• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా – 2

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

మహాత్మాగాంధీ హత్యలో మరోవ్యక్తి వున్నాడంటూ విచారణ జరపాలని కోరటం వెనుక గాడ్సే, తద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను చరిత్ర నుంచి అధికారికంగా తుడిచివేయాలనే ప్రయత్నం కనపడుతోంది.తమకు అనుకూలంగా చరిత్రను మార్చుకొనేందుకు మితవాద హిందూశక్తులు ప్రయత్నిస్తున్నాయని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది.తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయటం, గందరగోళపరచేందు ప్రయత్నించటం ఇదే మొదటిసారి కాదు. ఇది గాంధీ హంతకుల నుంచి సైద్ధాంతిక స్ఫూర్తి పొందిన హిందూ మితవాదుల పెద్ద పధకంలో భాగం. హత్య గురించి అనుమానాలను పెంచేందుకు మరొక స్ధాయికి తీసుకుపోయారు.ఇటువంటి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించకపోవటం ఆశ్చర్యపరిచింది. అదృష్టం కొద్దీ గతేడాది ముంబై హైకోర్టు వినతిని తిరస్కరించింది. పిటీషన్‌ వేసిన వ్యక్తి తాను వీర సావర్కర్‌ భక్తుడిని అని స్వయంగా అంగీకరించాడు. సావర్కర్‌పేరును కేసు నుంచి తొలగించాలని కోరాడు. జస్టిస్‌ కపూర్‌ కమిషన్‌ 1969లో సమర్పించిన నివేదికలో గాంధీ హత్యకు వున్న సంబంధాన్ని నిరూపించటమేగాక హత్యకుట్రలో సావర్కర్‌ పాత్ర, ప్రమేయం వున్నట్లు కూడా తెలిపింది. అంతకు ముందే కేసు నుంచి సావర్కర్‌ విముక్తి చేసినప్పటికీ ఈ కమిషన్‌ తన నివేదికలో అతని ప్రమేయం గురించి పేర్కొన్నది. అప్పటి నుంచి సంఘపరివార్‌ మరియు సావర్కర్‌ వాదులకు ఈ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని ఫడ్నిస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు అనుమతించింది. వర్తమాన చరిత్రను కించపరుస్తూ దాని స్ధానంలో తమ వూహలనే చరిత్రగా చొప్పించాలని చూసే ఈ పధకంలో బంబే హైకోర్టు తిరస్కరించటం, సుప్రీం కోర్టు అనుమతించటం కొన్ని అడుగులు.

పిటీషన్‌దారు ఆరోపించిన దాని ప్రకారం 1948 జనవరి 30న రెండవ అజ్ఞాత వ్యక్తి జరిపిన నాలుగవ రౌండ్‌ కాల్పులకే గాంధీ మరణించారు. రెండున్నర అడుగుల దూరం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన గాడ్సే తూటాల కారణంగా ఆయన మరణించలేదు. రెండవ వ్యక్తి రహస్యంగా జరిపిన కాల్పులను ఎవరూ వినలేదు, అతను వున్నట్లు కూడా ఎవరూ గుర్తించలేదు.ఆ సమయంలో అక్కడదాదాపు వెయ్యి మందికి పైగా వున్నారు. గాంధీ మరణం తరువాత అంత్యక్రియలకు ముందు చేయించే పార్ధివ దేహానికి స్నానం చేయించి,శుద్ధి చేసే సమయంలో దేహంపై కప్పిన షాల్‌ మడతలలో ఒక బుల్లెట్‌ కనిపించిందని మనుబెన్‌ అనే వ్యక్తి చెప్పాడని పిటీషనర్‌ పేర్కొన్నాడు. దాన్నే నాలుగవ బుల్లెట్‌గా చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మూడుసార్లు కాల్పులు జరిగినట్లు మూడు గాయాలున్నట్లు రెండు బుల్లెట్లు వెనుకవైపుకు దూసుకుపోయాయని, మూడింటిలో ఒక బుల్లెట్‌ గాంధీ వెనుక పది అడుగుల దూరంలో పడి వుండగా తరువాత కనుగొన్నారు. ఒకటి బాపు శరీరంలోనే వుండిపోయి చితిలో తరువాత కరిగిపోయి కనిపించింది. మూడవ బుల్లెట్టే షాల్‌లో దొరికిందని, నాలుగవది అసలు లేదని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

గాంధీ హత్యకు వుపయోగించిన 9ఎంఎం బెరెట్టా తుపాకి గాడ్సే చేతికి ఎలా వచ్చిందన్న అంశం గురించి తుషార్‌ గాంధీ తన విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. పిటీషన్‌దారు రెండు బెరెట్టా తుపాకులున్నాయని పేర్కొన్నారు. అవును నిజమే.ఒకే 606824 నంబరు గల రెండు తుపాకులున్నాయి.ఒకటి అసలైనది, రెండవది సందర్శకుల కోసం రూపొందించిన దాని నమూనా రాజఘాట్‌లోని జాతీయ గాంధీ మ్యూజియంలో వున్నాయి.ఈ తుపాకీ గాడ్సే చేతిలోకి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం. హత్యకు రెండు రోజుల ముందు వరకు అంటే జనవరి 28వరకు గాడ్సే-ఆప్టే ముఠాకు విస్వసనీయమైన ఆయుధం దొరకలేదు. ఇరవయ్యవ తేదీన వారు మూడు తుపాకులు కలిగి వున్నప్పటికీ హత్యాయత్నం విఫలమైంది. మరుసటి రోజునుంచి మరో ఆయుధం కోసం అన్ని వనరులనూ సంప్రదించారు. ఆ రోజుల్లో అక్రమ తుపాకుల విక్రయ కేంద్రంగా గ్వాలియర్‌ వుండేది. అక్కడ దత్తాత్రేయ పర్చూరే అనే డాక్టరున్నాడు. అతను సావర్కర్‌ వీర భక్తుడు, హిందూమహాసభ సభ్యుడిగా నాధూరామ్‌, ఆప్టేలకు తెలుసు. డాక్టరు దగ్గర మంచి తుపాకీ వుందని తెలిసి అది కావాలని అడిగారు. తిరస్కరించిన దత్తాత్రేయ వారికి ఒకదానిని సమకూర్చేందుకు అంగీకరించాడు.గంగాధర్‌ దండావతే అనే తన కింద పనిచేసే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించాడు. జనవరి 28 సాయంత్రానికి అతను ఐదువందల రూపాయలకు ఒక తుపాకీని తెచ్చాడు.దానితో గాడ్సే-ఆప్టేలకు కాల్చటం రాకపోతే ఆ డాక్టరు తన ప్రాంగణంలో కాల్చిచూపించాడు.

సమీపం నుంచి హత్యలు చేయటానికి ఆ రోజుల్లో బెరెట్టా సెమీ ఆటోమాటిక్‌ తుపాకిని ఎక్కువగా వుపయోగించేవారు. ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ సైన్యాధికారులు వుపయోగించేందుకు బెరెట్టా కంపెనీ పరిమితంగా వాటిని తయారుచేసేది. ఇప్పటికీ దాన్ని ఫాసిస్టు స్పెషల్‌ అని పిలుస్తారు. వుత్తర ఆఫ్రికాలోని అబిసీనియాను ఆక్రమించేందుకు ముస్సోలినీ సేనలు ప్రయత్నించినపుడు మిత్రపక్షాల సేనలు వాటిని ఓడించాయి. ఆ యుద్ధంలో బ్రిటీష్‌ సైన్యంలోని నాలుగ గ్వాలియర్‌ ఇన్‌ఫాంట్రిలో కమాండింగ్‌ అధికారిగా పనిచేసిన లెప్టినెంట్‌ కల్నల్‌ వి.వి జోషి ముస్సోలినీ సేనల లంగుబాటుకు చిహ్నంగా ఒక అధికారి నుంచి బెరెట్టా తుపాకిని స్వీకరించాడు. అది యుద్ద ట్రోఫిగా మారింది. తరువాత జోషిని నాటి గ్వాలియర్‌ రాజు జియాజీరావు సింధియా సంస్ధాన కోర్టులో అధికారిగా నియమించాడు. జోషి దగ్గర వున్న బెరెట్టా తుపాకి దొంగ తుపాకులు అమ్మేవారి దగ్గరకు అక్కడి నుంచి హంతకుల దగ్గరకు ఎలా చేరిందన్న విషయాన్ని ఎవరూ దర్యాప్తు చేయలేదు. గాంధీ హత్యలో డాక్టరు దత్తాత్రేయ సహనిందితుడు. అతడిని పంజాబు హైకోర్టు కేసు నుంచి విడుదల చేసింది. ఎందుకంటే అతడు సాంకేతికంగా అప్పటికి బ్రిటీష్‌ పౌరుడు. స్వయంగా తన నేరాన్ని అంగీకరించినప్పటికీ బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం నిందితుడిగా మార్పిడి జరగలేదనే సాకుతో విడుదల చేశారు. గాంధీ హంతకులకు సంబంధించి నకిలీలకు ఇవన్నీ ఇబ్బంది కలిగించే వాస్తవాలు. వారు ఇప్పుడు తమకు నిజాలను తారు మారు చేయగల, చరిత్రను తమకు అనుకూలంగా తిరిగి రాయగల సామర్ధ్యం, అధికారం వచ్చాయని భావిస్తున్నారు. ఇప్పటికే పురాతన చరిత్రను దిగజార్చటంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు వర్తమాన చరిత్రను తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకొనేందుకు పూనుకున్నారు. అని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

చరిత్ర రెండు రకాలు, ఒకటి హీనమైనది, రెండవది ఘనమైనది. మొదటి చరిత్ర కలవారు రెండోవారిని కించపరిచేందుకు, తమకు లేని చరిత్రను కృత్రిమంగా తయారు చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మన దేశంలో గాంధీ మహాత్ముడిని హత్యచేసిన వారు మతోన్మాదులు అన్నది తిరుగులేని సత్యం. ఒకవైపు హంతకుడు,కుట్ర చేసిన వారిని అనధికారికంగా కీర్తిస్తూ మరోవైపు వారితో తమపై ఏర్పడ్డ మచ్చను చెరిపివేసుకొనేందుకు కాషాయశక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. నాధూరామ్‌ గాడ్సే మావాడు కాదు అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనదానిలో మొదటిది. అయితే హత్యానంతరం కమిషన్‌ విచారణలో వారికి వున్న సంబంధాన్ని నిర్ధారించటంతో పాటు గాడ్సే సోదరుడు స్వయంగా నాధూరామ్‌ గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వీడలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఏర్పడిన జనసంఘ్‌పై గాంధీ హత్య మరక చాలా పెద్దదిగా కనిపించేది, ఎందుకంటే గాడ్సేను సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ వారు, హిందూమహాసభకు చెందిన వారందరూ ఆ పార్టీలో కనిపించేవారు. 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితిని ప్రకటించటం ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కూడా జైళ్లలో వేయటంతో వారు ప్రజాస్వామ్యం పరిరక్షణలో జైలుపాలైన వారిగా ఫోజు పెట్టి తమపై వున్న మచ్చను కాస్త మసకపారేట్లు చేసుకున్నారు. జనతా పార్టీలో మత ముద్రను చెరిపివేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌-జనతా పార్టీలలో ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా వుండాలన్న అంశం తెరమీదకు వచ్చినపుడు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే లౌకిక ముద్ర కంటే మతముద్రే లాభమని లెక్కలు వేసుకొని బిజెపి రూపమెత్తారు. తరువాత బాబ్రీ మసీదు కూల్చివేత- అయోధ్యలో రామాలయ నిర్మాణం తదితర అజెండాను ముందుకు తీసుకువచ్చినా విజయం సాధించలేకపోయారు. ఎదురుదెబ్బలు తిన్నారు. గత ఎన్నికలలో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించినా మూడోవంతు కూడా ఓట్లు రాలేదు. ఆ వచ్చినవి కూడా నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ది చేసిన ప్రగతివాదిగా చిత్రించటం, అన్నింటి కంటే కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, అసంతృప్తి కారణంగా ఆమేరకైనా ఓట్లు వచ్చాయి. ఆ ఓటింగ్‌ నిలవదని బిజెపి, సంఘపరివార్‌ నాయకత్వానికి తెలుసు. అందువలననే తమపై వున్న తిరోగామి ముద్రలను తుడిచివేసుకొనేందుకు పూనుకుంది. దానిలో తొలి అడుగు స్వచ్చభారత్‌ పిలుపును మహాత్మాగాంధీకి జతచేసి తాము ఆయనను గౌరవిస్తున్నామనే సందేశం పంపేందుకు ప్రయత్నించారు. దాని వలన ఆయనను హత్యచేసిన మచ్చపోయే అవకాశం లేదు. గతంలో ఏ సందర్భంలోనూ ప్రస్తావించని అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ నివేదిక పేరుతో ఒక కధనాన్ని ప్రచారంలో పెట్టారు. ఆ పధకంలో భాగమే బ్రిటీష్‌ గూఢచార విభాగానికి చెందిన గుర్తుతెలియని మూడో వ్యక్తి, అసలు లేని నాలుగో బుల్లెట్‌ కధ. మహాత్మాగాంధీని నిజంగా వదిలించుకోవాలని బ్రిటీష్‌ పాలకులు నిర్ణయించుకొని వుంటే ఆయనేం ఖర్మ యావత్తు స్వాతంత్య్రపోరాట నాయకత్వాన్నే అంతం చేసి వుండేది. అందునా స్వాతంత్య్రం ప్రకటించి, మన దేశం నుంచి వెళ్లిపోయిన తరువాత మహాత్ము డిని హత్యచేయాల్సిన అవసరం బ్రిటీష్‌ వారికి ఏమాత్రం లేదు. ఎందుకంటే వారు వెళ్లిపోయినా బ్రిటీష్‌ కార్పొరేట్ల పెట్టుబడులు అలాగే వున్నాయి. మహాత్ము డిని హత్య చేయించి వాటిని కాపాడుకోగలమనే పిచ్చి ఆలోచన వారికి కలిగే అవకాశం లేదు.

అయినా బ్రిటీష్‌ గూఢచారి కధ చెబుతున్నారంటే రాబోయే రోజుల్లో దాన్ని బలపరిచేందుకు వీలుగా అమెరికాలో కొత్త స్క్రిప్టు,దర్శ కత్వం, సినేరియో వంటి వన్నీ తయారువుతున్నాయని భావించాల్సి వుంది. మన మార్కెట్‌, మన మిలిటరీతో సంబంధాల విషయంలో అమెరికా పట్టు సాధించిన కారణంగా దానికి అనుగుణంగా వ్యవహరించే శక్తులకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అనేకదేశాలలో ఇది రుజువైంది.మన దేశంలో కూడా అదే పునరావృతం అవనుందా ?

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా-1

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

ఆయేషా మీరా, అరుషి కేసులలో నిందితులు నిర్దోషులు, వారు హత్య చేయలేదని కోర్టులు తీర్పులిచ్చాయి. ఎవరూ వారిని చంపకపోతే వారెలా హత్యకు గురయ్యారు? జాతిపిత మహాత్మాగాంధీ హత్యకేసులో కూడా, నిందితులు, వారి వెనుక కుట్ర చేశాయన్న సంస్ధలు పరిశుద్ధులని నిర్ధారించేందుకు ప్రయత్నం జరుగుతోందా ? మన న్యాయవ్యవస్ధకు ఎలాంటి దురుద్ధేశ్యాలను అపాదించకుండానే జరుగుతున్నవాటిని చూసి ఏమైనా జరగవచ్చని సామాన్యులు అనుకోవటంలో తప్పులేదు కదా. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న కొందరు వూహిస్తున్నట్లుగా ఒక వేళ ఆయేషా, అరుషి కేసుల తీర్పులే మహాత్మాగాంధీ విషయంలో పునరావృతం అయితే జాతిపితను చంపింది ఎవరు అన్న ప్రశ్న భవిష్యత్‌ తరాల ముందు వుంటుంది. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ వూహించి వుండరు కదా !

మహాత్మాగాంధీ జన్మించి 148 సంవత్సరాలు గడిచాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాధూరామ్‌ గాడ్సే, మరొకడు కలిసి ఆయనను హత్యచేసి 69 సంవత్సరాలవుతోంది. ఇన్ని సంవత్సరాల తరువాత హత్యలో మూడోవాడు,వాడు పేల్చిన నాలుగో బుల్లెట్టే ప్రాణం తీసింది దాని గురించి విచారణ జరపండి అని సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. ముంబైకి చెందిన డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నిస్‌ అనే వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించే సంస్ధగా పరిగణించబడే అభినవ్‌ భారత్‌ ట్రస్టీ. నాధూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టేలో పాటు మహాత్మాగాంధీ హత్య సమయంలో మరో విదేశీ అజ్ఞాత వ్యక్తి వున్నాడని, నాలుగవ బుల్లెట్‌ పేలిందని దాని గురించి విచారణ జరపాలని గతేడాది దాఖలు చేసిన పిటీషన్ను బంబాయి హైకోర్టు కొట్టివేసింది. అదే వ్యక్తి సుప్రీం కోర్టుకు విన్నవించారు. అమెరికా సిఐఏ నుంచి తనకు కొంత విలువైన సమాచారం త్వరలో అందనుందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని కూడా అతను వాదించాడు. ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ తదుపరి వాదనలను అక్టోబరు 30కి వాయిదా వేస్తూ ఈ కేసును విచారణకు చేపట్టవచ్చో లేదో తమకు సలహా ఇవ్వాలని అమరేందర్‌ శరణ్‌ అనే సీనియర్‌ న్యాయవాదిని నిర్ణయించింది. ఆ కేసు తదుపరి ఎటు తిరుగుతుందో అన్న ఆసక్తి సహజంగానే రేకెత్తింది. అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఒక వైపు మహాత్మాగాంధీని పొగుడుతూనే మరోవైపు ఆయనను కించపరిచే ద్వంద్వ వైఖరిని మనం ప్రస్తుత అధికారపక్షంలో చూస్తున్నాం. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌ షా కొద్ది వారాల క్రితం గాంధీని చతురుడైన కోమటి అని వర్ణించిన విషయం తెలిసిందే. గాంధీని హత్యచేసిన ‘గాడ్సేను దేవుడే పంపాడు, అసలు గాంధీనే వురి తీసి వుండాల్సింది, గాంధీని చంపటానికి గాడ్సేకు వుండే కారణాలు గాడ్సేకున్నాయి, అవును నేను గాడ్సేకు పెద్ద అభిమానిని, అయితే ఏమిటి’ అని ఆరాధించే అనేక మంది ప్రధాని నరేంద్రమోడీ భక్తులైతే అందుకు ప్రతిగా ట్విటర్‌ ద్వారా మోడీ వారిని అనుసరిస్తూ ప్రోత్సహిస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎవరో వూరూ పేరు లేని వారైతే పట్టించుకోనవసరం లేదు బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌లో ‘గాంధీని హత్యచేయటానికి గాడ్సేకు వుండే కారణాలు ఆయనుకున్నాయి, న్యాయబద్దమైన సమాజం వాటిని కూడా వినాలి’ అని వ్యాఖ్యానించాడు. వారందరికీ ఆరాధ్యదైవంగా పరిగణించబడే నరేంద్రమోడీ మరోవైపు ‘ గాంధీ జయంతి సందర్బంగా బాపూకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన మహత్తర ఆశయాలు ప్రపంచవ్యాపితంగా కోట్లాది మందికి ప్రేరణనిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేస్తారు.

సైద్ధాంతికంగా గాంధీని వ్యతిరేకించిన సుభాస్‌ చంద్రబోసే గాంధీని జాతిపితగా వర్ణించారు. మన రాజ్యాంగంలో జాతిపితగా గుర్తించే అవకాశం లేదు. అయినా మహాత్ముడి వ్యక్తిత్వం కారణంగా ఆయనను జాతిపితగా వర్ణిస్తున్నాము. కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించటం అంటే అంతటి స్ధాయిని కల్పించటమే. బిజెపి, దానిని వెనుక నుంచి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ ఆయనను జాతిపితగా గుర్తించలేదు, పిలవలేదు.అలాంటి వ్యక్తిని గాడ్సే గాంగ్‌ ఎందుకు చంపింది. అనేది అవలోకించాల్సి వుంది. ప్రస్తుతం దేశంలో హిందూమతోన్మాదశక్తులు రెచ్చిపోతున్నాయి. గాంధీని చంపటం ఒక పెద్ద ఘనతగా, అలాంటిదానిని తమకు దక్కకుండా చేసేందుకు పూనుకున్నారని హిందూమహాసభ పేరుతో వున్న వారు ప్రకటించారు.

మహాత్మాగాంధీని చంపింది హిందూమహసభకు చెందిన నాధూరామ్‌ గాడ్సే అనే తమ వారసత్వ ఆస్థి లేదా వుత్తరదాయిత్వాన్ని దెబ్బతీసేందుకు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని హిందూమహాసభ ఆగ్రహం వెలిబుచ్చింది.మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ పేరుతో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ నియామకం జరుపుతున్నట్లు ప్రకటించగానే హిందూమహాసభ జాతీయ వుపాధ్యక్షుడు అశోక్‌ శర్మ ఒక ప్రకటన చేశారు. హిందూ మహాసభ నుంచి పుట్టిన భావజాలమే బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వునికి కారణం. ఆ రెండు సంస్ధలు ఈరోజు ధరించిన ముసుగులను బహిరంగపరచగలిగేది తమ సంస్ధ మాత్రమే అని వాటికి తెలుసు, హిందూమహసభ గుర్తింపును నాధూరామ్‌ గాడ్సే నుంచి విడదీయలేరు, గాంధీ హత్యలో గాడ్సేకు ఖ్యాతి దక్కకుండా చేసేందుకు అతని పాత్రపై అనుమానాలను సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గాడ్సే లేకపోతే హిందూమహాసభ పూర్తిగా వునికి కోల్పోతుందని వారికి తెలుసు.ఇదందా బిజెపి ద్విముఖ వ్యూహంలో భాగం. గాడ్సేను పొగడలేదు కనుక గాంధీ పట్ల సానుకూల వైఖరిని అనుసరించేందుకు ఒక వైపు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ ప్రమాణాల గురించి బహిరంగంగా మాట్లాడగలిగేది హిందూ మహాసభే కనుక దానిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి పూర్తిగా సంఘ్‌ తరఫున పని చేస్తున్నాడు.’ అని అశోక్‌ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి మతోన్మాద, హంతక శక్తులకు అంతటి బరితెగింపు ఎలా వచ్చింది? వారిని రక్షించే శక్తులది పైచేయి అయిందా, జనం విచక్షణ కోల్పోతున్నారా ? దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలపై గాంధీ తీసుకున్న వైఖరి మతోన్మాదులకు నచ్చనందునే ఆయనను పొట్టన పెట్టుకున్నారు. మతాల గురించి గాంధీ చెప్పిందేమిటి? గాంధీ ధర్మం ప్రకారం సహనానికి మించి అన్ని మతాల పట్ట చిత్తశుద్దితో కూడిన గౌరవం వుంది.ఆమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.మతోన్మాదానికి ఏ మాత్రం అవకాశం లేదు. వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన, రాసిన మాటలు ఇలా వున్నాయి. ‘ నావరకు విభిన్న మతాలు ఒకే తోటలోని అందమైన పూలవంటివి లేదా దివ్యమైన చెట్టు యొక్క వివిధ కొమ్మలు. మానవ పరిణామక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి మతం తనదైన అంశభాగాన్ని అందచేసింది. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు ఒకే చెట్టులోని అనేక శాఖలు, మిగతావాటితో పోల్చితే దేనికది ప్రత్యేకతలు కలిగి వున్నప్పటికీ వాటికి వనరు ఒక్కటే.’ వివిధ మతాలు ఒకే చెట్టుమీది ఆకుల వంటివి. ఏ రెండు ఆకులూ ఒకే విధంగా వుండవు. ఒకే చెట్టుమీద పెరిగిన కొమ్ములు లేదా ఆకుల మధ్య వైరం వుండదు. ప్రపంచంలోని అన్ని గొప్పమతాలలోని నిజాల విశ్వాసిని, కేవలం సహనమే కాదు ఇతర మతాల విశ్వాసాలు కూడా మన వంటివే అనే గౌరవం లేకపోతే భూమ్మీద శాంతి నెలకొనదు. నేను ప్రబోధించే విశ్వాసం దాన్ని అమలు చేయటానికి మాత్రమే నన్ను అనుమతించదు, ఏ వనరునుంచి వచ్చినప్పటికీ మంచిని గ్రహించే విధి నిర్వహణ అనివార్యం చేస్తుంది. దీర్ఘ పఠనం, అనుభవం తరువాత నేను కొన్ని నిర్ధారణలకు వచ్చాను. అన్ని మతాలు నిజమైనవే,అన్ని మతాలలోనూ కొన్ని తప్పులున్నాయి, నా స్వంత హిందూమతం మాదిరి నాకు అన్ని మతాలూ ప్రియమైనవే, అదే విధంగా మానవులందరూ వారి స్వంత బంధువుల మాదిరి ప్రియంగా వుండాలి. ‘ ఒక క్రైస్తవ మిత్రుడు ఒకసారి గాంధీని ఒక ప్రశ్న అడిగాడు. మీ మతం అన్ని మతాల సంయోగం అని మీరు చెబుతారా ? అంటే ఆ సంయోగాన్ని నేను హిందూయిజం అని పిలుస్తాను, మరియు మీ విషయానికి వస్తే క్రైస్తవమే సంయోగం అవుతుంది అని గాంధీ చెప్పాడు.

ఇటువంటి భావాలున్న వ్యక్తి దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలకు నిరసనగా దీక్ష చేపట్టటాన్ని అవకాశంగా తీసుకొని హిందూమతోన్మాదశక్తులు తమ కసి తీర్చుకున్నాయి.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ వంటి సంస్దలకు నాయకత్వం వహించిన వారి కార్యకలాపాలు రచనలు, వుపన్యాసాలను గమనించితే వారికి ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ, జర్మన్‌ హిట్లర్‌ నాజీలు స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు. భారత్‌ను జర్మనీగా భావించి అక్కడ యూదులను దేశద్రోహులుగా ఎలా చిత్రించారో ఇక్కడ ముస్లింలను అలా పరిగణించాలని భావించారు. ఐరోపా మతరాజ్యాల మాదిరి భారత్‌ను ఒక హిందూ రాజ్యంగా చూడాలని అనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తాము గెలవాలని కోరుకున్న ముస్సోలినీ, హిట్లర్‌ మట్టి కరవటం, యూదులను వూచకోత కోయటాన్ని సభ్యసమాజం వ్యతిరేకించటం, జర్మనీ, ఇటలీలు ఓడిపోవటం, భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోవటం వంటి అంశాలతో తాము వూహించుకున్నది ఒకటి జరిగింది ఒకటనే ఆశాభంగానికి గురైన శక్తులు గాంధీ కారణంగానే హిందువులు చేతగాని విధంగా తయారయ్యారనే తప్పుడు నిర్దారణలకు వచ్చి ఆయనను హతమారిస్తే తప్ప హిందూమతం పటిష్టం కాదనే అంచనాతో హత్యకు పాల్పడివుంటారని చెప్పవచ్చు. వారి వారసులు ఇప్పుడు గాంధీ హత్యను మరోవిధంగా వ్యాఖ్యానించటానికి, వుపయోగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే సుప్రీం కోర్టులో మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ కథ.

గత లోక్‌సభ ఎన్నికలలో మూడింట రెండువంతుల సీట్లు బిజెపికి వచ్చాయి గానీ వచ్చిన ఓట్లు 31శాతమే. బిజెపిని వ్యతిరేకించే పార్టీల ఓట్ల చీలిక దానికి సీట్ల పంట పండించింది. గరిష్ట మతరాజకీయాల అనంతరం పరిస్ధితి ఇది. వుత్తర ప్రదే శ్‌ ఎన్నికలలో కూడా బిజెపికి ఎన్నడూ లేని సంఖ్యలో సీట్లు వచ్చాయి. కానీ ఓట్ల లెక్కలో లోక్‌సభ ఎన్నికల కంటే తగ్గాయి. అత్యవసర పరిస్దితి అనంతర ఓట్లవివరాలను చూస్తే తమకు వున్న పరిమితులేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వానికి అవగతం అయ్యాయి. అందువలన అధికారంలో కొనసాగాలన్నా, మరో రూపంలో మతోన్మాద అజెండాను అమలు జరపాలన్నా విశ్వసనీయతను సృష్టించుకోవటం అవసరంగా భావించినట్లు కనిపిస్తోంది.

నాటి నుంచి నేటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలందరూ హిందుత్వ గురించి, దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని కోరుతూ, హిందూ ధర్మానికి ముప్పు కలుగుతోందని చెబుతున్నవారే. అది వారికి ఆక్సిజన్‌ వంటిది. అదిలేకపోతే దానికింక మనుగడే వుండదు. ఎందుకంటే మిగతా అంశాలన్నీ అన్నీ పార్టీలు చెప్పేవే. గాంధీ హత్యకు కుట్రచేసిన గాడ్సే, ఇతరులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలలో సభ్యులుగా వున్న హిందుత్వశక్తులే. గతంలో జనసంఘం, ప్రస్తుతం బిజెపిగా వ్యవహరిస్తున్న పార్టీకి అది ఒక మాయని మచ్చ. దానిని తొలగించుకోవాలని ఎప్పటి నుంచో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. గాంధీని హతమార్చిన విషయాన్ని కాదనలేరు కనుక ఆయనను చంపింది రాజకీయ కారణాలతో తప్ప మతఅంశాలు కాదని చెప్పటానికి అనేక మంది బిజెపి ప్రముఖులు గతంలో ప్రయత్నించారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన వారు గాంధీని హత్యచేసిన ఘనత తమఖాతాలో వేసుకొనేందుకు ఇంకా మోజుపడుతున్నారు.అది బహిరంగంగా చెప్పుకోలేరు. అదే సమయంలో అధికారం కావాలంటే అదొక ఆటంకంగా వుంది కనుక అధికారికంగా ఏదో విధంగా మత ముద్ర బదులు రాజకీయ ముద్రవేయాలని చూస్తున్నారన్నది ఒక విమర్శ. గాడ్సే గతాన్ని తుడిచి వేసుకొనేందుకు అతడసలు ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని ప్రకటిస్తారు.హత్య సమయంలో అతను సంఘపరివార్‌లో లేడంటారు. అయితే గాడ్సే తమ్ముడు గోపాల్‌ గాడ్సే అసలు విషయాలు చెప్పాడు.’ నాధూరామ్‌, దత్తాత్రేయ, నేను, గోవింద్‌ సోదరులందరం ఆర్‌ఎస్‌ఎస్‌లో వున్నాం. మా ఇండ్లలో కంటే మేం ఆర్‌ఎస్‌ఎస్‌లోనే పెరిగామని నేను చెప్పగలను, అది మాకు ఒక కుటుంబం వంటిది.ఆర్‌ఎస్‌ఎస్‌లో నాధూరామ్‌ ఒక మేధోపరమైన కార్యకర్తగా ఎదిగాడు, తన ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వైదొలిగినట్లు చెప్పాడు, ఎందుకంటే గాంధీ హత్య తరువాత గోల్వాల్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో ఇబ్బందుల్లో వుంది కనుక అలా చెప్పాడు. అతను ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలి పెట్టలేదు. వెళ్లు, గాంధీని హత్యచేయమని ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానించలేదని చెప్పుకోవచ్చు తప్ప అతనితో మాకేమీ సంబంధం లేదని చెప్పకూడదు.ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తూనే 1944 నుంచి హిందూ మహాసభలో కూడా నాధూరామ్‌ పని చేయటం ప్రారంభించాడు.’ అని పేర్కొన్నాడు. గోపాల్‌ గాడ్సే చెప్పింది వాస్తవమే అనటానికి నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వుత్తర ప్రత్యుత్తరాల్లోని అంశాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆరవ వాల్యూమ్‌ పేజి 56లో ‘సావర్కర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసిన మతోన్మాద విభాగం హిందూమహాసభ కుట్ర చేసి అమలు చేయించింది’ అని పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టు ఏజి నూరాని తన పుస్తకంలో వివరించాడు.

దేశ రాజకీయ చిత్రపటం నుంచి గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్య్రం పోరాటనాయకులను తొలగించాలని బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. హత్యకేసు విచారణ సమయంలో గాడ్సే చెప్పిన అంశాల కొనసాగింపే ఇది. జిన్నాకు గాంధీ తదితరులు లంగిపోయారని గాడ్సే ఆరోపించాడు. చెవులప్పగించిన వారికిది వినసొంపుగానే వుంటోంది. ఎందుకంటే గత 70సంవత్సరాలుగా మధ్యలో కొంత కాలం మినహా గాంధీ, నెహ్రూల వారుసులుగా చెప్పుకొనే వారే అధికారంలో కొనసాగారు. అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా సమాజంలోని వివిధ తరగతులలో అసంతృప్తి నెలకొంది. దీన్ని సొమ్ము చేసుకోవాలంటే ఒక దగ్గర మార్గం సకల అనర్ధాలకు గాంధీ, నెహ్రూవారసులే కారణం అంటే చాలు. సరిగ్గా జర్మనీలో హిట్లర్‌ కూడా అదే చేశాడు. ఐరోపా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని పంచుకొనే పోటీలో జర్మన్‌ సామ్రాజ్యవాదులు వెనుకబడ్డారు. అందువలన మొదటి ప్రపంచయుద్ధంలో విజేతలు జర్మనీని దెబ్బతీసేందుకు అవమానకరమైన షరతులతో సంధిని రుద్ధారు. దాన్ని చూపి జనాన్ని రెచ్చగొట్టి హిట్లర్‌ రాజకీయంగా ఎదిగాడు. ఇప్పుడు బిజెపి చేస్తోంది అదే. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో ఎలాంటి మార్పు లేదు. అవే దివాలా కోరు విధానాలను అమలు జరుపుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనం ప్రారంభమైన సమయంలో అంకెల గారడీ చేసి నరేంద్రమోడీ సర్కార్‌ లేని అభివృద్ధిని చూపింది. దేన్నయినా మూసిపెడితే పాచి పోతుంది. మూడు సంవత్సరాల కాలంలో అదే జరిగింది. తప్పుడు సలహాలు విని తాత్కాలికంగా అయినా కొన్ని మెరుపులు మెరిపించి మరోసారి ఓట్లను కొల్లగొడదామనే ఎత్తుగడుతో పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా తన జీవిత కాలమంతా వ్యతిరేకించిన జిఎస్‌టిని ముందు వెనుకలు ఆలోచించకుండా బలవంతంగా అమలు జరిపించారు. ఆర్ధికాభివృద్ధి వెనుకపట్టు పట్టటం తాత్కాలికమే అని కొత్త పల్లవి అందుకున్నారు. దాని మంచి చెడ్డల గురించి మరోసారి చూద్దాం.

అసలు మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలేమిటి? అవి ఇప్పుడెలా వున్నాయో, వర్తమాన మేథావులు వాటిని ఎలా చూస్తున్నారో చూద్దాం. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నీతి నాయర్‌ గాంధీ జయంతి సందర్భంగా ఒక విశ్లేషణ చేశారు. దానితో ఎకీభవించాలా లేదా మరో కోణం నుంచి చూడాలా అనేది వేరే విషయం. అమె విశ్లేషణ సారం ఇలా వుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించటాన్ని కోట్లాది మంది చూశారు. గాంధీకి ఇష్టమైన ప్రార్ధనలను రేడియో వినిపించి, నలుపు, తెలుపుల డాక్యుమెంటరీలను టీవీలలో ప్రసారం చేశారు. అయితే ఈ తీపి మాటలు, విధిలో భాగంగా వెల్లడించే శ్రద్ధాంజలులు, జాతిపితకు సంబంధించిన వాస్తవాలను మూసిపెట్టేందుకే. అధికార భారత్‌లో వాస్తవానికి గాంధీ గతించారు.

మహాత్మాగాంధీ సంప్రదింపుల శక్తిని విశ్వసించారు. కాశ్మీరులో పరిస్ధితి నెత్తుటి మరకలా వుంది. సంప్రదింపులు లేవు,క్లుప్తంగా చెప్పాలంటే అధికారం పశుబలాన్ని ప్రయోగించింది. నిరాయుధనిరసనకారులపై భద్రతాదళాలు ప్రయోగించిన పిల్లెట్లతో వందలాది మంది అంధులయ్యారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఎన్ని సత్యాగ్రహాలు చేసి వుండేవారు? భిన్న సామాజిక తరగతులను ఐక్యం చేసేందుకు తన ప్రార్ధనా సమావేశాలలో గాంధీజీ బైబిల్‌, ఖురాన్‌, గీతలోని అంశాలను ప్రస్తావించేవారు, ఇప్పుడు హిందూ చిహ్నలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఏ పధకమైనా పేదలకు లబ్ది చేకూర్చిందా లేదా అన్నదే దాని విజయానికి గీటురాయిగా తీసుకోవాలన్నది గాంధీ వైఖరి. మోడీ తన పుట్టిన రోజు కానుకగా జాతికి అంకితం చేసిన సర్దార్‌ సరోవర్‌ డామ్‌ నీటిని నాలుగు రాష్ట్రాలలో రువు ప్రాంతాలకు వుద్దేశించగా దానికి భిన్నంగా దామాషాకు వ్యతిరేకంగా కోకాకోలా, టాటానానో కారు వంటి కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ల అవసరాలకు అనుగుణ్యంగా నీటిని మళ్లిస్తున్నారు. అత్యంత పేదలైన గిరిజనుల నివాసాలు మునిగిపోయాయి, దశాబ్దాలు గడిచినా, పాకేజీలు ప్రకటించినా నిర్వాసిత గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. ప్రజాస్వామ్యంలో మీడియా పోషించాల్సన విమర్శనాత్మక పాత్రను గాంధీజి విశ్వసించారు. నేడు దేశంలో ప్రభుత్వ విమర్శకులను భయపెట్టే పద్ధతులను నిరంతరం అనుసరిస్తున్నారు. జర్నలిస్టులను హత్యచేయటం నుంచి స్వతంత్రంగా వ్యవహరించే సంపాదకులను రాజీనామా చేయించటం వరకు అవి వున్నాయి.

గాంధీ గోవధను వ్యతిరేకించినప్పటికీ హిందువేతరులపై ఒక మతాన్ని రుద్దటాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. హిందువులు బీఫ్‌ తింటారని, ఆవు చర్మాలతో వ్యాపారం చేస్తారని ఆయనకు బాగా తెలుసు. భిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలున్న ముస్లిం, పార్సీ, క్రైస్తవులు తదితర బహుళ సామాజిక తరగతుల గురించి గాంధీజి పదే పదే చెప్పారు. కానీ నేడు ఆయన ప్రాతినిధ్యం వహించినదానికి విరుద్దంగా గో రక్షకులు రాత్రి పగలూ వీధులలో తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చభారత్‌ కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. చీపుర్లు పట్టి మోడీ మంత్రులు ఫొటోలు తీయించుకోవటంలో చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్య నియమాలను పాటించటంలో లేదు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌ నుంచి రాట్నం వడుకుతున్న గాంధీ పొటోను తొలగించి నరేంద్రమోడీది చేర్చటం ఖాదీతో గాంధీ అనుబంధాన్ని కనిపించకుండా చేయటమే. గోరక్షకుల దాడులకు బలైన బాధిత కుటుంబాల ఇండ్లకు శాంతియుతంగా వెళ్లిన కార్యకర్తల కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా అక్టోబరు రెండున దేశవ్యాపితంగా మౌనంగా అయినప్పటికీ శక్తివంతంగా జరిపిన జర్నలిస్టుల నిరసనల్లో గాంధీ వున్నారు. ప్రపంచవ్యాపితంగా జరిగిన అనేక శాంతియుత నిరసనల్లో గాంధీ భావజాలం పని చేసింది.

గాంధీకి అధికారికంగా ఏర్పాటు చేసిన రాజఘాట్‌ స్మారక చిహాన్ని చూపేందుకు బస్సుల్లో స్కూలు పిల్లల్ని తీసుకు వెళ్లేవారు ఒక పధకం ప్రకారం మితవాద మతోన్మాది నాధూరామ్‌ గాడ్సే చేతిలో గాంధీ హత్యకు గురైన బిర్లా భవనాన్ని ఎందుకు చూపరు అని గాంధియన్‌ విద్యావేత్త కృష్ణకుమార్‌ 2007ఒక రచనలో ఆశ ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాడ్సే పేరును పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారు. భారతీయ, విదేశీ అతిధులు కూడా బిర్లా భవనాన్ని ఎవరూ సందర్శించరు. గాంధీ హత్యవెనుక వున్న కారణాలేమిటని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా చేసేందుకు హత్యజరిగిన నాటి నుంచి ఒక ‘నిశబ్ద ఒప్పందం’ జరగటమే దీనికి కారణం అయివుండాలని కృష్ణ కుమార్‌ నిర్ధారణకు వచ్చారు. గాంధీ హత్య జరిగిన తరువాత హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై దాడులు చేసి కార్యకర్తలను అరెస్టుచేసి వారి రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. తరువాత రికార్డులను నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం తొలగింపు, కార్యకర్తల విడుదల తరువాత వారు రహస్యంగా హిందూ సామాజిక తరగతిని పటిష్టపరిచేందుకు పనిచేస్తున్నారు. విరాళాలు వసూలు చేసేటపుడు రాతపూర్వక రికార్డులు నిర్వహించకూడదని నిర్ణయించారు. గాడ్సేకు మరణశిక్ష విధించిన న్యాయమూర్తులలో ఒకరైన జి.డి ఖోస్లా కొన్ని సంవత్సరాల తరువాత ‘ ఆరోజు కోర్టులో ప్రేక్షకులుగా వున్నవారు ఒక జూరీని ఏర్పాటు చేసి గాడ్సే అప్పీలు మీద విచారణ జరపమని దానికి అప్పగించి వుంటే గాడ్సే తప్పుచేయలేదని అత్యధిక మెజారిటీతో తీర్పు చెప్పి వుండేవారు’ అని పేర్కొన్నారు.

సంవత్సరాలు గడిచిన కొద్దీ అనేక రోడ్లకు మహాత్మాగాంధీ పేరు పెట్టారు, దేశమంతటా అనేక విగ్రహాలు నెలకొల్పారు తప్ప ఆయన సందేశాన్ని నిర్లక్ష్యం చేశారు. లౌకికవాదులుగా పిలుచుకొనే పార్టీలు 1977-79 మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్ధానం దొరికింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనతా పార్టీ రెండింటిలో ద్వంద్వ సభ్యత్వం కలిగి వుండటమనే సమస్యకారణంగా దేశంలోని తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కూలిపోయింది.( ఇప్పుడు బిజెపిగా ఏర్పడిన వారు తాము ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకొనేది లేదని జనతా పార్టీ నుంచి బయటికి వచ్చారు) రాజకీయాలు మరియు ఇటీవలి సంవత్సరాలలో సాగుతున్న రాజకీయ బేరసారాలలో దేశంలో గాడ్సే స్ధానం గురించి పరిశీలించటానికి ఏమాత్రం చోటులేదు. భగత్‌ సింగ్‌, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి గాంధీ సమకాలిక పెద్దలు వున్నప్పటికీ భిన్న తరగతుల మధ్యó మహాత్ముడి స్ధానంలో గాంధీ కొనసాగుతూనే వుంటారు.ఆయన అనుసరించిన, ఆచరించిన పద్దతులు వర్తమాన భారతంలో ఎన్నడూ లేనివిధంగా మరింతగా ప్రతిబింబించాలి.’ నీతి నాయర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించినా, విబేధించినా అవి ఆలోచనాత్మకంగా వున్నాయని చెప్పవచ్చు. మూసిపెట్టటానికి ప్రయత్నించకుండా మరిన్ని కోణాల నుంచి ఈ అంశాలను చర్చించవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తూటాలు గౌరీ లంకేష్‌ దేహాన్నే కానీ భావాలను తాకలేవు !

13 Wednesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, Left politics, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

attack on journalists, BJP's social media, dissent, Gouri lankesh, RSS

ఎం కోటేశ్వరరావు

మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాల వ్యతిరేక పోరులో హేతువాద, వామపక్ష వాదిగా గళమెత్తి, కలంతో కదనరంగంలోకి దూకిన షీరో(వీర నారి) జర్నలిస్టు గౌరీ లంకేష్‌. తన ప్రాణాలను తృణపాయంగా అర్పించింది. తనను ఎప్పుడైనా మతోన్మాదులు అంతం చేస్తారని తెలిసినా ఏనాడూ వెన్ను చూపని ధీశాలి. దుండగుల తూటాలు ఆమె దేహాన్ని చీల్చాయి తప్ప భావాలను కాదని దేశవ్యాపితంగా వెల్లడైన నిరసన వెల్లడించింది. నేనూ గౌరినే ఏం చేస్తారో చేయండి అంటూ ఎలుగెత్తి చాటారు. గౌరి నివాసం ముందున్న సిసిటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సెప్టెంబరు ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన ఆమెపై మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగుడు తుపాకితో కాల్చిచంపాడు. సమీపంలో ఇంకా ఎవరైనా వున్నారా అన్నది విచారణలో తేలాల్సి వుంది. మతోన్మాద వ్యతిరేక, హేతువాద, సంస్కరణవాదం, వామపక్ష భావాల నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి సరసన గౌరి చేరింది. అభ్యుదయం, హేతువాదం, ప్రజానుకూల జర్నలిస్టు కలం, గళం పరంపరలో దేశంలో మతోన్మాదుల తూటాలకు బలైన తొలి మహిళగా చెప్పవచ్చు. తన ప్రాణాలకు ఏక్షణంలో అయినా ముప్పు వుందని, కొద్ది రోజులుగా ఎవరో వెంటాడుతున్నారని పసిగట్టినప్పటికి ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి సాయం ఆమె కోరలేదు. అలాంటి రక్షణలు ప్రాణాలను కాపాడలేవు అనే లోకానుభవంతో ఆమె ఆ నిర్ణయానికి వచ్చి వుండవచ్చు.

కాషాయ పరివారం, వారితో అంటకాగుతున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు తప్ప గౌరి హత్యపై దేశవ్యాపితంగా జర్నలిస్టు, ప్రజా సంఘాలు, వామపక్ష, అభ్యుదయ పార్టీలు, సంస్ధలు, శక్తులు తీవ్రనిరసన తెలిపాయి. నిందితులను గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. అనేక మంది సీనియర్‌ జర్నలిస్టులు దేశంలో నెలకొన్న పరిస్ధితుల తీరుతెన్నుల పట్ల నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జర్నలిస్టుల ప్రాణాలు తీయటం కొత్త కాదు. మన దేశంలో కూడా అనేక మంది బలయ్యారు.రాజకీయ నేతల, గూండాల, మాఫియాల అవినీతి అక్రమాలను బయట పెట్టే క్రమంలో జర్నలిస్టులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితిలో గడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలలో (2013 నుంచి) ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.అనేక మందిపై హత్యాయత్నం జరిగింది. దేశమంతా గౌరీ లంకేష్‌ హత్యకు నిరసన తెలుపుతున్న సమయంలోనే బీహార్‌లో పంకజ్‌ మిశ్రా అనే జర్నలిస్టుపై అధికారపక్ష ఎంఎల్‌ఏ అనుచరులు తుపాకులతో కాల్పులు జరిపారు.

జర్నలిస్టులపై జరిగిన దాడుల కేసులను పరిశీలిస్తే అవి కాంగ్రెస్‌, బిజెపి,జెడియు, ఎస్‌పి,టిడిపి మరొకటా అన్నది పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ దుండగులు చెలరేగిపోతున్నారు. వత్తిడి కారణంగా కేసులు నమోదు చేయటమే తప్ప వాటిలో ఎలాంటి పురోగతి వుండటం లేదు. డేరా బాబా గుర్మీత్‌ హత్య చేయించిన సిర్సా జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి కేసు పదిహేను సంవత్సరాలుగా నడుస్తూనే వుంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అనేక వుదంతాలలో చార్జిషీట్లు పెట్టటంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకలో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన కలుబుర్గి కేసులో ఇంతవరకు నిందితులెవరో తేలలేదు, దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే కేసులలో నిందితులు గోవా కేంద్రంగా పనిచేసే హిందూత్వ సనాతన సంస్ధకు చెందిన వారని సిబిఐ కేసులు దాఖలు చేసింది. ఇలాంటి వుదంతాలలో నేరగాళ్లకు శిక్షలు పడటం ఎంత అవసరమో అంతకంటే ఇటువంటి ధోరణులను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలు, శక్తులను ఎదుర్కోవటానికి సంఘటితం కావటం అంతకంటే ముఖ్యం. అసహనం, విమర్శలను తట్టుకోలేని ధోరణి, భిన్నాభిప్రాయాలను సహించకపోవటం దేశంలో క్రమంగా మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని గౌరవించటం ప్రజాస్వామ్య లక్షణం. నిత్యం భావ ప్రకటనా స్వేచ్చ హక్కు గురించి పారాయణం చేసే వారు తమ దాకా వచ్చే సరికి హరిదాసు-ధర్మపత్ని-వుల్లిపాయ కథలో మాదిరి వ్యవహరిస్తున్నారు.నేతి బీరలో నెయ్యి మాదిరి తయారవుతున్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీనంగా వున్న కర్ణాటకను దక్షిణాదిలో మతోన్మాద శక్తులు ఒక ప్రయోగశాలగా చేసుకున్నాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, అనేక హిందూ మతసంస్ధల మద్దతు కారణంగా కారణంగా బిజెపి ఆ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఆ పార్టీ రూపకల్పన చేసింది. ఈ పూర్వరంగంలో గౌరీ వంటి అనేక మంది మతోన్మాదశక్తులకు వ్యతిరేక గళం విప్పుతూ కంట్లో నలుసుగా మారారు. వాటన్నింటిని ఆమె తన పత్రికలో ఎప్పటి కప్పుడు రాస్తూ హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమెను కొంత మంది అనుసరించారని, రాకపోకలను నిర్ధారించుకున్నారని ఆమె హత్య అనంతరం వెల్లడైన సమాచారాన్ని బట్టి సరిగ్గా ప్రముఖ రచయిత ఎంఎం కలుబర్గిని హత్య చేసిన రోజే గౌరిని కూడా చంపివేయాలని పధకం వేశారా అనిపిస్తోంది. సరిగ్గా రెండు సంవత్సరాల ఐదు రోజుల తరువాత వారి పధకం నెరవేరింది. ఇద్దరి హత్యలకు అనేక సామీప్యాలున్నాయి.కుటుంబ సమస్యల కారణంగా కలుబర్గిని హత్య చేశారని వెంటనే ప్రచారం జరిగింది. గౌరిని నక్సలైట్లు చేసి వుండవచ్చని ప్రచారం చేశారు.

అనేక ప్రాంతాలలోని కోర్టులలో తప్పుడు కేసులు బనాయించటం మతోన్మాద శక్తులు అనుసరించే ఎత్తుగడలలో ఒకటి. ఎవరైనా పదులకొద్దీ కేసులకు హాజరుకావటం మామూలు విషయం కాదు. అయితే కోర్టులున్న ప్రతిచోటా అలాంటి కేసులను వుచితంగా చేపట్టటానికి మతశక్తులకు లాయర్లు వున్నారు. లుబుర్గి హత్య జరిగే నాటికి ఆయనపై ఇరవై వరకు వివిధ ప్రాంతాలలో పరువు నష్టం కేసులు దాఖలై వున్నాయి. అదే విధంగా గౌరి మీద కూడా(15) వున్నాయని ఆమె న్యాయవాది వెంకటేష్‌ హూట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె కోర్టు కేసులకు వెళ్లిన ప్రతి చోటా కోర్టు వెలుపల సభలు, సమావేశాలు జరపటానికి అ అవకాశాలను వినియోగించుకొనే వారని ఆయన తెలిపారు. గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌, కలుబర్గిని ఎలాంటి నాటు తుపాకితో కాల్చి చంపారో సరిగ్గా అలాంటిదానితోనే గౌరిని కూడా చంపారు.నాలుగు వుదంతాలలోనూ దుండగులు మోటారు సైకిళ్లనే వుపయోగించి దగ్గరినుంచి కాల్చారు.పన్సారే, దబోల్కర్‌ కేసులలో ముద్దాయిలుగా తేలి పరారీలో వున్న ఒకడు 2009 గోవా పేలుళ్ల వుదంతంలో కూడా వున్నాడు.పన్సారే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సమీర్‌ గైక్వాడ్‌ బాల్యస్నేహితుడైన రుద్రపాటిల్‌ కలుబుర్గి కేసులో అనుమానితుడు, పరారీలో వున్నాడు.

హిందూత్వ శక్తులు 2004 నుంచి గౌరిని బెదిరిస్తున్నాయి. కేసులు బనాయిస్తున్నాయి.2016 నవంబరు 28న హుబ్లి జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆమెకు పరువు నష్టం కేసులో ఆరునెలల జైలు, జరిమానా విధించారు. అదే రోజు ఆమె బెయిల్‌ తీసుకొని సెషన్స్‌ కోర్టుకు అప్పీలు చేయాలని నిర్ణయించారు. తప్పు చేస్తే జర్నలిస్టులైనా మరొకరైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతర జర్నలిస్టులు దీనిని గమనంలో వుంచుకోవాలంటూ బిజెపి ఐటి విభాగ ప్రతినిధి జర్నలిస్టులను ఆ సందర్భంగా బెదిరించాడు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే 2008లో లంకేష్‌ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసం తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ సంపాదకురాలిపై ధార్వాడ బిజెపి ఎంపీగా వున్న ప్రహ్లాద్‌ జోషి, బిజెపి స్ధానిక నేత వుమేష్‌ దుషి క్రిమినల్‌ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. కోర్టు తీరు తెన్నుల గురించి తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని, ఆ కేసును బిజెపి నేతలు, మద్దతుదార్లు వుపయోగించుకున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని గౌరీ వ్యాఖ్యానించారు. తాను జైలుకు పోతానని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురైందని అన్నారు. ‘అదొక పెద్ద అంశమని నేను భావించలేదు, బిజెపి ఐటి విభాగం దీనినొక ఆయుధంగా చేసుకొని జర్నలిస్టులను బెదిరించటమే విభ్రాంతి కలిగించింది’ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్చ దేశంలో ఏ స్ధితిలో వున్నదో తన వుదంతం వెల్లడించిందన్నారు. అధికారంలో వున్న వారి భావజాలాన్ని వ్యతిరేకించిన లేదా విబేధించిన వారి నోరు నొక్కేందుకు చట్టాన్ని వినియోగించుకోవటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ ధోరణి ఎంఎం కలుబుర్గి హత్య అనంతరం పెరుగుతోందని చెప్పారు. ఈ హత్యను సమర్ధిస్తూ భజరంగ్‌ దళ్‌ కార్యకర్త భువిత్‌ షెట్టి హిందూయిజాన్ని విమర్శించిన వారు కుక్క చావు చస్తారంటూ ట్వీట్‌ చేశాడన్నారు. గతేడాది హరీష్‌ పూజారి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు, హరీష్‌ను ఒక ముస్లింగా పరిగణించి హత్య చేశారు.

గౌరీ లంకేష్‌పై కేసు వివరాల్లోకి వెళితే బిజెపి కార్యకర్తలు తనను మోసం చేశారంటూ ఒక నగల వ్యాపారి బిజెపి ఎంపీ జోషీ దగ్గరకు వెళ్లారు. ఆయన తమ కార్యకర్తలను సమర్ధించి న్యాయం చేయకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాపారి హెచ్చరించాడు. ప్రచురించిన వార్త సారాంశం ఇది. దీనిలో జోషి పరువుకు నష్టం కలిగించే అంశమేదీ లేదని, ఇదే వార్తను ఇతర పత్రికలు కూడా ప్రచురించాయని, అయినప్పటికీ తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని కేసు దాఖలు చేసినట్లు గౌరీ అన్నారు. తాను వార్తను ప్రచురించిన తరువాత జరిగిన ఎన్నికలలో జోషీ విజయం సాధించారని అలాంటపుడు పరువు పోవటం అనే ప్రశ్న ఎక్కడుందని అన్నారు. దుషీ విషయానికి వస్తే అతని మీద అనేక కేసులు దర్యాప్తులో వున్నాయని, పోవాల్సిన పరువేదో ఇప్పటికే పోయిందని, తమ పత్రికలో రాసిన వార్తతో అదనంగా పోయేదేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

అంతకు ముందు 1994లో హుబ్లీ ఈద్‌గాలో జాతీయ జెండాను ఎగురవేసి మతకొట్లాటలను రెచ్చగొట్టిన వుమాభారతిపై పెట్టిన కేసును వుపసంహరించేందుకు గౌరి తిరస్కరించారు.గత కొంత కాలంగా కర్ణాటకలో ఒక బలమైన సామాజిక తరగతిగా వున్న లింగాయత్‌లు తాము బసవన ధర్మాన్ని పాటించేవారం తప్ప హిందువులం కాదని, తమను ఒక ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానాలు చేసి సభలు జరుపుతున్నారు. గౌరి ఒక హేతువాది అయినప్పటికీ బసవన చెప్పిన అనేక అంశాలు తన భావాలకు దగ్గరగా వున్నందున తాను వారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులకు కంటగింపుగా మారింది. కొన్ని పార్టీలను నిషేధించాలని కోరుతూ బిజెపి చలో మంగళూరు పేరుతో సెప్టెంబరు ఐదవ తేదీన ఒక రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమాన్ని గౌరి తీవ్రంగా విమర్శించారు.(అదే రోజు ఆమెను దుండగులు బలిగొన్నారు) అంతకు ముందు నెలలోనే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో పర్యటించి వెళ్లారు.

రెండు సంవత్సరాల క్రితం కలుబర్గిని హత్య చేసిన తరువాత కర్ణాటకలోని అనేక మందికి అదే గతి పడుతుందనే బెదిరింపులు వచ్చాయి.ఆ సందర్భంగా గౌరి,మరికొందరు ఒక జాబితాను తయారు చేసి ఎవరెవరిపై ఎన్నిసార్లు మతశక్తులు విద్వేష ప్రచారం, దాడులు చేశాయో, ఎవరికి ప్రాణహాని వుందో వెల్లడించారు.వారిలో మొదటి వ్యక్తిగా హేతువాది కెఎస్‌ భగవాన్‌,రచయితలు యోగేష్‌ మాస్టర్‌,బంజగారే జయప్రకాష్‌, తాను నాలుగవదానినని వెల్లడించారు. మతశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కర్ణాటక కోము సౌద్ర వేదికను ఏర్పాటు చేయటంలో గౌరి ముఖ్యపాత్ర పోషించారు.

నీ స్నేహితులను చూస్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్పవచ్చన్నది ఒక నానుడి. దాన్ని కొద్దిగా మార్చి నువ్వు సామాజిక మీడియాలో ఎవరిని అనుసరిస్తున్నావో చూస్తే నీవెలాంటి వాడివో చెప్పవచ్చన్నది న్యూ నుడిగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న కొంత మంది ట్వీట్లు గౌరి హత్యను సమర్ధించేవారిగా వున్నట్లు తేలటంతో, అసలు నరేంద్రమోడీని అనుసరించటం మానివేయాలనే ప్రచారం ప్రారంభమైంది. అసలే అన్ని రంగాలలో నరేంద్రమోడీ సర్కార్‌ విఫలం అయినట్లు అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. మీరు కన్న కలలను నిజం చేసేందుకు చేపట్టిన ఈచర్యకు యాభై రోజులు ఓపిక పట్టండి, ఫలితాలు కద్దనిపించకపోతే నన్ను వురి తీయండి అని మోడీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు ఘోరంగా విఫలమేగాక దేశానికి నష్టదాయకంగా మారిందని రుజువైంది. దాని గురించి తేలు కుట్టిన దొంగ మాదిరి ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈలోగా నరేంద్రమోడీ ఎలాంటి వారిని అనుసరిస్తున్నదీ వెల్లడి అయింది. దాంతో నష్ట నివారణ చర్యగా బిజెపి ఐటి విభాగం రంగంలోకి దిగింది. మోడీ ఎవరినైనా అనుసరిస్తున్నారంటే అర్ధం వారందరి ప్రవర్తన సరైనదే అని నిర్ధారణ పత్రం ఇవ్వటంగా భావించరాదని, ఎవరేం చేస్తారో ముందుగా ఎవరు వూహిస్తారంటూ, అనేక అవినీతి ఆరోపణలున్న రాహుల్‌ గాంధీని కూడా మోడీ అనుసరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. గౌరి హత్యను సమర్ధించేవారి వైఖరి తప్పని ఒక్క ముక్క కూడా ఆప్రకటనలో లేకపోవటం గమనించాల్సిన అంశం.

గౌరీ హత్య వార్త ఇంకా లోకానికి పూర్తిగా తెలియక ముందే దానితో తమకేమీ సంబంధం లేదని హత్య జరిగిన కొద్ది నిమిషాలలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఎవరు చంపారో తెలియకుండా హిందుత్వ సంస్ధలకు దానిని ఆపాదించవద్దని కొందరు ప్రచారం ప్రారంభించారు. కొందరు చేసిన పనులకు మొత్తం హిందువులకు ఆపాదించటం ఏమిటి అని మరి కొందరు, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్యచేసినపుడు ఈ మాదిరి స్పందన ఎందుకు వ్యక్తపరచరని మరి కొందరు, ఆ కోవకు చెందిన వారే నక్సలైట్ల అంతర్గత తగాదాలలో భాగంగా ఆమెను హత్య చేశారని, కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య అవినీతిపై కథనాన్ని రూపొందిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారని, ఇలాంటి ప్రచారం మొదలు పెట్టిన వారందరూ విషయాన్ని పక్కదారి పట్టించే యంత్రాంగంలో భాగం లేదా వారి వలలో పడ్డారన్నది స్పష్టం. ఏ ఆధారం లేదా నిర్ధారణ ప్రకారం నక్సలైట్లో, మరో కారణంతోనే హత్యచేసినట్లు కొందరు చెప్పినట్లు ? హిందూత్వ సంస్ధలు, చడ్డీవాలాలకు(ఆర్‌ఎస్‌ఎస్‌) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించకుండా వుంటే ఇది జరిగేది కాదని, ఆమె నా సోదరి వంటిది కానీ ఆమె రాతలను తాను అంగీకరించనని బిజెపి మాజీ మంత్రి జీవరాజ్‌ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటి? హిందుత్వ అంటే హిందూమతోన్మాదులకు పర్యాయపదంగా వాడుతున్న పదం తప్ప మొత్తం హిందువుల గురించి చెబుతున్నది కాదు. దానిని మొత్తానికి ఆపాదిస్తున్నారని చెప్పటం వక్రీకరణ. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్య చేసినపుడు ఎందుకు స్పందించరని ఆమాయకత్వం నటిస్తూ అడిగే ప్రశ్న ఒకటి. అక్కడ వారేమైనా తపస్సు చేసుకొనే మునుల్లా వున్నారా? పచ్చి గూండాల మాదిరి చేస్తున్న హత్యలు దాస్తే దాగేవా? ఎక్కడా లేనివిధంగా అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అంటే కమ్యూనిస్టులను అడ్డుకొంటున్నందుకు అంటారు.పేరుకు సాంస్కృతిక సంస్ధ, కమ్యూనిస్టులు రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నారు, వారిని అడ్డుకోవాల్సిన కర్తవ్యం వారెందుకు భుజానవేసుకున్నట్లు? కమ్యూనిస్టుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌వారు కత్తులు ఝళిపిస్తుంటే కమ్యూనిస్టులు గులాబీలు విసురుతారా ?

ఎవరేమన్నారు ?

కేంద్ర ప్రభుత్వ పరోక్ష మద్దతుతో మితవాద శక్తులు పెంచి పోషించిన విపరీత అసహన సంస్కృతికి మరో రుజువు గౌరీ లంకేష్‌ హత్య. నాలుగు హత్యలు ఒకే తీరునజరగటం అదే విధంగా వారి సారూప్యతను ఎవరూ చూడకుండా వుండలేరు. గోవింద పన్సారే ఒక కమ్యూనిస్టు, నరేంద్ర దబోల్కర్‌ ఒక హేతువాది, ఎంఎం కలుబుర్గి ఒక సంస్కరణవాది, గౌరీ లంకేష్‌ జంకు గొంకులేని ఒక జర్నలిస్టు, సామాజిక కార్యకర్త. భారత్‌లో మత ఫాసిస్టుల లక్ష్యం ఎవరో ఇది చూపుతున్నది. అయితే బెదిరింపులు లేదా హత్యలు స్ధిరచిత్తంతో వుండే వారి గళాలను, మార్పును కోరుకొనే వారిని నిలువరించలేవు. మన లౌకిక, సోషలిస్టు విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను నులిపివేయాలని ప్రయత్నించే చీకటి శక్తులతో పోరాడాలనే మన నిర్ణయాన్ని ఇలాంటి ప్రతి పిరికి చర్య మరింత గట్టిపరుస్తుంది.

కె సచ్చిదానందన్‌

గౌరి హత్య ఒక వ్యక్తిని హత్య చేయటం కంటే పెద్దది, అది భావ ప్రకటనా స్వేచ్చ,విబేధించే హక్కు,ప్రజాస్వామిక పౌరసత్వాలపై జరిగిన దాడి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది భావజాలాల సంఘర్షణ. మా దారికి రాకపోతే నీ అంతం చూస్తామని చెప్పటమే ఈ హత్య. దేశ ప్రజాజీవనంలో ప్రముఖ పాత్రపోషించే మహిళలకు ఇదొక ప్రమాదకర హెచ్చరిక. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ విమర్శకులు, నిరసన వ్యక్తం చేసే వారిపై ప్రత్యక్ష హింసాకాండతో ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టాలని చూసే పాలకులకు ప్రతిఘటన,తిరస్కరణను రెట్టింపు చేస్తుంది.

అనన్య వాజ్‌పేయి

భారతీయ పౌరుల హత్యలను చూస్తూ వున్న మీరు ఏ దేశానికి చెందిన వారని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలచుకున్నాను. ఈ రక్తపాతాన్ని ఆపుతారా లేక కొనసాగనిస్తారా? మీరు చర్య తీసుకొనేందుకు ఇంకా ఎన్ని శవాలు లేవాలి.ఈ దేశం మహాత్మాగాంధీది, ఆయన అంతేవాసులు, భావ ప్రకటనా స్వేచ్చకు హామీ ఇచ్చిన జవహర్‌లాల్‌ నెహ్రూది. చరిత్ర నుంచి వారి పేర్లను తుడిచి వేసే పనిలో మీరు తీరికలేకుండా వున్నారు, కానీ మీరు స్వేచ్చను హరించలేరు.

నయనతార సెహగల్‌

గౌరి దారుణ హత్యను బిజెపి ఖండిస్తున్నది. ఒక జర్నలిస్టు లేదా మావోయిస్టు మరియు నక్సలైట్ల హత్యలను ఖండించాల్సిందే, వాటికి వ్యతిరేకంగా గొంతెత్తి, గట్టిగా ఖండిస్తున్న నా వుదారవాద స్నేహితులందరూ కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా కేరళలో బిజెపి కార్యకర్తలను అనేక మందిని హత్య చేస్తుంటే ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నిస్తున్నా?

రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర మంత్రి

గౌరి హత్య వెనుక నక్సల్స్‌ హస్తం వుందని అనుమానిస్తున్నా. అది కావచ్చు, కాకపోనూ వచ్చు.ఆమె పూర్వరంగం దృష్ట్యా ఈ చర్య మితవాద వుగ్రవాదులదీ కావచ్చు లేదా మావోయిస్టులదీ కావచ్చు

ఇంద్రజిత్‌ లంకేష్‌( గౌరి సోదరుడు)

నక్సల్స్‌కు సంబంధం వుందని నేను అనుకోవటం లేదు. ఆమె భావజాలం మితవాదశక్తులకుతీవ్ర వ్యతిరేకమైనది కనుక వారి పనే అని నేను చెప్పదలచుకున్నాను. ఇది వ్యక్తిగతమైనది కాదని నాకు తెలుసు. ఇది మౌలికంగా ఒక ఆలోచనను హతమార్చటం. వారు ఒక ఆలోచన, ఒక వుద్యమాన్ని అంతం చేయాలని ఆలోచించారు.

కవితా లంకేష్‌( గౌరి సోదరి)

బెంగాల్‌లో హిందువులు మరియు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు వధించబడుతుంటే ఆమె, ఆమె వంటి ధైర్యవంతమైన జర్నలిజం ఎక్కడా కనపడలేదు. ఆ లం…పట్ల ఏ మాత్రం సానుభూతి లేకుండా శరీరాన్ని చీల్చివేసి, ఆపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేసి వుండాల్సి వుంది.ఆమె, ఆమె వంటి జర్నలిస్టులనబడే సాగరిక ఘోష్‌, శోభాడే, అరుంధతీరాయ్‌, కార్యకర్తలు కవితా కృష్ణన్‌,షీలా రషీద్‌, వుమర్‌ ఖాలిద్‌, కన్నయ్య కుమార్‌ వంటి వారికి ఇదే తగినది, వారిని లేపేయాల్సిన జాబితాలో పైన పెట్టాలి.

జర్నలిస్టులు, కార్యకర్తల ముసుగులో వున్న జాతి వ్యతిరేకులకు గౌరీ లంకేష్‌ కాల్చివేత ఒక వుదాహరణగా చేద్దాం. ఇటువంటి హత్య చివరిదని భావించటం లేదు, జాతి వ్యతిరేకులందరినీ వరుసగా లేపేసే కార్యక్రమం వుండాలి

( రెండు ఫేసుబుక్‌ పోస్టులలో విక్రమాదిత్య రానా పేరుతో వున్న అంశాలివి.హిందూత్వ శక్తులు సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల సారాంశమిదే. అలాంటి వారిని, వారి పోస్టులను నరేంద్రమోడీ అనుసరిస్తున్నారు)

నువ్వు అనుసరించేవారెవరో చూస్తే నువ్వేంటో తెలుస్తుంది

తమ భావజాలంతో విబేధించే వారిపై ద్వేషం ఎలా వెళ్లగక్కుతున్నారో, ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో దిగువ వుదాహరణ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘అనేక మంది గౌరీ లంకేష్‌ గురించి వ్యతిరేకంగా సానుకూలంగా పోస్టులు పెట్టారు.నేను ఎన్నడూ గౌరీ లంకేష్‌ను కలుసుకోలేదు, ఆమె గురించి వినలేదు, ఈ ట్వీట్‌ చేసేంత వరకు నేను ఒక అనామకుడిని. కొంత మంది దీనికి రాజకీయ రంగు పులిమి వివాదాన్ని సృష్టించారు. ఇప్పుడు నాకు గుర్తు తెలియని ఫోన్లు వస్తున్నాయి, అభినందిస్తున్నవారు, నిందిస్తున్నవారూ వున్నారు ‘ అని చెప్పాడు సూరత్‌కు చెందిన 38 సంవత్సరాల బట్టల వ్యాపారి నిఖిల్‌ దధిచ్‌. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అతనితో మాట్లాడి వార్త ప్రచురించింది) కొద్ది రోజుల క్రితం తన ట్విటర్‌ ఖాతా వివరాలలో ఇతర విషయాలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ అనుసరించే గౌరవం పొందిన వ్యక్తిని అని రాసుకున్నాడు. గౌరీ గురించి ఏమీ తెలియకపోయినా కొంతమంది పెట్టిన పోస్టులను చూసి అతగాడు గుజరాతీలో పెట్టిన పోస్టులో ‘ ఒక లం…, ఒక కుక్క చచ్చింది, పందులు ముక్త కంఠంతో గోల చేస్తున్నాయి ‘ అని రాశాడు. ఇది ఒక సాధారణ ట్వీట్‌ అని కూడా ఎక్స్‌ప్రెస్‌ విలేకరితో చెప్పుకున్నాడు. పెళ్లాం, ఇద్దరు పిల్లలతో కుటుంబం వున్న ఒక వ్యక్తి సంస్కారం ఇది. ఒక వ్యక్తి గురించి తనకేమీ తెలియకపోయినా గుడ్డిగా తోటివారితో కలసి రాళ్లు వేసే ఇతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు, రోజూ శాఖలకు వెళుతుంటాడట. ఇలాంటివి చూసినపుడు నువ్వు మనిషివా ఆర్‌ఎస్‌ఎస్‌ వాడిగా అని ప్రశ్నించటం సహజం. సంఘపరివార్‌ నుంచి ఒక సందేశం ఏదైనా వెలువడితే దాని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ప్రచారం చేయాలన్న ఆదేశం లేదా పధకం లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఏకత, శీలము అంటూ నేర్పేది, నేర్చుకుంటున్నది ఇలాంటివా? ఇంతటి ఘనకార్యం చేసిన ఇతగాడిని అనుసరించే వారు మూడు రోజుల్లో పెరిగారంటే దేశంలో ద్వేష పూరిత ధోరణులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఈ ఘనుడిని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నాడని మీడియాలో గుప్పుమనటంతో తన వివరాల నుంచి ప్రధాని మోడీ అనుసరిస్తున్న గౌరవం పొందిన వాడిని అనే దానిని తొలగించి హిందూ జాతీయవాదని అని ప్రకటించుకున్నాడు. అంటే హిందూ జాతీయవాదులంటే ఎలాంటి వారో స్వయంగా ప్రకటించుకున్నాడు.

ఈ ఘనుడిని అనుసరించేవారిలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, వుత్తర గుజరాత్‌ బిజెపి మీడియా విభాగనేత పరాగ్‌ షేత్‌ కూడా వున్నారు. దధీచ్‌ ట్వీట్‌ గురించి అడిగిన ప్రశ్నకు పరాగ్‌ స్పందిస్తూ ‘ మీరు ట్వీట్‌ అనంతరం వెలువడిన వ్యాఖ్యలను దానికి జోడిస్తే అప్పుడు నేను అదొక అసహ్యకరమైన ట్వీట్‌ అని తీవ్రంగా ఖండించాలంటాను’ అన్నాడు. అయినప్పటికీ నేను ట్విటర్‌పై అతనిని అసుసరించటం మానుకోబోవటం లేదు. సామాజిక మీడియాలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుసరించటం అంటే రెండోవారి ప్రవర్తనపై సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు కాదు.సామాజిక మీడియాలో జరుగుతున్నదాని ప్రకారం ఒకసారి ఎవరైనా ఒకరిని అనుసరిస్తే తరువాత అనుసరించకపోవటం అంటూ వుండదు.’ అని సమర్ధించుకున్నాడు.

లాటిన్‌ అమెరికా అనుభవాలు

1970,80 దశకాలలో లాటిన్‌ అమెరికాలోని వామపక్ష భావజాలం, మానవహక్కుల వుద్యమకార్యకర్తలను పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా సిఐఏ ఆపరేషన్‌ కండోర్‌ పేరుతో పెద్ద హంతక కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఒక అంచనా ప్రకారం చిన్న పెద్ద నాయకులు అలాంటి వారు 50 వేల మంది అదృశ్యం లేదా హత్యలకు గురయ్యారు. ఇప్పటికీ ఎన్నో వేల మంది విషయం విడిపడని రహస్యంగానే వుంది. ఒక్క అర్జెంటీనాలోనే అలాంటి వారు ఏడు నుంచి 30వేల మంది వరకు వున్నారని అంచనా. మన దేశంలో కూడా అదే దశకాలలో తలెత్తిన వామపక్ష వుగ్రవాదులను అణచేందుకు పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయించారు. అందుకు పాల్పడిన పోలీసులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. ఇదొక భాగమైతే తమ చేతికి మట్టి అంటకుండా తమ భావజాల వ్యతిరేకులను అంతం చేయించేందుకు కిరాయి మూకలను వినియోగించిన అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ పద్దతులను మన దేశంలో కూడా అమలు చేస్తున్నట్లు గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన కొన్ని వుదంతాలు స్పష్టం చేశాయి. జర్నలిస్టుల హత్యలకు కూడా అదే పద్దతిని ఆయాశక్తులు అనుసరించినట్లు చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికా దేశాల్లో ఇలాంటి హత్యలకు పాల్పడిన శక్తులు వాటిని పెంచి పోషించిన పాలకుల పేర్లను ప్రస్తావించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు. అత్యధిక సందర్భాలలో నియంతల, సిఐఏ కధనాలకే ప్రాధాన్యత ఇచ్చి జనం ముందు పెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లాటిన్‌ అమెరికాను తన పెరటి తోటగా మార్చుకొనేందుకు అమెరికా ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ప్రస్తుతం మన దేశంలో తమ భావజాల వ్యతిరేకుల నోరు మూయించేందుకు మితవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి, వాటికి కేంద్రంలోని ప్రభుత్వమద్దతు వుందని ప్రతిపక్షాలు, అనేక మంది మేధావులు, సంస్ధలు విమర్శిస్తున్నాయి. అలాంటి వారిపై దాడులు, హత్యలు జరిగినపుడు పాలక పార్టీ లేదా దానికి మద్దతు ఇచ్చే సంస్ధల వాదనల తీరు వాటిని ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా వుంటున్నాయి. మీడియా మొత్తం మీద పాలకవర్గ ప్రయోజనాలకే తోడ్పడుతోంది. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో కమ్యూనిజం నుంచి రక్షించేందుకు తాము పూనుకున్నట్లు నియంతలు ప్రకటనలు చేశారు. ఇక్కడ కమ్యూనిస్టులు, అభ్యుదశక్తులు అంతపెద్ద శక్తిగా లేనందున అలాంటి ప్రకటనలు లేవుగానీ చాపకింద నీరులా తమ పని తాము చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌

12 Tuesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

fake news, Gouri lankesh, Narendra Modi, RSS

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందుత్వ పేరుతో హత్యపై సంబరాలు నీచం !

11 Monday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

attack on journalists, Gouri lankesh, Hindu supremacy, hindutva, Journo murder

                                                          వాడ్రేవు చిన వీర భద్రుడు

మృత్యువును చూసి కాదు నేను

జీవితాన్ని చూసి జంకుతున్నాను

హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం

చూసి జంకుతున్నాను

మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను

బైరాగి ( ఆగమగీతి:నాకు చావులేదు)

గౌరీ లంకేష్‌ హత్య ఒక విషయాన్ని చాలా బిగ్గరగా, మనం ఎక్కడ వినకుండా పోతామో అన్నంత బిగ్గరగా, మన చెవులు చిల్లులు పడేట్లుగా, భరించలేనంతగా ఘోషిస్తోంది. అదేమంటే: మనం రాజకీయంగా సరే, సాంస్కృతికంగా కూడా పతనం అంచులకు చేరుకున్నామని.

రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత ఇంటికి వస్తున్న జర్మన్‌ సైనికులకు( ఇంటికి తిరిగి రాగల అదృష్టం నోచుకున్నవాళ్లు) తమ పదజాలమంతా హఠాత్తుగా మాయమైనట్లు అనిపించిందట.’దేశం’, ‘కుటుంబం’, ‘మనిషి’, ‘ప్రేమ’, ‘మానవ సంబంధాలు’ ఈ మాటలకు అర్ధం లేదని అనిపించిందట.

గౌరిని హత్య చేసిన మర్నాడే హత్యను ఖండించకపోగా, మరణానికి చింతించకపోగా, ఈ అమానుషాన్ని ప్రతి ఒక్కరూ తమ మీద తీసుకొని ఎంతో కొంత ప్రాయచిత్తం ప్రకటించకపోగా, సోషల్‌ మీడియాలో నడచిన, నడుస్తున్న కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి, భయపెడుతున్నాయి. మనం ఏ దేశంలో వున్నాం ? ఏ విలువల గురించి ఇంతకాలం గర్విస్తూ వచ్చాం? ప్రాచీన కాలం నుంచి ఎవరిని ఆదర్శాలుగా ప్రకటించుకుంటూ వచ్చాం? నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ చేసిన హత్యకన్నా, నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ మాట్లాడుతున్న ఈ మాటలు నన్నెక్కువ కలవరపెడుతున్నాయి.

దుర్మార్గమైన ఈ రాతలు చదివి ఎందరో యువతీ యువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు తామేదో మహత్తర హిందూ సంస్కృకి వారసులమని, తమ మతానికి సంస్కృతికి ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతోందని, అలాంటి ఒక ప్రమాదకరమైన మనిషిని చంపేస్తే వీళ్లంతా ఎందుకిట్లా ఖండిస్తున్నారని, దు:ఖిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చెప్తారు వీళ్లకి ? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికి, అనాది కాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవన విధానానికి సంబంధమే లేదని, అసలు ‘హిందుత్వం’ వేరు, హిందూ జీవన విధానం వేరని, అసలు హిందూ మతమంటూ ఒకటి లేనే లేదని, అసలు అటువంటి మతమంటూ ఒకటుందని అనుకున్నా ఇలాంటి అమానవీయ మిలిటెంట్‌ ధోరణుల్ని అది గతంలో ఇంత నిస్సిగ్గుగా చూపించి వుండలేదని, ఇప్పటి ఈ దుర్మార్గ స్వరూపం గ్లోబల్‌ పెట్టుబడికి, రాజకీయ కట్టుకథకి పుట్టిన విష పుత్రిక అని ఎప్పుడు గుర్తిస్తారు !

మరొక మాట కూడా చెప్పాలి. నేను కూడా హిందువునే, కానీ నా మతానికి బయటి మతాల వలన ప్రమాదం వుందని నాకెప్పుడూ అనిపించలేదు. ఏమతమైనా ఆ మతం పేరు చెప్పకుండా దాన్ని అనుసరించలేని ఆత్మవంచన వల్ల, కాలక్రమంలో సంతరించుకొనే దురాచారం వల్ల ప్రమాదంలో పడుతుంది తప్ప బయటివాళ్ల వల్ల కాదు. ఏమతాన్నయినా కాపాడగలిగేది ఆ మతం ప్రబోధించే మంచి విషయాల్ని అనుసరించగలిగే వాళ్లేతప్ప రాజకీయ నాయకులు, గూండాలు కాదు.

నేనీ మాటలు రాస్తే నేను ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా నాకు తెలుసు. అన్నింటికన్నా ముందు అడిగే ప్రశ్న: మరి వామపక్ష తీవ్రవాదులు అమాయకుల్ని చంపితే నువ్వెందుకు మాట్లాడలేదు అని, కేరళలోనో మరోచోటనో ఎవరో ఎవరినో చంపుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదని. హింస ఎక్కడైనా హింసే, ఎవరు చేసినా హింసనే. కత్తితో కుడివైపు నుంచి పొడిచినా, ఎడమవైపు నుంచి పొడిచినా కారేది రక్తమే, దు:ఖమే. కానీ నేను ఈ దేశంలో ఇంతదాకా చూసిన హింసకి, ఈ హింసకీ పోలికనే లేదు. గతంలో ఎవరైనా ఎవరినైనా చంపితే ఎంతో కొంత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు, చివరికి గాడ్సే కూడా తన వాంజ్మూలంలో గాంధీ పట్ల ఎంతో కొంత సానుభూతి చూపకుండా వుండలేకపోయాడు. కానీ ఈ హత్యని ఇట్లా సెలబ్రేట్‌(పండుగ) చేసుకుంటున్న హీన సందర్భాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా హిందూత్వం పేరిట.

ఆమె హత్యను ఎవరు ఖండించారన్నది కాదు, ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధ పెడుతున్నది. బహుశ చిదానంద రాజఘట రాసుకున్న జ్ఞాపకాలు చదివి వుండకపోతే ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా నా గొంతు పెగిలి వుండేది కాదు. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు ‘మరణం ఒక అనుకోని ఘటన. మంచి వ్యక్తులు చేసిన దానికి, వారు దేనికోసం నిలబడ్డారనేదానికి గౌరవం, ప్రేమ మరియు ప్రశంస ముఖ్యం. వామపక్షవాది, తీవ్రవాది, హిందుత్వ వ్యతిరేకి, లౌకిక వాది తదితర ముద్రలన్నింటినీ మరచిపోండి, నావరకైతే అబ్బురమైన కారుణ్యం, హుందాతనాల సారం’.

పిల్లలూ చదవండి, మీకు నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కరలేదని తెలుస్తుంది. విబేధాలతో విడిపోయినా, స్నేహితులుగా కొనసాగటమెలానో తెలుస్తుంది.మనుషులుగా మిగలటం అన్నింటికన్నా ముఖ్యమని తెలుస్తుంది.

(ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ సౌజన్యంతో)

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

27 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cbi, Congress party, Gurmeet Ram Rahim Singh, Narendra Modi, rape, rape case

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆరు పదాలపై ‘ ఆంక్షలు ‘ రవీంద్రుని మానవత్వంపై ‘అసహనం’

13 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Amarthya sen, attack on journalists, Attack on media, ‘Argumentative Indian’, cbfc, cow politics, History, Intolerance, NCERT, Ravindranath Tagore, RSS, six words censor

సత్య

దేశంలో వాక్సభా స్వాతంత్య్రాలకు ముప్పు వస్తోందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అనేక మంది తమకు సంబంధించినవి కావన్నట్లుగా అసలు వాటి గురించి పట్టించుకోవటమే మానుకున్నారు. వీరిలో రెండు రకాలు అణచివేత, వివక్ష, విద్వేషానికి బలౌతున్నవారు ఒక తరగతి అయితే మేథావులం అనుకునే వారు రెండో తరగతి. మొదటి వారితో ఇబ్బంది లేదు, సమయం, సందర్భం వచ్చినపుడు తమ సత్తా ఏమిటో చూపుతారు. గడియారంలోని లోలకం మాదిరి అటో ఇటో వూగటం తప్ప నిలబడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రాని మేథావులతోనే అసలు సమస్య. వంది మాగధులు పొగడ్తలకు రాజులు, రంగప్పలు ఎలా పొంగిపోయేవారో, తమను విమర్శించేవారిని ఏం చేశారో చూశాము. ఆ రాజరికాలు, జమిందారీ వ్యవస్ధ పోయినా ఆ స్వభావం మాత్రం పాలకులలో ఇంకా సజీవంగానే కొనసాగుతోండటమే ప్రమాదకరం.

మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న చోట గుజరాత్‌, ఆవు, హిందు, హిందూత్వ,ఈ రోజుల్లో, ఇండియాలో అనే పదాలు వినిపించకూడదు, వాడకూడదు.పాఠ్య పుస్తకాలలో అరబ్బీ, ఆంగ్లం, వుర్దు పదాలను తీసివేయాలి. రవీంద్రనాధఠాగూరు ఆలోచనలు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఆత్మకధ వుండకూడదు, మొఘల్‌ చక్రవర్తుల దయాగుణం కలవారని, బిజెపి హిందూ పార్టీ అని, నేషనల్‌ కాన్ఫరెన్సు లౌకికవాద పార్టీ అన్న వర్ణలు వుండకూడదు.1984 దాడులపై మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన క్షమాపణ, గుజరాత్‌లో దాదాపు రెండువేల మంది ముస్లింలను చంపివేశారనే వ్యాక్యాలను పాఠ్యపుస్తకాలను తొలగించాలి. ఇలా రోజు రోజుకూ నిషేధిత పదాలు, భావనలు, ఆలోచనలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటన్నింటినీ బయటకు తెలియనివ్వకుండా సంబంధిత సంస్ధలు తమంతట తామే చేసినట్లుగా బయటకు కనిపించాలని కోరుకొనే శక్తులు తమ బండారం బయట పెట్టిన మీడియా గురించి రెచ్చిపోతున్నారు.

సుమన్‌ ఘోష్‌,                                 అమర్త్యసేన్‌                       పహ్లజ్‌ నిహ్లానీ

ముందుగా ఆరు మాటలపై ఆంక్షల గురించి చూద్దాం. వీటిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ పదవీకాల గడువు ముగియక ముందే కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రసూన్‌ జోషి అనే రచయితను నియమించింది. తన పదవీ నియామకంతో పాటు తొలగింపు కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానని నిహ్లానీ వ్యాఖ్యానించాడు. ఇక నేరుగా సాధారణ సినిమాల్లోనే అశ్లీల, అసభ్య దృశ్యాలను చూడవచ్చని వుక్రోషం వెలిబుచ్చారు. అసాంస్కృతిక లేదా మర్యాద తెలియని సేన చేతిలో కాలం చెల్లిన ఆయుధంగా వుపయోగపడిన వ్యక్తికి కేంద్రం ముగింపు పలికిందని ఒక పత్రిక వ్యాఖ్యాన శీర్షికలో పేర్కొన్నారు. చరిత్రను వెనక్కు నడపాలని చూస్తున్న, ఏది తినకూడదో, ఏ డ్రస్సు వేసుకోకూడదో, ఎప్పుడు బయట తిరగాలో ఇలా ప్రతి జీవన రంగంలో కాలం చెల్లిన ఆయుధాలతో ‘స్వయంసేవకులు’ మూలమూలనా రెచ్చిపోతున్న స్ధితిలో నూతన అధిపతి ఎలా పని చేయగలరో చూడాల్సి వుంది.

నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ గురించి సుమన్‌ ఘోష్‌ అనే ఒక దర్శకుడు ‘భారతీయ తార్కికుడు ‘ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దానికి కేంద్ర ఫిలింసెన్సార్‌ బోర్డు తాము చెప్పిన ఆరు పదాల కోతలకు అంగీకరిస్తేనే ప్రదర్శనకు అనుమతి సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పింది.పైన పేర్కొన్న మొదటి ఆరుపదాలు, వాటితో కూడిన వ్యాక్యాలను ఆ డాక్యుమెంటరీలో వినిపించకుండా చేయాలని జూలై 11న కోరింది. ఒక్క కోతకు కూడా తాను అంగీకరించటం లేదని ఒక నెల రోజుల తరువాత దర్శకుడు తిరస్కారాన్ని తెలిపాడు. తరువాత ఆ చిత్రాన్ని పునర్విచారణ కమిటీకి పంపుతారు. అదొక తతంగం, ఇంత జరిగాక దానిని ఏమి చేస్తారో వూహించనవసరం లేదు. కుక్క మనిషిని కరవటం సాధారణ విషయం. కానీ మనిషే కుక్కను కరవటం సంచలన వార్త. దేశంలో నేడున్న స్ధితిలో ఆరు పదాలపై ఆంక్షలు పెట్టటం సాధారణం.ఇంత రాద్ధాంతం జరిగాక వాటిని అంగీకరించి అనుమతిస్తేనే అది అసలైన వార్త అవుతుంది. చివరికి అదేమైనా అసలు ఆ పదాలపై ఎందుకు అభ్యంతర పెడుతున్నారన్నదే తెలుసుకోవాల్సిన, తేలాల్సిన అంశం.

సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలపై దేశమంతటి నుంచి అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఆ పదాలకు కోత పెట్టినందువలన దర్శకుడి సృజనాత్మకతకు, అమర్త్యసేన్‌ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. ఆ పదాలు భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని విస్పష్టంగా తిరస్కరించేవిగా వున్నాయని, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఒక భారతీయుడిపై నిర్మించిన డాక్యుమెంటరీలో రాజకీయాలు, మతం గురించి మందబుద్దితో చేసిన వ్యాఖ్యలను అనుమతిస్తే శాంతి, సామరస్యాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించామని వాదించారు. ఒక సందర్భంలో భారతీయ ప్రజాస్వామ్యం గురించి చేసిన ప్రస్తావనలో గుజరాత్‌ నేరాల గురించి పేర్కొన్నారని, దానిలో గుజరాత్‌ అనే పదం తీసివేయమని కోరామన్నారు. మరొక సందర్భంలో ఇండియాలో శత్రువు మతనాయకత్వమని చేసిన ప్రస్తావనలో ఇండియా అనే పదం వాడవద్దన్నామని, ఇండియాను హిందు అని భాష్యం చెప్పినందున హిందూ అనే పదాన్ని తొలగించాలని కోరామన్నారు. ఆవు గురించి మతానికి ముడిపెడుతూ నిరర్ధకమైన ప్రస్తావన చేసినందున ఆవు పదాన్ని వాడవద్దని కోరామని, ఈ రోజుల్లో వేదాలను దురభిమాన పద్దతిలో వినియోగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలో ఈ రోజుల్లో, వినియోగిస్తున్నారు అనే పదాలను తొలగించాలని కోరినట్లు నిహలానీ చెప్పారు. భారత హిందుత్వ వైఖరి నకిలీదని ఆగ్రహం కలిగించే విశేషణం వాడినందున దానిని కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ పదాలను తొలగించాలని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వత్తిడి లేదని, అలా కోరటాన్ని ప్రభుత్వ అనుకూల చెంచాగిరి చేసినట్లుగా చూశారని వ్యాఖ్యానించారు. ఆవు, హిందూత్వ గురించి చేసిన వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని, చిత్ర నిర్మాతలు భావ ప్రకటనా స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి స్వేచ్చ బాధ్యతతో కూడినదై వుండాలని కూడా వారు తెలుసుకోవాలని నిహ్లానీ అన్నారు. మీరు నోబెల్‌ బహుమతి గ్రహీత కావచ్చు జనం పవిత్రమైనవిగా భావిస్తున్న వాటిని తృణీకారంతో మాట్లాడితే మీపై దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా సెన్సార్‌ బోర్డు అధిపతి వ్యాఖ్యానించారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ లేకుండా పలు బహిరంగ స్ధలాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు, అది చట్టవిరుద్దం, భావ ప్రకటనా స్వేచ్చ మంచిదే చట్ట వుల్లంఘన మాటేమిటని నిహ్లానీ ప్రశ్నించారు.

సెన్సార్‌ బోర్డు అధిపతి ప్రస్తుతం దేశంలో మనువాద, సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న వాదనలను అధికారికంగా వ్యక్తం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారా లేక అధికారం ఆయనను ప్రభావితం చేసిందా అన్నది సమస్య. మొదటిదే వాస్తవమైతే అన్ని రంగాలలో తిరోగమనవాదులతో నింపే ప్రప్రకియలో భాగంగానే ఆయనను అక్కడ నియమించారని, లేకపోతే ఆయనపై వత్తిడి తెచ్చారని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. కొంత మంది పవిత్రంగా చూస్తున్నదానిని జనం మొత్తం చూస్తున్నారని చిత్రించటం, వాటితో విబేధించి వర్ణనలు చేస్తే దాడులు జరుగుతాయని చెప్పటమంటే పరోక్షంగా అదే చేయమన్న సందేశం తప్ప మరొకటి కనిపించటం లేదు. మతోన్మాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల తరగతికి చెందిన వారు చేస్తున్న దుర్మార్గాలన్నీ దేవుళ్లు, దేవదూతలు, దేవుని బిడ్డలో, ఆయా మతాల గ్రంధాలు చెప్పాయనో, శాశించాయనో, జనాభిప్రాయమనో, కోరారనో పేరుతో చేస్తున్నవే అని గమనించాలి.

ఆవు, వేదాలు, హిందూత్వల గురించి భిన్న అభిప్రాయాలు వెలువరించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, లేదూ కొత్తగా ప్రారంభించినా తప్పేమీ కాదు. తమ వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదని కొన్ని శక్తులు తమ అభిప్రాయాన్ని దేశం మొత్తం మీద రుద్దటం గతంలో నడవ లేదు, ఇప్పుడూ కుదరదు, అది ఏ రీత్యా చూసినా ప్రజాస్వామ్య వైఖరి కాదు. చర్చోపచర్చలు చేయవచ్చు, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు. ఏ వైఖరిని కలిగి వుండాలనేది లేదా ఏ వైఖరికీ బద్దులం కాకూడదనో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలితప్ప భిన్నాభిప్రాయం, భిన్న వ్యాఖ్యానం వినిపించకూడదని చెప్పటం ఏమిటి ? ఇక పహ్లజ్‌ నిహ్లానీ నియామకం, తొలగింపు ఏమి సూచిస్తున్నది. తన తిరోగమన భావాలను సమాజంపై రుద్ధితే వాటి ప్రభావం ఎలా వుంటుందో సంఘపరివార్‌ పరీక్షిస్తున్నది. రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే తమ మనసెరిగి నడుచుకున్నప్పటికీ నిహ్లానీని కొనసాగించటం నష్టదాయకం అని గ్రహించినట్లుగా కనిపిస్తున్నది. అన్ని రంగాలలో ఒకేసారి తమ అజెండాను రుద్దితే నష్టం కనుక బ్రిటీష్‌ వారి సేవలో నేర్చుకున్న విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా కాషాయ పరివారం కొంతకాలమైనా సినీరంగాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుందా అన్నది చూడాల్సి వుంది.

ఇక పాఠ్యపుస్తకాల నుంచి విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూరు అభిప్రాయాలు, కొన్ని భాషా పదాలు, ఇంకా ఏమేమి తొలగించాలో సూచిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి వుత్తన్‌ న్యాస్‌ రూపొందించిన డిమాండ్ల జాబితాను ఆ సంస్ధ నేత దీనా నాధ్‌ బాత్ర నాయకత్వంలో ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించారు. వాటిని ప్రముఖంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతర అనేక పత్రికలు ప్రచురించాయి. వాటిని చూసిన వారు ఇదేమి వైఖరని ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మీడియాపై చిందులు తొక్కుతున్నారు.

మీడియా సైద్ధాంతికంగా, వివక్షతో కూడినదే గాక దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పైన పేర్కొన్న సంస్ధ న్యాస్‌ జాతీయకార్యదర్శి అతుల్‌ కొథారీ ఆరోపిస్తే, మాజీ జర్నలిస్టయిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌కమ్యూనిసకేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన కెజి సురేష్‌ దాడి చేశారు. దొంగే దొంగని అరచినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వ్యవహారం వుంది. రవీంద్రుని భావాలను తొలగిస్తున్నారా అని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన దానికి ఒక స్వతంత్ర సంస్ధ అయిన ఎన్‌సిఇఆర్‌టి తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నట్లుగా అలాంటిదేమీ జరగబోవటం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఆ సంస్ధ ప్రతినిధులెవరూ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రంలో రవీంద్రుని గురించిన ప్రస్తావన లేదని, కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవాస్తవ వార్తలు ప్రచురించాయని, ఎక్స్‌ప్రెస్‌కు లీగల్‌ నోటీసు పంపుతామని న్యాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

తమ పత్రంలో లేని అంశాలను మీడియా పేర్కొన్నదని ఆరోపిస్తున్న పెద్దలు అసలు తాము సమర్పించిన దానిని బహిరంగపరిచి మీడియా చేసిన వక్రీకరణలను లోకానికి తెలియచేయవచ్చు. కానీ వారా పని చేయలేదు. అదేమీ రహస్యం కాదు, అయినా ఇంతవరకు దానిని అధికారికంగా బహిరంగపరచలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రాన్ని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు అందచేసినట్లు న్యాస్‌ ప్రతినిధులు అంగీకరించారు.దాని కాపీలను మిగతా వారికి అందచేస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. తాను రాసిన వార్తలపై ఎక్స్‌ప్రెస్‌ పత్రిక కట్టుబడి వుంది కనుకనే వారికి లీగల్‌ నోటీసు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. కనుక పత్రికా వార్తలు లేదా వ్యాఖ్యానాలతో విబేధిస్తున్న న్యాస్‌ తన పత్రంలో ఏం వుందో వెల్లడించాల్సిన బాధ్యత దాని మీదే వుంది.

తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ అని పేర్కొనటాన్ని కూడా న్యాస్‌ అభ్యంతర పెట్టింది. అసలు ఆర్‌ఎస్‌ఎస్సే నమోదిత సంస్ధ కాదు.జనాన్ని మభ్యపెట్టేందుకు లేదా వేరే ప్రయోజనంతో కావచ్చు, దానిలో పని చేసే ప్రముఖుల ఆధ్వర్యంలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. అవన్నీ వాస్తవానికి దాని కనుసన్నలలో పని చేసేవే అన్నది అందరికీ తెలిసిన సత్యం.ఆర్‌ఎస్‌ఎస్‌కు బిజెపి అనుబంధ సంస్ధ అని ఎక్కడా వుండదు. కానీ దాని నాయకులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. దానిలో సభ్యత్వాన్ని వదులుకోవాలని గతంలో జనతా పార్టీలో ఒక డిమాండ్‌ వచ్చినపుడు దానిలో విలీనమైన పూర్వపు జనసంఘనేతలెవరూ అంగీకరించలేదు. తరువాత వారంతా బిజెపిని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. సాంకేతికంగా అనుబంధం వుంటుందా అంటే వుండదు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె వంటి పార్టీలన్నీ తమ అనుబంధ సంస్ధలనాయకత్వాన్ని నియమిస్తూ బహిరంగంగానే ప్రకటిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలలో నాయకులుగా వున్న వారు అనేక ప్రజా సంస్ధలలో కూడా పని చేస్తూ వాటికి నాయకులుగా కూడా వుంటారు. అవి నిజానికి పార్టీ అనుబంధ సంస్ధలు కావు, పార్టీ సభ్యులు కాని వారు కూడా వాటిల్లో నాయకులుగా వుంటారు వాటిని అనుబంధ సంస్ధలని నిరూపించే ఆధారాలను ఎవరూ చూపలేరు. అయినా సిపిఎం అనుబంధ రైతు సంఘమనో, సిపిఐ అనుబంధ కార్మిక సంఘమనో మీడియాలో ప్రస్తావించటం చూస్తున్నాము. అయితే తమ అనుబంధ సంస్ధలు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకొనే వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న సంబంధాల గురించి అంజలీ మోడీ అనే జర్నలిస్టు స్క్రోల్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఆధారాలతో వివరించారు. అలాంటి వాటిలో ఒకటైన న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించిన ఐదు పేజీల పత్రంలో రవీంద్రుని పేరు ప్రస్తావించటాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆ పత్రపు ఐదవ పేజీలో’ రవీంద్రనాధ్‌ ఆలోచనా ధోరణిలో జాతీయవాదం-మానవతా వాదం మధ్య వైరుధ్యం వున్నట్లు చూపేందుకు ఒక ప్రయత్నం జరిగిందని ‘ న్యాస్‌ పేర్కొన్నది.

” ఎక్కడ ఆత్మ భయరహితంగా వుంటుందో ‘ అనే రవీంద్రుని కవిత, ఇతర అంశాలు ‘ జాతీయ సమగ్రతకు సవాళ్లు ‘ అనే శీర్షిక కింద సిబిఎస్‌యి ప్రచురించిన పదవ తరగతి ఆరవ యూనిట్‌ వర్క్‌బుక్‌లో వున్నాయి తప్ప ఎన్‌సిఇఆర్‌టి పుస్తకంలో కాదు. అయితే ఆర్‌ఎసెస్‌ సంస్ధ న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి ఇచ్చిన పత్రంలో తొలగించాలని లేదా సవరించాలని చెప్పింది వీటి గురించే. ఆ పాఠంలో చెప్పిందేమిటి ? ‘ మానవత్వం అన్నింటికంటే వున్నతమైనదని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయపడ్డారు. మతం ఒక ప్రమాదకర అంశంగా తయారైంది. అయితే స్ధిరత్వాన్ని సాధించాలంటే మత మౌఢ్యం,తీవ్రవాదాలను తొలగించాల్సి వుంది.’ అన్న వ్యాక్యం ఆ పాఠంలో వుంది.

పదకొండవ తరగతికి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ‘రాజకీయ సిద్ధాంతం ‘ అనే పాఠ్యపుస్తకంలో దేశ భక్తికి వున్న పరిమితుల గురించి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయాలను పొందుపరిచారు. ఎఎం బోస్‌కు ఠాగూరు రాసిన లేఖలోని అంశాలను దానిలో వుటంకించారు.’దేశభక్తి అంతిమ ఆశ్రయం దేవతలు(లేదా ఆధ్యాత్మికం) కారాదు, నేను మానవత్వాన్నే ఆశ్ర యిస్తాను.’ అని ఠాగూరు చెప్పారు. హిందీ అనువాదంలో దేశభక్తి అంటే జాతీయవాదం(రాష్ట్రవాద) అని, మానవత్వం అంటే మానవత అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొనే ఠాగూరు ఆలోచనల్లో వైరుధ్యం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ భావించి వుండవచ్చన్నది ఒక అభిప్రాయం.

ఈ వుదంతంలో ఒకటి మాత్రం స్పష్టం. ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదానికి ఠాగూరు ఆలోచనా ధోరణి పొసగదు. తాము చేప్పిన దేశభక్తి, జాతీయవాదం ప్రశ్నించవీలులేనివి అన్నట్లుగా వాటితో విబేధించేవారిని దేశద్రోహులుగానూ, పాకిస్ధాన్‌ లేదా చైనా అనుకూలురుగానో ముద్రవేసి దాడులు చేస్తున్నారు. ఆ పదాలకు సంఘపరివార్‌ లేదా దాని సమర్ధకులు చెబుతున్న భాష్యాలు వివాదాస్పదం, అభ్యంతరకరమైనవి.హిట్లర్‌ దృష్టిలో లేదా అనేక మంది ఐరోపా మితవాదుల దృష్టిలో ఇతర దేశాలపై రాజకీయంగా, ఆర్ధికంగా, మిలిటరీ తదతర అన్ని రంగాలలో జర్మనీ లేదా తమ దేశాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు పూనుకోవటమే జాతీయవాదం, దేశభక్తి. అందుకే జర్మనీ ఔన్నత్యాన్ని కాపాడేందుకంటూ వున్మాదాన్ని రెచ్చగొట్టిన హిట్లర్‌ ప్రపంచానికి ఎలా ముప్పుగా తయారైందీ చూశాము. అదే సమయంలో మన దేశంలో దేశభక్తి, జాతీయవాదం అంటే బ్రిటీష్‌ వారి వ్యతిరేకత, సర్వసత్తాక స్వతంత్ర ప్రభుత్వస్ధాపన. ఈ అవగాహనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకీభవించలేదు కనుకనే అది స్వాతంత్య్రానికి దూరంగా వుండిపోయింది. దాని నాయకులుగా వున్న సావర్కర్‌ వంటి వారు చివరికి బ్రిటీష్‌ వారికి లంగిపోయి, సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాంటి శక్తుల ప్రతినిధులే నేడు దేశభక్తి, జాతీయవాదానికి భిన్న భాష్యాలు చెబుతూ వాటిని అంగీకరించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న ప్రమాదకర పరిస్ధితి దేశంలో నేడు పెరిగిపోతోంది. తాము చెబుతున్న జాతీయవాదమే మానవత్వమని అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

దేశ చరిత్ర, వ్యక్తులు, భావజాలం వంటి సకల సామాజిక అంశాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ టీకా తాత్పర్యాలతో విబేధించే హక్కు ఇతరులకు ఎలా వుందో, ఇతరులు చెప్పిన వాటిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికీ వుంది. వాటి గురించి బహిరంగ చర్చ జరపాలి భిన్న పక్షాలు తమ వాదనలకు అవసరమైన రుజువులను చూపాలి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక అంశాలలో అది మానమ్మకం, మా మనోభావం, తరతరాల నుంచీ వస్తున్నదానిని ఎవరూ తిరస్కరించకూడదనే పేరుతో చర్చ నుంచి పారిపోతోంది. తన అజెండాను రహస్య పద్దతుల్లో అమలు జరిపేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే రాజ్యాంగ వ్యవస్ధలో తన భావజాలాన్ని ఏదో ఒక విధంగా అమలు జరిపే శక్తులతో నింపుతూ వారితో తన కార్యక్రమాన్ని అమలు చేయిస్తోంది.పైకి తాము జోక్యం చేసుకోవటం లేదని, తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తోంది.

ఎన్‌సిఇఆర్‌టికి సూచనలు, సిఫార్సులను సమర్పించిన న్యాస్‌ విషయమే చూద్దాం.దాని అధినేత తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం అని పేర్కొనటాన్ని విలేకర్ల సమావేశంలో తప్పు పట్టారు. పోనీ రెండు సంస్ధల మధ్య వున్న సంబంధం ఏమిటో సెలవివ్వండి అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, తమదీ వేర్వేరు స్వతంత్ర సంస్ధలని మాత్రమే చెప్పారు. శిక్షా సంస్కృతి వుత్తాన్‌ న్యాస్‌ అనే సంస్ధ రిజిస్టర్డు ఆఫీసు చిరునామా ఢిల్లీలోని నారాయణ విహార్‌లోని సరస్వతీ బాల మందిర్‌. ఆ పాఠశాలను నడుపుతున్నది విద్యాభారతి అనే మరొక సంస్ద. దాని వెబ్‌సైట్‌లో జీవితంలో ఒక లక్ష్యం వుండాలనే భావనతో 1952లో కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పిల్లల విద్యను చేపట్టినట్లు స్పష్టంగా రాసుకున్నారు. అంతే కాదు హిందుత్వకు కట్టుబడి ూండే, దేశభక్తిని చొప్పించే ఒక జాతీయ విద్యా వ్యవస్ధను కూడా అభివృద్ధి చేయటం తమ లక్ష్యంగా కూడా దానిలో చెప్పుకున్నారు. విద్యా భారతి మాజీ అధిపతి దీనా నాధ్‌ బాత్రా న్యాస్‌ స్ధాపకులలో ఒకరు. వీరందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి ఆ సంస్ధ పత్రిక ఆర్గనైజర్‌లో 2008లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం బృందావన్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కొంతమంది అధికారుల బాధ్యతలలో మార్పులు చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సరకార్యవాహక్‌ శ్రీ మోహన్‌ భగవత్‌ దిగువ మార్పులను ప్రకటించినట్లు దానిలో వుంది. ఆ జాబితాలో శిక్షా బచావో ఆందోళన్‌ నూతన అధిపతిగా అతుల్‌ కొథారీని నియమిస్తున్నట్లు వుంది. ఆయనే తరువాత ప్రస్తుత న్యాస్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఏమి చెప్పటానికైనా వెనుతీయరు. న్యాస్‌ పత్రంపై చర్చ జరిగితే ఆర్‌ఎస్‌ఎస్‌ నిజరూపం మరింతగా బహిర్గతం అవుతుంది, అది నష్టదాయకం కనుక ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు తొందరపడుతున్నారు, దానిలో భాగమే రవీంద్రుని భావజాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబోవటం లేదని రాజ్యసభలో ప్రకాష్‌ జవదేకర్‌ చేత చెప్పించటం. ఎన్‌సిఇఆర్‌టి దాని గురించి అధికారికంగా చెప్పేంత వరకు ఎవరేమి చెప్పినా దానికి విలువ లేదు. తన పత్రాన్ని వుపసంహరించుకున్నట్లు లేదా సవరించుకున్నట్లు న్యాస్‌ చెప్పేంత వరకు దీని గురించి ఎవరైనా చర్చించవచ్చు, ఆ తరువాత కూడా జరిగిందానిని ప్రస్తావించవచ్చు. తమను ప్రశ్నించే మీడియాను బిజెపి మంత్రులు, అనుయాయులు ప్రెస్టిట్యూట్స్‌ అంటూ కించపరుస్తున్న విషయం తెలిసిందే.(వళ్లమ్ముకొనే వారిని ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్స్‌ అంటున్నారు, తమను ప్రశ్నించే మీడియా వారు కూడా వారితో సమానం అంటూ ప్రెస్టిట్యూట్స్‌ అని దాడి చేస్తున్నారు)

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ న్యాస్‌ విషయానికి వస్తే తమ భావజాలానికి వ్యతిరేకమైనవి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాటిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నాయి. వుదాహరణకు ‘ మూడు వందల రామాయణాలు: ఐదు వుదాహరణలు, అనువాదంపై మూడు ఆలోచనలు ‘ అనే ఏకె రామానుజం వ్యాసాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ సిలబస్‌ నుంచి తొలగించాలని, వెండీ డోనిగర్‌ రాసిన ది హిందూస్‌ అనే పుస్తకాన్ని వుపసంహరించాలని న్యాస్‌ ఆందోళన చేసింది, కోర్టులకు ఎక్కింది. రామానుజన్‌ వ్యాసాన్ని తొలగించారు, రెండో పుస్తకాన్ని తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించిన దాని ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అంశాలుగా పేర్కొన్న వాటి సారాంశం ఇలా వుంది.

పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్రం

1984 ఘర్షణల గురించిన పేరా ఇలా అంతమౌతుంది.’ 2005లో పార్లమెంట్‌లో వుపన్యాసం సందర్భంగా సిక్కు వ్యతిరేక హింసాకాండలో రక్తపాతం జరగటం దానికి దేశం క్షమాపణలు చెప్పాలనటంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

రామాలయ ఆందోళనకు బిజెపి మరియు హిందుత్వ రాజకీయాల ఎదుగులకు సంబంధం వుందని ఒక పేరా చెబుతోంది. ఒక చోట బిజెపి ఒక హిందుత్వ పార్టీ అని మరొక చోట హిందుత్వ, హిందుపన్‌లు విడి సావర్కర్‌ కల్పితమని పేర్కొన్నారు. మరొక చోట బాబరీ మసీదును మీర్‌ బక్షి నిర్మించాడని….రాముడి జన్మస్ధలంలోని రామాలయాన్ని ధ్వంసం చేసి దానిని నిర్మించారని కొందరు హిందువులు విశ్వసిస్తారని వుంది. గోద్రాలో 2002లో జరిగిన వుదంతం గురించిన చోట ఒక రైలుకు నిప్పంటుకుందని…. దానికి ముస్లింలో కారణమనే అనుమానంతో’ అనే వ్యాక్యంలో నిప్పుంటుకుంది అనే పదాన్ని తగులబెట్టారు అని సవరించాలని, అనుమానం అనే పదాన్ని తొలగించాలని న్యాస్‌ కోరింది. మరొక చోట ‘ అటువంటి మారణకాండకు పధకాలు వేసిన వారికి కనీసం రాజకీయ పద్దతులలో(ఓటింగ్‌) ద్వారా ఒక పాఠం చెప్పేట్లు మనం చూడగలమా అని వుంది.

తొలగించాల్సిన భాషా పదాల జాబితాలో ఆంగ్లంలో వైస్‌ ఛాన్సలర్‌,వర్కర్‌, మార్జిన్‌, బిజినెస్‌,బాక్‌బోన్‌, స్టాంజా, రాయల్‌ అకాడమీ, వుర్దు లేదా అరబిక్‌ భాషలోని బేటార్‌టిబ్‌, పోషక్‌, తాకత్‌, ఇలాకా, అక్సర్‌, ఇమాన్‌, జోకిహిమ్‌,మెహమాన్‌-నవాజీ, చమర్‌, సారే ఆమ్‌, ఇవిగాక భ్రష్టపదాలుగా వుల్లు కహిన్‌కా, కాంబఖత్‌, బద్మాష్‌, లుచ్చే-లఫంగే, బహంగియోన్‌ వున్నాయి.

తొమ్మిదవ తరగతిలో రామధరీ సింగ్‌ దినకర్‌ ఒక ప్రేమికుని వాంఛలు అనే కవిత వలన పిల్లలు తప్పుదారి పడతారు,శీలాన్ని కోల్పోతారు కనుక, కేంద్ర ప్రభుత్వం చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ కార్యకలాపాలు దేశ ఐక్యతం, గణతంత్రానికి ముప్పు అని భావిస్తున్నందున పదకొండవ తరగతిలో ఆయన ఆత్మకథను తొలగించాలని కోరారు. కన్నడ కవయిత్రి అక్క మహా దేవి ఒక సంఘటనను పేర్కొంటూ దానికి నిరనగా తన దుస్తులను తొలగించినట్లు ఒక పాఠంలో వుంది. ఒక నగ్న మహిళను వర్ణించటం మహిళల స్వేచ్చ పేరుతో హిందూ సంస్కృతిని కించపరచటమే అని న్యాస్‌ వాదించింది.

చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాల సారం ఇలా వుంది. వేదాల అనంతర కాలంలో సాధారణంగా మహిళలను సూద్రులతో సమంగా పరిగణించారు. దేవుడి ముందు అన్ని మతాల వారు సమానమే అనే సులహ్‌ ఏ కుల్‌ విధానాన్ని అక్బర్‌ ప్రవేశపెట్టారు. వితంతువుల దురదృష్టాలు, సామాజిక బహిష్కరణల గురించి 19వ శతాబ్ది మహిళా వుద్యమకారిణి తారాబాయ్‌ షిండే రాసిన పుస్తకంలో పితృస్వామ్య వ్యవస్ధపై తీవ్ర విమర్శ వుంది. దానిని కూడా తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ కోరింది. మరొక పుస్తకంలో వర్ణాశ్రమ వ్యవస్ధ గురించిన ప్రస్తావన ఇలా వుంది. ‘పుట్టుకతోనే హోదా నిర్ణయమౌతుంది. వారు(బ్రాహ్మలు) జనం ప్రతిష్ట పుట్టుక మీదే ఆధారపడి వుందని గుర్తించేందుకు ప్రయత్నించారు… అలాంటి అర్హతల గురించి మహాభారతం వంటి అనేక పుస్తకాలలోని కధలతో పటిష్టపరిచారు.’ ఆర్యుల యుద్ధ దేవుడు ఇంద్రుడిపై మొహంజదారో చివరి దశలో స్త్రీ పురుషులను వూచకోత కోశాడనే ఆరోపణలున్నాయి. ఒక చోట మొగల్‌ కాలంలో పాలకులు జనం పట్ల ఎంతో వుదారంగా వుండేవారు, మొగలాయీ పాలకులందరూ ప్రార్ధనా మందిరాల నిర్మాణం, నిర్వహణకు నిధులు ఇచ్చారు. యుద్ధాల సందర్భంగా దేవాలయాలు నాశనమైతే తరువాత వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసేవారు.అని వుంది. ఇలాంటి వాటన్నింటినీ తొలగించాలి, సవరించాలి అని న్యాస్‌ పేర్కొన్నది.

ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం, మనువాద వ్యవస్ధను పరిరక్షించటం, తమ భావజాలానికి తగిన విధంగా లేక వ్యతిరేకంగా వుంటే రవీంద్రుని వంటి వారి ఆలోచనలను కూడా నూతన తరాలకు అందకుండా చూడటం, తమ దుష్ట చరిత్రను మరుగుపరచటానికి విద్యారంగాన్ని వినియోగించుకోవాలని కాషాయ దళాలు చూస్తున్నాయన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గో గూండాలు, మరుగుజ్జు యోధులు తప్ప ఆర్ధికవేత్తలు చేసేదేమీ లేదిక్కడ !

04 Friday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Aravind Pangaria, Gau Rakshaks, India Exports, India PMI, Narendra Modi, narendra modi bhakts, Narendra Modi Failures, Niti Aayog, planing commission

ఎం కోటేశ్వరరావు

దేశంలో జరుగుతున్న వాటి గురించి నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే నరేంద్రమోడీ భక్త జనాలకు కోపం రావచ్చు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఎవరు? కాషాయ కూటమి అసలైన అజెండాను జయప్రదంగా అమలు చేసేందుకు కండలు తిరిగి పేరు మోసిన గో గూండాలు, సామాజిక మాధ్యమంలో దాడులు చేసే మరుగుజ్జు యోధులా(ట్రోల్స్‌) ? బిజెపి కూటమి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలను, మేకిన్‌ ఇండియా అన్న నరేంద్రమోడీ పిలుపు నిజం చేసేందుకు కావాల్సిన పేరు ప్రఖ్యాతులున్న ఆర్ధికవేత్తలా ? ఆవులకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు స్వయంగా మోడీ అంతరాత్మ అమిత్‌ షా లక్నోలో ఈ మధ్య విలేకర్లకు చెప్పారు. సరే ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చున్న వుత్తర ప్ర దేశ్‌ ముఖ్య మంత్రి ఆదిత్యనాధ్‌ ఆవుల రక్షణకు కేంద్రాల ఏర్పాటు గురించి చెప్పారనుకోండి.

ఎన్నడూ ఎరగనోడికి ఏగానీ దొరికితే దానిని అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అని తేల్చుకోలేక ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదన్నది ఒక సామెత. నరేంద్రమోడీ విదేశీ పర్యటనల గురించి అనేక మంది ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆచరణ ఏమిటో జనానికి తెలిసిందే. ఎవరేమి విమర్శించినా ఖాతరు చేయకుండా పెట్టుబడులను రాబట్టేందుంటూ నరేంద్రమోడీ తిరగని దేశం, తొక్కని గడపలేదు. పదవీ కాలంలో మిగిలిన దేశాలను కూడా చుట్టి వచ్చి రికార్డు సృష్టిస్తారేమో ! అమెరికా, చైనాలను పక్కకు నెట్టి విదేశీ పెట్టుబడులను రాబట్టి తెల్లవారేసరికి ప్రపంచం మొత్తానికి అవసరమైన వస్తువులను వుత్పత్తి చేసి ఎగుమతులు చేసేందుంటూ ప్రధాని మేకిన్‌ ఇండియా అని నినాదం కూడా ఇచ్చారు. మూడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడడీ సర్కార్‌ ఎన్నికలకు ముందు జనానికి చెప్పిన వాటి కంటే చెప్పని వాటినే ఎక్కువగా అమలు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు తప్ప దానికి ఒక మంత్రి లేడు. చిన్న ప్రభుత్వం-పెద్ద పాలన అంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి చివరకు ఆవులకోసం కూడా ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటు గురించి పరిశీలిస్తున్నట్లు అమిత్‌ షాయే చెప్పారు గనుక నమ్మక తప్పదు.

ఈ మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలను నిరుత్సాహపరిచే విధంగా ఒకవైపు చర్యలు మరోవైపు పురాతన సంస్కృత గ్రంధాలలో దాగున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే ఈ మధ్యనే పంచగవ్యాల సుగుణాల గురించి పరిశోధనలు చేసేందుకు నిర్ణయం. యధారాజా తధా ప్రజా అన్నట్లు ఆవు పేడ, మూత్రాలపై ఐఐటిలలో రోజుల తరబడి సెమినార్లు, వాటిపై పరిశోధనలకు 50వరకు ప్రతిపాదనలు వచ్చినట్లు వార్తలు. ఆసుపత్రి వార్డులను ఆవు మూత్రంతో కడగాలని నితిన్‌ గడ్గరీ వంటి వారి సుభాషితాలు. ఆవు మూత్రంతో తనకు తెలిసిన ఒకరి అంతుబట్టని వ్యాధి నయమైందని బిజెపి అధికార ప్రతినిధులలో ఒకరైన మీనాక్షి లేఖీ కూడా చెప్పారు. నా చిన్నతనంలో గుంటూరు పక్కనే వున్న పలలూరు భావిలో నీరు తాగితే జబ్బులు నయమయ్యాయని జనాలు బారులు తీరటాన్ని లేఖీ గారు గుర్తుకు తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లొట్టలు వేసుకుంటూ వినటానికి ఎన్ని కబుర్లో ! ఇప్పటికే బిజెపి పాలనలోని రాజస్ధాన్‌లో ఆవు సంక్షేమ మంత్రిత్వ శాఖ వుంది కనుక త్వరలో కేంద్రంలో, ఇతర రాష్ట్రాలలో ఆవు మంత్రిత్వశాఖ, దానికి సలహాదారులు, ఆవులు వేసే పేడ, పోసే మూత్రం ఎగుమతికి రామ్‌దేవ్‌ బాబా పతంజలి సంస్ధకు అనుమతి, వాటిని రవాణాచేసేందుకు అదానీ ఓడలకు పని చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఇ కామర్స్‌ సంస్ధలు ఇప్పటికే పేడ, మూత్రాలను కొరియర్‌ సేవల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.మన దేశానికి ఇలాంటి వాటి ఎగుమతులలో మరే నాగరిక దేశమూ సాటి రాదని స్టాంప్‌ పేపర్లపై రాసి ఇవ్వవచ్చు. మోడీ బ్యాండ్‌ ఏ పద్దతులలో అమెరికా, చైనాలను అధిగమించేందుకు దేశ రూపు రేఖలు ఎలా మార్చబోతున్నారో అనేందుకు సూచికలివి.

బహుశా ఈ పరిణామాలను వూహించి లేదా సర్వం ప్రయివేటీకరణ, సకల సబ్సిడీలకు మంగళం పాడాలన్న తన సలహాలను మోడీ సర్కార్‌ తు.చ తప్పకుండా అమలు జరుపుతోందనే సంతోషం లేదా ఇతర అంశాలేమిటో తెలియదు గానీ నీతి ఆయోగ్‌ అని పిలుస్తున్న ‘భారత్‌ రూపురేఖలు మార్చే జాతీయ సంస్ధ'(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) వుపాధ్యక్షుడిగా వున్న అరవింద్‌ పంగారియా ఆగస్టు 31తరువాత సేవలను అందించేది లేదంటూ ఆకస్మికంగా రాజీనామా ప్రకటించారు. దీనికెవరూ చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ జిందాతిలిస్మాత్‌ అని ఆకాశానికి ఎత్తిన దేశ భక్తుడు అరవింద్‌ పంగారియా. దాన్నే దేశమంతటికీ రాసి లేదా పూసి గుజరాత్‌ మాదిరి అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల ప్రచారంలో మోడీ నమ్మబలికారు. అదెంత బూటకమో ఈ దిగువ లింక్‌లోని సమాచారాన్ని బట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html

నరేంద్రమోడీ 2014 మే 26న గద్దెనెక్కారు. స్వతంత్ర మూల్యాంకన లేదా విలువ కట్టే కార్యాలయం మే 29న నరేంద్రమోడీకి ఒక నివేదిక సమర్పించి వెంటనే ప్రణాళికా సంఘం అనే ఇంటిని కూల గొట్టించాలని సూచించింది. ఎందుకటా బిజెపి నేతలు వివరించినదాని ప్రకారం ‘బొమ్మరిల్లు’ నాన్న మాదిరి పిల్లలనే రాష్ట్రాలకు ఒకే కొలతలు, ఒకే బట్టతో యూనిఫారాలను కుట్టించేదిగా ప్రణాళికా సంఘం వుంది. ఎవరికిష్టమైన దుస్తులు వారి సైజుల్లో కుట్టించుకోవాలన్నట్లుగా ఏ రాష్ట్రానికా ఆ రాష్ట్రం తన స్వంత అభివృద్దికి చర్యలు తీసుకోవాలంటే ప్రణాళికా సంఘం పనికిరాదు. ఆ మేరకు ఆగస్టు 13న ఆమేరకు కాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దాని స్ధానంలో2015 జనవరి ఒకటిన నీతి అయోగ్‌ వునికిలోకి వచ్చింది. ప్రధాని దానికి అధ్యక్షుడు. అమెరికాలో పాఠాలు చెప్పుకుంటున్న అరవింద్‌ను రప్పించి వుపాధ్యక్షుడిగా నియమించారు. అన్ని రాష్ట్రాలకు ఒకే అభివృద్ధి నమూనా పనికిరాదని చెప్పిన పెద్దలే అన్ని రాష్ట్రాలకు ఒకే పన్ను విధానం కావాలనటం, తీసుకు రావటం, దాన్ని మరొక స్వాతంత్య్రంగా వర్ణించుకోవటం విశేషం.

ఏడు సంవత్సరాలకు ఒక కార్యక్రమం, 15 సంవత్సరాలకు మరొకదాన్ని రూపొందించటం నీతి ఆయోగ్‌ కార్యక్రమం. అంటే ఐదు సంవత్సరాలకు బదులు పేరేం పెట్టినా పదిహేను సంవత్సరాలకు రెండు ప్రణాళికలన్నమాట. అందుకే నరేంద్రమోడీ 2022 నాటికి నేనేం చేస్తానో చూడండి అంటున్నారు.(2015-2022 మధ్య వ్యవధి ఏడు సంవత్సరాలు). అయితే మూడు సంవత్సరాలు గడిచినా కొత్త ఇల్లు ఎలా కట్టుకోవాలో కూడా నిర్ణయించుకోక ముందే వున్న ఇంటిని కూలగొట్టుకున్న వారు పడే ఇబ్బందుల మాదిరి ఏ ఏటికాయేడు ఏదో విధంగా నెట్టుకు వస్తున్నారు. ఒక నిర్ధిష్ట రూపు రేఖలు ఇంతవరకు లేవు. ఈ లోగా దాని శిల్పి అరవింద్‌ పంగారియా జంప్‌. ఆ పెద్ద మనిషి ఎందుకు రాజీనామా చేశారో తెలియదు. దున్న ఈనిందంటే రోజంతా బ్రేకింగ్‌ న్యూస్‌ ఇచ్చే మీడియా అదో సాధారణ విషయం అన్నట్లుగా మూసిపెట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు కాకపోతే తరువాత వెల్లడికాక మానదు.

కాకపోతే తన రాజీనామాకు పద్మభూషణుడిగా మనం సన్మానించిన అరవిందుడు ఇచ్చిన వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా వుంది. నా రాజీనామా నా ఇష్టం అంటే అడిగే వారే వుండరు. ఆగస్టు 31 తరువాత సెలవును పొడిగించేందుకు తాను వుద్యోగం చేస్తున్న కొలంబియా విశ్వవిద్యాలయం అంగీకరించలేదు కనుక రాజీనామా అన్నారు.’అదే నేను 40వ పడిలో వున్నట్లయితే నాకు ఎక్కడయినా వుద్యోగం దొరికేది, ఈ వయస్సు(64)లో కొలంబియాలో మాదిరి వుద్యోగం దొరకటం దాదాపు అసాధ్యం’ కనుక తిరిగి టీచరు వుద్యోగంలో చేరుతున్నట్లు చెప్పారు. నరేంద్రమోడీకి పంపిన రాజీనామా పత్రంలో పిల్లలకు దగ్గరగా వుండాలని తన భార్య గట్టిగా కోరుతున్నదని పేర్కొనటం గమనించాల్సిన అంశం. ఆయన ఇరవైల్లోనో ముప్ఫైల్లోనే వుండి వుంటే భార్య అలా కోరటం సహజం, కానీ 64 ఏండ్ల వయస్సులో అందునా భారత్‌లో ఒక వున్నతమైన స్ధానాన్ని వదులుకొని పిల్లల కోసం అమెరికా రమ్మని కోరటం అంటే నమ్మేట్లుగా లేదు. నీతి ఆయోగ్‌ బాధ్యతలను స్వీకరించే సమయంలోనే తాను ఫలనాతేదీ వరకు మాత్రమే సెలవు పెట్టానని లేదా రెండున్నర సంవత్సరాలు మాత్రమే తాను పదవిలో వుంటానని అప్పుడు చెప్పలేదు. ఒక వేళ అలా చెప్పి వుంటే మోడీ ముందుగానే మరొక ప్రముఖుడిని సిద్దంగా పెట్టుకొని వుండేవారు. అయినా అరవింద్‌కు వుద్యోగం లేకపోతే గడవదు అంటే నమ్మశక్యం కాదు. దేశ రూపురేఖలనే ఏడు సంవత్సరాలలో మార్చే మహత్తర మంత్రదండాన్ని నడుంకు కట్టుకున్న పెద్ద మనిషిని ఈ దేశం ముసలితనంలో వదలి వేస్తుందా? అవసరమైతే భార్యా బిడ్డలను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించుకోవటం అంత కష్టమా ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరాస వాణిజ్య విభాగం వంటి వాటిలో యుక్త వయస్సులో వుద్యోగాలు చేసి ముసలి తనంలో ఇబ్బందులు లేకుండా గడపటానికి అవసరమైన మొత్తాన్ని వెనకేసుకోలేనంత అమాయకుడా ఆ పెద్దమనిషి. అయినా పుట్టిన గడ్డమీద ఎంత అవిశ్వాసం ? ఇలాంటి వ్యక్తినా మనం పద్మభూషణుడని గౌరవించుకుంది ?

నరేంద్రమోడీ భక్తులు, ఆయన పెరటి మీడియా ఎన్ని విజయగానాలు చేసినా మాటలు కోటలు దాటటం తప్ప ఆచరణ గడపదాటటం లేదు. ఆర్ధిక రంగంలో అన్నీ అధోముఖ సూచికలే దర్శనమిస్తున్నాయి. 2016 అక్టోబరులో 25శాతం సంస్ధలు భవిష్యత్‌ గురించి ఆశాభావం వ్యక్తం చేస్తే 2017 మార్చినాటికి 16శాతానికి పడిపోయిందని, కేవలం ఆరుశాతం సంస్ధలే అదనపు సిబ్బందిని తీసుకొనేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపాయని http://economictimes.indiatimes.com/news/company/corporate-trends/indian-companies-least-confident-worldwide-markit-survey/articleshow/57616150.cms వార్తలు వచ్చాయి. దేశ వుత్పాదక రంగ సూచిక (పిఎంఐ) జూన్‌లో 52.7 వున్నది కాస్తా జూలైలో 46కు అంటే 2009 కనిష్ట స్ధాయికి, సేవారంగం 53.1 నుంచి 45.9కి దిగజారిందని తాజాగా వార్తలు వచ్చాయి. ఈ కాలంలో అన్ని అభివృద్ధి సూచికలు పడిపోతుండగా దేశంలో గో గూండాల దాడుల గ్రాఫ్‌ మాత్రమే రోజు రోజుకూ పెరుగుతోంది. అదీ కఠిన చర్యలు తీసుకోవాలని తిరుగులేని నరేంద్రమోడీ కోరిన తరువాత. ఆశ్చర్యంగా వుంది కదూ !

తాను రాజీనామా చేయబోతున్న విషయం నరేంద్రమోడీకి రెండు నెలల ముందుగానే అరవింద్‌ పంగారియా చెప్పారట. మరొకరిని ఎవరిని తీసుకువస్తారో ఇంతవరకు తెలియదు. రాజీనామా వ్యవహారం బయటకు వచ్చిన తరువాతే కొన్ని పేర్లు పరిశీలనలో వున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు సమస్య ఏమంటే ఎవరు వచ్చినా దేశం ఇప్పుడున్న స్ధితిలో ఏం పొడుస్తారు ? పొడిచేదేమీ లేదని అర్ధం అయిన కారణంగానే అరవింద్‌ సెలవు పొడిగింపు లేదనే సాకుతో మర్యాదగా తప్పుకున్నారా ?

వుత్పత్తి లేదు, ఎగుమతులు పడిపోతున్నాయి, వుద్యోగాల కల్పన అసలే లేదు. కాస్త ఆశాజనంగా వున్న ఐటి రంగం రూపాయి బలహీనం కావటంతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు, కొత్త వుద్యోగాలు లేవు. డిగ్రీ చేతబట్టుకొని వుద్యోగాల కోసం కావాలంటే ముందు వుద్యోగంలో చేరు కొన్ని నెలలపాటు జీతం భత్యం అడగవద్దు, ఖర్చుల మేరకు ఇస్తాం అంటున్నారు. ఆవులకు ఆధార్‌ కార్డులు, ఆవులను చంపితే మరణశిక్ష విధించే విధంగా చట్టసవరణలు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్ధల స్ధానంలో గోశాలలు, వస్తూత్పిత్తికి బదులు ఆవు పేడ, మూత్ర సేకరణ వంటి కార్యక్రమాలు అమలు జరపటానికి, ఆవు, గొడ్డు మాంస రాజకీయాలు చేయటానికి మరో కోణం నుంచి ఆలోచిస్తే అరవింద్‌ వంటి ఆర్ధికవేత్తలు అవసరమా ? గుజరాత్‌ నమూనా అభివృద్ధి అంటూ నరేంద్రమోడీ పాలనకు విశ్వసనీయత కలిగించిన వారిలో అరవింద్‌ పంగారియా ఒకరు. అందుకే నరేంద్రమోడీ ఆయనను ఎంచుకోవటానికి ఒక కారణం. ప్రచార హోరు తప్ప చెప్పిన విధంగా అక్కడకు పెట్టుబడులు రాలేదన్నది నమ్మలేని నిజం. అందువలన గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా దాని బండారం ఏమిటో నరేంద్రమోడీకి బాగా తెలుసుగనుకనే గత మూడు సంవత్సరాలలో దాని గురించి మాట్లాడితే ఒట్టు. రెండవది అరవింద్‌ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ బడిలో చదువుకున్నాడు. అన్నీ ప్రయివేటీకరణ, ప్రభుత్వ జోక్యం పరిమితంగా వుండాలి, సబ్సిడీలన్నీ ఎత్తివేయాలన్నది ఆయన ప్రిస్క్రిప్షన్‌. వాటిని అమలు జరిపితే తమ పని ఖాళీ అని బిజెపి నేతలకు తెలుసు. అందుకే జనం నుంచి వెలికాకుండా వుండటానికి స్వదేశీ జాగరణ మంచ్‌, బిఎంఎస్‌ వంటి సంస్ధలతో కొన్ని విమర్శల నాటకం ఆడిస్తూ వుంటారు. వైఫల్యాల నుంచి జన దృష్టిని మళ్లించాలంటే ఎప్పుడూ ఏదో ఒక జిమ్మిక్కు చేస్తూ వుండాలి. అరవింద్‌ పంగారియాకు పోటీగా నీతి ఆయోగ్‌లో మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఒక వార్త. కొన్ని అంశాలపై ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించి మోడీ ఆగ్రహానికి గురయ్యారని మరొక సమాచారం.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ 2008 నుంచి తీవ్ర ఆర్ధిక మాంద్యంతో సాగుతున్న స్ధితిలో దానిని గట్టెక్కించే అస్త్రాలు అరవింద్‌ వంటి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల అంబుల పొదిలో లేవు. ప్రయోగించినవన్నీ తుస్సు మంటున్నాయి. ధనిక దేశాల మార్కెట్లు మందగించటం, అనేక దేశాలు తమ దేశాల పరిశ్రమలు, వ్యాపారాలకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న స్ధితిలో మన పెట్టుబడిదారులకు విదేశీ మార్కెట్లను సంపాదించటం అంత తేలిక కాదని గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌కు బాగా తెలిసి వచ్చింది. మరోవైపున ప్రపంచ ఆర్ధిక సంస్ధ, ఇతర వేదికలు మన వంటి మార్కెట్లను మరింతగా తెరవాలని, దిగుమతి పన్నులను తగ్గించాలని రోజు రోజుకూ వత్తిడి తెస్తున్నాయి. మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా మా ఇంటికొస్తూ మాకేం తెచ్చావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అన్నట్లుగా అక్కడ పరిస్ధితి వుంది తప్ప మనకు అనుకూలంగా ఏదీ లేదు. పంచవర్ష ప్రణాళిక విధానం పాతబడితే అవసరాలకు తగిన విధంగా మార్పులు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమాన్ని సవరించుకోవాలి. లేదూ అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించుకొని ఆ తరువాత ఆ విధానాన్ని రద్దు చేయవచ్చు. కానీ నరేంద్రమోడీ సర్కార్‌ మబ్బులను చూపి చేతిలోని ముంతలో నీళ్లు పారబోయటమే కాదు, ముంతనే పగలగొట్టినట్లుగా ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసింది.నీతి ఆయోగ్‌లో అరవింద్‌ కొనసాగినా, మరొక వుపాధ్యక్షుడు వచ్చినా చేసేదేమీ కనిపించటం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఎవరు వచ్చినా కొంత మంది వర్ణిస్తున్నట్లు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాలు లేదా ఆదేశిత విధానాలు అమలు జరపాల్సిందే తప్ప అందుకు భిన్నంగా జరగదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు ఇండియా అంటే ఇందిరే, నేడు నరేంద్రమోడీ అంటే ఇండియానే !

02 Wednesday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

bjp cow politics, cow goondas, cow politics, cow protectors, Indira gandhi, lynching, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

మరో ఏడాదిలో దేశంలో అత్యవసర పరిస్ధితి ప్రకటించటానికి ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభ వెలిగిపోతుందగా1974లో దేవకాంత బారువా అనే అసోం నాయకుడు ఇందిరే ఇండియా-ఇండియా అంటే ఇందిరే అని వర్ణించాడు. భజనపరుల్లో అగ్రగణ్యుడిగా ప్రాచుర్యం పొందాడు. దేశంలో ఇప్పుడు అత్యవసర పరిస్ధితి కంటే కొన్ని దారుణమైన పరిస్ధితులు వున్నాయన్నది కొందరి అభిప్రాయం. సరే వాటిని పాఠకులకు వదలివేస్తా. తాజాగా లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు ఆటవిక చిత్ర వధ లేదా హత్యాకాండ(లించింగ్‌) గురించి చర్చ సందర్భంగా ప్రతిపక్షాలను బెదిరించి అత్యవసర పరిస్ధితి రోజులను గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. ఆటవిక హత్యాకాండ వుదంతాల సందర్భంగా ప్రధాన మంత్రి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటమంటే దేశ ప్రతిష్టనే దెబ్బతీసినట్లుగా భావించాలని కిరెన్‌ రిజ్జు మహాశయుడు దేవకాంత బారువాను మరోసారి గుర్తుకు తెచ్చారు.

గోరక్షణ ముసుగులో చెలరేగుతున్న గూండాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో చెలరేగిపోతూ దాడులు, హత్యాకాండకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అరుదుగా నోరు విప్పే ప్రధాని నరేంద్రమోడీ కూడా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తీసుకోవాలని చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేయనవసరం లేదు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సహజంగానే ప్రతిపక్షాలు దేశాన్ని లించిస్ధాన్‌గా మార్చవద్దని హెచ్చరించాయి.గోరక్షకుల ఆటవిక చర్యలను తాము సమర్ధించటం లేదంటూనే బిజెపి సభ్యులు వ్యవహరించిన తీరు రానున్న రోజుల్లో గో గూండాలు మరింతగా రెచ్చిపోయేందుకు దారితీసేదిగా వుందంటే అతిశయోక్తి కాదు.

గోరక్షణ, గొడ్డు మాంసం తింటున్నారంటూ దాడులకు దిగుతున్న గూండాలను అదుపు చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంటే ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు బిజెపి సభ్యులు బ్రాందీ, వీస్కీ సీసాలపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తున్నారని అది కూడా ఆటవిక చిత్రవధతో సమానమే అని వాదనకు దిగారని వార్తలు వచ్చాయి. ఒకవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గో రక్షకుల చిత్రవధలతో నిమిత్తం లేదని ఆ పార్టీ వారు చెబుతారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కావాలని హత్యాకాండకు పాల్పడుతున్నారని హుకుందేవ్‌ నారాయణ యాదవ్‌ అనే బిజెపి సభ్యుడు లోక్‌సభలో చెప్పారు. ఆటవిక హత్యా కాండ అనే పద అర్ధాన్ని మరింత విస్తృతపరచాల్సి వుందని భాషా చర్చకు సైతం ఆ పెద్దమనిషి తెరతీశారు. హిందూ పండగల సందర్భంగా కొన్ని బహిరంగ రోడ్లలో ప్ర దర్శనలకు అనుమతివ్వకపోవటాన్ని కూడా ఆటవిక హత్యాకాండగానే పరిగణించాలని డిమాండ్‌ చేశారు. గో రక్షణ పేరుతో జరుగుతున్న హత్యాకాండలో మరణిస్తున్నవారెవరు అనే అంశాన్ని పక్కన పెట్టి మంత్రి రిజు తన తెలివితేటలను పూర్తిగా ప్రదర్శించారు.ఆయన చేసిన వాదన సారాంశం ఇలా వుంది. ముందుగా చెప్పాల్సిందేమంటే ఇది రాష్ట్రాల సమస్య. ఒక వుదంతం( గో గూండాల దాడులు) ఆధారంగా ప్రధాని లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పాలనాధికారాలను చేపట్టటం వూహించలేము.కేవలం రాజకీయం చేయటం కోసమే వారు ఈ సమస్యను ముందుకు తెచ్చారు.నిజానికి ఆ దాడుల గురించి వారికి ఆసక్తి లేదు.ప్రధాని నరేంద్రమోడీని బదనాం చేసేందుకు ఈ విధంగా చేస్తున్నారు, దేశవ్యాపితంగా మాపై ప్రచారం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మాపై దాడి చేసేందుకు ఒక సాకుకోసం చూస్తున్నారు.దేశంలో జరగకూడని పనులు జరిగినపుడు వాటిని మనమందరం ఖండించాలి.దీనిలో పార్టీ సమస్యలేదు.పార్టీ రాజకీయాలు వుండకూడదు. నేడు ప్రపంచమంతటా మన ప్రధాన మంత్రిని పొగుడుతూ స్త్రోత్ర, గానాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రధాని ఒక దేశానికి ఇలాంటి సమసయంలో దొరకటం అరుదైన విషయం. మనకు దొరికిన అదృష్టం మిగతా దేశాలకు అరుదుగా లభిస్తుంది. ఇవి మన రోజులు. ప్రపంచ దృష్టిలో భారత్‌ పేరు వెలిగిపోతోంది. మన ప్రధానిని ప్రపంచమంతా గౌరవిస్తున్నపుడు ఆయన ప్రతిష్ట, మా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటం దేశ ప్రతిష్టను దెబ్బతీయటంతో సమానం అని మీరు మరచిపోవద్దు. మీరు ఎన్నిసార్లు ఈ సమస్యను లేవనెత్తితే జనం అన్నిసార్లు మీ బండారం బయటపెడతారు.ఇలాంటి కల్పిత అంశాలను సమస్యలుగా చేసిన ప్రతిసారీ బిజెపి మరింత బలపడుతుంది.ఇది నేను చేస్తున్నది కాదు ప్రజల హెచ్చరిక.

ఇటువంటి వారి భజన తీవ్రత పెరిగే కొద్దీ నరేంద్రమోడీ ప్రతిష్ట తరగిపోతుందని, దేశజనం చెవుల్లో పూలు పెట్టుకొని లేరని ఆయన భక్తులు గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d