద్వారా దాడులు చేయించి లేదా బెదిరించీ రాజకీయాల్లో ఫిరాయింపులు లేదా నాశనం చేయటం చూస్తున్నదే కదా. ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. అందువలన భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు విప్పనివ్వండి, జనాన్ని తెలుసుకోనివ్వండి. పిచ్చిబియ్యాలకు,శాపాలకు భయపడే రోజులు కావివి అని గుర్తించండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓటర్లకు స్వేచ్చే బెంగాల్‌ ఎన్నికల అసలు సమస్య !

30 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress, CPI(M), INC, Mamatha Benarjee, Trinamool Congress, West Bengal election

ఎం కోటేశ్వరరావు

దేశంలో ఇప్పటికి నాలుగు దశల ఎన్నికలు జరిగాయి. మరో మూడు దశలకు సిద్ధం అవుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పశ్చిమబెంగాల్లో నాలుగు దశల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఓటర్లను అనేక చోట్ల అధికార తృణమూల్‌ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిపురలో తొలి దశలో పోలింగ్‌ జరిగిన నియోజకవర్గంలో వందలాది పోలింగ్‌ కేంద్రాలలో సిపిఎం ఏజంట్లను రాకుండా బిజెపి గూండాలు అడ్డుకున్నారు, రిగ్గింగుకు పాల్పడ్డారు. రెండవ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారటంతో ఎన్నికల కమిషన్‌ మొత్తం నియోజకవర్గ పోలింగ్‌నే మరొక రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకరి అప్రజాస్వామిక చర్యల గురించి ఒకరు రోజూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బిజెపి, తృణమూల్‌ రెండూ ఒకే విధమైన చర్యలకు పాల్పడుతున్నాయి. దేశంలో బిజెపిని విమర్శించే పార్టీలు త్రిపుర గురించి మాట్లాడలేదు. అలాగే మమతాబెనర్జీని తమతో కలుపుకొని కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీలు పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య ఖూనీ గురించి నోరెత్తటం లేదు. గతంలో సిపిఎ పాలనలో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ అంటూ అన్‌సైంటిఫిక్‌ వాదనలు, ప్రచారం చేసిన వారు ఇప్పుడు పల్లెత్తు మాట్లాడటం లేదంటే నాడు పని గట్టుకొని ప్రచారం చేసిన వారు తప్ప నిజమైన ప్రజాస్వామిక వాదులు కాదన్నది స్పష్టం. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రానివ్వలేదన్న విమర్శలు, ఆరోపణలు వామపక్ష ప్రభుత్వ హయాంలో రాలేదు.

పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్నది ఇప్పుడు ప్రధానం కాదు. అసలు తమ ఓటు తాము వేసుకొనే స్చేచ్చను ఓటర్లకు ఇస్తారా అన్నది అసలు సమస్య. ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లు-త ణమూల్‌ కండబలం మధ్య పోటీగా వుంది. మూడు దశల పోలింగ్‌లో వెల్లువెత్తిన ఆరోపణలు మిగిలిన నాలుగు దశల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. అభ్యర్ధులను ప్రచారం చేసుకోనివ్వరు,(స్ధానిక సంస్ధల్లో అయితే అసలు నామినేషన్లనే వేయనివ్వలేదు) అనుమానం వచ్చిన ఓటర్లను బూత్‌లకు రానివ్వరు, వచ్చిన వారు అధికార త ణమూల్‌కు ఓటేయలేదని అనుమానం వస్తే చావచితక కొడతారు అన్న విమర్శలు వచ్చాయి. అయినా రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. చిత్రం ఏమిటంటే ఎవరికి ఓటు వేసినా ఒకే పార్టీకి పడేవిధంగా, జాబితాలో వున్న వారి కంటే ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని, ఇలా రకరకాలుగా ఎన్నికల ఓటింగ్‌ యంత్రాల మీద విమర్శలు చేస్తున్న వారు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి. ఈ పూర్వరంగంలో అక్కడ ఏ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా, ఓటర్లను కదిలించినా, వాస్తవాలను వివరించినా ఫలితం ఏమిటి, అసలు ఎన్నికలను బహిష్కరిస్తే పోలా అనే వారు వుండవచ్చు. అలా వూరందరికీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు మమతాబెనర్జీ అధికారానికి రావటానికి దోహదం చేసిన వారిలో వున్నారంటే వులిక్కిపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వారే వైఖరి తీసుకున్నారో తెలియదు. ఏ పిలుపు ఇచ్చినా పట్టించుకొనే వారు వుండరు.

అత్యవసర పరిస్ధితికి ముందు 1971లో కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చివేసింది. తాము విజయం సాధిస్తామన్న నియోజకవర్గాలలో మినహా మిగిలిన అన్నిచోట్లా సామూహిక రిగ్గింగ్‌కు పాల్పడింది. ఆ నాడు కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నోరు మెదపలేదు. కమ్యూనిస్టులనే కదా తొక్కేసింది అన్నట్లుగా వున్నాయి. తరువాత అదే కాంగ్రెస్‌ సిపిఎంతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల(సిపిఐ ఆ నాడు కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్న కారణంగా దాన్ని మినహా) నేతలందరినీ అత్యవసర పరిస్ధితి పేరుతో జైల్లో పెట్టింది. ఇప్పుడు మమతాబెనర్జీ అకృత్యాలను విమర్శించని పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చుగానీ, ప్రజాస్వామిక ప్రక్రియకు తలపెట్టిన హాని గురించి ఎందుకు పట్టించుకోవు? అవి కూడా తమకు ప్రాబల్యం వున్న ప్రాంతాలలో అలాంటి పనులు చేసిన చరిత్ర కలిగినవే, వర్గ రీత్యా ఒకే తానులో ముక్కలు కనుకే అలా వ్యవహరిస్తున్నాయి.

పైన పేర్కొన్న పరిమితుల పూర్వరంగంలో అక్కడి ఎన్నికల తీరు తెన్నులను చూద్దాం. రాష్ట్రమంతటా అలాంటి పరిస్ధితి వున్నప్పటికీ అనేక చోట్ల తృణమూల్‌ను వ్యతిరేకించే శక్తులు కూడా వున్నాయి. కనుకనే వామపక్షాలు, ఇతరులకు ఆ మేరకైనా ఓట్లు వస్తున్నాయి. దేశమంతటినీ గతంలో ఆకర్షించిన నియోజకవర్గాలలో జాదవ్‌పూర్‌ ఒకటి.లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీని ఓడించి మమతాబెనర్జీ జెయింట్‌ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ త ణమూల్‌ అభ్యర్ధిగా సినీ నటి మిమి చక్రవర్తి పోటీ చేస్తుండగా సిపిఎం తరఫున కొల్‌కతా మాజీ మేయర్‌ వికాస్‌ రంజన్‌ భట్టాచార్య, ఇటీవల త ణమూల్‌ నుంచి వుద్వాసనకు గురైన మాజీ ఎంపీ అనుపమ్‌ హజ్రా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. కొల్‌కతా నగరంలో కొంత భాగం, గ్రామీణ ప్రాంతాలతో నిండి వున్న ఈ నియోజకవర్గంలోని జాదవ్‌ పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2011లో మినహా 1967 నుంచి సిపిఎం అభ్యర్దులే ఎన్నిక అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిపిఎం నే సుజన్‌ చక్రవర్తి ఎంఎల్‌ఏగా వున్నారు. త ణమూల్‌-సిపిఎం మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందనే అభిప్రాయం వెల్లడైంది. లాయర్‌ అయిన భట్టాచార్య నియోజకవర్గంలో అనేక కేసులలో ముఖ్యంగా వివిధ చిట్‌ఫండ్‌ మోసాల కేసుల్లో వందలాది మంది తరఫున ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా వాదించి వారి సొమ్మును వెనక్కు ఇప్పించిన వుదంతాలు వున్నాయి. పోటీ తీవ్రంగా వున్నప్పటికీ రోజు రోజుకూ సులభం అవుతోందని భట్టాచార్య అంటున్నారు. రాజకీయాలకు కొత్త, ఏమీ తెలియని సినీనటి మిమి గురించి అనేక మంది పెదవి విరుస్తున్నారు. సిపిఎం అభ్యర్ధి మంచి వాడైనప్పటికీ తగిన సంస్దాగత పట్టులేదని కొందరు అభిప్రాయపడ్డారు. 2011 ఎన్నికల్లో ఓటమి తరువాత సిపిఎంకు ఈ పరిస్ధితి ఏర్పడింది. మార్పు కోసం ఓటు వేయాలని జనానికి వున్నప్పటికీ త ణమూల్‌ గూండాలు వారిని అనుమతించే అవకాశాలు లేవని ఓటర్లు భయపడుతున్నారని వికాస్‌ రంజన్‌ భట్టాచార్య అన్నారు.

మీరు ఈ నియోజకవర్గానికి చెందిన వారు కదా అన్న ప్రశ్నలకు బిజెపి అభ్యర్ధి హజ్రా మాట్లాడుతూ టిఎంసి అభ్యర్ధిని మిమి చక్రవర్తి ఎక్కడో జల్పాయిగురికి చెందిన వారు, ఆమెకూడా వెలుపలి వ్యక్తే కదా, అయినా నియోజకవర్గ ఓటర్లు బిజెపితోనే వున్నారు. త ణమూల్‌ నేరగాండ్లు, సంఘవ్యతిరేకశక్తులకు నిలయంగా మారినందునే తాను బిజెపిలో చేరానని, వారు నాపై బురద చల్లుతున్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలోని భంగోర్‌ అసెంబ్లీ స్ధానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్‌ రజాక్‌ మొల్లా ప్రస్తుతం మమతా మంత్రి వర్గ సభ్యుడు. గత రెండు సంవత్సరాలలో కావలసినంత చెడ్డపేరు తెచ్చుకున్నాడీ మాజీ సిపిఎం నేత. ప్రస్తుతం త ణమూల్‌ అభ్యర్ధి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించటం లేదని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. చివరి దశలో పోలింగ్‌కు ఇంకా సమయం వుంది కనుక తరువాత రంగంలోకి వచ్చేది లేనిదీ తెలియదు. సింగూరులో పరిశ్రమలకు భూమి సేకరించటాన్ని వ్యతిరేకించిన త ణమూల్‌కు భంగోర్‌లో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే పరిస్ధితి ఎదురైంది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను వ్యతిరేకించిన వారిపై 2017లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్ధానిక త ణమూల్‌ ఎంఎల్‌ఏగా గతంలో పనిచేసిన అరబుల్‌ ఇస్లాం తన అనుచరులతో బెదిరించి భూములు స్వాధీనం చేసుకున్నాడు. త ణమూల్‌ గూండాయిజానికి పేరుమోసిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన భారీ మెజారిటీ త ణమూల్‌ గెలుపును నిర్ధేశించింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.

ఒక్క జాదవ్‌పూరే కాదు, ఏ నియోజకవర్గంలోనూ ఓటర్ల అభీష్టం మేరకు ఓట్లు వేసుకొనే స్వేచ్చాపూరిత వాతావరణం లేదన్నది సర్వత్రా వెల్లడౌతున్న అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు త ణమూల్‌ ధన, కండబలాన్ని వుపయోగించి తన స్ధానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పుడేఇపుపడే కింది స్ధాయి క్యాడర్‌, సానుభూతి పరుల్లో భయం వదులుతున్న స్ధితిలో సిపిఎం, మొత్తంగా వామపక్ష సంఘటన తిరిగి తన మద్దతుదార్లను కూడగట్టుకొని పోయిన స్ధానాలను తిరిగి సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. పన్నెండు సంవత్సరాల తరువాత నందిగ్రామ్‌లో సిపిఎం తన కార్యాలయాన్ని తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా ప్రారంభించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల జనంలో తొలుగుతున్న భ్రమలు, ప్రతిఘటనకు ఇదొక సూచిక అయినప్పటికీ ఇంకా దాని గూండాయిజం ఏమాత్రం తగ్గలేదన్నది నాలుగు దశల ఎన్నికలు నిరూపించాయి. తాము ఇరవైకి పైగా స్ధానాలు సంపాదించగలమనే వూహల్లో బిజెపి నేతలు వున్నారు. గతంలో తాను సాధించిన వాటిని అయినా నిలబెట్టుకొని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. త ణమూల్‌ కాంగ్రెస్‌-బిజెపి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వాటి మధ్య అంతర్గత ఒప్పందం వుందన్నది వామపక్షాల విమర్శ. త ణమూల్‌, బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలు గెలిచిన సీట్లలో పరస్పరం పోటీ నివారించుకోవాలని, ఆమేరకు కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో తాము పోటీ చేయబోమని, తమ స్ధానాల్లో అదే విధంగా స్పందించాలని సిపిఎం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్‌ అందుకు అంగీకరించకుండా సిపిఎం గెలిచిన స్ధానాల్లో పోటీకి దిగింది. అయినప్పటికీ తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న స్ధానాలలో వామపక్ష సంఘటన పోటీ చేయకుండా 42కుగాను 38 చోట్లకే పరిమితం అయింది.

మాల్డా అంటే కాంగ్రెస్‌ కంచుకోట. ఏబిఏ ఘనీఖాన్‌ చౌదరి పాతికేండ్లకు పైగా ఎంపీగా వున్నారు. తరువాత ఆయన వారసులే ఎన్నిక అవుతున్నారు. 2006లో ఆయన మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయనే వేస్తున్నట్లుగా ఓటర్ల వైఖరి వుంటుంది. ఘనీఖాన్‌ చౌదరి సోదరుడు మాల్డా దక్షిణంలో తిరిగి పోటీచేస్తుండగా సిపిఎం తన అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. మాల్డా వుత్తరం నుంచి గెలిచిన ఘనీఖాన్‌ మేనకోడలు జనవరిలో కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌కు ఫిరాయించారు. బిజెపిని ఓడించాలంటే త ణమూల్‌ పార్టీ అవసరమని దానిలో చేరినట్లు చెప్పుకున్నారు. ఆమెపై ఘనీఖాన్‌ కుటుంబం నుంచే మరొకరు రంగంలో వున్నారు.

ముర్షిదాబాద్‌ జిల్లాలో ముర్షిదాబాద్‌, జాంగీపూర్‌ నియోజకవర్గాలున్నాయి. జాంగీపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండుసార్లు, తరువాత ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ రెండుసార్లు ఎన్నికయ్యారు. గత రెండు ఎన్నికలలో అభిజిత్‌ మెజారిటీ 2012లో 2,536, 2014లో 8,161 మాత్రమే. రెండు సార్లూ సిపిఎం అభ్యర్ధి రెండవ స్ధానంలో వచ్చారు.ఈ సారి కూడా పోటీ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది. ఈ నియోకవర్గంలో సిపిఎం 1977-1999 మధ్య ఏడుసార్లు గెలిచింది. మరోనియోజకవర్గం ముర్షిదాబాద్‌, సిపిఎం సిటింగ్‌ అభ్యర్ధి బద్రుద్దోజా ఖాన్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రముఖుడైన హుమాయున్‌ కబీర్‌ బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్ధి అయ్యాడు. ఇక్కడ కాంగ్రెస్‌, త ణమూల్‌ పోటీ చేస్తున్నాయి. మరో నియోజకవర్గం బెరహంపూర్‌ ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌కు సిపిఎం మద్దతు ఇస్తున్నది. అధిర్‌ అనుచరుడిగా వున్న అపూర్వ సర్కార్‌ కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌లో చేరి అభ్యర్ధి అయ్యారు.

బిజెపి మతతత్వ రాజకీయాల ప్రయోగ కేంద్రంగా మారిన అసన్‌సోల్‌,దుర్గాపూర్‌, బర్ద్వాన్‌ ప్రాంతంలో బిజెపి అసన్‌సోల్‌ నియోజకవర్గంలో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతుల పేర్లతో ప్రదర్శనలు జరిపి బలపడింది. త ణమూల్‌ కాంగ్రెస్‌లోని ముఠాతగాదాల కారణంగా ఒక వర్గం మద్దతు ఇచ్చిన కారణంగానే ఇక్కడ బిజెపి అభ్యర్ధి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న బాబూలాల్‌ సుప్రియో విజయం సాధించారు. ఈసారి రెండు వర్గాల మధ్య రాజీగా సినీ నటి మున్‌మున్‌ సేన్‌ రంగ ప్రవేశం చేశారు. బిజెపి మరో నియోజకవర్గం డార్జిలింగ్‌. ఇక్కడ ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా ఆ పార్టీ తరఫున గెలిచారు. ఇక్కడ కూడా మత ప్రాతిపదికన చీల్చేందుకు బిజెపి ప్రయత్నించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 17.02శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పదిశాతానికి పడిపోయింది. అయినప్పటికీ తానే త ణమూల్‌కు ప్రత్యామ్నాయం అని సగం సీట్లు గెలుస్తామని మీడియా ప్రచారదన్నుతో చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం సీట్లు

త ణమూల్‌ కాంగ్రెస్‌ 39.05      34

వామపక్ష సంఘటన 29.71       2

బిజెపి                17.02       2

కాంగ్రెస్‌                9.58       4

2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం, సీట్లు

త ణమూల్‌    44.9          211

సిపిఎం        19.8            26

కాంగ్రెస్‌        12.3           44

బిజెపి         10.2            3

ఫార్వర్డ్‌బ్లాక్‌    2.8             2

సిపిఐ          1.5           1

ఆర్‌ఎస్‌పి      1.7           3

జెఎంఎం       0.5           3

ఇండి ్        0             1

Share this:

  • Tweet
  • More
Like Loading...

తిరోగామి-పురోగామి పోరు గడ్డ బెగుసరాయ్‌ !

28 Sunday Apr 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

a regressive vs progressive electoral battle battlefield, Begusarai, Kanhaiya Kumar

Image result for Kanhaiya Kumar

ఎం కోటేశ్వరరావు

బీహార్‌లో రైతాంగ వుద్యమ నిర్మాత ! ఆలిండియా కిసాన్‌ సభ తొలి అధ్యక్షుడు !! స్వామి సహజానంద సరస్వతి కలియ తిరిగిన నేల, వుద్యమాల పురుటి గడ్డ బెగుసరాయ్‌. స్వాతంత్య్ర వుద్యమంలో పరిచయం అవసరం లేని ప్రాంతం. మరోసారి జాతీయంగా జనం నోళ్లలో నానుతోంది. అటు పచ్చి మితవాదులు, ఇటు పురోగామి వాదులు ఇప్పుడు కేంద్రీకరించిన ఎన్నికల పోరుగడ్డ. సోమవారం నాడు జరిగే ఎన్నికల ఫలితం ఏమౌతుందన్నది ప్రశ్నే కాదు.

ఏ మతానికి చెందిన వారైనా పిల్లల్ని కనే సంఖ్య ఒకటిగానే వుండాలి. హిందువులు మరింత ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా సంఖ్యను పెంచాలని ప్రబోధించిన మిత, మతవాది అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ బిజెపి అభ్యర్ధి. దేశానికి మిత, మతవాదుల నుంచి పొంచి వున్న ముప్పును చిత్తు చెయ్యాలన్న పురోగమన వాది కన్నయ్య కుమార్‌ వామపక్షాలన్నీ బలపరిచిన సిపిఐ అభ్యర్ధిగా పోటీలో వున్నారు. బిజెపిని ఓడించాలన్న వామపక్షాల పిలుపును విస్మరించిన ఆర్‌జెడి, కాంగ్రెస్‌ కూటమి తరఫున ఆర్‌జెడి అభ్యర్ధిగా తన్వీర్‌ హసన్‌ పోటీలో వున్నారు.

ఆ నియోజకవర్గంలో భూమిహార్‌లు గణనీయ సంఖ్యలో వున్నారు. గిరిరాజ్‌ సింగ్‌, కన్నయ్య ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందిన వారు. భూమిహార్లు తాము వ్యవసాయం చేసే బ్రాహ్మణులమని, తాము యాచక తరగతికి చెందిన వారం కాదని చెప్పుకుంటారు. కర్మకాండలు చేసే తరగతి బ్రాహ్మణులు వారు అసలు సిసలు బ్రాహ్మలు కాదంటూ తమతో సమంగా గుర్తించేందుకు నిరాకరిస్తారు. భూమిహార్లలో పెద్ద పెద్ద జమిందార్లు వున్నారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన పేద భూమిహార్లు వున్నారు. స్వామి సహజనాంద తరగతి నాడు రెండవ కోవకు చెందితే నేడు ఆ వారసత్వాన్ని కన్నయ్య కుమార్‌ కొనసాగిస్తున్నాడు.

Image result for Kanhaiya Kumar

కన్నయ్యకు మద్దతుగా అనేక ప్రాంతాల నుంచి కుల, మత, భాషా, ప్రాంత భేదంలేకుండా చురుకుగా పాల్గొంటున్నవారితో బెగుసరాయ్‌ ఓ ‘మినీ భారత్‌’ను తలపిస్తున్నదని న్యూస్‌ క్లిక్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి నివేదించాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు చర్చల్లో నిమగమై ఉండగా.. మరికొందరు తమ తమ మొబైల్‌ ఫోన్లతో బిజీగా ఉన్నారు. మరికొందరు మండుతున్న వేడి నుంచి సేదతీరేందుకు చెట్ల నీడన తలదాచుకున్నారు. ఇదంతా బేగసరాయ్‌ లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత నివాసం వెలుపల ద శ్యం. అక్కడ ఉన్నవారంతా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. వారి లక్ష్యం ఒక్కటే. బేగుసరారు లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కన్నయ్యకుమార్‌కు ప్రచారంలో సహాయ పడటం. బిహత్‌ గ్రామంలోని కన్నయ్యకుమార్‌ ఇంటికి చేరుకునేసరికి వారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పరిచయంలేదు. యువకులు, మధ్యవయస్కులు, వ ద్దులు, మహిళలు ఇలా అందరూ ఇప్పుడు మంచి స్నేహితులు. ‘ఉదయం ప్రచారానికి బయలుదేరే ముందు వరకూ.. అలాగే ప్రచారాన్ని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత… వారంతా కన్నయ్యకుమార్‌ ఇంటివెలుపల బహిరంగ ప్రదేశంలో గడుపుతున్నారు..’ అని సీపీఐ అభ్యర్థి ప్రచార సమన్వయకర్త ధనుంజరుకుమార్‌ చెప్పారు. ప్రత్యేకమేమంటే.. అక్కడ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, కళాకారులు, పర్యావరణ ఉద్యమ కారులు, విద్యావేత్తలు.. ఇలా విభిన్నవర్గాలకు చెందినవారే కాదు, వివిధ భాషలు, కులాలు, సంస్క తులకు చెందిన వారూ ఉన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు, సాంస్క తిక గ్రూపు, వీధి నాటకాలకు, సోషల్‌ మీడియా నిర్వహణ ఇలా… అందరినీ ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. ముమ్మర ప్రచారం నిర్వహించారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని మరీ వీరంతా అక్కడకు చేరుకొని ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురితో సహా విదేశీయులు కూడా ఉండటం ప్రత్యేకం. పన్నెండు అంతర్జాతీయ మీడియాసంస్థలు ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించాయి. నివాసం వెనుక ఖాళీ స్థలంలో భోజనశాలను ఏర్పాటుచేశారు. కన్నయ్యకుమార్‌ తల్లి సహా పలువురు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లుచూస్తున్నారు. ‘నా సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడకు వచ్చాను. నేను సీసీఐ కార్యకర్తనుకాను. అలాగని ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కానీ, కన్నయ్య విజయం కోసం నా వంతు సహాయం చేయాలన్న తపనతో ఇక్కడకువచ్చాను. చీకటిలో కాంతిరేఖలా కన్నయ్యకుమార్‌ కనిపించారు నాలాగే వివిధ రాష్ట్రాల నుంచి కన్నయ్యకు సహాయపడేందుకు వందలాది మంది బేగుసరారు వచ్చారు..’ అని పంజాబ్‌లోని భటిధర్‌ నుంచి వచ్చిన జబర్‌ జంగ్‌ సింగ్‌ చెప్పారు.

Image result for Kanhaiya Kumar

‘దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరం నుంచి నేను ఇక్కడకు వచ్చాను. గత ఐదేండ్లుగా గోవాలోనూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యావరణంపై మోడీ ప్రభుత్వ రాజీపడిన ధోరణిని ఇక్కడ ప్రజలకు వివరిస్తున్నాను’ అని పర్యావరణ కార్యకర్త సుదీప్‌ దాల్వీ చెప్పారు. ‘కన్నయ్యకు మద్దతివ్వాల్సిందిగా గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాను. అసంఘటిత రంగ, బలహీనవర్గాలు, మైనార్టీల, పేదల గొంతుక కన్నయ్య. ఆయన కోసం నేను ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ వచ్చాను’ అని ఒడిషాలోని జగత్‌సింగ్‌పుర్‌ నుంచి వచ్చిన మిర్జా లుక్మన్‌ చెప్పారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ నుంచి సందీప్‌ గుప్తా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ విద్యార్థి జైన్‌ మొహమ్మద్‌ సులేమన్‌, అలహాబాద్‌ వర్సిటీ నుంచి ఆరిఫ్‌ సిద్ధికి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మహేశ్‌ కుమార్‌, జేఎన్‌యూ నుంచి పలువురు విద్యార్థులు, తెలంగాణ నుంచి సల్మాన్‌ అలీ, క్రిష్ణరామ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాగేశ్వర్‌రెడ్డి.. ఇలా అన్ని ప్రాంతాలవారూ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటువేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలోని మతవాద, నియంతత్వ దళాలను ఓడించేందుకే నా పోరాటం., బేగుసరారు ప్రజలు నాకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉంది’ అని కన్నయ్యకుమార్‌ చెప్పారు.

Image result for Kanhaiya Kumar

వామపక్షాలకు బెగుసరాయ్‌ ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం. లెనిన్‌గ్రాడ్‌గానూ దీనికి పేరు. 1967లో యోగేంద్ర శర్మ సీపీఐ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ సీపీఐ అభ్యర్థికి 11.87్న ఓట్లు వచ్చాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ మళ్లీ సత్తా చాటాలనే ఉద్దేశంతో నవడా స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను రంగంలో దించింది. ఆయన అయిష్టంగానే బరిలో దిగారని వార్తలు వచ్చాయి. ఆర్జేడీ గత ఎన్నికల్లో 3.69 లక్షల ఓట్లు దక్కించుకున్న తన్వీర్‌ హసన్‌ను అభ్యర్థిగా ప్రకటించి త్రిముఖ పోరుకు తెరతీసింది. బిజెపి-సిపిఐ మధ్య భూమిహార్‌ ఓట్లు చీలితే తమకు లాభమని ఆర్జేడీ భావిస్తోంది. పైగా తన్వీర్‌ ముస్లిం కావడం, యాదవ్‌ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేస్తోంది. కన్నయ్యకు మద్దతుగా గెలిపించేందుకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా, కె నారాయణ, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి ఉద్దంఢులు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజాగొంతుకను గెలిపించాలని కోరారు.

Image result for Kanhaiya Kumar, sitaram

షబానా ఆజ్మీ, జావేద్‌ అక్తర్‌, స్వరభాస్కర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు కన్నయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని, నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా స్వయంగా బెగుసరాయ్‌లో ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని గిరిరాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరఫున ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి కన్నయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల ఘర్షణలకు కూడా ప్రయత్నించారు. నితీశ్‌ కుమార్‌ నేత త్వంలోని జేడీ(యూ) మద్దతు కూడా తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు తన్వీర్‌ హసన్‌ స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో తామే గెలుస్తామని ఆర్జేడీ అంచనాలు వేసుకుంటోంది.

మొత్తం ఓటర్లు 17.78 లక్షలు

పురుషులు 9.49 లక్షలు

మహిళలు 8.28 లక్షలు

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వత్తిడికి లొంగిన అపర జాతీయవాది నరేంద్రమోడీ !

25 Thursday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Donald Trump diktats, INDIA, iran, Iran Oil, Narendra Modi, US SANCTIONS

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యలోటు తగ్గిందా ? వాస్తవాలేమిటి ?

20 Saturday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

China, India’s Trade, India’s Trade Deficit, India’s Trade Deficit With China

Image result for India’s Trade Deficit With China 2019

ఎం కోటేశ్వరరావు

‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్‌,చైనాకు భారత్‌ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్‌ విత్‌ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.

దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్‌ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్‌ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.

Image result for India’s Trade Deficit With China 2019

2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్‌ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్‌-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్‌ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్‌-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్‌ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్‌ లైన్‌ జనవరి 4, 2019).

ఎకనమిక్‌ టైమ్స్‌ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్‌ లెగ్గా ఐరన్‌ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !

చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్‌ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్‌ 17వ తేదీన లైవ్‌ మింట్‌ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్‌ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్‌ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్‌ కథనాన్ని నిర్ధారించింది.

Related image

పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్‌ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్‌ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్‌ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్‌ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్‌ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్‌ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్‌ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్‌ నుంచి 728శాతం పెరిగాయి.లాన్‌ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్‌ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్‌ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్‌ డాలర్లు. దీనిలో భారత్‌ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్‌ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్‌ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొలి పత్రికా గోష్టిలో జర్నలిస్టులను అదరగొట్టిన నరేంద్రమోడీ !

19 Friday Apr 2019

Posted by raomk in BJP, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra modi maiden press conference

Image result for narendra modi  maiden press conference

7, లోక కల్యాణ్‌ మార్గ్‌ , న్యూఢిల్లీ నుంచి వర్తమానం ! ప్రధాని నరేంద్రమోడీ మాడ్లాడతారు మీడియా వారంతా రండి అన్నది దాని సారాంశం.

ఇంకే ముంది ఢిల్లీ, శివార్లలోని గురుగ్రామ్‌ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లి పోయిన మీడియా సంస్ధలలో ఎవరు కనిపించినా సరే ఎదుటి వారిని పట్టుకొని గిల్లటం, తమను గిల్లమని కోరటం. ఆడామగా తేడా లేదు,ఎడిటర్‌ నుంచి సబ్‌ ఎడిటర్‌ వరకు, సాధారణ రిపోర్టర్‌ నుంచి బ్యూరో చీఫ్‌ల వరకు ఎవరిని చూసినా అరిచేతుల్లో, ఎక్కడ చూసినా గిచ్చుళ్లతో ఎర్రగా కంది పోయి వున్నాయి. చివరకు ఎన్నడూ లేనిది అటెండరు నుంచి ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వరకు ఈ సమాచారంతో అందరూ విస్తుపోతున్నారు. అది ఆఫీసులకే పరిమితం కాలేదు, ఎవరైనా తమను ఆటపట్టించేందుకు అలా చేశారేమో అని ప్రతి ఒక్కరూ రెండు మూడు కార్యాలయాలకు ఫోన్లు చేసి నిర్ధారించుకుంటున్నారు. పట్టించుకోని వారెవరంటే పెయిడ్‌ న్యూస్‌, ఆర్టికల్స్‌ రాసే వారే బిజీగా వున్నారు. ప్రకటనల విభాగం, మేనేజిమెంట్‌ ఇచ్చిన సూచనల మేరకు వారంతా అనుకూల కధనాలను రాయటంలో బిజీగా వున్నారు. నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెడితేనేం పెట్టకపోతేనేం, మన పని మనకు తప్పదు కదా అని వారంతా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పూనుకున్నారు. పెయిడ్‌ న్యూసైనా, వ్యాసాలైనా స్వంత అభిప్రాయాల్లా వుండకపోతే ఫిర్యాదులొస్తాయని యాజమాన్యాలు హెచ్చరిస్తాయి కదా !

రెండు విడతల ఎన్నికలు చూసిన తరువాత మోడీ గాలి సూచనలు ఎక్కడా కనిపించకపోవటంతో సీనియర్‌ ఎడిటర్లందరూ మనం ఇక అటుతిప్పి ఇటు తిప్పి కష్టపడి విశ్లేషణలు రాయాల్సిన అవసరం లేదని తాపీగా వున్నారు. అలాంటి వారందరిలో ఒకటే ఆలోచన. ఏమై వుంటుంది? ఏమి జరిగి వుంటుంది. ఏమిటీ విపరీతం . పరిపరి విధాలా ఒకటే ఆలోచన, పట్టపగలే బాటిల్స్‌ మీద బాటిల్స్‌ ఖాళీ అవుతున్నాయి తప్ప మీడియాతో మాట్లాడాలని మోడీ ఎందుకు నిర్ణయించుకున్నారో ఎవరూ నిర్ధారణకు రాలేకపోతున్నారు. మోడీ మారు మనస్సు పుచ్చుకున్నారా? దేవతలెవరైనా అర్ధరాత్రి కలలోకి వచ్చి చివరి రోజుల్లో అయినా నారాయణా అనిపించమని అమిత్‌ షాకు నిర్దేశించారా !

క్షణ క్షణానికీ వుత్కంఠ పెరిగిపోతోంది. ఒక్కో సంస్ధ నుంచి ఎంత మంది రావచ్చని ప్రధాని పత్రికా కార్యాలయానికి ఫోన్లు. దివాలా తీయించిన ప్రభుత్వ రంగ సంస్ధ మాదిరి ఐదేండ్లుగా మూతపడి వుండటం, ఎన్నడూ పలకరించని విలేకర్లు మాట్లాడుతుండటంతో పరిమితంగా, పాడుబడిన ఇంట్లో బిక్కుబిక్కు మంటూ వుండే వారిలా వున్న సిబ్బందికి ఏం చెప్పాలో పాలుపోలేదు. మాక్కూడా ఆహ్వానాలు వచ్చాయి, నిజమేనా అని వుర్దూ, కాశ్మీరీ పత్రికల విలేకర్ల ప్రత్యేక విచారణలు. విలేకర్లకు, కార్యాలయ అధికారులు, సిబ్బందికి ఐదేండ్లుగా సంబంధాలు లేవు. అందువలన ఎవరెవరో తెలియదు, ఫోన్లు చేస్తున్నవారు విలేకరులా లేక మరెవరైనా అని అడుగడుగునా అనుమానాలు. కొద్ది సేపటి తరువాత ఒక్కో మీడియా సంస్ధనుంచి ఎందరైనా రావచ్చు, ఏర్పాట్లకు గాను ఎందరు వచ్చేది ఒక ఫోన్‌ నంబరుకు తెలియచేయమని కోరారు. దానికి ఎడతెగని ఫోన్లు రావటంతో లైను దొరక్క కొందరు నేరుగా కార్యాలయానికి వచ్చారు. ఐదేండ్ల కాలంలో అనేక మంది కొత్త విలేకర్లు వుద్యోగాల్లోకి రావటంతో చాలా మందికి కార్యాలయ చిరునామా కూడా తెలియలేదు. జిపిఎస్‌ సాయంతో వచ్చేసరికి కొండవీటి చాంతాడంత పొడవున క్యూ. అప్పటికే పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు వచ్చాయి. లేకపోతే విలేకర్లు అదుపులోకి వచ్చేట్లు లేరు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ తన తొలి పత్రికా గోష్టికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయలేదు.అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అంటే ఇదే అని బిజెపి లీకు వీరులు వూదరగొడుతున్నారు.

మరోవైపున పన్నెండెకరాల విస్తీర్ణంలో వున్న ప్రధాని నివాసం. కొంత మంది అధికారులు, పని వారు తప్ప మిగిలిన వారెవరూ గత ఐదు సంవత్సరాలుగా అటు అడుగు పెట్టలేదు. కాపురం చేసే ఇల్లయితే కదా ! అలాంటిది పదులకొద్దీ ట్రక్కుల్లో షామియానాలు, ఇతర సామాన్లు దిగుతున్నాయి.అవన్నీ విలేకర్ల సమావేశానికి అవసరమైన ఏర్పాట్ల కోసమట. అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియా వారు వుంటారు గనుక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎవరికి నచ్చిన వంటకాలకోసం వారికి ప్రత్యేకంగా వంటవారిని అప్పటికే పిలిపించారు. ఆయా రాష్ట్రాల భవన్లలోని కాంటీన్లు మూసి వేయించి వంటవారిని ఇక్కడకు తరలించారు. మోడీ పత్రికా గోష్టా మజాకానా !

ఇంకోవైపున ప్రతి మీడియా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాట్లు చేశారు. ప్రశ్నలు అడగటానికి ఎంత మందికి అవకాశం వస్తుంది, ఎన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఒక వేళ అడగాల్సి వస్తే ఏమి అడగాలి, ఎవరు అడగాలి, సంస్ధ ప్రతిష్టను పెంచే ప్రశ్నలు కొన్నింటిని తయారు చేయాలని నిర్ణయించారు. మొత్తానికి యావత్‌ మీడియాకు ఇదొక కొత్త పరిస్ధితి. తొలిసారిగా భారత ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రతి వారూ తమ కొత్త అనుభవం ఎలా వుంటుందో అనుకొనే శోభనపు దంపతుల్లా వున్నారు. మధ్య మధ్యలో తుళ్లి పడుతున్నారు. ఎలాగైతేనేం మొత్తానికి సీనియారిటీని బట్టి సంపాదకులు, తరువాత వరుసగా ఎవరెవరు అడగాలో నిర్ణయించుకున్నారు. కొన్ని చోట్ల అయితే నమూనా మీడియా గోష్టి నిర్ణయించారు.

ప్రధాని నరేంద్రమోడీ మీడియా సమావేశ సమయం దగ్గర పడుతోంది. కొందరైతే రెండు మూడు గంటల నుంచి అక్కడే తారట్లాడుతున్నారు. గేటు తీయగానే పొలో మంటూ పరుగులు తీశారు. తోపులాటలు, నెట్టుకోవటాలు, కెమెరాలు, ఫోన్లు, కళ్ల జోళ్లు కిందపడటాలు, చొక్కాలు, కోట్లు నలగటాలు, ఆడవాళ్లని కూడా చూడరా ఇదేం వరస అంటూ శాపనార్ధాలు. జర్నలిజంలో ఓనమాలు తెలియని వారి హడావుడే ఎక్కువగా వుందని సీనియర్ల పెదవి విరుపు. మొత్తానికి వేసిన వేలాది కుర్చీలు నిండిపోయాయి. అమిత్‌ షా గడ్డం సవరించుకుంటూ మెల్లగా వచ్చి ప్రధాని అత్యవసరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడుతున్నారు. ఈ లోగా అందరూ స్నాక్స్‌, టీ తీసుకుందాం రండి అంటూ తానే ముందుగా దారి తీయటంతో మీడియా వారంతా అటువైపు పరుగులు తీశారు. వెనుక బడితే తమ సీట్లు గల్లంతై వెనుక కూర్చోవాల్సి వస్తుందని ఎవరికి వారు కంగారు పడుతున్నారు. కొందరు తమ టీ తమమీదే ఒలకపోసుకుంటే మరికొందరు పక్కవారి మీద పోశారు. కొద్ది సేపటికి తిరిగి అందరూ వచ్చారు. నరేంద్రమోడీ గారు కొత్త కోటును సవరించుకుంటూ మిత్రోం అంటూ పలకరింపుగా అందరి వైపు చూశారు. ఆ మాత్రానికే కొందరు తమ జన్మ ధన్యమైందన్నట్లుగా పులకించిపోయారు.

ఇంతలో ఒక అధికారి వచ్చి ఒకరి తరువాత ఒకరు ఒక్కొక్క ప్రశ్న మాత్రమే అడగాలి, వచ్చిన వారందరికీ అవకాశం వుంటుందని ప్రకటించారు. దాంతో ప్రతి వారికీ అవకాశం వస్తుందన్న భరోసా వచ్చింది కనుక అందరూ తాపీగా వున్నారు. ముందు అందరూ ప్రశ్నలు అడగండి, ఒక ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతారు గనుక ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన ప్రధాని ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పటం కాకుండా ఒకే తరహా ప్రశ్నలన్నింటికీ తీరిగ్గా సమాధానం చెబుతారు, తరువాత వివరణ అడిగే అవకాశం కూడా వుంటుంది అని మరో అధికారి ప్రకటించారు.

భారత ప్రధాని ఐదు సంవత్సరాల తరువాత తొలిసారిగా నోరు విప్పుతున్నారంటే సహజంగానే అంతర్జాతీయ మీడియా సంస్ధలకు సైతం ఆసక్తి లేకుండా ఎలా వుంటుంది. పిల్లి గడ్డాల వారు, పొట్టి లాగుల వారు, పలు రంగుల వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొత్తం మీద న్యూఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సమావేశాలకు కూడా ఇంతగా విలేకర్లు పోటెత్తి వుండరు. ఢిల్లీ గల్లీ నుంచి వాషింగ్టన్‌ డిసి వరకు చైనా మాంజాల నుంచి అమెరికా చికెన్‌ దిగుమతుల వరకు ప్రపంచవ్యాపితంగా వున్న సమస్యలన్నింటినీ విలేకర్లు ఏకరువు పెట్టి దాని మీద ప్రధాని అభిప్రాయం చెప్పాలని కోరారు. ముందే హామీ ఇచ్చినట్లుగా అందరికీ అవకాశం ఇవ్వటంతో ఒకే ప్రశ్న అయినా చాంతాడంత పొడవున సాగదీసి అడగటంతో సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన కార్యక్రమం అర్దరాత్రి పన్నెండు కొట్టేదాకా సాగింది.

టీవీ ఛానల్స్‌కు ఇబ్బంది లేదు ఏదో ఒక చెత్త, చెప్పిందే చెప్పటం, చూపిందే చూపే సోది కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పత్రికలన్నీ ఎడిషన్లను కొద్ది గంటల పాటు వాయిదా వేసి ఆలశ్యమైనా పాఠకులకు ప్రధాని తాజా సందేశం అందించాలని నిర్ణయించాయి. కొందరైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఏజంట్లందరికీ పత్రికల కట్టలు ఎలా వస్తాయో ముందే తెలియచేశారు. అప్పటికే అరడజను సార్లు ఇంట్లోకి బయటకు తిరిగిన నరేంద్రమోడీ, అమిత్‌ షాలు పన్నెండు దాటగానే కొత్త దుస్తులు వేసుకొని వచ్చారు. క్రికెట్‌ స్డేడియంలో ఫ్లడ్‌ లైట్ల మాదిరి అంబానీ కంపెనీ నుంచి వచ్చిన లైటింగ్‌ అదిరి పోతోంది.ఇంతలో అదానీ కంపెనీ ప్రతినిధి వచ్చి విలేకర్లందరికీ తమ కంపెనీ ప్రత్యేక డిన్నర్‌ ఏర్పాటు చేసిందని, అందరూ ఆరగించి వెళ్లాలని సవినయంగా ఆహ్వానం పలికి వెళ్లారు.

నరేంద్రమోడీ ప్రత్యేక వేదిక వద్దకు వచ్చేందుకు వుద్యుక్తులై ఒక్కసారి అమిత్‌ షావైపు చూశారు. పదండి అంటూ షా ముసి ముసి నవ్వులు నవ్వారు. ఒక్కసారి నిశ్బబ్దం. అందునా అర్ధరాత్రి కావటంతో చీమ చిటుక్కుమన్నా వినిపించేట్లుగా వుంది. నరేంద్రమోడీ మాట్లాడబోతున్నారగానే యధావిధిగా టీవీ ఛానల్స్‌ కెమెరాల వారు తోపులాట ప్రారంభించారు. వెనుక కూర్చున్న ప్రింట్‌ మీడియా జర్నలిస్టులకు అడ్డంగా నిల్చున్నారు. ఇక్కడ కూడా మీ తీరు మారదా అంటూ వారు విసుక్కుంటున్నారు.

Image result for how narendra modi beats journalists in his maiden press conference

ఇంతలో నరేంద్రమోడీ గారు అటూ ఇటూ చూసి మిత్రోం మీరు ఎన్నో విలువైన, తెలివైన ప్రశ్నలు వేశారు. వాటిన్నింటికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే అదేమంటే మీరు లేవనెత్తిన అంశాలన్నింటికీ కారకుడు జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కుటుంబ వారసత్వం. అంటూ ముగించి కూర్చున్నారు. అది విన్న సీనియర్‌ జర్నలిస్టులు కొందరు కుర్చీల్లోనే మూర్ఛపోయారు. కొందరు పక్కవారి కుర్చీల మీద పడిపోయారు. కొందరు తలగోక్కున్నారు, కొందరు జుట్టుపీక్కున్నారు, వెనుకా ముందూ, కిందాపైనా చూసుకున్నారు. కొందరు కేకలు వేయబోయారు, కొందరు ఏడుపు లంకించుకున్నారు, కొందరు పిచ్చినవ్వులు నవ్వుతున్నారు. చిత్రం ఏమిటంటే టీవీ చర్చల్లో అందరి మీదా ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి ప్రధాని, అమిత్‌ షాలకు దగ్గరగా ముందు వరుసలో విధేయుడైన సేవకుడి మాదిరిగా నడుము, తలా వంచుకుని తాపీగా కూర్చున్నాడు, మధ్యమధ్యలో అమిత్‌ షా, ప్రధాని వైపు చూసి చిరునవ్వులు నవ్వుతున్నాడు. ఈలోగా ఇంకేమైనా అడిగేది వుందా సమావేశం ముగిద్దామా అని మరొక అధికారి ఎంతో వినమ్రంగా అడిగాడు. ఈ లోగా షాక్‌ నుంచి తేరుకున్న కొందరు వివరణలు అడగటం ప్రారంభించారు. తిరిగి ప్రధాని లేవగానే మరోసారి నిశ్శబ్దం. మరోసారి చెబుతున్నా దేశ సమస్యలన్నింటికీ కారణం నెహ్రూ, ఆయన కుటుంబ వారసత్వమే. ఏం అమిత్‌ షా అంటూ అటు తిరిగారు.

ఆయన అంతేగా మరి అంటూ తాను కూడా లేస్తూ గడ్డాన్ని సవరించుకున్నాడు. సిబ్బంది వెంటనే వారికి దారి సుగమం చేశారు. ఇంతలో ఏమిటా కలవరింతలు, ఏమిటా పిచ్చినవ్వులు అంటూ మా ఆవిడ ఒక్కటివ్వటంతో నా మధ్యాహ్ననిద్ర భంగమైంది. ఎన్నికలప్పుడే ఇల్లు ప్రశాంతంగా వుంది, ఇప్పుడు ఈ పగటి నిద్రలేమిటో, కలవరింతలేమిటో చిరాకు పుట్టిస్తున్నారు అంటూ కసురుకుంటోంది. ఇంటి పట్టున వుండని జర్నలిస్టులెవరైనా ఎప్పుడైనా ఇంట్లో వుంటే అంతేగా మరి !

సత్య

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామాన్యులే కాదు, కార్పొరేట్ల సంపాదనా తగ్గింది!

12 Friday Apr 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Commoners, India elections 2019, India Inc's earnings, Modi era

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ తొలి రోజుల్లో విమానాల్లో విహరించి గత ప్రధానుల రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పారు. విదేశాల వారికి మన పేదరికం లేదా పిసినారితనం ఎక్కడ కనపడుతోందో అని దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రతిపక్షాల విమర్శలను కూడా దిగమించి ఖరీదైన సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగారు, విదేశీ అతిధులు వచ్చినపుడు వారితో సమంగా వ్యవహరించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ, మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా విదేశీయులు మన దగ్గర వస్తువులన తయారు చేయించుకొనేందుకు ఎగబడే విధంగా చేయటం కోసమే అని బిజెపి నేతలందరూ సమర్ధించారు. ఐదేండ్ల పాలన తరువాత అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్‌ సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక వార్తను విడుదల చేసింది.

అసాధ్యం అనుకున్న వాటిని అయిదేండ్లలో సుసాధ్యం చేశానని ఎన్నికల ప్రచారంలో వూరూ వాడా ప్రచారం చేస్తున్నారు. తాను తీసుకున్న చర్యలన్నీ దేశంలో వర్తక,వాణిజ్యాలు, పరిశ్రమల అభివృద్ధి కోసమే అని తద్వారా వుపాధి పెరుగుతుందని నరేంద్రమోడీ నాయకత్వం చెబితే జనం ఎలాంటి శషభిషలు లేకుండా నమ్మారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం రోజుల తరబడి తమ సొమ్మును తామే తీసుకొనేందుకు బ్యాంకుల ముందు రోజుల తరబడి నిలబడి ప్రదర్శించిన దేశ భక్తిని చూశాము. రాష్ట్రాల అమ్మకపు పన్ను అధికారాన్ని తొలగించి జిఎస్‌టి అంటే దానికీ సై అన్నారు. అయితే రాయిటర్స్‌ వార్త సారాంశం ఏమంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న వాణిజ్య అనుకూల అజెండా ఎక్కువ కార్పొరేట్‌ సంస్ధల లాభాల పెరుగుదల ప్రతిబింబించటంలో విఫలమైంది. అయినా మదుపుదారుల్లో ఇంకా ఆశచావలేదు. వడ్డీ రేట్లు గణనీయంగా పడిపోయాయి. చిన్న మదుపుదార్లకు అవకాశాలు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ముందుకు వస్తున్నారు, మాడీ మార్కెట్లను వుత్సాహంతో వుంచారు అని అలాట్‌ మెంట్‌ కాపిటల్‌ అధికారి కృష్‌ సుబ్రమణ్యం చెప్పారు.

మోడీ తిరిగి ప్రధానిగా వస్తారనే ఆశలతో విదేశీ మదుపుదారులు వుత్సాహంతో వున్నారు.గతేడాది జనవరి-మార్చినెలల్లో 4.4బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితే ఈ ఏడాది ఆ మొత్తం 6.7బిలియన్లకు పెరిగింది. మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిఫ్టీ 63శాతం పెరిగితే ఈ ఏడాది ఇంతవరకు ఏడు శాతం పెరిగింది. స్వల్ప మెజారిటీతో బిజెపి తిరిగి అధికారానికి వస్తుందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఒక వేళ మోడీ తిరిగి రాకపోతే కొంత మేర నీరసం ఆవహిస్తుందని యుబిఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ ఛోఛోరియా అన్నారు. ఆర్జన లేకుండానే స్టాక్‌ మార్కెట్‌ పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 399 కంపెనీల వివరాలను విశ్లేషించినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఐదేండ్ల పాలనలో ఒక ఏడాది పడిపోతే మోడీ హయాంలో ఐదేండ్లలో నాలుగేండ్లు పడిపోయాయి.

రీఫినిటివ్‌ అనే సంస్ధ సేకరించిన సమచారాన్ని విశ్లేషిస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా 11.94% ఆర్జన పెరగ్గా మోడీ హయాంలో అది 3.72%కు పడిపోయింది.పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరుగుదలను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో నిప్టీ 500 సూచిక కంపెనీల లాభం జిడిపిలో 2.8శాతం వుందని అది గత పదిహేను సంవత్సరాలలో కనిష్టమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. 2014లో మోడీ అధికారంలోకి రాగానే భారత ఆర్ధిక రూపురేఖలనే మార్చివేస్తారన్న ఆశాభావం వుండేది, అయితే ఆశించిన వేగంగా అభివృద్ధి లేకపోయినప్పటికీ సంస్కరణలు తమకు ప్రయోజనం చేకూర్చుతాయని పెట్టుబడిదారులు ఇంకా ఆశాభావంతో వున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు కారణంగా సాంప్రదాయకంగా రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్లకు బదులు మదుపుదారులు స్టాక్‌ మార్కెట్‌కు మళ్లారు. మోడీ హయాంలో నిఫ్టీ 75శాతం పెరిగింది. అయితే అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలో ప్రతి ఐదేండ్లకు ఆ పెరుగుదల వందశాతం చొప్పున వుంది. అంటే మోడీ పాలన ఈ విషయంలో కూడా వెనుకపడే వుంది.

గతం కంటే ఆర్జన తక్కువగా వున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ సూచిక పెరిగింది అంటే దాని అర్ధం కంపెనీల విలువలు ఎక్కువగా వుండటమే. స్టాక్‌ మార్కెట్‌ పరిభాషలో నిఫ్టీ 500 సూచిక కంపెనీలలో సగటు పియి గత ఐదు సంవత్సరాలలో 18 వుంది. అదే అంతకు ముందు ప్రభుత్వ హయాంలో 14.22 మాత్రమే. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు.ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక రూపాయి ఆర్జించాలనుకుంటే గత ఐదు సంవత్సరాలలో 18 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే అంతకు ముందు రూ. 14.22 మాత్రమే పెట్టారు. ఏది లాభమో వేరే చెప్పనవసరం లేదు.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించటం ఎన్నికల ముందు బిజెపికి ఒక ఎదురుదెబ్బ అనవచ్చు.పాకిస్ధాన్‌ అభివృద్ధి రేటును తగ్గించటం కొన్ని రాజకీయ పక్షాలకు వూరట కలిగిస్తే, ఇదే సమయంలో చైనా వృద్ధి రేటు పెంచటం మింగుడు పడని విషయం అనవచ్చు. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన అభివృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న.

ఇక మన దేశంలో అనేక మంది అభివృద్ధి విషయంలో చైనా కంటే మనం ముందున్నామని పోల్చుకుంటారు. కానీ మిగతా విషయాలకు వచ్చే సరికి అబ్బే అది కమ్యూనిస్టు నియంతృత్వం మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం, దానికి దీనికి పోలిక పెట్టకూడదంటారు. ఈ ఏడాది దాని అభివృద్ధి 6.2 నుంచి 6.3శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. డిసెంబరులో 4.9శాతంగా వున్న నిరుద్యోగ రేటు జనవరిలో 5.3శాతానికి పెరిగింది. అభివృద్ధి రేటు పెరగనున్నందున నిరుద్యోగశాతం తగ్గనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d