• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

నిన్న నోట్ల రద్దు, నేడు బ్యాంకు డిపాజిట్లకు ఎసరు, రేపేమిటి మోడీగారూ !

18 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bank deposits, Demonetisation, FRDI bill, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికార నాలుగోవార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. ఈ కాలంలో ఆయన వ్యతిరేకులకు, మద్దతుదార్లకు ఒక విషయంపై ఏకాభిప్రాయం వుంది. అదేమంటే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి, పదవిలోకి వచ్చినప్పటి నుంచి దేశం గిడసబారిపోయింది తప్ప ఎదుగుల లేదు. ఏ దివాలాకోరు విధానాలనైతే కాంగ్రెసు అనుసరించిందో వాటినే మరింత వేగంగా అమలు జరుపుతున్నారు తప్ప కొత్తవి, సరైనవి లేనందున నరేంద్రమోడీ విఫలం కావటం అనివార్యమని ఆయన విధానాలను వ్యతిరేకించే వారు మొదటి నుంచీ బహిరంగంగా చెబుతున్నారు. మద్ధతుదార్లకు ఇప్పటికీ సమాధానం అంతుబట్టటం లేదు. ఆయన అనేక మంచి చర్యలను చేపట్టినప్పటికీ దేశం ఎందుకు గిడసబారిపోయింది, తీసుకున్న చర్యలు వ్యతిరేక ఫలితాలు ఎందుకు ఇస్తున్నాయి అనే ప్రశ్నలకు వారు అంతర్గతంగా తమలో తాము సతమతం అవుతున్నారు తప్ప బయట పడేందుకు సిద్ధం కావటం లేదు. పెద్ద నోట్ల రద్దుపేరుతో జనం దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయించిన మోడీ ఇప్పుడు ఆ డిపాజిట్లను కొల్లగొట్టేందుకు పూనుకున్నారని అదే జనం గగ్గోలు పెడుతున్నారు. అనేక మంది బ్యాంకుల్లో వున్న డిపాజిట్లను వెనక్కు తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎక్కడ దాచుకోవాలి, తీసుకోకపోతే ఆ డిపాజిట్లను ఏదో ఒకసాకుతో స్వాహా చేస్తే ఎలా అనే గుంజాటనలో వున్నారు.

నల్లధనం వెలికితీత, వుగ్రవాదులకు నిధులు అందకుండా చేసేందుకో మరొక లోకకల్యాణం కోసమో పెద్ద నోట్లను రద్దుచేశామని చెబితే దేశ జనులందరూ నెలల తరబడి బ్యాంకుల ముందు క్యూలు కట్టి తమ వద్ద వున్న నోట్లను డిపాజిట్‌ చేయటం కొత్త నోట్లను తీసుకున్నారు. దానినొక దేశభక్తి కర్తవ్యంగా భావించారు. ఏడాది గడచిపోయినా ఇంకా నోట్ల రద్దుకు ముందున్న పరిస్ధితి పునరుద్ధరణ కాలేదు. ఏటిఎంలలో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తూనే వున్నాయి. రద్దయిన నోట్లెన్ని, నల్లధనం ఎంత బయటికి వచ్చిందో నోట్ల రద్దు వలన కలిగిన లాభమెంత, నష్టమెంత అని చెప్పేవారే లేరు. నోట్ల రద్దును ఎంతో ఘనంగా ప్రకటించిన మోడీ దాని లాభనష్టాల గురించి కనీసం మన్‌కీబాత్‌లో అయినా ఎందుకు చెప్పటం లేదు. రద్దయిన పాతనోట్లతో బ్యాంకుల గదులన్నీ నిండిపోయినందున నాణాలు పెట్టేందుకు స్ధలం లేనందున వాటి ముద్రణ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుద్యోగుల ఆందోళనతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.పనికిరాని పాతనోట్లను ఇంకా ఎంతకాలం దాస్తారు, దాచి ఏం చేస్తారు? మరి నాణాలకు స్ధలం అంతలోనే ఎలా దొరికింది? ఏదో ఒకసాకుతో నాణాల ముద్రణ నిలిపివేసి టంకశాలలను మూసివేయటం లేదా నాణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు వేసిన ఎత్తుగడ తప్ప నాణాలకు స్ధలం లేదంటే ఎవరైనా నమ్ముతారా? కేంద్ర ప్ర భుత్వం చెబుతున్న మాటలకు విశ్వసనీయత లేకుండా పోతోంది. నోట్ల రద్దు తాత్కాలికంగా ఆర్ధిక వ్యవస్ధకు చేటు తెచ్చినప్పటికీ అభివృద్ధి కొద్ది నెలల్లోనే తిరిగి పట్టాలెక్కుతుందని ఆర్ధికవేత్తలనేక మంది ప్రభుత్వానికి మద్దతు పలికారు.2017 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసానికి అభివృద్ధి 6.5-7శాతం వరకు వుంటుందని అనేకమంది అంచనాలు వేశారు. తీరా అది 5.7శాతమని ప్రభుత్వమే ప్రకటించటంతో ఆర్ధికవేత్తల నోళ్లు మూతబడ్డాయి. రోగి తట్టుకోగలిగినపుడే ఆపరేషన్‌ చెయ్యాలి, అందుకే ఇప్పుడు నోట్లు రద్దు చేశామని చెప్పిన నరేంద్రమోడీ చర్యతో వున్న ఆరోగ్యం కాస్తా మరింత దిగజారింది.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు మనం దిగుమతి చేసుకున్న పీపా ముడి చమురు ధర 109 డాలర్లయితే ఇప్పుడు 56 డాలర్లకు అటూ ఇటూ వుంది. మోడీ తొలి మూడు సంవత్సరాలలో ఇంకా తక్కువ వుంది. ఖజానాకు ఎంతో కలసి వచ్చింది. కానీ వినియోగదారుడికి ఏం ఒరిగింది. తిరిగి పెట్రోలు మూడేండ్ల గరిష్టానికి చేరింది. డీజిల్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు, గ్యాస్‌, కిరోసిన్‌పై నొప్పి తగుల కుండా ప్రతినెలా కొంత చొప్పున కోత పెడుతున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం అదుపులో వుందని, ధరల పెరుగుదల తక్కువగా వుందని సంతోషిస్తున్నవారికి అది కూడా పెరగటం ప్రారంభమై 5.13శాతానికి చేరినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. నోట్ల రద్దు ప్రయోజనం ఏమైనట్లు, జిఎస్‌టి విప్లవ ఫలితాలేమిటి? వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నట్లు ? వాస్తవ పరిస్ధితిని దాచి తిమ్మినిబమ్మిని చేసేందుకు, అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు కొత్త సమస్యలను ముందు తెచ్చి ఇంతకాలం ప్రయత్నించారన్న అనుమానం కలుగుతోంది. ఏదైనా అసలు ప్రధాని నోరు విప్పి వాస్తవాలు చెబితే కదా !

ఇక బ్యాంకుల్లో వున్న జనం డిపాజిట్లను ప్రభుత్వం తీసుకుంటుందటగా అనే జన ఆందోళన గురించి చూద్ధాం. ఇది ఆధారం లేని లేదా నరేంద్రమోడీని వ్యతిరేకించే ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కాదు. స్వయంగా నరేంద్రమోడీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లులోనే వుంది. తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సెలెక్టు కమిటీకి పంపారు. అది తరువాత ఏమౌతుందో చూడాల్సి వుంది. వున్నది వున్నట్లుగా బిల్లును ఆమోదించినట్లయితే జరిగేదేమిటో చూద్దాం. బ్యాంకుల పరిస్ధితి ప్రాణాంతకంగా అంటే తీవ్రపరిస్ధితి ఏర్పడినపుడు పరిష్కరించేందుకు వ్యవస్ధ ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు ఈ బిల్లులో వుంది. దీనిలో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ అధికారులే సభ్యులుగా వుంటారు. బ్యాంకుల పరిస్థితి సంక్లిష్టంగా మారినపుడు డిపాజిట్లతో సహా డబ్బుదాచుకున్నవారి సొమ్మును బ్యాంకులు దివాలా ఎత్తకుండా వినియోగించేందుకు పరిశీలించే అవకాశం ఈ కార్పొరేషన్‌కు దఖలు పడుతుంది. ఇప్పటి వరకు అటువ ంటి పరిస్ధితులు ఏర్పడితే అంటే విజయమాల్య వంటి వారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయినా, స్వదేశంలోనే వుండి కాళ్లు బార్లా చాపినా దివాలా తీసిన లేదా అంతదగ్గరగా వెళ్లిన ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వమే బడ్జెట్‌ ద్వారా నిధులు ఇచ్చి వాటిని నిలబెడుతోంది. దీన్నే బెయిల్‌ అవుట్‌ అంటున్నారు.ఇప్పుడు పార్లమెంటులో ప్రవే శపెట్టిన బిల్లులో బెయిల్‌ ఇన్‌ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తాను ఆదుకొనే బాధ్యతను వదిలించుకొని అవసరమైతే డిపాజిటర్ల సొమ్ముతోనే బ్యాంకులను నిలబెడతారు. అప్పుడేమవుతుంది. ఏమైనా జరగవచ్చు. బ్యాంకులు దివాలా తీస్తే బ్యాంకులలో డిపాజిట్లు చేసుకున్నవారిలో లక్షలోపు వున్నవారికి బీమాను వర్తింప చేసి వారికి చెల్లించటం జరుగుతోంది. దీనికి గాను రిజర్వుబ్యాంకుకు అనుబంధంగా వుండే డిపాజిట్‌ ఇన్సూరెన్సు అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. కొత్త బిల్లు ప్రకారం దాన్ని మూసివేస్తారు, దాని స్ధానంలో కొత్త వ్యవస్ధ గురించి ప్రస్తావన లేదు. నిజానికి ఆ సంస్ధకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకుల మీద జనంలో వున్న నమ్మకం ముఖ్యమైనది. గతంలో ప్రయివేటు బ్యాంకుల అనుభవాలను చూసిన జనం బ్యాంకులకు బదులు ఇండ్లలోనే డబ్బుదాచుకొనేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత బ్యాంకుల జాతీయకరణతో వడ్డీ తక్కువ ఇచ్చినప్పటికీ ఆ నమ్మకం ఎంతోపెరిగింది. ఇప్పుడు దానికి ముప్పు వచ్చింది. నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు, మరోసారి పెద్ద నోట్ల రద్దు అనే ప్రచారాల నడుమ ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుతో బ్యాంకు డిపాజిట్లు కూడా సురక్షితం కాదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ భావం మరింత పెరిగితే బ్యాంకులకు డిపాజిట్లు తగ్గిపోతాయి. బంగారం, ఇండ్ల స్ధలాలు, భూముల రూపంలో దాచుకొనేందుకు జనం చూస్తారు. ఇది ఆర్ధిక కోణంలో చూస్తే తిరోగమనమే.

ప్రతిదానిని తమ ఘనతగా చూపేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయద్రవ్య సంస్ధలు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల వత్తిడి మేరకు దేశమంతటా ఏకరూప పన్ను విధానం వుండాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రతిపాదించింది. అప్పుడు ప్రతిపక్షంలో వున్న బిజెపి దానిని వ్యతిరేకించింది. తీరా తాను అధికారానికి వచ్చిన తరువాత తన ఘనతగా చెప్పుకొంటోంది. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ద్వారా డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పిస్తామని, రుణాలు ఎగవేసినవారిపై మరింత కఠినచర్యలు తీ సుకొనేందుకే ఈ బిల్లును తెస్తున్నట్లు చెబుతోంది. పది సంవత్సరాల కితం అమెరికాలోని బడా బ్యాంకులు దివాలా తీసిన తీరు చూసిన బ్యాంకులను ఆదుకొనేందుకు డిపాజిటర్ల సొమ్మును వాడుకోవటంతో సహా వివిధ చర్యలను చేపట్టేందుకు విధంగా ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని భారత్‌ భాగస్వామిగా వున్న జి20 దేశాల కూటమి నిర్ణయించింది. దాని పర్యవసానమే ఈ బిల్లు.

ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్దలన్నీ ప్రయివేటు రంగంలో వున్నాయి. అటువంటివి దివాలా తీసినపుడు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకోవటానికి, ప్రభుత్వరంగంలోని బ్యాంకులు దివాలా తీసినపుడు వాటిని ఆదుకొనేందుకు ప్రజల సొమ్మును వినియోగించటానికి తేడా వుంది. ప్రభుత్వరంగంలోని బ్యాంకులు పాలకపార్టీల నేతలతో కుమ్మక్కయ్యే పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలిస్తున్నాయి. వాటిని పక్కదారి పట్టించి, కాగితాల మీద దివాలా చూపించి రుణాలు ఎగవేస్తున్నవారే ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కుమ్మక్కు, కావాలని ఎగవేసే వారిని నియంత్రించటం, వసూలు చేయటం ఒక అంశం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ పధకాలు, సామాజిక అవసరాలను కూడా తీరుస్తున్నందున అవి ఇబ్బందులలో పడినపుడు వాటిని ఆదుకోవటానికి ప్రభుత్వ నిధులు కేటాయించటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ప్ర భుత్వం ఆ బాధ్యతను కూడా విస్మరించి డిపాజిటర్ల సొమ్ముతోనే ఆపని చేసేందుకు పూనుకుంది. అంటే కుమ్మక్కు, కావాలని ఎగవేసే రుణాలు ఇంకా పెరిగేందుకు అవకా శం వుంటుంది. ఇప్పటి వరకు మన దేశ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అటువంటి పారుబాకీల సమస్య వున్నప్పటికీ మొత్తం మీద అవి నిర్వహిస్తున్న పాత్రతో పోల్చితే వుద్యోగ సంఘాలు సూచిస్తున్న విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటే అధిగమించరాని పెద్ద సమస్య కాదు.

ప్రపంచ ద్రవ్యపెట్టుబడిదారులు బ్యాంకులలో ప్రభుత్వ పాత్ర తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్దకు మనకు చాలా తేడా వుంది. దాని రోగం వేరు. బాసల్‌ పేరుతో పశ్చిమ దేశాల బ్యాంకుల రోగానికి సూచిస్తున్న చికిత్సను మన జాతీయ బ్యాంకులకు చేయటం అర్దంలేని పని. బాసల్‌ పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని బ్యాంకులలో తగిన మేర నిధులు వుంచే పేరుతో ప్రయివేటీకరణకు బాటలు వేస్తున్నది. ఇప్పుడు డిపాజిటర్ల సొమ్ముతో ప్రభుత్వ బ్యాంకుల దివాలాను నిరోధించటమంటే అది మరింత వేగం కావటానికి దారి తీస్తుంది. బ్యాంకులు దివాలా తీసినపుడు డిపాజిట్లలో కొంత మొత్తాన్ని బ్యాంకుల వాటా ధనంగా మార్చుతారు. అది మరోసారి దివాలా తీస్తే గీస్తే వాటాల ధర మరింతగా పతనం అవుతుంది. సొమ్ము అవసరమైన వారు ఆ వాటాలను అయినకాడికి, లేదా అవసరం అయినపుడు ప్రయివేటు వారికి అమ్ముకోవటం తప్ప మరొక మార్గం వుండదు. తన వాటాలనే విక్రయిస్తున్న ప్రభుత్వం సామాన్యడిపాజిటర్ల వాటాను కొనుగోలు చేస్తుందని ఎలా భావించగలం? ప్రభుత్వం ఒక వైపున బ్యాంకులకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు 2.11లక్షల కోట్లను ప్రభుత్వ రంగబ్యాంకులకు సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాంటపుడు బిల్లు ద్వారా డిపాజిటర్ల సొమ్ము వినియోగానికి అవకాశ ం కల్పించటం ఎందుకు అనే ప్ర శ్న వుత్పన్నం అవుతోంది. ఈ బిల్లును యధాతధంగా ఆమోదిస్తే రానున్న రోజుల్లో డిపాజిట్లకు భద్రత సమస్యకు నాందిపలికినట్లే. లేదు కొంత మంది చెబుతున్నట్లుగా బిల్లు ఆమోదం పొందటం కోసం ప్రభుత్వరంగ బ్యాంకు డిపాజిట్లకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా తరువాత దొడ్డిదారిన దానిని అమలు జరపరన్న గ్యారంటీ ఏముంది? పాలకుల మాటలు నీటి మీది రాతలు, అందునా అవసరమైనపుడు హడావుడి చేసి ఆనన నోరు మెదపని నరేంద్రమోడీ వంటి వారి చేతలు మరింత ప్రమాదకరం. ఆలోచించండి ! నిన్న జనానికి ప్రయోజనం లేని, దేశానికి నష్టం కలిగించిన పెద్ద నోట్ల రద్దు, నేడు సామాన్య డిపాజిటర్ల సొమ్ము కొల్లగొట్టేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ, రేపు ఏ ముప్పు తేనున్నారు మోడీ గారూ అని అడగాల్సిన తరుణం రాలేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

లోక్‌సభ ముందస్తు ఎన్నికలను ముందుకు తెచ్చే గుజరాత్‌ విజయం ?

19 Tuesday Dec 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress party, gujarat election verdict, lok sabha midterm polls, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్స్‌ మోజులో మోడీ ఆశాభంగం ?

26 Sunday Nov 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

india ratings, moody’s india ratings, Narendra Modi, rating fancy, s&p india rating

ఎం కోటేశ్వరరావు

అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఒక్కొక్కటీ ఎదురుతన్నుతుండటంతో గతంలో మాదిరి రొమ్ము విరుచుకొనే పరిస్థితులు లేవు. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్నట్లుగా రేటింగ్స్‌ మోజు నరేంద్రమోడీ పైకి చెప్పుకోలేని చోట మరో దెబ్బతగిలేట్లు చేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పద్నాలుగు సంవత్సరాలుగా రేటింగ్‌తో నిమిత్తం లేకుండా తెచ్చుకుంటున్న అప్పులు, వస్తున్నాయని చెబుతున్న పెట్టుబడులతో ముందుకు పోకుండా అత్యాశకు పోనేల, ఇలా ఇబ్బందులను కొని తెచ్చుకోవటం ఎందుకు అని మోడీ మంత్రాంగం, యంత్రాంగం ఇప్పుడు తలలు పట్టుకోవటం గురించి చెప్పనవసరం లేదు. మూడు వన్‌డే మాచ్‌ల సీరీస్‌లో ఒకటి అటు ఇటు అయితే మూడవది ఇరు జట్లపై ఎంతో వత్తిడి, అభిమానులలో వుత్కంఠను పెంచినట్లుగా ఇప్పుడు అగ్రశ్రేణి రేటింగ్‌ కంపెనీలో మూడవదైన ‘ఫిచ్‌’ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కారణాలు పైకి ఏం చెప్పినా మూడీస్‌ మన సార్వభౌమ రేటింగ్‌ను చెత్తకు దగ్గరగా వున్న స్ధానాన్ని ఒక మెట్టు పైకి పెంచింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌(ఎస్‌ అండ్‌ పి) మాత్రం గతంలో ఏ స్ధానంలో వుంచిందో దానిని మార్చాల్సినంత సీనేమీ లేదని శుక్రవారం నాడు స్పష్టం చేసింది.ఈ రెండు కంపెనీలు అమెరికావి, మూడవది బ్రిటన్‌ది.

సులభతర వాణిజ్య ర్యాంకును 130 నుంచి 100కు ప్రపంచబ్యాంకు పెంచింది. అలాగే అమెరికాకు చెందిన పూ పరిశోధనా సంస్ధ ఫిబ్రవరిలో చేసిన సర్వే ఫలితాలను నవంబరులో విడుదల చేసి నరేంద్రమోడీకి ఆదరణేమీ తగ్గలేదని, తిరుగులేని నేతని చెప్పింది.విశ్వసనీయ ప్రభుత్వంగా ప్రపంచంలో మోడీ సర్కార్‌ మూడో దేశంగా వుందని 2016లో చేసిన సర్వేలో ఓయిసిడి మరో రాంకు ఇచ్చింది. మూడీస్‌ సంస్ధ చెత్త పక్కన వున్న రాంకును కాస్త ఎగువకు జరిపింది. వాటిని మోడీ భజంత్రీలు ఆయన ఖాతాలో వేసి వీరుడు, శూరుడు అని పొగుడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలను కలిగి వున్న దేశాలు తీవ్ర సంక్షోభం, వాటి పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి ఆ సంక్షోభ సెగ తగలటం ప్రారంభమయ్యే సమయంలో నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి మాజిక్‌ చేస్తానని జనాన్ని నమ్మించి సీట్ల రీత్యా తిరుగులేని మెజారిటీ సాధించారు. అలాంటి స్ధితిలో ఎస్‌ అండ్‌ పి వున్న ర్యాంకును కొనసాగించటం తప్ప పెంచే అవకాశం లేదని చెప్పి గాలితీసిందంటే అది దేశద్రోహం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు.

ఇప్పుడున్న స్ధితిలో ఎవరెన్ని ర్యాంకులు ఇచ్చినా, తెచ్చుకున్నా, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇంకా మరికొన్నింటిని జనం ముందు ప్రదర్శించినా స్ధాయి పెంచిన మూడీస్‌గానీ, యథాతధంగా వుంచిన ఎస్‌ అండ్‌పి గానీ లేవనెత్తున్న అంశాలేమిటి? మోడీ భక్తులు దాని గురించి మాట్లాడటం లేదెందుని? దేశంలో నేడున్న పరిస్ధితులలో అనేక కారణాల రీత్యా ప్రజాకర్షణలో నరేంద్రమోడీ మిగతా పార్టీల నేతల కంటే ఎంతో ముందున్న మాట నిజం. చరిత్రలో అనేక మంది నేతలు ఇలాగే ప్రజాకర్షణలో తారాజువ్వల మాదిరి దూసుకుపోయి అంతే వేగంతో పడిపోయిన వారు కూడా లేకపోలేదు. గత మూడున్నర సంవత్సరాలుగా ఇంతగా జనం విశ్వసిస్తున్న దేశ ప్రధానిని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్ధలు ఎందుకు నమ్మటం లేదు అని మోడీ భక్తులు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంస్ధలకు చట్టబద్దత లేకపోయినా, లొసుగులున్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఏ దేశానికైనా రుణం ఇవ్వాలన్నా,పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంస్ధల సిఫార్సులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకే కదా నరేంద్రమోడీ సర్కార్‌ తమ రేటింగ్‌ పెంచమని పైరవీలు కూడా జరిపింది. మరోవైపు అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు ఫోజు పెడుతున్నారు.

మీ గురించి కావాలంటే ఎన్ని మెచ్చుకోలు మాటలైనా చెబుతాం గాని ఆ ఒక్కటీ అడగవద్దు అన్నట్లుగా రేటింగ్‌ సంస్ధలు మన దేశం పట్ల వ్యవహరిస్తున్నాయి. గత 14 సంవత్సరాలుగా రేటింగ్‌ను పెంచకపోయినా మేం అప్పులు తెచ్చుకోగలిగాం, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, గతం కంటే ఇప్పుడు మా రుణభార శాతం తక్కువగా వుంది. మాకంటే ఎక్కువ రుణభారం వారికి మెరుగైన రేటింగ్‌ ఇచ్చారు, అలాంటపుడు మా రేటింగ్‌ ఎందుకు పెంచరు అని నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది మూడీస్‌ సంస్ధను నిలదీసింది. దీనిలో పాక్షిక సత్యం లేకపోలేదు.1991 నుంచి 2016 వరకు మన దేశ జిడిపి-రుణ నిష్పత్తి సగటున 73.42 శాతం వుంది. అంటే మన ఆదాయం 100 అయితే 73.42 అప్పు తీసుకుంటున్నాం. గతేడాది 2016లో ఇది 69.50 శాతం, గత పాతిక సంవత్సరాలలో కనిష్టంగా 1996లో 66, గరిష్టంగా 2003లో 84.20 శాతం నమోదైంది. రెండవ ఘనత బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయికి దక్కింది. ఆయన పాలనలోనే రుణభారం విపరీతంగా పెరిగింది. అంతకు ముందున్న కనిష్ట స్ధాయికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ హయాంలో అంతకు ముందున్నదాని కంటే ఒక శాతం పెరిగింది. రేటింగ్‌ లేకపోయినా అప్పులు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అది కూడా తిరుగులేని సత్యమే. ముందు అప్పు ఇవ్వండి వడ్డీ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటున్నాం. ముందే చెప్పినట్లు మన అప్పు నూటికి నూరుశాతం స్ధాయికి పెరగలేదు.మిగతా దేశాలకు ఇస్తే వడ్డీ కంటే రెట్టింపునకు పైగా భారత్‌లో వస్తోంది. అందువలన రేటింగ్‌ను పక్కన పెట్టి ఇచ్చినా ఫరవాలేదు, కొంత వడ్డీ పోయినా ఇబ్బంది లేదు అని విదేశీ సంస్ధలు అనుకుంటున్నాయి. రోజువారీ అధిక వడ్డీలకు ఇచ్చే వారు తీసుకొనే వాడి జుట్టు చేతిలో పెట్టుకుంటున్నట్లే అలాంటి రుణాలకు మనం తప్పించుకోలేని షరతులను రుద్దుతాయి.https://tradingeconomics.com/india/government-bond-yield మన దేశం తీసుకొనే రుణాలకు చెల్లించే వడ్డీ (దాన్నే బాండ్‌ రేటు అంటున్నారు) పది సంవత్సరాల బాండ్‌కు దాదాపు 7 శాతం కాగా అదే చైనా 4.04, అమెరికా 2.33, బ్రిటన్‌ 1.25,ఫ్రాన్సు 0.68, జపాన్‌ 0.03 వుండగా మన కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించి రుణాలు పొందే దేశాలు బ్రెజిల్‌ 10.09, మెక్సికో 7.26 వున్నాయి. అందువలన అప్పు తీసుకోవటం గొప్ప కాదు, దానిని ఎలా తీరుస్తామనేదే సమస్య.ష్https://thelogicalindian.com/story-feed/opinion/indias-debt-trap-25-of-the-budget-is-spent-on-paying-of-debts/ మనం తీసుకొనే అప్పులకు బడ్జెట్‌లో 25శాతం మొత్తం చెల్లిస్తున్నాము, అదే అమెరికా కేవలం ఆరుశాతమే. మన పాలకులు అప్పులు తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేది ఒట్టిమాట, పాత అప్పులు, వాటి వడ్డీలు కట్టేందుకే మనం కొత్త అప్పులు తీసుకుంటున్నాం.

రేటింగ్‌ సంస్ధలు దీని గురించే పట్టుబడుతున్నాయి. అనధికారికంగా అధిక వడ్డీలకు ఆశపడి ఎవరైనా అప్పులు ఇచ్చి రిస్కుతీసుకుంటే అది వారి సమస్య, తమ రేటింగ్‌ను బట్టి అప్పు ఇచ్చేవారిని నట్టేట ముంచేందుకు సిద్ధంగా లేమంటున్నాయి ఆ సంస్ధలు. ఎందుకంటే అన్ని దేశాల పరిస్ధితులను అధ్యయనం చేసి తగు సలహాలనిచ్చేందుకు ఆ సంస్ధలు పెద్ద మొత్తంలో మదుపుదార్లనుంచి ఫీజులు వసూలు చేస్తాయి. మన దేశ తలసరి ఆదాయం కనిష్ట స్ధాయిలో వుండటం, రుణభారం పెరుగుతుండటం మదుపుదార్లకు ఆందోళన కలిగించే అంశమే. మూడు సంవత్సరాలలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మోడీ చేసుకుంటున్నది ప్రచారం తప్ప వాస్తవం కాదని చెప్పటమే గత రేటింగ్‌ను యథాతధంగా వుంచటానికి అర్ధం. అంటే మోడీ అభివృద్ధి, సంస్కరణల గాలితీసినట్లే.

గతేడాది చేసిన నోట్ల రద్దు ద్వారా సాధించిన ఫలితాలేమిటో ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా మోడీ నోరు విప్పుతారేమోనని ఆశించిన దేశభక్తులను నిరాశపరిచారు. జిఎస్‌టి గురించి ఎలాంటి కసరత్తు, పర్యవసానాల గురించి ఆలోచించకుండా బలవంతంగా అమలు జరపటంతో జరిగిందేమిటో చూస్తున్నాం. ఒక పన్ను పద్దతిని రద్దు చేసి మరొక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టటం అంటే తెల్లచొక్కా తీసి వేసి కాషాయ చొక్కా తొడుక్కున్నంత సులభం అన్నట్లుగా చెప్పిన కబుర్లు ఏమయ్యాయి. గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, గుజరాత్‌ వ్యాపారులు తీవ్ర నిరసనల కారణంగా జిఎస్‌టిలో మార్పులు చేశారని అందరూ ఎరిగిందే. ఆ పని పూర్తయిన తరువాత తిరిగి రేట్లు పెంచరన్న హామీ ఏముంది. భారత్‌లో పన్ను ఆదాయం తక్కువగా వుందని, దాన్ని పెంచకుండా, తగినంత ఆదాయం లేకుండా అప్పులు ఎలా తీరుస్తారని గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ మన ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. అందువలన నరేంద్రమోడీ మరింతగా మూసుకోవటం తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. నిజానికి మోడీకి వాస్తవాలు తెలియక కాదు, జర్నలిస్టులలో చెప్పింది రాసుకొనే స్టెనోగ్రాఫర్లే కాదు, ఏమిటి, ఎందుకు, ఎలా,ఎవరు, ఎక్కడ అని ప్రశ్నలడిగే నోరున్న వారు కూడా వున్నారు గనుక ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మోడీ ఇంతవరకు పత్రికా గోష్టి పెట్టలేదు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం మనది, అందులోనూ ప్రధాని విధిగా పత్రికా గోష్టి పెట్టాలని ఎక్కడా రాసిలేదు మరి. ఈ విషయంలో గిన్నిస్‌బుక్‌ రికార్డులకు ఎక్కుతారనేది జనాభిప్రాయం.

యధారాజా తధా ప్రజ సామెతలో ప్రజ బదులు సలహాదారులు అని మార్పు చేసుకోవాల్సిన అగత్యం కనపడుతోంది. ఈ మధ్య కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రులు పుష్పకవిమానాలను నింపినట్లు తమ కార్యాలయాలను సలహాదారులతో నింపివేస్తున్నారు. వారు తమ ప్రావీణ్యత వున్న రంగాలలో గతంలో ఏం చేశారో తెలియదు గానీ సలహాదారులుగా మారిన తరువాత యజమాని మనసెరిగి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదంటే వారి వుద్యోగాలుండవు మరి. మహాభారతంలో శకుని మామ గురించి తెలిసినదే. ప్రధాని నరేంద్రమోడీకి బయటి ప్రత్యర్ధులెవరో అందరికీ తెలిసిందే. సమస్య అంతర్గత శక్తులతోనే. అందుకని ఎవరే పాత్ర పోషిస్తున్నప్పటికీ అది ఆ పెద్ద మనిషి స్వయంకృతం. ‘చివరాఖరికి ‘ చెప్పొచ్చేదేమంటే నరేంద్రమోడీ అంతకంటే ఆయనను అనుసరించే గుడ్డి భక్తకోటి రోజు రోజుకూ ఇరకాటంలో కూరుకుపోతున్నారు. దానివలన ఎవరికీ నష్టం లేదు సమస్యల్లా సామాన్య జనం, దేశం అధోగతి పాలు కావటం గురించే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

18 Saturday Nov 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు ‘విదేశీ’ ముస్లిం మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బాటలో నేడు ‘స్వదేశీ’ హిందూ బిజెపి నరేంద్రమోడీ !

02 Thursday Nov 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Doing business India rank, Doing business rankings, mughal king jahangir, Narendra Modi, red carpet to foreign investors

సూరత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతి కోరుతూ 1615లో మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ వద్దకు ఇంగ్లండ్‌ రాజు ఒకటవ జేమ్సు ప్రతినిధిగా వచ్చిన సర్‌ థామస్‌ రో

ఎం కోటేశ్వరరావు

దారీతెన్నూ తెలియని అడవిలో తచ్చట్లాడుతున్నవారికి తెల్లవారు ఝామున వేగు చుక్క కనపడినట్లు నరేంద్రమోడీ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు వెల్లడించిన తాజా సులభవాణిజ్య సూచిక దొరికింది. మునిగిపోయే వారికి గడ్డిపరక దొరికినా దానిని పట్టుకొని బయటపడాలని చూసినట్లుగా బిజెపి నాయకత్వ ఆత్రం కనిపిస్తోంది. ప్రపంచబ్యాంకు నివేదిక వార్తలతో పాటే ప్రజల సొమ్ముతో పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు జారీ చేయించి పండగ చేసుకుంది. భక్తులు పరమానంద భరితులౌతున్నారు. విమర్శించిన వారి మీద ఎదురుదాడులకు దిగుతున్నారు. ఎందుకటా! ఇప్పటి వరకు 190 దేశాలలో 130వ స్ధానంలో వున్న మనం ఒక్క ఏడాదిలో ఏకంగా100వ స్ధానంలోకి ఎగబాకినందుకట. దానికిగాను తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, చర్యలు ఇవీ అంటూ కేంద్ర ప్రభుత్వం పూర్తి పేజీని నింపి జనం మీదకు వదిలింది. నిజానికి అవేవీ కొత్తవి కాదు, మోడీ సర్కార్‌ గద్దె నెక్కిన దగ్గర నుంచీ వూదరగొడుతున్నవి, కొద్ది మంది కార్పొరేట్లకు తప్ప సామాన్య జన సంక్షేమానికి సంబంధం లేనివి, ఒక పట్టాన అర్ధం కానివి.

Bill Bragg illustration on Europe and India and Greece

మోడీ సర్కారు పూర్తి పేజీ ప్రకటనలో లేనిదీ ప్రపంచబ్యాంకు నివేదిక అట్ట మీద వున్నదానిని జనం గమనించాలి. ‘డూయింగ్‌ బిజినెస్‌ 2018, రిఫార్మింగ్‌ టు క్రియేట్‌ జాబ్స్‌’ అన్నది నివేదికకు పెట్టిన నామం. మన ప్రధాని పూర్తి పేజీ ప్రచారంలో జాబ్స్‌ అదే వుపాధి ప్రస్తావనకు ఎగనామం పెట్టారు. నివేదిక పేరును తెలుగులో అనువదించుకుంటే ‘2018లో వ్యాపారం, వుపాధి సృష్టికి సంస్కరణ’ అని అర్ధం. ప్రచార ప్రకటనలో వందవ ర్యాంకు సాధన గురించి పేర్కొని సంస్కరణలు దీనిని సాధ్యం చేశాయి అంటూ పన్నుల చెల్లింపు, అల్పసంఖ్యాక పెట్టుబడిదారులకు రక్షణ, కాట్రాక్ట్‌ సేవకరణ, వ్యాపార ప్రారంభం, సరిహద్దులలో వ్యాపారం, రిసాల్వింగ్‌ ఇన్సాల్వెన్సీ(దివాలా పరిష్కారం) రుణం పొందటం, విద్యుత్‌ పొందుట, అనుమతులు రూపకల్పన విషయాలలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా పేర్కొన్నారు. వాటి ఫలితంగా సంభవించాల్సిన వుపాధి కల్పన గురించి ఎక్కడైనా వుందా అని దుర్భిణీవేసి వెతికినా కనిపించలేదు. అందుకే పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలన్నట్లుగా ఇంతకాలంగా నరేంద్రమోడీ చేపట్టిన సంస్కరణలు ఇచ్చిన ఫలితాలేమిటన్నది గీటురాయి. సంస్కరణలనే పిల్లికి మన్మోహన్‌ సింగ్‌ పాలుపోసినా లేక నరేంద్రమోడీ మోడీ అంతకంటే మంచి ఆహారం అందించినా అది ఎలుకలను పట్టకపోతే ఎందుకు చేరదీసినట్లు ? వుపాధిని పెంచని, వుద్యోగాలను వూడగొట్టే, సంక్షేమ చర్యలకు మంగళం పాడే సంస్కరణలెందుకు? నరేంద్రమోడీ సంస్కరణలలో ప్రపంచబ్యాంకు సూచికను తయారు చేసే వారిని ప్రధానంగా ఆకర్షించింది కంపెనీల దివాలా పరిష్కారాన్ని సులభతరం చేయటం. అనేక మంది పెద్దలు పరిశ్రమలు, వ్యాపారాల పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటం, వాటిని వేరే మళ్లించి చివరకు దివాళా, ఐపి పెట్టటం అందరికీ బాగా తెలిసింది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు కాస్త కఠినంగా వుంది. అయినప్పటికీ ఎందరో మహానుభావులు లక్షల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు.

2014 జూన్‌ నాటికి అంటే నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించే నాటికి 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థులుగా వర్గీకరించిన మొత్తం రు.2.34లక్షల కోట్లు కాగా 2016 డిసెంబరు నాటికే ఆ మొత్తం రు.6.46లక్షల కోట్లకు చేరింది. అయితే రద్దు చేసినవి, పునర్‌వ్యవస్థీకరించినవి, పారుబాకీలుగా తేల్చిన మొత్తాన్ని లెక్కకడితే అది 20లక్షల కోట్ల రూపాయల వరకు వుంటుందని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి చెప్పారు. కంపెనీల నుంచి గోళ్లూడగొట్టి ఎగవేసిన రుణాలను వసూలు చేయాల్సిన సర్కార్‌ పధకం ప్రకారం దివాలా ప్రకటించిన వారిని సులభంగా బయటపడవేయించేందుకు మోడీ సర్కార్‌ ప్రకటించిన దివాలా సంస్కరణలు ప్రపంచ వాణిజ్యవేత్తలను, వారికి ప్రతినిధిగా వున్న ప్రపంచబ్యాంకుకు సంతోషం కలిగించకుండా ఎలా వుంటాయి. నూతన దివాలా చట్టం నిధులను పక్కదారి పట్టించి కొల్లగొట్టేందుకు అనుమతిస్తుందని, అందువలన ఈ వుదంతంలో వాణిజ్యాన్ని సులభతరం గావిస్తుందా సొమ్ము లూటీని సులభతరం చేస్తుందా అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్యం చేయటాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన సంస్కరణల లక్ష్యం కొత్త వుద్యోగాల సృష్టి అన్నది ప్రపంచబ్యాంకు చెబుతున్నమాటే. మరి వాటి సంగతిని మోడీ సర్కార్‌ ఎక్కడా చెప్పదేం? భక్తులైనా నోరు విప్పరేం?

ప్రతి ఏటా కోటి కొత్త వుద్యోగాలను సృష్టిస్తానని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మోడీ మంత్రదండంతో నిజంగానే వుద్యోగాలస్తాయనే గట్టి నమ్మకంతో ఆంధ్రప్రదేశ నలో మా బాబస్తే మీ జాబచ్చినట్లే అని తెలుగు దేశం పార్టీ ప్రచారం చేసింది. ఇక కెసిఆర్‌ బంగారు తెలంగాణా గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు సంవత్సరాల మోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూస్తే పదేండ్ల కనిష్టానికి కొత్త వుపాధి సృష్టి పడిపోయిందని అధికారిక సమాచారమే వెల్లడించింది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ 2009లో పదిలక్షల వుద్యోగాలను సృష్టిస్తే మోడీ హయాంలో 2015లో 1.55లక్షలు, 2016లో 2.31లక్షలు మాత్రమే వచ్చాయి. నాటి కోటి వాగ్దానానికి, నేటి ఆచరణకు పొంతన ఎక్కడ? మోడీ విదేశీ పర్యటనలు చేసి విమనాల్లో జీవించే ప్రధాని అని చెడ్డ పేరు తెచ్చుకోవటం తప్ప సాధించిందేమిటి? మేకిన్‌ ఇండియా జాడలెక్కడ? మరోవైపు కొంత తగ్గినప్పటికీ ఏడుశాతం వరకు అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నారు, సంస్కరణలు సరేసరి, ఇన్ని చేసినా వుద్యోగాలెందుకు రావటం లేదు. అలాంటపుడు అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎవరికోసం? వుపాధి లేని యువత దేశానికి వరమా? శాపమా ? ఐటి రంగంలో దిగ్గజ సంస్ధలు ఈ ఏడాది 56వేల మందిని ఇంటికి పంపేందుకు పధకాలు వేశాయని ఒకవైపు వార్తలు, మరోవైపు రానున్న మూడు సంవత్సరాలలో ఐటి రంగంలో ఇప్పుడున్న వారిలో సగం మంది అవసరం లేని మిగులుగా తేలుతారని మెకెన్సీ కంపెనీ అంచనా వేసింది.

ఎందుకీ పరిస్ధితి? నిరుద్యోగం, దారిద్య్ర భూతాల వంటివి మోడీని వ్యతిరేకించే వారినే పట్టి పీడిస్తాయి, అభిమానించేవారి జోలికి రావని ఎవరైనా అనుకుంటే జాలిపడటం తప్ప చేసేదేమీ లేదు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ఎవరినీ వదల్లేదని ఇప్పటికే రుజువైంది కదా ! పెట్టుబడిదారులకు కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా కార్మికులు తక్కువగా వుండే పరిశ్రమలు, వ్యాపార సంస్ధల కోసం మన దేశంలో తీవ్రవెతుకులాట ప్రారంభమైంది. పశ్చిమ దేశాలలో ఇప్పటికే వుపాధి రహిత అభివృద్ధి దశలో వున్నాయి. మనం కూడా అదేబాట పట్టాము. మరోవైపు చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి కనుక మా దేశంలో చౌక శ్రమశక్తితో పని చేయించుకోవచ్చు రండహో అని మోడీ, చంద్రబాబు, కెసిఆర్‌ లేకపోతే వారి తనయులు ప్రపంచమంతా తిరిగి చెప్పినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. మేకిన్‌ ఇండియా అంటే అదొక ప్రహసనంగా తయారైంది. సింఫనీ టెక్నాలజీ గ్రూపు కంపెనీల అధిపతి రమేష్‌ వాధ్వానీ ఒక పత్రికలో రాసిన దాని ప్రకారం ‘ 2005-12 మధ్య భారత జిడిపి 54శాతం పెరగ్గా నిఖర వుద్యోగ పెరుగుదల మూడుశాతం మాత్రమే. కేవలం కోటీ యాభైలక్షల కొత్త వుద్యోగాలు మాత్రమే వచ్చాయి.ఈ అంతరం రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. వార్షిక వృద్ధి రేటు 7-8శాతం మధ్య వుంటుందనే అంచనా ప్రకారం 2025నాటికి దేశ జిడిపి రెట్టింపు అవుతుంది. కొత్తగా వుద్యోగాలు కావాల్సిన వారు ఎనిమిది కోట్ల మంది వుంటారు, అయితే ఇప్పుడున్న రేటులో కేవలం మూడు కోట్ల కొత్త వుద్యోగాలు మాత్రమే, అవీ ఎక్కువగా అసంఘటితరంగం, తక్కువ వేతనాలున్నవి మాత్రమే సృష్టి అవుతాయి.’ ఇప్పుడున్న పరిస్ధితి ప్రకారం 2020 నాటికి దేశ జనాభా సగటు వయస్సు 29 వుంటుంది, ప్రతి ఏటా వుద్యోగాలవేటలో చేరేవారి సంఖ్య కోటీ ఇరవై నుంచి కోటిన్నర వరకు వుండవచ్చు. వారిని సంతృప్తి పరచపోతే సామాజిక అశాంతి ఏ రూపంలో బద్దలు అవుతుందో చెప్పలేము. నిరుద్యోగం పెరగటం లేదా కొత్త వుద్యోగాల సృష్టి లేకపోవటానికి దారితీసే కారణాలలో పెట్టుబడి సమీకరణ(ఆస్థుల సమీకరణ అని కూడా అంటారు) పురోగతి నెమ్మదించటం ఒకటని నిపుణులు చెబుతారు. ఆ మేరకు 2016 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2017లో పెరుగుదల కేవలం రెండుశాతమే వుంది.జర్మన్‌ డచ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం నెమ్మదిగా సాగే పెట్టుబడి సమీకరణ జిడిపి పురోగతిపై పరిమితులు విధించటం, వుపాధి కల్పనను నిరోధిస్తుంది.’

వాణిజ్య సులభతరం సూచనలో 130న నుంచి 100కు 30 పాయింట్ల పురోగతి సాధించామని బిజెపి తనకు తానే కితాబునిచ్చుకుంటున్నది. సంస్కరణలతో పాటు అవినీతి నిరోధం గురించి కూడా నరేంద్రమోడీ అంతే గట్టిగా చెప్పారు. అవినీతిని అరికట్టి వాణిజ్యాన్సి సులభతరం గావించామని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ కాంగ్రెస్‌ నేతలకు ఒక ట్వీట్‌లో చురకలంటించారు. అయితే అవినీతి నిరోధక సూచికలో మోడీ సర్కార్‌ 176 దేశాలలో 2016లో తన సూచికను 76 నుంచి 79కి మూడు పాయింట్లు మాత్రమే మెరుగుపరచుకుంది. అంటే మోడీ సర్కార్‌కు కార్పొరేట్లకు వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు తీసుకొనే చర్యల పట్ల వున్న శ్రద్ద అవినీతి నిరోధకంలో లేదని ఈ సూచిక స్పష్టం చేయటం లేదూ !

పదహారవ శతాబ్ది ప్రారంభంలో నాటి మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ మన దేశంలో సులభంగా వాణిజ్యం చేసుకొనేందుకు ఎర్రతివాచీ పరిచాడు. పద్దెనిమిదవ శతాబ్ది చివరికి ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌ వారు చివరకు మన దేశాన్ని ఆక్రమించుకొని వలస దేశంగా చేసుకున్నారు. ఇప్పుడు 130 నుంచి 100వ స్ధానానికి ఎగబాకించటం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ మరో జహంగీర్‌గా చరిత్రకు ఎక్కారు. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో చెప్పనక్కరలేదు. నాడు బ్రిటీష్‌ వారు ప్రత్యక్ష పాలకులుగా మారితే అంతర్జాతీయ కార్పొరేట్లు పరోక్షంగా చక్రం తిప్పి ప్రతి జీవన రంగాన్ని శాసించేందుకు మోడీ ద్వారాలు బార్లా తెరిచినట్లుగా వేరే చెప్పనవసరం లేదు. అసలు ద్వారాలే లేకుండా చేసే ప్రయత్నాల్లో వున్నారు.

అవథ్‌ నవాబు రాజ్యాన్ని తిరిగి అప్పగించినందుకు బహుమానంగా నాటి బెంగాల్‌ ప్రాంతం(బెంగాల్‌,బీహార్‌,ఒడిషా)లో పన్నులు వసూలు చేసుకొనే అధికారాన్ని నాటి బ్రిటీష్‌ రాజ్య ప్రతినిధి రాబర్టు క్లైవ్‌కు 1765 అగస్టు పన్నెండున అప్పగిస్తున్న మొఘల్‌ రాజు రెండవ రెండవ షా ఆలమ్‌.

ఇప్పటికే వాణిజ్యాన్ని సులభతరం చేసే పేరుతో మన సంపదలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించారు. సంస్కరణల పేరుతో 1990 దశకంలో ప్రారంభించిన చర్యలతో సులభవాణిజ్యంలో మన దేశాన్ని 130వ స్ధానానికి తెచ్చారు. కాంగ్రెస్‌ వారు మూడు దశాబ్దాలలో చేయలేని దానిని స్వదేశీ నరేంద్రమోడీ అత్యంత వేగంతో విదేశీయులకు విందు చేసేందుకు మూడు సంవత్సరాలలో 100కు తెచ్చారు. విశాఖలోని గంగవరం రేవును ప్రయివేటు రంగానికి కట్టబెట్టారు. ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఈ రేవులో అమెరికా సంస్ధ వార్‌బర్గ్‌ పింకస్‌ తనకున్న 31.5శాతం వాటాను దుబాయ్‌ కంపెనీకి విక్రయించాలని చూస్తోందని, పదేండ్ల క్రితం 150 కోట్లు పెట్టుబడి పెట్టిన అది ఇప్పుడు తన వాటాను రు.2560 కోట్ల రూపాయలకు విక్రయించాలని చూస్తోందన్నది వార్త సారాంశం. వ్యాపార సులభతరంలో భాగమే ఇది. అంటే అంత మొత్తం మన దేశం నుంచి సంపద అమెరికాకు తరలిపోయినట్లే. మన స్ధానం వంద నుంచి ఒకటికి తెచ్చేందుకు మోడీ సర్కార్‌ కృషి చేయవచ్చు, దాని వలన అంత మొత్తానికి వాటా కొనుగోలు చేసిన దుబాయ్‌ అదిగాక పోతే మరొక విదేశీ సంస్ధ మరో పదేండ్ల తరువాత అదే దామాషాలో సంపదను తరలించుకుపోతే మన జనానికి ఒరిగేదేమిటి ? మూడు సంవత్సరాల నుంచి తీసుకున్న చర్యలతో విదేశీ కంపెనీల పని సులభం అయిందిగానీ మన బతుకులు దుర్భరం అయ్యాయని మోడీ ప్రభుత్వ విధానాలు స్పష్టం చేయటం లేదా? అందువలన సంఘపరివార్‌ అదే, బిజెపి మాతృసంస్ధ భాషలో చెప్పాలంటే ‘విదేశీ ‘ ముస్లిం మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ మన దేశం బ్రిటీషు వారి పాలనలోకి పోవటానికి ఆద్యుడైతే నేడు ‘స్వదేశీ ‘ హిందూ నరేంద్రమోడీ విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి దేశాన్ని అప్పనంగా అప్పగించేందుకు పూనుకున్న వారిలో నెంబర్‌ ఒన్‌ రాంక్‌ పొందినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

షింజో అబే మాదిరి ముందస్తుకు పోతే నరేంద్రమోడీకి మిగిలేది నిరాశే !

31 Tuesday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Japanese general election 2017, jcp, LDP, Narendra Modi, shinzo abe

ఎం కోటేశ్వరరావు

ఏమో, అధికారమే పరమావధిగా భావించే వారు దేనికైనా పాల్పడవచ్చు. నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించే వ్యక్తి కాదని గతంలో ఎన్నోసార్లు రుజువైంది కనుక ఏమైనా చేయవచ్చు. నిబంధనలు ఏమి వున్నప్పటికీ ఒకే రోజు లెక్కింపు జరిపే సందర్భాలలో ఎన్నికలు జరిగే వ్యవధి ఎక్కువగా వున్నప్పటికీ వివిధ రాష్ట్రాలు, నియోజకవర్గాలకు ఒకే సారి షెడ్యూలు ప్రకటించటం ఆనవాయితీ. దానికి విరుద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం హిమచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శల పాలైంది. కేంద్ర అధికారపక్షం , ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి మేరకే ఇది జరిగిందన్నది జనవాక్యం. మోడీది ఒక పద్దతి అయితే ఆయన చెట్టపట్టాలు వేసుకొని భాయి భాయి అన్నట్లుగా వున్న జపాన్‌ ప్రధాని షింజో అబె మరొక తీరుతో వ్యవహరించారు. అన్నీ ముందే సిద్ధం చేసుకొని ప్రతిపక్షాలకు ,ఓటర్లకు తగిన వ్యవధి ఇవ్వకుండా ఆకస్మిక ఎన్నికలను రుద్ధారు. పద్నాలుగు నెలల గడువున్నప్పటికీ జపాన్‌ ప్రధాని అక్టోబరు 22న మధ్యంతర ఎన్నికలు జరపాలని నిర్ణయించి జరిపించేశారు.అక్కడి రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి పార్లమెంట్‌ను రద్దు చేసిన 40 రోజులలోగా ఎన్నికలు జరపాల్సి వుంది. అయితే 26 రోజులకే పూర్తి చేశారు.

జపాన్‌ పార్లమెంట్‌ ‘డైట్‌ ‘ వ్యవధి నాలుగు సంవత్సరాలు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1946 నుంచి ఇప్పటి వరకు 27 ఎన్నికలు జరిగాయి. సగటున ప్రతి 31నెలలకు ఒక ఎన్నికను జనం మీద రుద్దారు. ఇది జపాన్‌లో ప్రజాస్వామ్యం పరిహాసంపాలైన తీరు, అక్కడి ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధల సంక్షోభాన్ని వెల్లడిస్తున్నది. ఇక ఫలితాల విషయానికి వస్తే మన తెలుగు మీడియాతో సహా కార్పొరేట్‌ మీడియా అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి) కూటమి మూడింట రెండువంతుల మెజారిటీ సాధించినట్లు వూదర గొట్టింది. నిజానికి పాలక కూటమి విజయానికి ఎలాంటి ఢోకా లేదని ముందుగానే అక్కడి మీడియా, విశ్లేషకులు చెప్పేశారు. అయితే రద్దయిన సభలో వున్న స్ధానాల కంటే తక్కువ వచ్చాయి. ప్రతిపక్షాల చీలిక కారణంగా పాలక కూటమి ఏక సభ్య నియోజకవర్గాలలో ఓట్లకంటే సీట్లు ఎక్కువ తెచ్చుకుంది. దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన చోట్ల అధికారానికి వచ్చిన ఎల్‌డిపికి వచ్చిన ఓట్లు 33శాతమే, వాటిని మొత్తంలో లెక్కించి చూస్తే 17.3శాతమే. జపాన్‌ ఎన్నికల చరిత్రలో అతి తక్కువ ఓట్లు పోలు కావటం ఇది రెండవసారి. ఓటింగ్‌ వయస్సును 20 నుంచి 18కి తగ్గించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో 53.69 శాతం పోలు కాగా కనిష్ట రికార్డు గత ఎన్నికలలో 52.66గా నమోదైంది. ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదన్నది స్పష్టం.

డైట్‌లోని దిగువ సభ 475 స్ధానాలలో 295 సీట్లకు నియోజకవర్గాల వారీ ప్రత్యక్ష పద్దతి, 180 సీట్లకు పదకొండు బ్లాకుల వారీ దామాషా పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 242 స్ధానాలకు గాను 146 మంది సభ్యులను 47 ఒకటి అంతకంటే ఎక్కువ స్ధానాలున్న నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల పద్దతిలో 96 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభ పరిమితి నాలుగు సంవత్సరాలు కాగా ఎగువ సభ ఆరు సంవత్సరాలు, ప్రతి మూడు సంవత్సరాలకు సగం సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.1982 నుంచి ఎన్నికల సంస్కరణలలో భాగంగా పరిమితమైన దామాషా విధానాన్ని ప్రవేశ పెట్టారు.జపాన్‌ ఎన్నికలలో సామాన్యులు పాల్గొనే అవకాశం లేదు. ఒక్కొక్క అభ్యర్ధి డిపాజిట్‌గా చెల్లించే 6లక్షల ఎన్‌లలో (మన రూపాయలలో 3లక్షల 42వేలు) తెచ్చుకున్న ఓట్లను బట్టి పదిశాతంపైన తెచ్చుకున్న వారికి వచ్చిన ఓట్లను బట్టి కొంత డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అందువలన డబ్బున్నవారే, వారినే పాలక పార్టీలు రంగంలోకి దించుతాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు కనుక జనం ఆలోచించుకొనే లోపే పాలకపార్టీ అతి తక్కువ వ్యవధిలో ఆకస్మిక ఎన్నికలను ప్రకటించటం సర్వసాధారణం.

తాజా ఎన్నికల ఫలితాలకు వస్తే ఎన్నికలు జరిగిన 465 స్ధానాలకు గాను పాలక ఎల్‌డిపికి రద్దయిన సభలో 291 స్ధానాలుండగా తాజాగా 284కు తగ్గాయి, దాని మిత్రపక్షమైన కోమీ పార్టీ బలం 35 నుంచి 29కి పడిపోయింది. వాటి బలం 313, ప్రతిపక్షాల విషయానికి వస్తే రెండు కూటములుగా పోటీ చేశాయి. యుద్ధ, అణ్యాయుధాల వ్యతిరేక, అహింసా విధానాలను ఆమోదించే రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ, కమ్యూనిస్టుపార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పౌర కూటమిగా పోటీ చేశాయి. వరుసగా ఈ పార్టీలకు 55,12,2 చొప్పున 69 వచ్చాయి. రెండవది కోయికీ కూటమి, ఇది ఎల్‌డిపి నుంచి విడిపోయిన టోకియో గవర్నర్‌ యురికో కోయికి నాయకత్వంలో సెప్టెంబరు 25న ఏర్పడిన కిబోనోటో(ఆశాజీవి), నిప్పన్‌ ఇషిన్‌ కయ్‌ పేరుతో వున్న ఒక చిన్న పార్టీ కలసి పోటీ చేశాయి. వాటికి 50,11 చొప్పున 61 వచ్చాయి. పాలక పార్టీ నుంచి బయటకు పంపిన వారు, వచ్చిన వారితో కిబోనోటో పార్టీ ఏర్పడింది. జపాన్‌ రాజకీయాలలో ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్‌ పార్టీ దీనిలో విలీనమైంది. రెండవ కూటమిలోని రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత అక్టోబరు 2న కొత్తగా ఏర్పడింది. ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత కూడా కొత్త పార్టీల నమోదు, పోటీకి అక్కడ అవకాశం వుంది. ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప ప్రతి ఎన్నిక సమయంలో జపాన్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలలోని ముఠాలు కొత్త పార్టీలను ఏర్పాటు చేయటం ఎన్నికలలో కొన్ని సీట్లు సంపాదించటం మామూలు విషయం. ఈ ముఠాలు, వ్యక్తులు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాయో తెలియదు. సరిగ్గా అలాంటి పరిస్ధితే మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పడటం చూస్తున్నాము. ఇలాంటి అవకాశవాదానికి కార్పొరేట్ల, వ్యక్తుల వ్యాపారలావాదేవీల ప్రయోజనాలు, లాభాలే అసలైన కారణాలుగా వున్నాయి. రద్దయిన సభలో 20 స్ధానాలున్న కమ్యూనిస్టుల బలం ఈసారి 12కు పడిపోయింది. ఏడు అంగీకృత అంశాలపై ఐక్యంగా పోటీ చేసిన మూడు పార్టీల పౌర కూటమి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించటమే వూరట కలిగించే అంశం.

రద్దయిన సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వున్న ఎల్‌డిపిలో ఎలాంటి చీలిక లేకపోయినప్పటికీ ప్రధాని షింజే అబే ముందస్తు ఎన్నికలకు పోయిన కారణాలను చూస్తే మన దేశంలో నరేంద్రమోడీ కూడా అదే పని చేస్తారా అని అనుమానించకతప్పదు. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని నెరవేర్చుకొనేందుకు షింజో అబే ఆకస్మిక ఎన్నికలు జరిపారని విశ్లేషకుల అభిప్రాయం. గత రెండున్నర దశాబ్దాలుగా జపాన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఒక దీర్ఘకాల పక్షపాత రోగి మాదిరి వుంది. అమెరికా తరువాత వున్న రెండవ స్ధానాన్ని చైనా ఆక్రమించటంతో మూడో స్ధానానికి దిగజారింది. ప్రస్తుతం వున్న స్ధితి నుంచి తమ దేశ కార్పొరేట్‌ సంస్ధలకు మరింతగా మార్కెట్‌ను కల్పించాలంటే అహింసా విధానం నుంచి తప్పుకొని మిలిటరీ పునరుద్ధరణ, ఇతర దేశాలలో జోక్యానికి వీలుగా తన స్వదేశీ, విదేశీ విధానాన్ని మార్చాలని గత కొంత కాలంగా అక్కడి పాలకవర్గం ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ సమీక్ష పేరుతో దాన్ని అమలు జరపాలని చూస్తున్నారు. చైనా, వుత్తర కొరియాల నుంచి ముప్పు, వాటి ఆయుధ పరీక్షలను సాకుగా చూపుతున్నారు. తాజా ఎన్నికలకు ఆర్ధిక వ్యవస్ధలో మార్పుల గురించి చెప్పినప్పటికీ అంతర్గతంగా పైన చెప్పిన అజండా వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్‌ రక్షణ బాధ్యతను అమెరికా, జర్మనీ బాధ్యతను అమెరికా నాయకత్వంలోని నాటో కూటమికి అప్పగించి ఆ రెండు దేశాలకు మిలిటరీ లేకుండా చేశారు. మరోసారి మిలిటరీతో యుద్ధాలకు దిగకుండా ఆమేరకు ఆ దేశాలు రాజ్యాంగాలను రాసుకున్నాయి. అయితే దానిని వుల్లంఘించేందుకు అడ్డదారిలో 1954లో ఆత్మరక్షణ బలగాల పేరుతో పరిమిత మిలిటరీని జపాన్‌ ఏర్పాటు చేసింది. తొలి రోజుల్లో మిలిటరీకి చేసే ఖర్చును పరిశోధన, అభివృద్ధి వైపు మళ్లించి యుద్ధ నష్టాలనుంచి కోలుకోవటంతో పాటు అమెరికాతో వస్తు ఎగుమతుల్లో పోటీ పడేంతగా బలపడింది. అయితే క్రమంగా ఆత్మరక్షణ సైన్యానికి ఖర్చు పెంచింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక మిలిటరీ బడ్జెట్‌లున్న దేశాలలో జపాన్‌ ఎనిమిదవ స్ధానంలో వుంది. ఈ ఖర్చు పెరుగుదలతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్ధలో వుండే అంతర్గత దౌర్బల్యం కారణంగా పరిమితులు ఏర్పడి అభివృద్ది గిడసబారి పోయింది. దాన్నుంచి బయటపడాలంటే మార్కెట్‌ వాటా పెంచుకోవాలని, అందుకు గాను వివాదాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగ సవరణ చేసి 2020 నాటికి మిలిటరీని తిరిగి రంగంలోకి తేవాలని జపాన్‌ పాలకవర్గం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. అయితే దానికి అనేక ఆటంకాలు కూడా వున్నాయి. అమెరికన్లు ఒక పట్టాన ఒక స్వతంత్రశక్తిగా పూర్వపు స్ధాయికి జపాన్‌ లేదా జర్మనీలను ఎదగనిచ్చేందుకు సుతరామూ అంగీకరించరు. తాజా ఎన్నికల తీర్పు ప్రకారం మధ్యలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తకపోతే షింజో అబే సర్కార్‌ 2021వరకు అధికారంలో వుంటుంది.

గత కొద్ది నెలలుగా షింజో అబే ప్రతిష్ట మసకబారుతోంది. అనేక ఎన్నికలలో పాలకపార్టీ మట్టి కరిచింది. ఏకంగా అబే భార్య, ఎంపీలు, మంత్రులు కొందరు అవినీతి కుంభకోణాలలో చిక్కుకు పోయారు,రక్షణ మంత్రితో సహా కొందరిని పదవుల నుంచి ఆగస్టులో తొలగించాల్సి వచ్చింది.టోకియో గవర్నర్‌ యురికో కొయికే తిరుగుబాటు జెండా ఎగురవేసి కొత్త పార్టీని పెట్టారు. జూలైలో జరిగిన స్ధానిక ఎన్నికలలో ఆమె గ్రూపు మెరుగైన ఫలితాలు సాధించింది. అందువలన సాధారణ ఎన్నికల నాటికి మరింత బలపడకుండా ఆకస్మిక ఎన్నికలు జరిపి ఆమెను ఓడించాలనే ఆలోచన కూడా అక్టోబరు ఎన్నికలకు పురికొల్పిందని భావన.ఆగస్టు ఒకటిన ఒక సర్వేలో 60శాతం మంది అబే పనితీరును వ్యతిరేకించగా 32శాతమే ఆమోదం తెలిపారు. వుత్తర కొరియాతో సంబంధాలు కలిగి వున్న కారణంగా ఆ దేశంతో సమస్యలు రాకుండా చక్రం తిప్పుతారనే విశ్వాసంతో వున్న ప్రజలు జపాన్‌ మీదుగా వుత్తర కొరియా క్షిపణి ప్రయోగం జరపటంతో నివ్వెర పోయారు.

మన దేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి, నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. మన దేశంలో వసూలు చేస్తున్న పన్నులు మరీ తక్కువగా వున్నాయని వాటిని పెంచాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ చాలా కాలం నుంచి వత్తిడి తెస్తున్నాయి.పన్ను సంస్కరణల ముసుగులో దాన్ని అమలు జరపటానికి పూనుకున్న మోడీ జిఎస్‌టిని పెద్ద విజయంగా వర్ణించుకున్న విషయం తెలిసిందే. జపాన్‌లో కూడా పన్ను పెంచాలన్నది అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల వత్తిడి. 2012లో అధికారంలో వున్న డెమోక్రటిక్‌ పార్టీ వినియోగ పన్ను(జిఎస్‌టికి మరోపేరు) మొత్తాన్ని 8 నుంచి 10శాతానికి పెంచాలని నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ అప్పుతీర్చేందుకు కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే ప్రతిపక్షంలో వున్న షింజే అబే నాయకత్వంలోని ఎల్‌డిపి దానిని వ్యతిరేకించి అదే ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చింది. పెంచిన పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని అప్పు తీర్చటానికి బదులు సంక్షేమ చర్యలైన అల్పాదాయ కాలేజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మూడు-ఐదు సంవత్సరాల వయస్సున్న పిల్లల సంక్షేమం వంటి వాటికి ఖర్చు చేయాలని చెబుతూ దానిని అబోనోమిక్స్‌గా ప్రచారం చేసింది. 2014లో పన్ను పెంచాలనే తరుణంలో జపాన్‌ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయింది. సంక్షేమ చర్యలు నిలిచిపోయాయి. దాంతో మరోసారి ప్రజల అనుమతి పేరుతో మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చి షింజో అబే విజయం సాధించాడు. ఇప్పుడు ఆ పన్నును జనం మీద రుద్ధేందుకు తమకు జనం అనుమతిచ్చారని చెప్పేందుకు ఈ విజయాన్ని వినియోగించుకోనున్నారు.

అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో వున్న పార్టీలలో జపాన్‌ కమ్యూనిస్టు పార్టీయే పెద్దది. గత రెండు దశాబ్దాల ఎన్నికల చరిత్రను పరిశీలించినపుడు సగటున తొమ్మిదిశాతం ఓట్లు తెచ్చుకుంది. తాజా ఎన్నికలలో దామాషా బ్లాక్‌ నియోజకవర్గాలలో ఓట్లు 11.37 నుంచి 7.91శాతానికి పడిపోయాయి, సీట్లు 20 నుంచి 11కు తగ్గాయి. ఏక సభ్య ప్రత్యక్ష ఎన్నికల నియోజకవర్గాలలో ఓకినావా ఒకటవ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధి తిరిగి ఎన్నికయ్యారు.దీనితో మొత్తం పన్నెండు. ఏకసభ్యనియోజకవర్గాలలో గతెన్నికలలో 292చోట్ల పోటీ చేయగా ఈ సారి 206కు పరిమితమైంది. 67 స్ధానాలలో మిత్రపక్షాలకు మద్దతుగా అభ్యర్దులను వుపసంహరించుకుంది. ఈ చర్య పౌర కూటమి మెరుగైన ఫలితాలు సాధించటానికి తోడ్పడింది. ఈ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బల గురించి తిరిగి కోలుకుంటామని కమ్యూనిస్టుపార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అందుకు గాను పార్టీ కార్యక్రమాన్ని జనం అర్ధం చేసుకొనేందుకు, వర్తమాన సంక్లిష్ట రాజకీయ పరిస్ధితులలో కూడా మద్దతు ఇచ్చి ఓటు చేసేందుకు ముందుకు వచ్చే విధంగా కార్యకలాపాలను మరింత పెంచాలని, పార్టీ సభ్యత్వాన్ని , పార్టీ దినపత్రిక అకహటా పాఠకులను పెంచుకోవటంతో పాటు సభ్యులందరినీ పూర్తిగా పనిలోకి దింపాలని ప్రకటనలో పేర్కొన్నది. తాజా ఎన్నికలలో గతంతో పోలిస్తే పాల్గొన్న సభ్యులు, పత్రిక సర్క్యులేషన్‌ తగ్గిపోయారని తెలిపింది.

జపాన్‌ కమ్యూనిస్టు పార్టీ గత ఎన్నికల రికార్డు చూసినపుడు ఓట్లు, సీట్లలో హెచ్చుతగ్గులు ఒక ధోరణిగా వున్నాయి. గత మూడు సంవత్సరాలలో స్ధానిక సంస్ధలు, రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో గతం కంటే వున్న బలాన్ని పెంచుకోవటంతో పాటు కొత్త ప్రాంతాల విస్తరించటాన్ని కూడా చూడవచ్చు.మచ్చుకు జూలైలో జరిగిన టోకియో రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ 127 స్దానాలలో 19 చోట్ల విజయం సాధించింది. గతేడాది పార్లమెంటు ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో కూడా బలాన్ని పెంచుకొని 242 సీట్లకు గాను 14 స్ధానాలకు పెంచుకుంది. ప్రపంచ మంతటా ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలలో కమ్యూనిస్టుపార్టీలకు ఎదురు గాలి వీస్తున్న సమయంలో జపాన్‌లో సాధిస్తున్న ఓట్లు, సీట్లకు ఎంతో ప్రాధాన్యత వుంది. అహింసా రాజ్యాంగాన్ని సవరించి తిరిగి మిలిటరీని పునరుద్దరించేందుకు పాలకవర్గ పార్టీలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయో అంతే తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీ జపాన్‌ శాంతియుత రాజ్యాంగాన్ని కాపాడాలని, యుద్ధాలకు దూరంగా వుండాలని కలసి వచ్చే శక్తులతో పని చేయటం అనేక మంది అభిమానానికి పాత్రమైంది. రానున్న రోజులలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆ పార్టీ తీర్మానాలు చెబుతున్నాయి.

జపాన్‌ రాజకీయంగా మితవాదం దిశగా పయనిస్తుండవచ్చుగాని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ కొంత ప్రభావం చూపగలుగుతున్నదని ‘ఫోర్బ్స్‌’ పత్రిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కమ్యూనిస్టు పార్టీ నేత విశ్వాసం వెలిబుచ్చారు, అయితే కమ్యూనిస్టులు జపాన్‌లో పూర్తిగా అంతరించలేదు. జపాన్‌ రాజకీయాలలో అనేక యుద్ధాలలో ఆరితేరిన భీష్ముడి వంటి లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కంటే ఆరుసీట్లు మాత్రమే తక్కువగా ఇటీవలి టోకియో రాష్ట్ర ఎన్నికలలో సీట్లు తెచ్చుకుంది. ఎలాంటి వుగ్రవాద చర్యలకు పాల్పడకపోయినప్పటికీ ఇప్పటికీ జపాన్‌ పోలీసులు కమ్యూనిస్టు పార్టీని ఒక తీవ్రవాద పక్షంగానే పరిగణిస్తారు. వారిపై నిరంతర నిఘా, వేధింపులకు గురవుతుంటారు. అయినా వారి పలుకుబడి తగ్గలేదు. పార్టీ పత్రిక అకహటా 11.2లక్షల సర్క్యులేషన్‌ కలిగి వుంది. సమీప భవిష్యత్‌లో జపాన్‌ తీవ్ర మితవాద పత్రిక శంకై షింబున్‌ను అధిగమించనుందని ఒక వార పత్రిక జోస్యం చెప్పింది. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మరియు దాని ఒడిలో కూర్చొనే కోమీ పార్టీ, చీలికలతో వుండే ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలో ఏదో ఒక దానిని మాత్రమే ఎంచుకొనే అవకాశం అనేక సంవత్సరాలుగా జపాన్‌ ఓటర్లకు ఏర్పడింది. రెండింటి మీద తీవ్ర అసంతృప్తి చెందిన ఓటర్లు కమ్యూనిస్టుపార్టీకి ఓటు చేస్తారు. కమ్యూనిస్టు రాజ్యమైన వుత్తర కొరియా చర్యలు కమ్యూనిస్టు అనే పదం పట్ల సాధారణ జనంలో విముఖత కలిగించి వుండవచ్చు. అయితే ఎన్నికలలో ఎదురు దెబ్బ తగలటానికి అతి పెద్ద కారణం టోకియో గవర్నర్‌ యురికో కోకీ అనుసరించిన వైఖరి ప్రతిపక్ష ఐక్యతకు అడ్డం పడింది. అహింసా పూరితమైన రాజ్యాంగ కలిగి వుండాలనే వైఖరితో కేవలం వారం రోజుల్లోనే రూపుదిద్దుకున్న రాజ్యాంగ బద్ద డెమోక్రటిక్‌ పార్టీ (సిడిపి) ప్రధాన ప్రతిక్షంగా ఎన్నికలలో అవతరించింది. పచ్చి మితవాద ఆశాజీవి పార్టీ, ఎల్‌డిపి, కొమిటోను కూడా ఓడించటానికి కమ్యూనిస్టు పార్టీ సిడిపికి మద్దతు ఇవ్వటం ద్వారా కమ్యూనిస్టు పార్టీ తనను తాను నష్టపరుచుకొని వుండవచ్చు. ఎల్‌డిపి-బుద్ధిస్టు కొమిటో పార్టీలకు కంచుకోట వంటి కాంటో నియోజకవర్గంలో సిడిపి-కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధి తొలిసారిగా గెలిచారు. సిడిపి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నిక కావటానికి కమ్యూనిస్టుపార్టీ దోహదం చేసిందని ఎన్నికల విజయోత్సవ సభలో అక్కడ విజయం సాధించిన ఎడనో బహిరంగంగా చెప్పారు. తమ రెండు పార్టీలు మంచి విజయాలు సాధిస్తాయని కమ్యూనిస్టు నేత కాజూ షి ఆశాభావం వెలిబుచ్చారు గాని సిడిపి మాత్రమే లబ్దిపొందింది, కమ్యూనిస్టుపార్టీ తన పునాదిని కోల్పోయింది అని ఫోర్బ్స్‌ విశ్లేషకుడు పేర్కొన్నారు.

డబ్బు రాజకీయాలు, పార్టీల ఫిరాయింపులు, అవినీతి అక్రమాలకు పాల్పడటం, కార్పొరేట్ల కొమ్ము కాయటంలో మన దేశానికి జపాన్‌కు ఎన్నో సామ్యాలున్నాయి.ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత దాన్ని నిలుపుకొనేందుకు తొక్కని అడ్డదారులు వుండవు. ఈ పూర్వరంగంలో జపాన్‌లో అబెనోమిక్స్‌ మాదిరే మోడినోమిక్స్‌ కూడా ఎదురుతన్నుతోంది. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇప్పటికే మోడీని వుక్కిరిబిక్కిరి, నోటమాట రాకుండా చేస్తున్నాయి. వైఫల్యాలు, తప్పుడు విధానాల పర్యవసానాల నుంచి బయట పడేందుకు తప్ప మోడీ నాయకత్వానికి ఇప్పుడు మరొక పని లేదు. దేశమంతటా గుజరాత్‌ అభివృద్ధి నమూనా అమలు జరుపుతామని వూదరగొట్టిన పెద్దలు ఇప్పుడు చేసిందేమిటో చూశాము. మిగతా రాష్ట్రాలలో మాదిరి ఎన్నికల తాయిలాలను గుజరాత్‌లో ప్రకటించటానికే కేంద్ర ఎన్నికల కమిషన్‌పై వత్తిడి తెచ్చి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించకుండా వాయిదా వేయించారన్నది స్పష్టం. ఇలాంటి అధికార దుర్వినియోగం బహుశా ఇదే ప్రధమం. అయితే జపాన్‌ వేరు, భారత్‌ వేరు. షింజో అబే మాదిరి తిరిగి గత ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు తెచ్చుకోగలమని నరేంద్రమోడీ దురాశపడితే నిరాశే మిగులుతుందని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివాదాస్పద విదేశీ ఆర్ధికవేత్త విఫల స్వదేశీ నరేంద్రమోడీని గట్టెక్కిస్తారా ?

20 Friday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

behavioural economics, Consumer Affairs, economist richard thaler, Narendra Modi, Nobel economics prize, swadesi

కొండూరి వీరయ్య

అర్థశాస్త్రంలో 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి రిచర్డ్‌ థేలర్‌ను వరించింది. దానివల్ల అర్థశాస్త్ర పరిశోధనా రంగంలో ఉన్న మేధావులు ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ థేలర్‌కు నోబెల్‌ బహుమతి రావటం పట్ల దేశంలో బిజెపి సంబరాలు చేసుకోవటమే ఈ వ్యాసానికి నేపథ్యం. థేలర్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన వెంటనే బిజెపి ఐటి సెల్‌ ( దేశవ్యాప్తంగా బిజెపి, ప్రధాని పేరు మీద ప్రచారమవుతున్న అవాకులు, చవాకులు, అర్థ సత్యాలు, అసత్యాలు, నిరాధారమైన అభిప్రాయాల పోగు పోసే కేంద్రం – సంక్షిప్తీకరణ కోసం బిజెపి గోబెల్స్‌ విభాగం అని పిలుద్దాం) సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన వెలువడించింది. మోడీ అమలు చేసిన నోట్ల రద్దు పథకాన్ని థేలర్‌ సమర్ధించాడు అన్నది ఈ ప్రకటన సారాంశం. నోబెల్‌ విజేత పేరు ప్రకటించగానే బిజెపి ఐటి సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ తన ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. యథా ప్రకారం ఈ ప్రకటనను సుక్షితులైన బిజెపి ఐటి కరసేవకులు దేశమంతా వ్యాపింపచేశారు. థేలర్‌ నోబెల్‌ విజేత కావటానికి, మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ఏమిటి సంబంధం ?

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ గురించిన చర్చను భారతదేశంలో నోట్ల రద్దు అనుభవాలతో పోల్చవచ్చు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి దఫా సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ఇలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగదు వినియోగం వల్లనే ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నగదు పట్ల ప్రజల మక్కువ తగ్గించాలంటే నగదు పనికిరాని కాగితం కింద మార్చటం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో వారి ప్రవర్తన, కొనుగోళ్ల పద్దతి, ప్రాధాన్యతలనను నగదురహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి నోట్లు రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది అన్నది ఈ విశ్లేషణల సారాంశం. ఈ సందర్భంగానే తొలిసారిగా పామర చర్చల్లో సైతం ఆర్థిక లావాదేవీలు- ప్రవర్తనాశీలత (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) గురించిన చర్చ సార్వత్రికమైంది. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాల గురించి బిజెపి గోబెల్స్‌ విభాగం కంప్యూటర్లెక్కి కూయటమే కాదు. మన జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లల్లో కూడా అర్థరహిత సమాచారాన్ని నింపేసింది. ఇదే నిజమని నమ్మిన పలువురు మేధావులు, ఆర్థిక వేత్తలు, ఆరెస్సెస్‌-బిజెపి కంప్యూటర్‌ కరసైనికులతో గొంతు కలిపి నోట్ల రద్దు విమర్శకుల నోళ్లు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేశారు.

విదియ నాడు కనపడకపోతే తదియ నాడు కనపడుతుంది అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి వంటి వాళ్ల మొదలు నోట్ల రద్దుకు సిపార్సు చేసిన గురుమూర్తి వంటి వారంతా ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తూ వరుసగా నోళ్లు తెరిచారు. గత ఆర్నెల్లుగా ఈ ప్రమాదాన్ని వామపక్ష ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కదా… ఈ విమర్శల పట్ల ప్రభుత్వ స్పందన ఈ సామెతనే గుర్తు తెస్తోంది. రెండ్నెల్ల క్రితం స్వయంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు అని నిర్దారించింది. ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వేలో నోట్ల రద్దు, జిఎస్టీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్త కుంగిపోయింది అన్న అంచనాను వెల్లడించింది. బిజెపి గోబెల్స్‌ విభాగం మోడీ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి థేలర్‌ను అరువు తెచ్చుకొంటోంది. నిజంగా నోట్ల రద్దు మీద థేలర్‌ అభిప్రాయం ఏమైనా ఈ రకమైన అరువుతెచ్చుకున్న మద్దతు ద్వారా కుదేలైన ఆర్థిక వ్యవస్థ బతికి వస్తుందా అన్న ప్రశ్నకు బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు, వారిని పనికి పురామాయించిన పెద్ద తలకాయలు సమాధానం ఇవ్వాలి.

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌కు పునాదులు ఆధునిక వినిమయ వాదంలో ఉన్నాయి. సరళీకరణ విధానాల ఆరంభానికి ముందు ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా వ్యవస్థాగతంగా ఉండేవి. అంటే ఆయా దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలు, పురోగతి నేపథ్యంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పద్ధతి. ఈ క్రమంలో జాతీయ వనరులు అర్థవంతమైన వినియోగంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుపై నియంత్రణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించటానికి కీన్స్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ ఆర్థిక విధానాలు, వాటి ద్వారా సాధారన ప్రజానికి కలిగే కొద్దిపాటి వెసుబాట్లు కూడా దిగమింగటం పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధ్యం కాలేదు. దాంతో సంక్షేమ ఆర్థిక విధానాలపై మొదలైన మితవాద ఆర్థికవేత్తల దాడిలో ఒక కోణమే బిహేవియరల్‌ ఎకనమిక్స్‌. ఈ ధోరణి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ వినియోగదారుడే. వినియోగపు అస్థిత్వమే వ్యక్తి అస్థిత్వంగా మారుతుంది. ప్రపంచీకరణ విధానాలు పుంజుకున్న తర్వాత ఈ ధోరణి మరింత ముదిరి నిర్ణీత మోతాదులో వినియోగం చేయలేని వాళ్ల గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం లేదు అనేంత వరకు వెళ్లింది. ఆధునిక మాల్స్‌లో ఖరీదైన వస్తువుల అమరిక ఆరోహణ క్రమంలో అమర్చటాన్ని మనం రోజూ గమనిస్తూనే ఉంటాం. కొనుగోలు చేసే వస్తువుల ఖరీదును బట్టి కొనుగోలుదారుడికి అందే సమపర్యలుంటాయి.

వాణిజ్య ప్రకటనల కోలాహలం బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ పునాదిగా పెరిగిన ధోరణే. ఈ వాణిజ్య ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని వినియోగదారుల వద్దకు చేర్చటమే కాదు. తమ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వారిని ప్రభోదించటం, ప్రభావితం చేయటం కూడా. సూత్ర రీత్యా బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ చెప్పేది విస్తృతమైన ప్రత్యామ్నాయాలు (ఒకే సరుకు వివిధ బ్రాండ్లలో) అందుబాటులో ఉంటే నచ్చింది ఎంచుకునే స్వేఛ్చ వినియోగదారుడికి ఉంటుంది. ఈ ఆర్థిక సూత్రీకరణలో ప్రధాన లోపం ఉంది. అది వినియోగదారుల ఆర్థిక సామాజిక స్థాయి, కొనుగోలు శక్తి, అవసరాలుతో నిమిత్తం లేకుండా మూసపోసిన కొనుగోలుదారుల మందను తయారు చేయటమే ఈ లోపం.

ఈ ధోరణి మరో చర్చను కూడా ముందుకు తెస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైనది. డేటా మోడలింగ్‌తో ముడిపడిన అంశం ఇది. దీన్ని పరిశీలించటానికి ఆర్థిక రంగం కంటే రాజకీయ రంగం మరింత అర్థవంతంగా ఉంటుంది. 2013 మొదలు 2017 సెప్టెంబరు వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. ప్రజలను నిర్దిష్ట ఆలోచనలు, అవసరాలు, అవగాహనలు, అస్థిత్వాలు ఉన్న వ్యక్తులుగా కాక తమ సమాచార సరఫరాకు క్షేత్రంగా మాత్రమే చూసే ధోరణి. ఒక సారి వ్యక్తులు తమ సామాజిక అస్థిత్వం కోల్పోయిన ప్రయోగశాలలో పరిశీలనావస్తువులుగా మారిన తర్వాత వారి నిర్ణయాలను ప్రభావితం చేయటంలో డేటా మోడలింగ్‌ ద్వారా చూపించే ప్రొజెక్షన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 2014 ఎన్నికల్లో మోడీ అనుసరించిన ప్రచార వ్యూహం ఇది. ఆ తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా ఓటర్లు, ప్రజల రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయటం ద్వారా ఓటింగ్‌ విషయంలోనూ లేదా ప్రభుత్వ నిర్ణయాలను అంచనా వేసే విషయంలోనూ తప్పు దారి పట్టించటం ద్వారా తమ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాము. ఇదే ధోరణి బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ ద్వారా వస్తూత్పత్తుల వినియోగం విషయంలో కొనుగోలు దారుల బ్రెయిన్‌ వాష్‌ చేసే టెక్నిక్కులు విపరీతంగా రూపొందించబడతాయి. ఇదే ధోరణిని తాజాగా హిందూత్మ మతోన్మాద శక్తులు వంటబట్టించుకున్నాయి.

కీన్స్‌ విధానాలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సామాజిక అవసరాలు తీర్చటానికి ఉపయోగపడే సమీకృత, పరస్పరాధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తెస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో సమాంతరంగా పుట్టుకొచ్చిన బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ వికేంద్రీకృత ఆర్థిక విధాన నిర్ణయ వ్యవస్థను ముందుకు తెస్తుంది. ఈ ధోరణిలో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి ఆ రంగం పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఆయా రంగాల లాభాల రేటును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం జరుగుతుంది. దాంతో స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రణాళికా రంగం రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు దీనికి సరైన ఉదాహరణ.

అమెరికాలో ఒబామా ప్రభుత్వం గానీ ఇంగ్లాండ్‌లో టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వంగానీ తమ కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా సామాజిక ప్రవర్తనా శాస్త్రవేత్తల బృందాలను నియమించి పాలకవర్గం అవసరాల నేపథ్యంలో ప్రజల మనోభావాలు ప్రభావితం చేయటానికి తద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ధ్యాన్ని ప్రభావితం చేయటానికి అవసరమైన ప్రయోగాత్మక విధానాలు రూపొందించాయి. ఆయా దేశాల నుండి పాఠాలు నేర్చుకున్న మోడీ ప్రభుత్వం అవే ప్రయోగాత్మక విధానాలు భారతదేశంలో అమలు చేయటం ద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ద్యాన్ని అన్ని వేళలా ప్రభావితం చేయాలనుకొంటోంది.చేయగలననుకొంటోంది. ఏదైనా కీలక సందర్భం, సమస్య ముందుకొచ్చినపుడు ప్రజల దృష్టిని మళ్లించటానికి అవరమైన అప్రాధాన్య విషయాలను, అర్థసత్యాలను, అసత్యాలను, నిరాధారమైన విషయాలను ప్రజల ముందు కుప్పలు పోయటానికి బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. బిహేవియరల్‌ ఎకనమిక్స్‌లో సరైన నిర్ణయం అంటే కంపెనీల లాభాలు పెంచేందుకు దోహదం చేసేది. బిహేవియరల్‌ పాలిటిక్స్‌లో సరైన నిర్ణయం అంటే పాలకవర్గాల ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లేంది. ప్రజలు గొర్రెల మంద కాదు. ఈ రెండు రకాల ప్రమాదాల నుండి సగటు మనిషి తన సామాజిక రాజకీయ జంతువుగా (అరిస్టాటిల్‌ అన్నట్లు) తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఇటువంటి కుహనా సిద్ధాంతాలపై సాగించే పోరాటంలో అంతర్భాగమవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ నోరు మూస్తే ఏమిటి ? తెరిస్తే ఏమిటి ?

29 Friday Sep 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arun jaitly, BJP, BJP-led NDA, economic mess, India economy, Narendra Modi, rupee value

ఎం కోటేశ్వరరావు

మిన్ను విరిగి మీద పడ్డా తన అంతరాత్మ అయిన అమిత్‌ షాతో మనకు లాభమో నష్టమో చెప్పు, అవసరమైతే నోరు విప్పుతా అంటారు ప్రధాని నరేంద్రమోడీ. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రయోజనం లేని మొగుడు తోటలో వుంటేనేం కోటలో వుంటే ఏమిటి ప్రయోజనం అన్న సామెత మాదిరి మోడీ వచ్చి మూడు సంవత్సరాల నాలుగు నెలలైంది ఆయన నోరు తెరిస్తే ఏమిటి మూస్తే ఏమిటి అని జనం అనుకోవటం ప్రారంభించారు. ఆ పెద్ద మనిషి మూసుకున్నా దేశం కోసం మేం నోరు తెరవక తప్పదంటున్నారు బిజెపి నేతలు. మోడీ పోయినా పార్టీని దక్కించుకోవాలి కదా మరి ! ఇంతకాలం చెప్పిన వాటికి భిన్నంగా ఇప్పుడు వాస్తవాలను చెప్పినా జనం నమ్ముతారా ? అన్నది అసలు సమస్య !

డాలరుతో మారకంలో రూపాయి బలపడినట్లే కనిపించి తిరిగి పతనం అవుతోంది. ఆ క్రమంలో అది పడుతూ లేస్తూ వుంది. సెప్టెంబరు ఎనిమిదిన గరిష్ట స్ధాయిలో రు.63.78 వున్నది కాస్తా ఆ తరువాత 194పైసల విలువ కోల్పోయింది. బుధవారం నాడు 65.72కి చేరింది. శుక్రవారం నాడు 65.31గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా వేల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప. బ్యాంకులు చేశాయా, పాలకులు చేయించారా అన్నది జనానికి అనవసరం మనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక పాలకులే మనకు బాధ్యులు. 2016 మార్చి వరకు అంతకు ముందు ఐదు సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం బకాయి 2,25,180 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఆరు సంవత్సరాలవి కూడా కలుపుకుంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయలు. రుణగ్రస్తులైన సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది తప్ప పెద్దలకు లేదు.విజయమాల్య వంటి వాడైతే అమ్మాయిలను వెంటేసుకొని మరీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గత ఆరునెలలుగా రూపాయి బలపడితే కొంత మంది వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు కొంత మంది వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అని పిస్తోంది. రూపాయి విలువ పెరిగినపుడే పెట్రోలు ధరలను మండిస్తుంటే ఇదేంట్రా బాబూ అనుకుంటున్న జనానికి రూపాయి విలువ పడిపోయిందంటే మరింతగా బాదుడు తప్పదు. అయినా సరే నరేంద్రమోడీ నోరు విప్పరు, ఇలాంటి మేళాన్నా మనం తలకెక్కించుకున్నాం !

కొత్తల్లుడు నోరు విప్పకపోతే మాఅల్లుడి పలుకే బంగారం అని అత్తామామలు మురిసి పోతారు, ఏదైనా వుంటే గదిలోకి తీసుకు వెళ్లి అమ్మాయికే చెబుతాడు అని అత్తింటి వారు సిగ్గుపడుతూ తొలి రోజుల్లో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పాతపడిన తరువాత సమయం వచ్చినపుడు కూడా నోరు తెరవకపోతే మీ ఆయనకదేం జబ్బే అని అడిగితే నేనూ మోసపోయా, ఆయనకు నత్తి, మాట్లాడటం సరిగా రాదు అని కూతురు అసలు విషయం చెప్పక తప్పదు. మా మోడీ ఎలాగూ మాట్లాడరు కనుక మేం మాట్లాడక తప్పదు అంటున్నారు బిజెపి అగ్రనేతలలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా . ఆర్ధిక రంగాన్ని చిందరవందర చేసిన మంత్రి అరుణ్‌జైట్లీ గురించి ఇప్పటికీ నేను నోరు విప్పక పోతే నా బాధ్యతలను విస్మరించిన వాడిని అవుతాను. పార్టీలో పెద్ద సంఖ్యలో వున్నటువంటి, బయట మాట్లాడటానికి భయపడే వారి తరఫున నేను మాట్లాడుతున్నాను అన్నారాయన. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇలా ప్రతి చర్యనూ మోడీకి ఆపాదించిన పూర్వరంగంలో ఆయన పూలనే కాదు రాళ్లను కూడా భరించాల్సి వుంటుంది. అయితే ‘ అంత సహనం’ ప్రస్తుతం బిజెపిలో లేదు. అందుకే లోతు తెలుసుకొనేందుకు ఆంచులను తాకి చూస్తున్నట్లుగా యశ్వంత సిన్హా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీని ఎంచుకున్నారు. ఆయనేమీ తక్కువ తినలేదు, అసలు విషయాలు చెప్పకుండా 80 ఏండ్ల వయస్సులో వుద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని సిన్హాను ఎత్తిపొడిచారు. అంతే కాదు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వున్న సిన్హా కుమారుడు జయంత సిన్హా చేత పోటీగా తండ్రి వ్యాసానికి ఖండనగా మరో పత్రికలో వ్యాసం రాయించారు.మంత్రిత్వశాఖకు సంబంధం లేని తమ కుమారుడి చేత వ్యాసం రాయించిన పెద్దలు మరి అతనిని సహాయ ఆర్ధిక మంత్రిగా ఎందుకు తొలగించారో అని యశ్వంత సిన్హా ఎత్తి పొడిచారు. కొడుకు వ్యాసంలో పెద్ద పసేమీ లేదనుకోండి.

ఇంతకీ సీనియర్‌ సిన్హా చెబుతున్నదేమిటి? ప్రయివేటు పెట్టుబడులు గత రెండు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. పారిశ్రామిక వుత్పత్తి మొత్తంగా కుప్పకూలిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో వుంది. పెద్ద సంఖ్యలో వుపాధి కల్పించే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో వుంది. ప్రతి త్రైమాసికానికి అభివృద్ధి రేటు పడిపోతూ 5.7శాతానికి చేరింది. ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు నోట్ల రద్దు ఆజ్యం పోసింది. ప్రస్తుత ప్రభుత్వం 2015లో జిడిపి లెక్కింపు పద్దతిని మార్చింది. ఫలితంగా రెండువందల ప్రాతిపదిక పాయింట్లు పెరిగి అభివృద్ధి రేట్లు రికార్డయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.7, అదే పాత లెక్కల ప్రకారం అయితే 3.7 లేదా అంతకంటే తక్కువ. నరేంద్రమోడీ నోరు మూసుకొని గానీ ఇతర మంత్రులు, బిజెపి నేతలు తెరిచిగానీ ఈ అంకెలను సవాలు చేసే స్ధితిలో లేరు.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు వుద్దీపన కలిగించనున్నారనే వార్తలు రావటంతోనే వరుసగా వారం రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంటి పెద్ద సామర్ధ్యం మీద ఒకసారి అపనమ్మకం కలిగిన తరువాత బయటి వారే కాదు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో వారే ఎవరికి వారు జాగ్రత్త పడటం వుమ్మడి కుటుంబాల్లో తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ పరిస్ధితి అలాగే వుందంటే అతిశయోక్తి కాదు. యశ్వంత సిన్హా చెప్పినట్లు గణాంక విధానం మార్చిన కారణంగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఒక ఏడాది తరువాత అభివృద్ధి ఎంతో పెరిగినట్లు కనిపించింది. అది వాపు తప్ప బలుపు కాదని అప్పుడే ఎందరో చెప్పారు. ఇప్పుడు రుజువైంది. ఇంకా వాపుగానే కనిపిస్తున్నప్పటికీ మూడు సంవత్సరాల కనిష్టానికి మన అభివృద్దిరేటు పడిపోయింది. నిజానికి ఈ పరిస్ధితిని అధికారంలో వున్న పెద్దలు వూహించలేదా అంటే నమ్మటం కష్టం. మార్కెట్లో చెలామణి అవుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు ఇచ్చిందెవరో మోడీ పదవీచ్యుతుడై ఎన్‌డిఏలో ముసలం పుట్టిన తరువాత గానీ బయటకు రాదు. దానితో నాలుగు లక్షల కోట్లరూపాయల రాబడి అప్పనంగా ప్రభుత్వానికి వస్తుందని ఆ మొత్తంతో కొన్ని మెరుపులు మెరిపించి మంచి రోజులొచ్చయనే ప్రచార హోరులో మధ్యంతర ఎన్నికలతో మరో ఐదు సంవత్సరాలకు ఓట్లు కొల్లగొడదామని వేసిన అంచనాలు నీరు గారిపోయాయి. మోడీ ప్రతిష్టనిర్మాణంలో భాగంగానే నోట్ల రద్దు ఆయన తీసుకున్న నిర్ణయమే అని ఆపాదించిన వారు అదిప్పుడు శాపంగా మారిందని అర్ధమైన తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి వున్నారు.ముఖ్యమంత్రిగా వుండగా తీవ్రంగా వ్యతిరేకించిన జిఎస్‌టి అమలు మంచి చెడ్డలను పూర్తిగా ఆధ్యయనం చేయకుండానే ఆదరాబాదరా అమలులోకి తెచ్చారు. ఈ రెండు చర్యలూ తాత్కాలికంగా అయినా ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనానికి కారణమయ్యాయని మోడీ సర్కారు తప్ప అందరూ అంగీకరిస్తున్నారు. అంతా బాగుంది, ఏదైనా వుంటే అది తాత్కాలికమే అని సొల్లు కబుర్లు చెబుతున్న పెద్దలు వాటినే కొనసాగిస్తే ఒక దారి. కానీ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పని చేయించేందుకు ఒక వుద్దీపన పధకం గురించి కసరత్తు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఆరుణ్‌జైట్లీ సెప్టెంబరు 20న చేసిన ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

మరో ఆరు రోజుల తరువాత గత మూడు సంవత్సరాలుగా మూలన పడవేసిన ప్రధాని ఆర్ధిక సలహా మండలి దుమ్ముదులిపారు. ఇది ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న భయాలను మరింత పెంచేదే తప్ప తగ్గించేది కాదు. ఇప్పటి వరకు ద్రవ్యలోటు 3.2శాతం కంటే పెరగరాదు అన్న ఆంక్షలను చూపి అన్ని రకాల పెట్టుబడులు, అభివృద్ధి పనులకు కోత పెట్టిన సర్కార్‌ ఇప్పుడు కట్టుకున్న ఆ మడిని పక్కన పెట్టి ఆర్ధిక వ్యవస్ధలోకి అదనంగా 50వేల కోట్లను కుమ్మరించి ఆర్ధిక మందగింపును ఆపగలమా అని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న మంద్యానికి కారణంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్య వస్ధలో రైతాంగ వుత్పత్తులకు ధరలు పడిపోవటం ఒక ప్రధాన కారణంగా అనేక మంది చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధలో నిరర్ధక ఆస్థులు 2013 మార్చి నాటికి 1.56లక్షల కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది మార్చినాటికి 6.41లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు ఇచ్చింది మన్మోహన్‌ సర్కారే అనుకుందాం వసూలు చేయకుండా మోడీ సర్కార్‌ను అడ్డుకున్నదెవరు? యుపిఏ హయాంలో విజయమాల్య వేల కోట్లు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతుంటే నరేంద్రమోడీ సర్కార్‌ వెళ్లిరండి సార్‌ అని విమానం ఎక్కించిందా లేదా ? ప్రతి వారూ పరిశ్ర మలు, వ్యాపారాలకు వడ్డీ రేటు తగ్గించమని కోరేవారే తప్ప అదే సూత్రం వ్యవసాయానికి ఎందుకు వర్తింపచేయరని అడుగుతున్నవారేరి?

నరేంద్రమోడీ సర్కార్‌ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా వ్యవహరిస్తోందంటే చాలా మంది నమ్మరు. మన ప్రభుత్వాలు ఏటా ఎంత మొత్తం అప్పు తెచ్చుకోవాలో, దాన్నెట్లా తీర్చుకోవాలో ముందే నిర్ణయించుకుంటాయి. ఆ మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పన్నెండు నెలల్లో వంద రూపాయల అప్పు తీసుకోవాల్సి వుంటే మొదటి నాలుగు నెలల్లోనే 92 తీసుకొని అనుభవజ్ఞుడైన నరేంద్రమోడీ ఖర్చు పెట్టేశారు. అందువలన ఏ మాత్రం అదనంగా ఖర్చు చేయాలన్నా అప్పులన్నా తేవాలి లేదా అదనంగా నోట్లన్నా అచ్చువేయాలి. మొదటి పని చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోయి అప్పులు తీర్చుకోవాల్సి రెండోది జరిగితే జనానికి ధరలు పెరుగుతాయి. బలి ఇవ్వటానికి మంచి యువకుడి కోసం దుర్భిణీ వేసి వెతికిన పాతాళభైరవి మాంత్రికుడి మాదిరి నరేంద్రమోడీ ఏదైనా మంత్రదండం దొరక్క పోతుందా అని వెతుకుతున్నారు. ఏదైనా పిచ్చిపని చేసి జనం దృష్టిని మళ్లిస్తే తప్ప అల్లావుద్దీన్‌ అద్బుత దీపాలకు, మంత్రదండాలకు పరిష్కారమయ్యేవి కాదిప్పుడు ముసురుకున్న సమస్యలు. వచ్చేటపుడు మంచిదినాలను తెస్తున్నా అన్న మోడీ చెడ్డదినాలతో పోయాడు అని పించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌

12 Tuesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

fake news, Gouri lankesh, Narendra Modi, RSS

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

27 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cbi, Congress party, Gurmeet Ram Rahim Singh, Narendra Modi, rape, rape case

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d