• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

Central Government announced  Special Assistance To Andhra Pradesh 

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP crisis, ap special status, Central government, Special Assistance To Andhra Pradesh

1 The Central Government is committed to help and assist the newly created State of Andhra Pradesh. The commitments of the Centre emanate from four basic documents, namely, the provisions of the Andhra Pradesh Reorganisation Act, 2014, the report of the Fourteenth Finance Commission, the statement of the then Prime Minister before the Parliament on 20.2.2014 and the Report dated 1.12.2015 of Vice Chairman, NITI Aayog on Developmental Support to the Successor State of Andhra Pradesh under the Andhra Pradesh Reorganisation Act 2014.

2. The above mentioned commitments are broadly categorized as under:-

(i) The Andhra Pradesh Reorganisation Act:

(a) Section 46 of the Act provides for a reference to be made to the Fourteenth Finance Commission to take into account the resources available to the Successor States and make separate awards to them. It further provides for a developmental package to be given to the backward areas of the State of Andhra Pradesh. It also provides for adequate incentives in particular for Rayalaseema and north coastal regions of the State.

(b) Section 90 of the Act declares the Polavaram Irrigation Project as a National Project.

(c) Under Section 93 of the Act, the details of institutions and infrastructure to be developed in the State are outlined in the Thirteenth Schedule to the Act.

(d) Section 94 of the Act provides for appropriate fiscal measures, including offer of tax incentives, to be given to the Successor States to promote industrialization and economic growth. It further provides for support to programmes for backward areas including physical and social infrastructure. In addition, it provides for giving special financial support for creation of essential facilities in the new capital of the successor State of Andhra Pradesh, including the Raj Bhawan, High Court, Government Secretariat, Legislative 2 Assembly, Legislative Council and such other essential infrastructure.

(ii) Statement of the then Prime Minister Dr. Manmohan Singh on 20.2.2014: The then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 stated before the Rajya Sabha that Special Category Status would be extended to the State of Andhra Pradesh for a period of five years. This would be done to put the State’s finances on a firmer footing. He further stated that the resource gap for the year 2014-15 would be compensated by the Central Government.

(iii) Fourteenth Finance Commission: The Fourteenth Finance Commission defined the financial relationship between Centre and the States for the five year period ending 2019-20. The Commission did not make a distinction between Special and General Category States. Its approach was to fill the resource gap of each State to the extent possible through tax devolution. Accordingly, the Commission recommended an enhanced devolution of 42% of the Central Government’s tax revenues to States. If devolution alone could not cover the assessed gap, for certain States, a revenue deficit grant was provided. Andhra Pradesh was one of the States determined to be a revenue deficit State, and the Commission recommended that the Centre would provide revenue deficit grant for the period of the Fourteenth Finance Commission. The amount of deficit for each year was mentioned in the report itself and a total of Rs.22,113 crores is to be paid to Andhra Pradesh as revenue deficit grant for the 5 year period.

(iv) Report on Developmental Support to Andhra Pradesh dated 1.12.2015: The Vice Chairman, NITI Aayog Dr. Arvind Panagariya studied various aspects of the support to be given to Andhra Pradesh under the Reorganisation Act and made recommendations regarding effective implementation.

3 The Central Government’s commitments to the State of Andhra Pradesh

. Under the Andhra Pradesh Reorganisation Act, the commitment for the resource gap for the year 2014-15 is being met on the basis of standardized expenditure for that year. The revenue gap has been tentatively quantified subject to further adjustment on account of figures relating to certain pension schemes. A part of the revenue gap compensation amounting to Rs.3,979.5 crore has already been paid and the balance is being paid in annual instalments.

An amount of Rs.2,500 crore has already been paid as support for creation of new capital of State of Andhra Pradesh and a balance of Rs.1,000 crore would be paid in due course. An amount of Rs.1,050 crore has been disbursed as special package for backward areas and a further amount of Rs.1,050 crore would be paid in the coming years.

4. The Polavaram Project is on the river Godavari near Ramayyapeta village of Polavaram mandal, about 42 km upstream of Sir Arthur Cotton Barrage in the State of Andhra Pradesh. It envisages construction of a dam and canal system to create ultimate irrigation potential of 2,91,000 ha. (7.2 lakh acres), generation of 960 MW of hydro power, drinking water supply to a population of 28.50 lakh in 540 villages and diversion of 80 TMC of water to Krishna river basin. The project was accorded investment clearance by the Planning Commission for Rs.10,151.04 crore (at 2005-06 price level) in 2009. Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price level as Rs.16,010.45 crore during January, 2011 including power and drinking water component of Rs.2868 crore. Prior to the passage of the AP Reorganisation Act, the Polavaram Project was being implemented by the Government of Andhra Pradesh with Central Assistance under the Accelerated Irrigation Benefits Programme (AIBP). An expenditure of Rs.5,135.87 crore had been incurred up to 31.3. 2014 including Central Assistance of Rs.562.469 crore.

The Central Government will fund the Polavaram Irrigation Project in the following manner:

(i) It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1.4.2014, to the extent of the cost of the irrigation component on that date.

(ii) In view of the recommendations of the Vice Chairman NITI Aayog that it will be appropriate for the State of Andhra Pradesh to execute this project (as it is an important project and the State Government is keen to complete it at the earliest), the Government of India has agreed to the State’s request for the execution of the project by the State Government on behalf of the Government of India.

5. Government of India has already legislated for fiscal incentives of enhanced investment allowance and accelerated depreciation. They will come into effect once notified, after the State of Andhra Pradesh identifies the eligible backward areas.

6. In respect of educational and other institutions:  A Petroleum University has already been established.

 The IIT has already been functioning from a transit campus and the main campus is being constructed.

 The National Institute of Technology has already been functioning since September 2015 in a temporary campus and its main campus is being constructed.

 The Indian Institute of Information Technology, Kurnool has already started functioning from the temporary campus and would start functioning and its main campus is being constructed.

 The site for the Central University in Anantapur district has already been selected. 5  The Indian Institute of Science Education and Research has been established in Tirupati.

 The Indian Institute of Management has been established at Visakhapatnam.

 An All India Institute of Medical Sciences has been approved at Guntur and the land for the same is being taken over.

 A Tribal University is to be established in the State of Andhra Pradesh for which a Site Selection Committee of the State has already approved the land.

 A National Institute of Disaster Management is being established in the State of Andhra Pradesh for which identification and takeover of the land is being completed.

7.(i) The Cabinet Committee on Economic Affairs has given in-principle approval for the establishment of a major port at Dugarajapatnam in Andhra Pradesh on PPP basis, subject to feasibility.

(ii) Proposals with regard to the Steel Authority of India, Indian Oil Corporation/HPCL to set up units in Andhra Pradesh are being examined as provided in the Reorganisation Act.

(iii) Regarding airports:  In Vishakhapatnam, international flights are already operating. For further expansion, land has been identified at Bhogapuram. The State is to acquire and hand over land for development by AAI as per the standard terms for such development or develop on its own by PPP. A techno economic feasibility report is to be undertaken by State Government.  For Vijayawada, MoU has been signed by AAI with Govt. of Andhra Pradesh to develop the existing terminal. The State is to 6 acquire 698 acres of land required for the expansion as per the standard terms.  For Tirupati, the new terminal was inaugurated by the Prime Minister on 22.10.2015. A new apron for parking for 3 aircraft has been completed. The existing runway, apron and terminal building are adequate for commencing international flights. Expansion of new apron for parking additional 4 aircraft and isolation bay is under construction within the available land.

(iv) The National Highway Authority of India has taken several steps for establishment of the National Highways in the State of Andhra Pradesh. The Railways is considering measures for establishing a rapid rail and road connectivity between the new proposed capital of Andhra Pradesh with Hyderabad and other cities in the region. The Government of India is actively considering proposals for the establishment of the Metro Rail in Visakhapatnam and VijayawadaGuntur-Tenali urban area.

8. The Fourteenth Finance Commission’s award came into effect from 1.4.2015. The enhanced devolution amount due to Andhra Pradesh is being paid in entirety. This has resulted in an increase of Rs.7,787 crore in tax devolution in 2015-16 compared to 2014-15, a growth of 55%. The revenue deficit grants for each of the years recommended by the Fourteenth Finance Commission will also be paid by the Government of India to the State of Andhra Pradesh. The same has been done for the year 2015-16 and 2016-17. There are no issues pending on that score.

9. The Government of India is thus honouring and shall honour all commitments made under the Andhra Pradesh Reorganisation Act.

10. The statement of the then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 contains six paragraphs. There are no issues with regard to five out of the six paragraphs. With regard to the first point i.e. the grant of special status, an apparent conflict has set in, between the statement and the recommendations of the Fourteenth Finance Commission which came subsequently. On page 17 (para 2.29 & 2.30) of the Report, the Commission has stated (inter alia):

“We did not make a distinction between special and general category states in determining our norms and recommendations…… In our assessment of State resources, we have taken into account the disabilities arising from constraints unique to each State to arrive at the expenditure requirements. In this regard, we have observed that the North-eastern and hill States have several unique features that have a bearing on their fiscal resources and expenditure needs, such as low level of economic activity, remoteness and international borders. Our objective has been to fill the resource gaps of each State to the extent possible through tax devolution. However, we have provided post-devolution revenue deficit grants for States where devolution alone could not cover the assessed gap……

We are of the view that intra-state inequality is within the policy jurisdiction of the States and provisioning of adequate resources through tax devolution should enable them to address intra-state inequalities in an effective manner.”

Thus following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the Central Government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for five years, which would make up for the additional Central share the State might have received during these years, i.e. 2015-16 to 2019-20, as envisaged in the then Prime Minister’s statement dated 20.2.2014. This will be in the form of Central Government funding for externally aided projects for the state for Andhra Pradesh signed and disbursed during these years.

11. Thus the Government of India has effectively addressed all commitments made to the State of Andhra Pradesh in the Andhra Pradesh Reorganisation Act, the Fourteenth Finance Commission and the statement of the then Prime Minister on 20.2.2014.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మొనా లిసా నవ్వు -ప్రధాని నరేంద్రమోడీ మొసలి కన్నీరు

10 Wednesday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

attacks on dalits, BJP, cow, cow slaughter, Cow Vigilante Groups, crocodile tears, Dalit, Narendra Modi, narendra modi crocodile tears, pink revalution, RSS

ఎం కోటేశ్వరరావు

    ప్రఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మొనా లిసా ‘ నవ్విందా లేదా అన్నది ఆ చిత్రం గీచిన గత ఐదు వందల సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే వుంది. బహుశా ఏ చిత్రం గురించి అన్ని కధనాలు, విశ్లేషణలు వెలువడి వుండవు. ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పటం గురించి కూడా ఇలాగే అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా గోరక్షకులు-దళితులపై దాడుల గురించి నరేంద్రమోడీ బహిరంగ వేదికలపై నోరు విప్పారు. ఆయన దళితులపై దాడులను ఖండించారా ? లేక గోరక్షకులు పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారా , కావాలంటే నన్ను కాల్చండి అంటూ వారిని వేడుకున్నారు తప్ప అలాంటి వారిపై గట్టిగా చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పలేకపోయారు, ఆ వ్యాఖ్యల ద్వారా ప్రధాని ఎలాంటి సందేశం ఇస్తున్నారు అన్నది చర్చగా మారింది.

    ఎవరి అర్ధం వారు చెబుతున్నారు. ఆవులు-దళితులు- నరేంద్రమోడీ, మధ్యలో మొసలి చేరింది. దళితులపై దాడుల పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. బిఎస్‌పి నాయకురాలు మాయావతి దళితులపై దాడుల గురించి అదే పని చేస్తున్నారని బిజెపి ధ్వజమెత్తింది,గుజరాత్‌లో దళితులపై దాడుల గురించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనవసరగా మొసలి కన్నీరు కార్చవద్దని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన గురించి కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తున్నదని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇలా ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు నిజంగా మొసలి కన్నీరు కారుస్తుందా, కారిస్తే ఎందుకు ? అది నరేంద్రమోడీ, బిజెపి నేతలకు వర్తిస్తుందా ?

   మొసలి కన్నీటి గురించి ఆరువందల సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రస్తావన వస్తోంది. దీని గురించి అనేక మంది అనేక విషయాలు చెబుతూనే వున్నారు. మొసలి కన్నీరు కార్చటం తన కోసం తప్ప ఇతరుల కోసం కాదన్నది చాలా మంది ఏకీభవిస్తున్న విషయం. వుభయ చర జీవులలో ఒకటైన మొసలి నీటిలో వున్నపుడు కన్నీరు కారుస్తుందో లేదో తెలియదు. అవసరం కూడా లేదు. బయటకు వచ్చినపుడు మాత్రం తన కళ్లను శుభ్రం చేసుకొనేందుకు కన్నీరు కారుస్తుంది తప్ప తనకు ఆహారంగా మారిన వాటి గురించి కాదని చెబుతారు.కానీ బయటకు చూసే వారికి మాత్రం అది ఎవరిపట్లనో విచారంతో కన్నీరు కారుస్తున్నట్లు కనిపిస్తుంది.స్వభావం, వాస్తవానికి విరుద్దంగా ఇతరులపై పైకి సానుభూతి వచనాలు పలికే వారిని అందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్నారు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ అయినా మరొకరి గురించి అయినా లేదా సంఘటనల గురించి అయినా వివిధ పార్టీలు చేసే వ్యాఖ్యలను పరిశీలించాల్సి వుంటుంది.

    గత లోక్‌సభ ఎన్నికలు, తరువాత జరిగిన బీహార్‌ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతల ప్రసంగాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. గత కొద్ది సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారమే గులాబి విప్లవం లేదా పింక్‌ రివల్యూషన్‌ గురించి ప్రచారం చేసి తమ ఓటు బ్యాంకును పెంచుకొనేందుకు ప్రయత్నించారనేందుకు అనేక దృష్టాంతాలు వున్నాయి. కేంద్రంలో అధికారానికి రాక ముందు చెప్పిన మాటలకు తరువాత ఆచరణే అందుకు సాక్ష్యం. ఆవు మాంసం, ఇతర మాంసాలకు తేడా లేకుండా మొత్తం ఆవు మాంసాన్ని ఎగుమతి చేసేందుకు కాంగ్రెస్‌ అనుమతి ఇచ్చిందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పశుమాంసం గులాబి రంగులో వుంటుంది కనుక గులాబి విప్లవం అని పేరు పెట్టారు. కాంగ్రెస్‌ అజెండాయే గులాబి విప్లవం అన్నారు. వుపన్యాసాలు ఎలా సాగాయో చూడండి ‘ మనం హరిత విప్లవం, శ్వేత విప్లవం(పాల విప్లవం) గురించి విన్నాం కానీ గులాబీ విప్లవం గురించి ఎప్పుడూ వినలేదు.దీని అర్ధం ఏమంటే పశువులను వధించటం, మీరు చూడవచ్చు మాంసం రంగు గులాబీ, వారు దానిని ఎగుమతి చేయటం ద్వారా విప్లవాన్ని తీసుకువచ్చేందుకు పూనుకున్నారు.మన ఆవులను వధిస్తారు లేదా వధించేందుకు విదేశాలకు పంపుతారు. మీరు మాకు ఓటేస్తే మేము ఆవులను చంపేందుకు అనుమతి ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోంది’ అని స్వయంగా నరేంద్రమోడీ వుపన్యాసాలు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనుక ఢిల్లీలో వుంటే గ్రామాల్లోని ఆవులు అంతరించి పోతాయన్నట్లుగా చిత్రించారు. బీహార్‌ ఎన్నికలలో ఏం చెప్పారు? ములాయం సింగ్‌, లాలూ ప్రసాద్‌ వంటి యదువంశీకులు, యాదవులు కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు అని ప్రశ్నిస్తూ ‘ గులాబి విప్లవం తీసుకురావాలని కోరుతున్న వారిని మీరు ఎలా సమర్ధిస్తారు అని నేను వారిని అడగదలచుకున్నాను, ఒక పశువును వధించినపుడు దాని మాంసం గులాబి రంగులో వుంటుంది దాన్నే గులాబి విప్లవం అంటున్నాము. ఒక గ్రామం తరువాత మరొక గ్రామంలో పశు సంపదను వధిస్తూ పోతూ వుంటే పశువులను అపహరించటం, వాటిని బంగ్లాదేశ్‌కు తరలించటం, దేశం మంతటా బడా పశువధ శాలలను తెరిచారు. కాంగ్రెస్‌ ఒక రైతుకు లేదా తన ఆవులను పెంచాలనుకొనే యాదవులకు సబ్సిడీ ఇవ్వదు, కానీ ఎవరైనా ఆవులను చంపేందుకు వధ శాలలు ప్రారంభిస్తే, పశువులను వధిస్తే మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి సబ్సిడీలు ఇస్తుంది’ ఇలా సాగాయి.

     అదే పెద్ద మనిషి ఇప్పుడు ఆవులు ఎక్కువగా చనిపోవటానికి అవి ప్లాస్టిక్‌ తినటమే అని కొత్త పల్లవి అందుకున్నారు. గుజరాత్‌లో చచ్చిన ఆవు చర్మం తీసిన దళితులపై దారుణంగా దాడి చేసిన వుదంతాలతో అక్కడి దళితులలో వెల్లడైన ఆగ్రహం, దాని ప్రభావం దేశమంతటా దళితులపై పడి నిరసన పెరుగుతున్న క్రమంలో నష్టనివారణ చర్యలలో భాగంగా నరేంద్రమోడీ, సంఘపరివార్‌ శక్తులు కొత్త పల్లవి అందుకున్నాయి.

      న్యూఢిల్లీలో జరిపిన టౌన్‌హాల్‌ సమావేశ ఆహ్వానితుల ఇష్టా గోష్టిలో మాట్లాడిన ప్రధాని వధశాలల్లో కంటే ఎక్కువగా ఆవులు ప్లాస్టిక్‌ తిని మరణిస్తున్నట్లు ఆవుల కాపలాదారులు గుర్తించాలని చెప్పారు. ‘నాకు నిజంగా కోపం తెప్పిస్తున్నదేమంటే కొందరు గో సంరక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది పగలు గోరక్షణ అంటారు రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు. డెబ్బయి నుంచి ఎనభై శాతం వరకు తప్పుడు పనులు చేస్తున్నట్లు తేలింది.సమాజం దీనిని అంగీకరించదు, తమ తప్పుడు పనులను కప్పిపుచ్చుకొనేందుకు వారు గోసంరక్షణ ముసుగు వేసుకుంటారు’ అన్నారు. స్వయం సేవకులు వున్నది సామాజిక సేవ చేయటానికి తప్ప జనాన్ని భయపెట్టటానికి, దుర్మార్గాన్ని ప్రదర్శించటానికి కాదు. వధశాలలలో కంటే ఆవులు ఎక్కువగా ప్లాస్టిక్‌ తిని మరణిస్తున్నాయి. పశు సేవ చేయదలచుకున్న వారు ఆవులను ప్లాస్టిక్‌ తినకుండా నిరోధించేందుకు ప్రయత్నించండి అని మోడీ సలహా ఇచ్చారు. హైదరాబాదు బిజెపి సభలో మాట్లాడుతూ ‘కావాలంటే నాపై దాడి చేయండి, నన్ను కాల్చండి అంతే కాని దళితులపై దాడులు చేయవద్దు. బిజెపి చేస్తున్న మంచి పనులను వారు గ్రహిస్తున్న విషయాన్ని గమనించి వారు తమ అదుపులో వున్నారని భావిస్తున్న కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని ఎన్నికలు, ఓటుబ్యాంకు భాష మాట్లాడారు.

    అసలు వాస్తవం ఏమిటి ? కాంగ్రెస్‌ విధానాలు దివాళాకోరు, ప్రజావ్యతిరేకమైనవి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అదే మాదిరి బిజెపి వాజ్‌పేయి నాయకత్వంలో వెలగబెట్టిన పాలనలో, ఇప్పుడు మోడీ హయాంలో కూడా ఆ విధానాల కొనసాగింపు తప్ప ప్రత్యామ్నాయ విధానాలు కాదు. అందువలన దొందూ దొందే. ప్రతి దాని నుంచి తన రాజకీయ విభాగం బిజెపికి ఓట్లు సంపాదించాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ నిరంతర లక్ష్యం, కృషి అన్నది అనేక మంది అభిప్రాయం. గొడ్డు మాంసం నుంచి కూడా ఓట్లు కొల్ల గొట్టేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. ‘గోమాత వధను ప్రోత్సహించే గులాబి విప్లవాన్ని తిరస్కరించాల్సిన సమసయం ఆసన్నమైంది’ అనే శీర్షికతో 2012 అగస్టు 9న నరేంద్రమోడీ కృష్ణుడి పుట్టిన రోజు జన్మాష్టమి సందర్భంగా తన బ్లాగులో ఒక సందేశమిచ్చారు. దానిలో కూడా గులాబి విప్లవాన్ని ప్రోత్సహించేందుకు యుపిఏ ప్రభుత్వం ఆవుల వధను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. గుజరాత్‌లో గోమాత రక్షణకు సకల చర్యలూ తీసుకున్నామని దానిలో భాగంగానే చివరకు గోవుల కళ్ల అపరేషన్లు కూడా చేయించామని పేర్కొన్నారు. అనుమానం వున్నవారు దిగువ లింక్‌ను చూడవచ్చు.http://www.narendramodi.in/janmashtami-%E2%80%93-the-protector-of-cows-lord-krishna%E2%80%99s-birthday-3070

   అలాంటి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏం జరుగుతోందో దిగువ లింక్‌లోని నివేదిక చూడండి. http://www.ers.usda.gov/media/2106598/ldpm-264-01.pdf

    మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో గొడ్డు మాంస ఎగుమతుల్లో మిగతా దేశాలను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. మన మాంసం ధర తక్కువ, ఇతర కారణాలు అందుకు దోహదం చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల బీఫ్‌(గొడ్డు మాంసం) వుత్పత్తి 2012లో 3,491 వేల టన్నుల నుంచి నరేంద్రమోడీ పాలనలో 2015 నాటికి 4,200 వేల టన్నులకు పెరిగింది. ఇదే సమయంలో మన అంతర్గత వినియోగం 2080 నుంచి 2200 వేల టన్నులకు, ఎగుమతులు 1411 నుంచి 2000 వేల టన్నులకు పెరిగాయి. ఎగుమతి చేసిందంతా దున్నలు, బర్రె మాంసమే. వుత్పత్తిలో దీని వాటా ఈ కాలంలోనే 77 నుంచి 82శాతానికి పెరిగింది. అందువలన ఆవులను వధిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు అనే ప్రచారం మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవటానికి తప్ప వేరు కాదు. గులాబీ విప్లవం నరేంద్రమోడీ హయాంలో పెరగటమే కాదు, రానున్న రోజులలో ‘మేకిన్‌ ఇండియా ‘ వూపుతో ఇంకా అభివృద్ధి చెందనుంది. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఆ నివేదికను రూపొందించింది కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్‌ పార్టీ కాదు, పక్కా అమెరికా, మోడీకి బ్రహ్మరధం పడుతున్నదేశం. దాని ప్రకారం మోడీ పదవి నుంచి దిగిపోయే 2019 నాటికి బీఫ్‌ ఎగుమతులు 2,408 వేల టన్నులకు, 2025 నాటికి 2,826 వేల టన్నులకు పెరుగుతాయని అంచనా వేసింది. అంటే మోడీ సర్కార్‌ కూడా సబ్సిడీలను కొనసాగిస్తుందనే అనుకోవాలి. పత్తి ఎగుమతి చేస్తే పన్నులు, మటన్‌,బీఫ్‌ ఎగుమతి చేస్తే సబ్సిడీలు ఇస్తున్న కాంగ్రెస్‌ అంటూ 2012లో ధ్వజమెత్తిన నరేంద్రమోడీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా అదిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎగుమతులు, వుత్పత్తి ఎందుకు పెరగనిచ్చినట్లు ? బీఫ్‌ ఎగుమతుల సబ్సిడీని రద్దు చేసి పత్తి ఎగుమతులకు సబ్సిడీ ఇచ్చి రైతులకు మెరుగైన ధరలు ఎందుకు ఇప్పించలేకపోయారు?

     https://youtu.be/Mj0_jYfGWTc  ఈ లింక్‌ ద్వారా నరేంద్రమోడీ నాలుగేండ్ల నాడు ఏం చెప్పారో చూడండి.

    తమ పండుగల సందర్బంగా మటన్‌, బీఫ్‌ను నిషేధించాలని గతేడాది జైన సంఘాలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాము నడిచే నేల మీద కంటికి కనపడని జీవులు కూడా తమ పాదాల కింద నలిగి చనిపోకూడదని జైనులు నేలను వూడుస్తూ నడవటం తెలిసిందే.తన కున్న జైన స్నేహితులలో కొందరు బీఫ్‌ ఎగుమతి వ్యాపారంలో వున్నట్లు రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ స్వయంగా ఏబిపి టీవీతో చెప్పారు.

     ఇక ఆవులు ప్లాస్టిక్‌ తినటం గురించి ‘ప్లాస్టిక్‌ కౌ ‘ పేరుతో 2012లోనే కునాల్‌ ఓహ్రా కరుణా సొసైటీ కోసం ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసి ఆ సమస్యను వెలుగులోకి తెచ్చారు. ‘దేశంలో ఆవును సంరక్షించాలంటూ ఇటీవల టీవీ చర్చలు, పత్రికలలో వార్తలు రాసేవారి ఆత్మవంచన చూస్తే నవ్వు వస్తున్నదని ఆ డాక్యుమెంటరీ నిర్మాణంలో భాగస్వామి అయిన రుక్మిణీ శేఖర్‌ గతేడాది వ్యాఖ్యానించారు.ఎవరూ గో రక్షణకు చర్యలు తీసుకోవటం లేదని మీడియా చర్చలలో అదొక పావుగా మారిపోయిందని అన్నారు. నిజంగా నరేంద్రమోడీకి, సంఘపరివార్‌ స్వయం సేవకులు లేదా గో రక్షకులుగా రంగంలోకి వచ్చిన వారు వీధులలో తిరుగాడే గోవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెంట తిరుగుతున్నట్లు మనక్కెక్కడా కనిపించరు? అది గోరక్షణ కాదా ? అసలు ఇంతకాలం దాని గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? చర్యలు తీసుకున్నారా ? పోనీ ప్లాస్టిక్‌ నిషేధాన్ని అయినా సక్రమంగా అమలు జరిపించారా లేదే !

   ప్లాస్టిక్‌ కౌ డాక్యుమెంటరీ నిర్మించిన కరుణ సొసైటీ వారు 2012లోనే సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్లాస్టిక్‌ సంచులను నిషేధించి ఆవులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.గతనెలలోనే సుప్రీం కోర్టు ఆ కేసు విచారణ ముగించింది. పరిస్థితి తీవ్రంగా వుందని, ప్లాస్టిక్‌ వినియోగ నిషేధానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. దీని గురించి నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్లాస్టిక్‌ ఒక్క ఆవులకే కాదు, అన్ని రకాల పశువులు, అన్నింటి కంటే మించి పర్యావరణానికి తద్వారా మనుషులకూ హాని కలిగిస్తున్న విషయం తెలిసికూడా ఎలాంటి చర్యలూ గత రెండు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? అసలు దీన్నొక ప్రాధాన్యత గల సమస్యగా భావించటం లేదా ? బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆవు సంరక్షణ పేరుతో ఇతర చర్యలకు ప్రాధాన్యత ఇచ్చాయి తప్ప మోడీ చెప్పి ఆవుల మరణానికి ఎక్కువగా కారణం అవుతున్న ప్లాస్టిక్‌ నిషేధానికి తీసుకున్న చర్యలేమిటి ?

    దళితులు గణనీయంగా వున్న వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలతో పాటు, గుజరాత్‌లో అడుగు జారుతున్నట్లు గతేడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో దళితులకు ఎక్కువ వుద్యోగాలు ఇవ్వటం కూడా దళిత ఓట్లను దండుకొనేందుకే అనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ దళితులపై దాడులు, వెల్లడైన నిరసన కమలనాధుల్లో కలవరం రేపాయి. కావాలంటే నాపై దాడి చేయండి అని నరేంద్రమోడీ గొంతు చించుకుంటున్న హైదరాబాదు సభలో గుజరాత్‌ దళితులపై దాడిని బహిరంగంగా సమర్ధించి బిజెపి ఎంఎల్‌ఏ రాజా సింగ్‌ కూడా అక్కడే వున్న విషయం మోడీ కావాలనే విస్మరించారా ? ఇప్పటి వరకు గో సంరక్షకుల పేరుతో జరిగిన దాడులలో ఎక్కువ భాగం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే, వారంతా ఎవరు ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా లెక్కలేనన్ని దాని అనుబంధ సంస్ధలకు చెందిన వారు తప్ప మరొకరు కాదన్నది జగమెరిగిన సత్యం. ఈ పూర్వరంగంలో గో రక్షకుల మంటూ దుకాణాలు తెరిచారని, కావాలంటే తనపై దాడి జరపమనే కబుర్లు, కడవల కొద్దీ దళితులపై కన్నీరు కార్చారు తప్ప అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరలేదు. నూటికి 70-80శాతం తప్పుడు పనులు చేసే వారని చెప్పిన నరేంద్రమోడీ తమ పార్టీ పాలిత రాష్ట్రాలలో అలాంటివారు ఎందరిపై చర్యలు తీసుకున్నారు, ఎన్ని దుకాణాలను మూయించారు అన్నది చెప్పి వుంటే ఆయన మాటలకు విలువ వుంటుంది.అవి లేవు కనుకనే దళితులపై దాడుల గురించి మొసలి కన్నీరు కార్చారనే విమర్శలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావాల్సింది వృధా చర్చా ! నమ్మక ద్రోహంపై రచ్చా !

04 Thursday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, center's betrayal, CHANDRABABU, tdp

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ 1 Comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ – ఇప్తార్‌ విందు రాజకీయాలు

03 Sunday Jul 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, iftar, iftar party, Narendra Modi, PM Narendra modi, politics of iftar, RSS, skull cap

సత్య

    మంత్రసానితనానికి ఒప్పుకున్నతరువాత ఏదొచ్చినా పట్టాలి అన్నట్లుగా ప్రజాజీవితంలో వుండాలి అనుకున్న తరువాత ప్రశంసలను ‘ఆస్వాదించటమే ‘ కాదు విమర్శలను కూడా ‘సహించాలి’.గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ పైకి అభివృద్ధి మంత్రం జపిస్తున్నప్పటికీ ఆచరణలో హిందుత్వను పెంచి పోషించటంపైనే కేంద్రీకరిస్తున్నారన్నది కమ్యూనిస్టులు, కాని వారు కూడా చేసిన విమర్శలలో ఒకటి.http://economictimes.indiatimes.com/news/politics-and-nation/pm-narendra-modi-in-control-turns-focus-from-hindutva-to-development/articleshow/53021691.cms

   ‘పరిస్థితిని అదుపులోకి తెచ్చుకొని హిందూత్వ నుంచి అభివృద్ధి వైపు మరలిన ప్రధాని నరేంద్రమోడీ’ అనే శీర్షికతో జూలై రెండున ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. దానిని ఐఎఎన్‌ఎస్‌ అనే ఒక వార్తా సంస్ధ ప్రతినిధి రాశారు. ప్రచురించిన పత్రిక, రాసిన జర్నలిస్టు, రాయించిన వార్తా సంస్ధగానీ కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో ‘నీకిది నాకది’ సంబంధాలు కలిగినవి కాదు.ఎట్టకేలకు రెండు సంవత్సరాల తరువాత హిందుత్వ నుంచి అభివృద్ధి వైపు మరలినట్లు రాసిన ఆ కధనం ‘బి పాజిటివ్‌ ‘ ధోరణిలో సాగిందే అని గమనించాలి. హిందుత్వ బలపడటానికి నరేంద్రమోడీ ‘పాటు పడుతున్నారని’ చేసిన విమర్శలు వాస్తవమే అన్నది ఆ కధనం కూడా బలపరిచింది.

      ఈ వ్యాఖ్యానం వెలువడిన రోజే రాష్ట్రపతి ప్రతి ఏటా రంజాన్‌ సందర్భంగా సాంప్రదాయంగా ఇచ్చే ఇప్తార్‌ విందుకు వరుసగా మూడవ సంవత్సరం ప్రధాని నరేంద్రమోడీ డుమ్మా అనే వార్తలు కూడా వచ్చాయి. దేనికి హాజరు కావాలో కాకూడదో ప్రధాని ఇష్టం, ఆయనకు ఆ స్వేచ్ఛ లేదా అనే మండిపడే ప్రజాస్వామిక వాదులతో ఎలాంటి పేచీ లేదు.అత్యంత గౌరవనీయ పదవిలో దేశాధిపతి అధికారికంగా ఇచ్చే విందుకు సందర్భం ఏదైనా ఆహ్వానం రావటమే ఒక గౌరవంగా భావిస్తారు. దాన్ని మన్నించటం ఒక వ్యవస్ధకు ఇచ్చే మర్యాద. సోనియా గాంధీ, సీతారాం ఏచూరి వంటి వారు రావటం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ప్రధాని న్యూఢిల్లీలో వుండి రాకపోవటం అన్నది నలుగురి నోళ్లలో నానే అంశమే. ఈ విషయం నరేంద్రమోడీ, ఆయన సలహాదారులు, మార్గదర్శకులకు తెలియదు అనుకొనే అమాయకులు లేరు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్నవి మినహా మన దేశంలో మతాన్ని రాజకీయ మయం చేసినంతగా మరే దేశంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు.వాటిలో ఇప్తార్‌ విందు ఒకటి.

      రాష్ట్రపతి ఇచ్చిన విందుకు రాకపోవటం గురించి కనీసం ట్విటర్‌ ద్వారా అయినా నరేంద్రమోడీ తెలిపారా లేదా అన్నది గానీ, బిజెపి నాయకత్వం ఇబ్బంది పడుతున్న కారణంగా తన ట్వీట్ల సంఖ్యను తగ్గించుకుంటానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవటంలో భాగంగా గానీ ట్వీట్లు, వాటిని అనుసరించే అభిమానుల విషయంలో నరేంద్రమోడీతో పోటీ పడే సుబ్రమణ్యస్వామి దీని మీద ట్వీట్‌ చేసిందీ లేనిదీ తెలియదు. స్వాతి చతుర్వేది అనే ఒక సీనియర్‌ జర్నలిస్టు ‘రాష్ట్రపతి భవన్‌ ఇప్తార్‌ విందుకు భారత ప్రధాని మరోసారి రాలేదు, విదేశాలలో ఆయన చేసిన వుపన్యాసాలను మరచిపోయినట్లుగా కనిపిస్తున్నది ‘ అని ట్వీట్‌ చేశారు.’ ఇదీ భారతీయ స్ఫూర్తి,ఇది మా జాతి బలం, మా పౌరులందరూ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్దులు, చాలా పరిమితంగా వున్న పార్సీలు, దైవంపై నమ్మకం వున్న వారు , లేని వారు అందరూ భారత్‌లో అంతర్బాగం. ఒకసారి భారత్‌కు వచ్చినట్లుగానే ఈ రోజు భారత్‌ నుంచి సూఫీయిజం ప్రపంచానికి విస్తరిస్తోంది. భారత్‌లో రూపుదిద్దుకున్న ఈ సంప్రదాయం మొత్తం దక్షిణాసియా అంతటికి చెందుతుంది. అందుకే మన వారసత్వాన్ని ఈ ప్రాంతంలోని ఇతరులందరూ పాటించాలని, పునరుద్ధరించాలని కోరుతున్నాను.’ ఈ మాటలను ఢిల్లీలో జరిగిన ప్రపంచ సూఫీ మహాసభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వుపన్యాసంలో చెప్పారు. విదేశాలకు వెళ్లినపుడు భిన్నత్వాన్ని తానెంతగా గౌరవించేది తన వుపన్యాసాలలో చెప్పే నరేంద్రమోడీ ఆచరణ ముస్లింల పట్ల వ్యతిరేక భావంతో వుంటారన్న అభిప్రాయాలకు అనుగుణంగా వుందని, తిరిగి వెనుకటి రోజులకు మరలారని కనిపిస్తోందని ఇండియా డాట్‌కామ్‌ వార్తలో వ్యాఖ్యానించారు.http://www.india.com/news/india/prime-minister-narendra-modi-skips-presidents-iftar-party-third-year-in-a-row-1304643/

     ఒకే రోజు నరేంద్రమోడీ గురించి భిన్నమైన వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.అమృతసర్‌లో నేనూ మరికొందరు జర్నలిస్టులు స్వర్ణదేవాలయ సందర్శనకు వెళ్లాము. తలమీద పాగా లేదా అది లేనట్లయితే కనీసం హాండ్‌ కర్చిఫ్‌ అయినా కప్పుకొని వెళ్లాలని చెప్పినదానిని మేము పాటించాము, అదే విధంగా తిరుపతి, తిరువనంతపురం పద్మనాభస్వామి గుడి సందర్శనకు వెళ్లినపుడు విధిగా అక్కడి ఆచారాలు పాటించాలని స్పష్టం చేశారు. ఇష్టం వున్నవారు పాటించి దేవాలయాలను సందర్శించారు లేని వారు బయటే వుండిపోయారు. నా గురించి తెలిసిన వారు నేను హిందూ మతావలంబకులను సంతుష్టి పరచటానికి అంగవస్త్రం ధరించి వారితో పాటు గుడిలోకి వెళ్లానని అనలేకపోయారు. ముస్లింలు సాంప్రదాయంగా ధరించే టోపీ (స్కల్‌ కాప్‌) ధరించటానికి నరేంద్రమోడీ తిరస్కరించారు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిదానినీ రాజకీయం చేయటంలో భాగంగా ఇతర పార్టీల వారు వాటిని ధరించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వారు మైనారిటీల సంతుష్టీకరణలో భాగమే ఇదని వూరూ వాడా ప్రచారం చేశారు. అలాంటి వారే చివరికి వాటిని ధరిస్తే ప్రతిపక్షాలు వూరుకుంటాయా? అందుకే నరేంద్రమోడీ బహుశా తిరస్కరించి వుండవచ్చు లేదా ఇంకేదయినా మహత్తర ఆశయం వుందేమో తెలియదు. టోపీ ధరించిన వారినీ లేదా ధరించని వారిని గానీ కమ్యూనిస్టులెపుడూ విమర్శించలేదు. సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నదని విమర్శలు,ఆరోపణలకు తీవ్రంగా గురైన కాంగ్రెస్‌ పార్టీ చివరికి ఇప్తార్‌ విందులకు స్వస్తి చెప్పింది. కాంగ్రెస్‌ను దుయ్యబట్టిన సంఘపరివార్‌ తన అనుబంధ సంస్ధ ఆర్‌ఎంఎం ద్వారా కొత్తగా ఇప్తార్‌ విందులకు తెరతీసింది. గతేడాది ఈ సంస్ధ సాదాసీదాగా నిర్వహిస్తే ఈ సంవత్సరం దానిని ఒక అంతర్జాతీయ సంఘటనగా చేసేందుకు 140 దేశాల రాయబారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించి న్యూఢిల్లీ పార్లమెంట్‌ అనెగ్జర్‌లో భారీ ఇప్తార్‌ విందు ఏర్పాటు చేసింది. దాని ఎవరైనా విమర్శిస్తే సహించాలి. ఎదురుదాడికి దిగితే లాభం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వసనీయతను దిగజార్చుకుంటున్న చంద్రబాబు

02 Thursday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Congress party, special status to Andhra pradesh

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) On Two Years of BJP-Modi Government

31 Tuesday May 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

BJP, Communal Polarisation, Congress party, CPI()M, electoral tactics, Kerala, LDF, Modi, Narendra Modi, RSS-BJP, Trinamool Congress, Two Years of BJP-Modi Government, West Bengal

The Polit Bureau of the Communist Party of India (Marxist) met at New Delhi
on May 29 & 30, 2016. It has issued the following statement:

The BJP government had conducted a gaudy celebration of the completion of
two years in office making many bombastic claims.

These two years have confirmed that a new `trimoorti? is being sculpted.
Its three faces represent the following: one, the relentless pursuit of
aggressive communal polarization in the effort to transform the secular
democratic character of the Indian Republic into the RSS version of a
rabidly intolerant fascistic `Hindu Rashtra?; two, the pursuit of the
neo-liberal trajectory of economic reforms, more aggressively than pursued
by the UPA government, imposing unprecedented burdens on the vast majority
of our people; and three, increasing recourse to authoritarian measures
undermining the institutions of parliamentary democracy and running
roughshod over democratic rights and civil liberties.

As far as the majority of the Indian people are concerned, there is an
economic disaster rather than any cause for celebrations.
*        Six year low for new jobs in eight labour-intensive industries. In
2015, official figures reveal that only few new jobs were created in the
country as against the promise of creating two crores of new jobs annually.
Every year, over 1.3 crore of Indian youth join the job market
*        Worst decline in exports in 63 years – decline for 17 months in a
row
*        Core inflation of 6.8 per cent, Dal prices rise by more than 30 per
cent
*        Annual core sector growth of only 2.7 per cent, a decade low
*        2,997 farmers committed suicide in 2015, 116 farmers in
January-March 2016
*        MGNREGA payments not made, arrears paid after Supreme Court orders
*        Rural wages decline in real terms in a decade
*        Savings bank deposits growth at a 53 year low
*        NPAs of banks more than Rs 13 lakh core and growing
*        27 per cent zero-balance Jan Dhan accounts, 33 per cent duplicate
accounts
*        New and more taxes, surcharges and cesses on items used by the
poor
On top of this, the agrarian distress is worsening.  The Modi government
promised ?minimum of 50 per cent profits over cost of production?.

Reality:
*        Profitability down to less than 10 per cent, and in some crops,
into losses
*        Agriculture and allied sector grew at -0.2 per cent  in FY15 & 1.1
per cent in FY16
*        Foodgrains production dropped by 5 per cent in FY15, to decline
further in FY16

Severe Drought Situation
*        12 states were declared drought-hit only after Supreme Court?s
orders. Overall,  54 crore people in 13 states are suffering in the grip of
drought
*        25 per cent of India?s rural inhabitations face drinking water
crisis.
The unprecedented drought situation has resulted in the death of thousands
of poor people and lakhs of livestock.  Immediate relief must be provided to
the suffering people.  Despite the Supreme Court intervention, nothing
tangible is being done by the Central government.
The Polit Bureau of the CPI(M) demands that the sufferings of the people
must be mitigated on a war footing.

Sharpening Communal Polarisation

The RSS-BJP are, once again, resorting to whipping up communal passions in
the run up to the forthcoming Assembly elections in Uttar Pradesh in 2017.
It is reported that the Bajrang Dal has been organizing arms training camps
in several parts of the state.  This is clearly an exercise  to provoke
communal conflicts and tensions and reap the consequent electoral gains from
such polarization.  Such efforts are an expression of the worst ?vote bank
politics? seeking the consolidation of the Hindutva communal vote bank at
the expense of  weakening the unity of India?s social fabric.  The Polit
Bureau of the CPI(M) strongly condemns such activities and demands that both
the Central government and the UP state government take strong action in
accordance with the law of the land.
Racial Attacks against the People of African Origin
The reports of increasing violence resulting in the death of people of
African origin living in India is a matter of grave concern.  That such
grievous attacks take place in the national capital of Delhi is, indeed,
shameful.  Such racist attacks undermine the centuries old relationship
between India and the African countries. This has already assumed the
dimension of affecting diplomatic ties between India and the African
countries.
The Central government must immediately intervene to ensure that stringent
action is taken against the culprits and those propagating racist hatred.
This is absolutely essential to prevent the further downslide in the
international image of India.

Elections to the State Assemblies

The CPI(M) state committees in West Bengal, Kerala, Tamilnadu and  Assam are
scheduled to meet to prepare a detailed review of the CPI(M)?s performance
in the elections and the post election political situation arising in these
states.  On the basis of these review reports prepared by the state
committees, the Central Committee will conduct its review at its forthcoming
meeting from June 18-20.
With regard to the electoral tactics pursued by the CPI(M) in various
states, the electoral tactics evolved in West Bengal was not in consonance
with the Central Committee decision based on the political-tactical line of
the Party which states that there shall be no alliance or understanding with
the Congress party.

Post-Declaration of Result Violence

The Trinamool Congress has unleashed widespread violence against the cadres
of the opposition parties.  Many CPI(M) cadres have been murdered and over
600 CPI(M) and mass organization offices have been ransacked and some set on
fire.  Apart from targeting the offices of all opposition parties and mass
organizations, the attacks specifically focus on constituencies and areas
where Trinamool Congress lost in these elections.  Widespread  bomb attacks,
arson and extortions of huge amounts of money as ransom are being reported.
Those who voted against the Trinamool Congress are reportedly coerced into
paying a hefty fine for having exercised their  democratic choice.
Under these circumstances, the CPI(M) calls upon the people of West Bengal
to unitedly resist this murder of democracy and civil liberties in the
state.  The strength of the people?s unity is the answer to meet this
unprecedented unleashing of violence.

Kerala

The Polit Bureau of the CPI(M) salutes the people of Kerala for reposing
faith in the LDF in a resounding manner in these Assembly elections.  The
LDF government has assumed office with a resolve to fulfill the commitments
that it made to the people of Kerala during the polls.
The physical attacks by the RSS against the CPI(M) and the LDF continue.
Forty one such attacks have already taken place since the results were
declared. Two comrades have lost their lives, with Sasikumar, who was
seriously injured in an attack at Engandiyoor in Thrissur on 22nd May
succumbing to his injuries on May 27.  82 comrades have been injured in
these brutal attacks including an elected MLA who has now been sworn in as a
Minister.
The CPI(M) calls upon the RSS/BJP to respect the verdict of the people and
desist from such murderous onslaughts.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాచ్‌మన్ల జాతి పిత నరేంద్రమోడీ

29 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, Literature., Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, tdp, tdp mahanadu, telugudesam, YS jagan

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d