• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

నరేంద్రమోడీ పెంపకంలో రక్షణలేని రూపాయి పాపాయి !

07 Saturday Jan 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi rule, Rupee, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిప్పు లేదా సేవా రుసుములపై ప్రభుత్వ వైఖరేమిటి ?

05 Thursday Jan 2017

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

Department of Consumer Affairs, hotels service charges, National Restaurant Association of India, tip

సత్య

    హోటళ్లకు వెళ్లినపుడు ‘టిప్పు’ ఇవ్వాలా వద్దా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. ఇవ్వటం ఇష్టం లేని నాన్నలు లేచి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కాలర్‌ పట్టి మరీ లాగి కూర్చోపెట్టి పర్సు తీసి టిప్పు ఇచ్చే భార్య, పిల్లలను చూసే వుంటారు. టిప్పు ఇవ్వకుండా వెళ్లే వారిని సర్వర్లు చూసే చూపు తట్టుకోలేక, అవమానంగా భావించి ఇలా చేస్తారని తెలిసిందే. ఇప్పుడా టిప్పు ఇవ్వటమా లేదా అన్నది మీ ఇష్టం ఇష్టముంటే ఇవ్వండి, విధిగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ మృదువుగా ప్రకటించింది. టిప్పు చెల్లించాల్సిందే, ఇష్టమైతేనే తినండి లేకుంటే దొబ్బేయండి మీ ఇష్టం అని హోటల్‌ యజమానుల ప్రతినిధి మొహమాటం లేకుండా తెగేసి చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు మాదిరి కేంద్ర ప్రకటన ప్రయోజనం లేకుండా పోయింది. ఇష్టమైతే టిప్పు ఇవ్వండి లేకుంటే లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే టిప్పు అని సేవా ఛార్జీలు అని వసూలు చేసే యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందువలన ఇక్కడ తేలాల్సిన అంశం ఏమంటే వుదారంగా ఇచ్చే టిప్పు లేదా విధిగా వసూలు చేసే సేవా రుసుముపై అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటి ? తాను ఇచ్చిన వివరణ ప్రకారం హోటళ్లలో అమలు చేయించే దమ్ము ప్రభుత్వాలకు వుందా అన్నది ప్రశ్న. వసూలు విచక్షణ యజమానులకు, సేవలు నచ్చితే చెల్లించాలా లేదా అనే విచక్షణ వినియోగదారులదీ అని చెప్పటం అదీ కరెక్టే ఇదీ కరెక్టే అని చెప్పటం తప్ప మరొకటి కాదు.

    ‘ బుర్ర వుపయోగించకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం వుద్యోగులకు తీవ్ర నష్టదాయకం. యజమానులే కాదు సర్వీసు ఛార్జీలపై ఆధారపడిన హోటల్‌ వుద్యోగులందరూ దీనితో ప్రభావితులౌతారు.మంచి చెడ్డలను ఆలోచించకుండా వారి భుక్తిని ఎలా దెబ్బకొడతారు ‘ అని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రియాజ్‌ అమ్లానీ వ్యాఖ్యానించారు. ఆహార సేవారంగంతో సంబంధం వున్న 85లక్షల మంది దీనితో ప్రభావితులౌతారని అమ్లానీ చెప్పారు. సేవా చార్జీలు వసూలు చేయాలా లేదా అన్నది రెస్టారెంట్ల యజమానుల ఇష్టం. ఒక వేళ వసూలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని పదార్ధాల పట్టికలో లేదా ఇతర విధాలుగా స్పష్టంగా ప్రకటించాలి. దీంతో ఆ సేవలను కోరుకొనే వినియోగదారులకు ఆ విషయం ముందే తెలుస్తుంది.రెస్టారెంట్లు అందుబాటులో వుంచిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలా లేదా అన్నది తేల్చుకుంటారు అని ప్రభుత్వ వినియోగదారుల వ్యవహరాలశాఖ పేర్కొన్నది. హోటళ్లు ఎలాంటి సేవలు అందించినా సేవా ఛార్జీల పేరుతో ఐదు నుంచి ఇరవై శాతం వరకు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు రావటంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.

     దీంతో అనేక మంది హోటల్‌ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా రుసుము వసూలు గురించి తెలిపే ఏర్పాట్లు చేయటం అనేక పర్యవసానాలకు దారితీస్తుంది. ఇప్పటికే 15 శాతం వాట్‌, ఇతర సెస్సులతో వెనుకా ముందు చూసుకొనే వినియోగదారులు అంత మొత్తం టిప్పుకూడా చెల్లించాలంటే అది లేని రెస్టారెంట్లకు వెళతారు. యజమానులు ఇచ్చే నామ మాత్ర జీతాలతో ఎవరు పని చేస్తారు, జీతం కంటే టిప్పు ఎక్కువ వస్తుందనే ఆశతో పని చేస్తున్న కార్మికులకు సమస్యలు వస్తాయి. అమెరికాలో కొందరు యజమానులు టిప్పు రద్దు చేసిన సందర్భాలలో పని చేసేందుకు కార్మికుల లభ్యత సమస్యలు ఏర్పడ్డాయని, హొటళ్లలో పని చేసే వారి వేతనాలు చాలా తక్కువగా వుంటాయి కనుక వారికి కాస్త అదనంగా చెల్లించేందుకు టిప్పు వసూలు చేస్తామని అక్కడి యజమానులు నమ్మ బలుకుతారు. ప్రపంచవ్యాపితంగా టిప్పు ఒక సమస్యగా తయారైంది.

    ఐరోపా కులీన కుటుంబాలలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసినపుడు వచ్చిన అతిధులు మెచ్చుకోలుగా పనివారికి కొంత సొమ్మును ఇవ్వటంతో ప్రారంభమైన టిప్పు ఇప్పుడు విధిగా చెల్లించాల్సిన వాటి జాబితాలో చేరిపోయింది. అయితే ప్రపంచమంతటా ఇది ఒకే విధంగా లేదు. అసలు టిప్పు తీసుకోవటం అనేది కార్మికుల గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశం. ప్రభుత్వాలు లేదా మార్కెట్‌ ప్రతి పనికీ ఒక వేతనం లేదా విలువ నిర్ణయిస్తున్నాయి. ప్రతి వారు తాము ఏ పని చేసినా గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన వేతనం లేదా ప్రతిఫలం పొందటం న్యాయం. ఆ విధంగా చూసినపుడు ఒక హోటల్లో పని చేసే కార్మికులకు అలాంటి వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత యజమానులదే. వారి వేతనాల ఖర్చు, ప్రభుత్వ పన్నులను కూడా కలుపుకొని ఆహార పదార్ధాల ధరలను నిర్ణయించాలి. ఆ ధరలకు సిద్దపడిన వినియోగదారులే వస్తారు. అలాగాకుండా కార్మికులకు నామమాత్ర వేతనాలిచ్చి, వారిని ఆదుకొనే పేరుతో టిప్పు లేదా సేవా రుసుము అంటూ అదనంగా వసూలు చేయటాన్ని మరొక విధంగా చెప్పాలంటే కార్మికులకు వేతనాలు చెల్లించే బాధ్యతను వినియోగదారులపై నెట్టి యజమాని వుచితంగా లేదా నామమాత్ర వేతనాలతో పని చేయించుకోవటం, కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లింపుల వాటాను యజమానులు ఎగవేయటమే. దీని వలన అంతిమంగా నష్టపోయేది కార్మికులే. మన దేశంలో హొటళ్లు అసంఘటిత రంగంగా వున్నందున వాటిలో పని చేసే వారు కూడా శాశ్వతంగా వుండటం లేదు. రుచిగా వంట చేసే వారికి మంచి డిమాండ్‌ వున్నందున అలాంటి వారికి ప్రభుత్వ నిర్ణయించిన వేతనాలకు కొన్ని రెట్లు అదనంగా ఇచ్చి నియమించుకుంటారు. ఇతర పని వారికి నామ మాత్ర లేదా రోజువారీ వేతనాలతో పనులకు పెట్టుకుంటారు. యజమానికి కోపం వచ్చినా, కార్మికులకు కోపం వచ్చినా పని గోవిందా. నిరుద్యోగులు ఖాళీగా వుండకుండా ఏదో ఒక పని చేయాలి కనుక తాత్కాలిక వెసులుబాటుగా హోటళ్లను ఎంచుకుంటారు.ఈ బలహీనతను యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.

    చివరిగా ఒక ప్రశ్న. హోటళ్లలో సేవ నచ్చకపోతే టిప్పు చెల్లించాలా లేదా అన్నది వినియోగదారుడి ఇష్టమని చెబుతున్న ప్రభుత్వం అది తాను అందించే సేవలకు సైతం వర్తింప చేస్తుందా ? సేవలకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటి మీద అదనంగా రుసుముల పేరుతో వసూలు ఎందుకు చేయాలి? చెత్త సెస్సు వసూలు చేస్తున్నా రోడ్లు శుభ్రంగా వుండటం లేదు, అలాంటపుడు దాన్నెందుకు చెల్లించాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మసూద్‌ అజార్‌ను చైనా, దలైలామాను మనం ఎందుకు కాపాడుతున్నాం ?

01 Sunday Jan 2017

Posted by raomk in BJP, CHINA, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

anti china, anti india, China, Dalai Lama, INDIA, masood azhar

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కల్పిత వార్తల సంవత్సరంగా ముగిసిన 2016 !

31 Saturday Dec 2016

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

2016 year of fake news, fake news, fake news stories, Misinformer, whatsapp

సత్య

    నిజం నాలుగు వేసే లోగా అవాస్తవం అరవైై అంగల దూరం ప్రయాణిస్తున్న కాలమిది. ప్రపంచవ్యాపితంగా కల్పిత, నకిలీ వార్తలు ప్రచారం, వేగం రోజు రోజుకూ పుంజుకుంటోంది. అలాంటి వాటిని సృష్టించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా రంగంలోకి వస్తున్నాయన్నది నమ్మలేని నిజం. ఒక వస్తువు చివరి వినియోగదారుడికి చేరక ముందే దాని నకిలీ తిష్టవేస్తున్నట్లుగానే నిజమైన వార్తలతో పాటు కల్పిత వార్తలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవటం వర్తమాన వ్యాపారాలలో ఒకటిగా మారింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నిలకు ముందు నుంచీ మన దేశంలో ఈ వ్యాపారం తామరతంపరగా పెరిగింది. ఒక సాంస్కృతిక సంస్ధ ముసుగులో పని చేస్తున్న వారు ఒక పెద్ద కల్పిత, నకిలీ, పుకార్ల కర్మాగారాన్నే పెట్టారు. దానికి అనుబంధంగా అనేక చిన్న ఫ్యాక్టరీలు నెలకొల్పారు. వందల మందిని నియమించి కోట్లాది రూపాయల వేతనాలతో నడుపుతున్నారు. తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, వాటి నేతలు, తమ పట్ల విమర్శనాత్మక వైఖరిని కలిగి వున్న జర్నలిస్టులు, మేథావులు, ఇతరులను అన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలతో, ఇతర విధాలుగా దెబ్బతీయటం నిత్య కార్యక్రమం. వీటి బండారాన్ని జనం తెలుసుకొనే సమయానికి అవి చేయాల్సిన పని, ప్రయోజనం, హాని చేస్తాయి. ఒక వార్త నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొనే అవకాశం, తీరిక అందరికీ వుండదనే బలహీనతను వాటి సృష్టి కర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. తాము నమ్మిన వార్త అవాస్తవమని తెలుసుకున్నవారు నిజమైన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మరు. ప్రతిదానినీ అనుమానిస్తూ వుంటారు. స్వార్ధశక్తులకు కావాల్సింది కూడా అదే. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, సారా, కులం, మతం, మీడియాలో డబ్బిచ్చి వార్తలు రాయించుకోవటం వంటి ప్రలోభాలతో పాటు కల్పిత వార్తలు కూడా ఒకటిగా చేరాయని 2016 మరింతగా నిరూపించింది. అందుకే ఒక సంస్థ ముగిసిన ఏటిని అబద్దాల సంవత్సరంగా ప్రకటించింది.

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచంలో కల్పిత వార్తలకు మన దేశం ఒక ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. దేశంలో 16కోట్ల వాట్సాప్‌లుంటే నెలకు వంద కోట్ల సార్లు వినియోగిస్తున్నారని అంచనా. ఫేస్‌ బుక్‌ ఖాతాలున్నవారు 15 కోట్లు, ట్విటర్‌లో 2.2కోట్ల మంది వున్నారని చెబుతున్నారు. వీటి ప్రభావం ఎంతగా వుందంటే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వారు కూడా తామెక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో సోషల్‌ మీడియాలో ప్రచారంలో పెడుతున్న చెత్తను స్వీకరించి పాఠకులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామం. గతేడాది జనాన్ని బురిడీ కొట్టించిన అనేక వార్తలలో కొన్నింటిని చూద్దాం.

    ‘నరేంద్రమోడీని ప్రపంచ వుత్తమ ప్రధానిగా యునెస్కో ప్రకటించింది’ ఇదొక కల్పిత వార్త.జూన్‌ నెలలో వాట్సాప్‌ గ్రూపులలో ప్రారంభమై ఇతర సోషల్‌ మీడియాలో చెలరేగింది. ఐక్యరాజ్యసమితి గానీ, దాని ఆధ్వర్యంలో నడిచే యునెస్కో వంటి సంస్ధలుగా గానీ అలాంటి అవార్డులు ఇవ్వవు, అయినా సరే అది ఇంకా తిరుగుతూనే వుంది. అలాగే జనగణమనను కూడా వుత్తమ జాతీయ గీతంగా అదే సంస్ధ ప్రకటించిందన్న తప్పుడు వార్త గురించి కూడా తెలిసిందే. ఇది 2008 నుంచి తిరుగుతోంది. ఒకసారి అందుకున్నవారికి అనేక సార్లు వచ్చి వుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులకు తోడు రెండువేల రూపాయల నోటు వచ్చి చిల్లర సమస్యను జత చేసి మరింత చికాకు కల్పించటాన్ని అందరం చూశాము. సరిగ్గా ఈ సమయంలోనే మన రెండు వేల రూపాయల నోటు ప్రపంచంలో అత్యంత వుత్తమ కరెన్సీ అని యునెస్కో కితాబు ఇచ్చిందనే సమాచారం వాట్సాప్‌ జనాలను వూపేసింది. ఇప్పటికింకా మీకు రాకపోతే త్వరలో వస్తుంది. ఇలాంటి వాటిని నిజమని నమ్మి ఇతరులకు చేరవేసే మన వాట్సాప్‌ గ్రూపు వినియోగదారుల తెలివితక్కువ తనం గురించి బిబిసి ప్రపంచానికంతటికీ తెలియచేసింది.

   ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను పెంచేందుకు రంగంలోకి దించిన మరొక వార్త రెండువేల రూపాయల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారన్నది. న్యూఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్ధులు దేశ వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారంటూ సృష్టించిన కల్పిత వీడియోలను పదే పదే ప్రచారం చేసిన జీ న్యూస్‌లోని బిజెపి భక్తుడైన సీనియర్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరి రెండువేల నోటుకు జిపిఎస్‌ చిప్‌ అమర్చారనే తప్పుడు కధనాన్ని కూడా జీ న్యూస్‌లో ప్రసారం, ప్రచారం చేశాడు. ఆ నోటును వుపగ్రహాలు కనుగొంటాయని, 120మీటర్ల లోతున భూ గర్బంలో దాచినా సిగ్నల్స్‌ ద్వారా పట్టుకోవచ్చునని ఇదంతా నరేంద్రమోడీ ఘనత అనే అర్ధం వచ్చేట్లుగా కట్టుకధలు చెప్పాడు. దాంతో మిగతా ఛానల్స్‌ కూడా దానిని కాపీ చేశాయి, కొత్త అంశాలను కలిపి చెప్పాయి. 15 ప్రోటాన్స్‌, 17 న్యూట్రాన్స్‌ వున్న రేడియో యాక్టివ్‌ ఐసోటోప్‌లు కొత్త నోట్లలో వున్నాయని కూడా ప్రచారం చేశారు. నిజమే అని వాట్సాప్‌ వీరులు ఎలా వ్యాపింప చేసిందీ చూశాము. నరేంద్రమోడీ, బిజెపి భక్తులు దానిని పెద్ద ఎత్తున వ్యాపింప చేశారు. చివరికది అవాస్తవమని తేలింది. మోడీ సర్కార్‌ నుంచి ప్రశంసలు లేదా ప్రతిఫలం పొందేందుకు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ కూడా కల్పిత వార్తలను తయారు చేసి దేశం మీదకు వదిలింది. తన వుద్యోగి ఒకడిని సామాన్యుడి మాదిరి ఒక టీస్టాల్లో నిలబెట్టి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పించింది. సామాజిక మీడియాలో కొంత మంది అతనిని గుర్తు పట్టి బండారాన్ని బయటపెట్టటంతో ఆ వార్తా సంస్ధ పరువు మురికి గంగలో కలిసింది.

    వాట్సాప్‌లోని ఫొటోలను ఐస్‌ వుగ్రవాదులు దుర్వినియోగం చేసే అవకాశం వున్నందున వెంటనే వాటిని తొలగించాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ పేరుతో ప్రచారం జరిగింది. ఒక 20-25 రోజుల పాటు ఫొటోలు పెట్ట వద్దని ఈ లోగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ సిఇఓ చెప్పినట్లుగా దాని కొనసాగింపుగా మరో పుకారు షికారు చేసింది. పది రూపాయల నాణాన్ని రిజర్వు బ్యాంకు రద్దు చేసిందన్న ప్రచారం కూడా ఈ కాలంలోనే వాట్సాప్‌లో తిరిగింది. అనేక చోట్ల దుకాణదారులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరించారు. నిరాకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వు బ్యాంకు ప్రకటించాల్సి వచ్చింది.

   తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత కుమార్తె అని, అమెరికాలో రహస్యంగా జీవిస్తోందంటూ ఒక ఫొటో వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో తిరిగింది. అయితే అది అవాస్తవమని, ఆ యువతి ఆస్ట్రేలియాలో వుంటోందని, జయలలితకు సంబంధం లేదని తరువాత తేలింది. జయలలిత మరణించిన తరువాత దీనిని సృష్టించారు.

    మన దేశానికి దాదాపు ఎనిమిదివేల కిలోమీటర్ల సముద్రతీరం, పుష్కలంగా వుప్పు తయారీకి అవకాశం వున్నప్పటికీ దేశంలో వుప్పు కొరత ఏర్పడిందన్న వాట్సాప్‌ మెసేజ్‌ రాగానే నిజమనుకొని జనం ఎగబడి కిలో వుప్పును మూడు, నాలుగు వందల రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేయటాన్ని చూశాము. కాన్పూరులో వుప్పుకోసం ఒక దుకాణాన్ని లూటీ చేసేందుకు ఎగబడిన జనాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో ఒక మహిళ మరణించింది. తన నోట్ల రద్దు చర్యతో దెబ్బతిన్నవారే ఈ పుకార్లు పుట్టించారని నరేంద్రమోడీ ఆరోపించారు.

    ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు తెలుపుతూ భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక వటవృక్షంలా తయారై దేశాన్ని, జనాన్ని ఎదగనివ్వలేదంటూ మన దేశంలో బిబిసి విలేకరిగా పనిచేసిన మార్క్‌తులీ వ్యాఖ్యానించారంటూ ఒక నకిలీ వార్తను పుట్టించారు. తానలాంటి వ్యాఖ్య చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

    అంతర్జాతీయ విషయాలకు వస్తే డిసెంబరు నెలలో వచ్చిన ఒక వార్త పాకిస్ధాన్‌ మంత్రి ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేయటానికి దారి తీసింది. ఏదో ఒక సాకుతో పాకిస్తాన్‌ గనుక సిరియాకు సైన్యాన్ని పంపితే తాము పాక్‌పై అణుదాడి చేయగలమని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి బెదిరించినట్లు ఒక వార్త వచ్చింది. అది ఎంత వరకు నిజమో తేల్చుకోకుండానే పాక్‌ మంత్రి ఆసిఫ్‌ ట్విటర్‌ ద్వారా ఒక ప్రకటన చేస్తూ తమ దేశం కూడా అణ్వస్త్ర దేశమే అని హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు. తరువాత ఇజ్రాయెల్‌ మంత్రి అలాంటి ప్రకటన చేయలేదని వెల్లడైంది. నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కల్పిత వార్తల తయారీ కేంద్రాలు, కార్మికులు ఓవర్‌టైమ్‌ పని చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే పొలైటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ 2016ను అబద్దాల సంవత్సరంగా వర్ణించింది. కల్పిత వార్తలను తామరతంపరగా తయారు చేయటమే కాదు, వాటిని జనం నమ్మటం కూడా ఆందోళన కలిగించే అంశమే. అమెరికా ఎన్నికలకు మూడునెలల ముందు కాలంలో ఓ ఇరవై కల్పిత వార్తలు పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. వాటిపై వ్యాఖ్యలు, ఇష్టపడిన(లైక్‌), పంచుకున్న (షేర్‌) వారి సంఖ్య 8.71 మిలియన్లని తేలింది. ఇదే సమయంలో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రికలుగా పరిగణనలో వున్న వాటిలో వచ్చిన 20 ముఖ్య వార్తలపై స్పందించిన వారు 7.36 మిలియన్ల మంది మాత్రమే వున్నారు. అంటే సామాజిక మాధ్యమాలలో కల్పిత వార్తలు ఎంతగా ప్రాచుర్యంలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

     అమెరికా అధ్యక్షుడిగా పచ్చిమితవాది డోనాల్డ్‌ ట్రంప్‌ గెలవటంలో కల్పిత వార్తలు కూడా ముఖ్య పాత్ర వహించాయంటే అతిశయోక్తి కాదు. దీనిని గుర్తించే వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న ఎన్నికలలో ఓటర్లు కల్పిత వార్తల బారిన పడకుండా చూసేందుకు కల్పిత వార్తల నుంచి రక్షణకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ కేంద్రం అలాంటి వార్తల గురించి ఓటర్లను విద్యావంతులను గావిస్తుందట. ముఖ్యంగా రష్యన్‌, టర్కిష్‌ భాష మాట్లాడే జర్మన్‌ పౌరులు ఈ కల్పిత వార్తల బారిన ఎక్కువగా పడే అవకాశం వుందని భావిస్తున్నారు. కల్పిత వార్తలుగా తేలిన వాటిని తమ వేదికలపై నుంచి తొలగించని సామాజిక మీడియా సంస్ధలకు జరిమానా విధించాలని జర్మన్‌ పార్లమెంట్‌ సభ్యులు ఇప్పటికే డిమాండ్‌ చేశారు. ఫ్రాన్స్‌లో కూడా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో కల్పిత వార్తల ధాటి పెరగవచ్చని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.

     మన దేశంతో సహా ప్రపంచంలో అనేక చోట్ల ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటానికి కల్పిత వార్తలను తయారు చేస్తున్నారు. వలస వచ్చిన శరణార్ధి బెర్లిన్‌ నగరంలో 13 సంవత్సరాల రష్యన్‌ జాతికి చెందిన ఒక బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు ఒక వార్త వచ్చింది. ఇంకేముంది రష్యాలోని ముస్లిం వ్యతిరేక మితవాద శక్తులు చెలరేగిపోయి అనేక చోట్ల ప్రదర్శనలు చేశారు. ఆ దెబ్బకు తట్టుకోలేని రష్యన్‌ ప్రభుత్వం ఈ వుదంతాన్ని మూసిపెట్టేందుకు జర్మన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించేవరకు వెళ్లింది.

    అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణ సెల్లార్‌లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ అనుచరులు బాలలతో ఒక వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఒక వార్తను వదిలారు. అది నిజమే అని నమ్మిన ఒక వ్యక్తి అక్కడి బాలలను రక్షించేందుకు వచ్చి పీజా కేంద్రంలో కాల్పులు జరిపాడు. అయితే ఎవరూ గాయపడలేదు. తీరా అక్కడ సెల్లార్‌ లేదు, వ్యభిచార కేంద్రం లేదని తెలుసుకొని పోలీసులకు లొంగి పోయాడు. హిల్లరీ క్లింటన్‌ ఐఎస్‌ తీవ్రవాదులకు నిధులు అందచేసినట్లు, డోనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్ధిత్వాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ బలపరిచినట్లు , షరియా చట్టాన్ని ఫ్లోరిడా రాష్ట్రంలో అమలు జరపాలని డెమోక్రటిక్‌ పార్టీ కోరినట్లు కల్పిత వార్తలు వచ్చాయి. ఇవన్నీ రిపబ్లికన్‌ పార్టీ వారు డబ్బిచ్చి ప్రత్యర్ధిని దెబ్బతీసేందుకు చేసిన అవాంఛనీయ వ్యవహారాలని వేరే చెప్పనవసరం లేదు.

     కల్పిత వార్తల తయారీకి వాటితో లబ్ది పొందే వారి నుంచి డబ్బు తీసుకోవటంతో పాటు వాటిని చదివే, చూసే పాఠకులను ఆకర్షించేందుకు ఆ వార్తలలో పెట్టే ప్రకటనల ద్వారా కూడా తయారీదారులు, వాటిని జనానికి పంచే 180 కోట్ల వినియోగదారులున్న ఫేస్‌బుక్‌, తదితర వెబ్‌సైట్ల వారికి కాసుల వర్షం కురుస్తోంది.అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ శివార్లలో కల్పిత వార్తల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న జెస్టిన్‌ కోలెర్‌ తాను ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా నెలకు పది నుంచి 30వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు అంగీకరించాడు. అమెరికా ఎన్నికలలో కల్పిత వార్తలతో డబ్బు సంపాదిస్తున్నవారిని గమనించిన తరువాత పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లలో ఒకటైన జార్జియాకు చెందిన ఒక కంప్యూటర్‌ విద్యార్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా కల్పిత వార్తలు తయారు చేస్తే బాగా గిట్టుబాటు అవుతోందని గ్రహించి ఆమేరకు అందుకు పూనుకోగా ఒక నెలలో తనకు గరిష్టంగా ఆరువేల డాలర్లు వచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. కల్పిత వార్తల వేదికగా మారినట్లు తీవ్ర విమర్శలు రావటంతో గూగుల్‌, ఫేస్‌బుక్‌ యాజమాన్యం వాటి నివారణకు తాము కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

     సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియా తీరుతెన్నులను పరిశీలిస్తున్నవారు 2017లో కూడా ప్రజలపై కల్పిత వార్తల దాడి ఎక్కువగానే వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో వాటి నిరోధం, జనానికి చైతన్యం కలిగించే చర్యలపై కూడా దృష్టి సారించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబును ఆవహించిన గురజాడ గిరీశం !

21 Wednesday Dec 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

chandrababu naidu, Demonetisation, demonetisation worries, gurajada girisam

ఎంకెఆర్‌

    డామిట్‌ కథ అడ్డం తిరిగింది. పెద్ద నోట్ల రద్దు గురించి చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘ఓపినీయన్స్‌ అప్పుడప్పుడూ చేంజ్‌ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్‌ కానేరడు !'( అభిప్రాయాలను అప్పుడప్పుడూ మార్చుకుంటూ వుంటేనే కానీ రాజకీయవేత్త కానేరడు) గురజాడ అప్పారావు పంతులు గారు గిరీశం పాత్ర ద్వారా ఎంత చక్కగా చెప్పారు. 1862-1915 మధ్య కేవలం 53 సంవత్సరాలు మాత్రమే జీవించిన గురజాడ ఆ నాటి రాజకీయ నేతల తీరు తెన్నులను చూసే అలాంటి వ్యాఖ్య చేశారంటే నేడే గనుక ఆయన వుండి వుంటే బాబోయ్‌ ఇంకేమైనా వుందా !

    ‘ ఒక ప్రముఖ రచయిత రాసిన ప్రతిదానినీ మెచ్చుకోవాలని నమ్మే అలవాటు తెలివి తక్కువ వారికి వుంటుంది. నా వరకైతే నాకు సంతృప్తినిచ్చే దానినే నేను చదువుతాను మరియు నా అభిరుచులకు తగినదానినే అభిమానిస్తాను’ అన్నాడు ప్రముఖ ప్రెంచి రచయిత ఓల్టేర్‌. చంద్రబాబు, నరేంద్రమోడీ నోటి నుంచి ఏది వస్తే అదే ప్రామాణికం అని నమ్మేవారు ఈ మాటలు తమకు ఎంతవరకు సరిపోతాయో ఆలోచించుకోవటం మంచిది. పెద్ద నోట్ల రద్దు గురించి కేంద్రానికి సిఫార్సు చేసిందే తానే అంటూ కేంద్రానికి రాసిన లేఖ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చి నరేంద్రమోడీ ప్రశంసలు అందుకొనేందుకు ప్రయత్నించటాన్ని లోకమంతా చూసింది. ఇప్పుడు ఆ నిర్ణయం తెచ్చిన సమస్యలు, పర్యవసానాలను చూసి పెద్ద నోట్ల రద్దు తాను కోరుకున్నది కాదని, తలెత్తిన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియటం లేదని రోజంతా ఆలోచించినా తట్టటం లేదని సెలవిచ్చారు. బ్రూటస్‌ నువ్వు కూడానా ! అని స్నేహితుడిగా వుండి వెన్నుపోటు పొడిచిన బ్రూటస్‌ గురించి రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ వాపోయినట్లుగా బహుశా గత రాత్రి నరేంద్రమోడీ కూడా ఒంటరిగానో లేక అమిత్‌ షా, వెంకయ్య నాయుడి వంటి తన నీడలను పిలిపించుకొనే చంద్రబాబు నాయుడి గురించి అనుకొని వుండి వుండాలి.

    సరే చంద్రబాబు నాయుడంటే పోలవరం తాత్కాలిక డామ్‌ మట్టి తీయిస్తూ, కాంక్రీట్‌ పోయిస్తూ ఆ పనేమీ లేకపోతే నేను నిదురపోను మిమ్మల్ని నిదురపోనివ్వనంటూ అధికారులతో ఏదో ఒక ప్రయోజనం లేని దాని గురించి సమీక్షపేరుతో తీరిక లేకుండా వుండి వుంటారనుకుందాం. లక్షల రూపాయల ప్రజాధనం పందారం చేస్తూ ఆయన నియమించుకున్న సలహాదారులేం చేస్తున్నట్లు ? రాజు మెచ్చిందే రంభ అన్నట్లుగా చంద్రబాబు మనసెరిగి నోట్ల రద్దు అంతా సజావుగానే జరిగిపోతుందంటూ, వాస్తవ పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టించి వుంటారా ?

      ‘నోట్ల రద్దు చిన్న ప్రయోజనాల కంటే మోడీ వ్యూహం ఎంతో సాహసోపేతమైనది’ అనే శీర్షికతో ఆర్‌ జగన్నాధన్‌ అనే ఆయన భక్తుడు ఒకరు రాసిన వ్యాసంలోని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నోట్ల రద్దు వలన ఎంతో మేలు జరుగుతుంది, దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం అని ఇప్పటికీ ఒకవైపు ప్రచారం సాగుతుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఈ భక్తుడు రాసిన దానికి చిన్న ప్రయోజనాలని పేరు పెట్టటం అంటే ముందే చెప్పాం కదా అని ఎదురుదాడి చేసేందుకే. నోట్ల రద్దుతో జనం ఇబ్బందులపై మీడియా వార్తలతో ఇబ్బంది పడిన భక్తులు భజన బాణీ మార్చారు. మోడీ ఏదో పెద్ద పధకంతోనే ఈ పని చేశారంటూ కొత్త పాట అందుకున్నారు. ‘నోట్ల రద్దు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో విజయం కోసం కాదు, అది జరిగితే అదొక ప్రయోజనకరమైన బోనస్‌ అవుతుంది. ఆయన రాజకీయ లక్ష్యాలు అసాధారణమైనవి. అధికారానికి వచ్చిన వెంటనే నల్లధనంపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.2015లో విదేశీ ఆస్థుల గురించి తొలి స్వచ్చంద వెల్లడి పధకాన్ని ప్రకటించారు.అరవై శాతం పన్ను విధించటంతో అది విఫలమైంది. దాని గురించి గుణపాఠం తీసుకొని ఆదాయ వెల్లడి పధకం (ఐడిఎస్‌) ప్రారంభించారు. సెప్టెంబరులో ముగిసిన దానిలో రు.67,382 కోట్ల మేరకు ప్రకటన చేయించగలిగారు. వాయిదాల పద్దతిలో దానిలో 45శాతం మేరకు వసూలు చేస్తారు.( హైదరాబాదులో ప్రకటించి చేతులెత్తేసిన పదివేల కోట్ల రూపాయల ఆస్థిపరుల వంటి వారు ఇంకా ఎందరున్నారో తెలియదు).తరువాత బినామీ లావాదేవీల నిషేధ సవరణ చట్టాన్ని నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు నోటిఫై చేశారు. జనం తమ వద్ద వున్న సొమ్మును బ్యాంకులలో డిపాజిట్‌ చేయటాన్ని చూసి పన్నుల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం దాచుకున్న సొమ్మును వెల్లడిస్తే 50శాతం పన్ను వసూలు చేసి, 25శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాల తరువాత చెల్లించే విధంగా ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.అది కూడా పనిచేయకపోతే నగదును మరింత తక్కువ చేసేందుకు, మరింతగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధవైపు నడిపించేందుకు లక్ష్యాన్ని మార్చారు. పరిశుద్దులయ్యేందుకు ఇవన్నీ ప్రతి వారికి ఒకటికి రెండు అవకాశాలు ఇవ్వటం, అలా చేసే వారికి వేధింపులు లేకుండా చూడటం, ఎన్నో ప్రయోజనాలు లేకుండా బిజెపికి పునాది వంటి మద్దతుదారులైన వాణిజ్య, వృత్తిదారుల ఆగ్రహానికి గురిఅయ్యేందుకు కూడా సిద్ద పడి ఒక రాజకీయ నాయకుడు ఈ సాహసం చేయరు.’ ఇలా జనానికి ఆగ్రహం కలగకుండా మంచి రోజులు ముందున్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయత్నమిది అని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కనుక ఎటుబోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తతో నోట్ల రద్దు తన సలహా వల్లనే జరిగిందని తొలి రోజుల్లో చెప్పుకున్నారు తప్ప తరువాత క్రమంగా అసంతృప్తిని వెల్లడించటం ప్రారంభించారు. తీరా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. దీనిలో అయినా నిజాయితీ వుందా ? లేక ఆగ్రహిస్తున్న జనాన్ని దువ్వేందుకా ? కారణం ఏదైనా చంద్రబాబును గురజాడ గిరీశం ఆవహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఒపీనియన్‌ను చేంజ్‌ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు – చెల్లని పాత నోట్లు !

18 Sunday Dec 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Telangana

≈ Leave a comment

Tags

demonetised notes, Pawan kalyan, pawan kalyan tweets

Image result for pawan kalyan tweets

ఎంకెఆర్‌

      అన్నా పవర్‌ స్టారన్నా మీ అభిమానిగా నా ఆందోళన, ఆవేదనదాచుకోలేక ఈ లేఖ రాస్తున్నా. మీ సెక్రటరీలు లేకపోతే సలహాదారులతో ట్వీట్లు ఇప్పించినట్లు కాకుండా నువ్వే స్వయంగా చదువుకో అన్నా, లేకపోతే నిన్ను తప్పుదారి పట్టించే అవకాశం వుంది. ట్వీట్ల ద్వారా అనేక విషయాల మీద మా అన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడని తెలిసి అభిమానులం అందరం పొంగిపోయాం. ఇదేంటన్నా అట్టర్‌ ప్లాఫు సినిమాల మాదిరి తుస్సు మంటున్నాయి. ఒక సినిమా ఫట్టయి డబ్బాలు వెనక్కు తిరిగి వస్తే తరువాత మరో డైరెక్టర్‌తో హిట్టు సినిమా తీసి అభిమానులను అలరించటం తెలిసిందే. ఈ మధ్య నీ రాజకీయ సినిమాలన్నీ ఓపెనింగ్‌ కలెక్షన్ల తరువాత మరుసటి రోజు నుంచి జనం చూడటం లేదని నీకూ తెలిసి వుండాలి కదా అన్నా. అయినా రాజకీయ డైరెక్టర్లను మార్చినట్లు కనిపించటం లేదు. ఇలాగయితే అభిమానులం ఏం కావాలో తెలియటం లేదన్నా.

    ఎప్పుడో ఏడాది క్రితంనాటి విషయాలపై మీ స్టారు ఇప్పుడు ట్వీట్లు ఇస్తున్నాడు పవర్‌, పంచ్‌ తగ్గిపోయిందా, ఇప్పటి విషయాల మీద ఏడాది తరువాత ట్వీటుతాడా అని చివరికి బిజెపి వారు కూడా ఎగతాళిగా అంటున్నారన్నా. మాకు తలతీసేసినట్లయింది. ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లయ్య దిగింతరువాత బోడి మల్లయ్య అన్నట్లుగా పద్దతి తప్పితే ఎంతలో ఎంత మార్పో చూడన్నా ! ఇప్పుడు అటు బిజెపి, తెలుగుదేశం వారూ పట్టించుకోవటం లేదు, ఇటు వాటిని వ్యతిరేకించే వారూ నమ్మటం లేదు. దేశమంతా నరేంద్రమోడీ రద్దు చేసిన పెద్ద నోట్ల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో జమ అవుతుందా లేదా అని పందాలు కడుతూ డిసెంబరు 30 కోసం అందరూ అటువైపే చూస్తుంటే నువ్వేంటన్నా ఏడాది క్రితపు విషయాల మీద ఇప్పుడు స్పందిస్తున్నావు. అప్పుడు మరచిపోయావా, లేకపొరపాటున ఇప్పుడిచ్చావో తెలియటం లేదన్నా. వాటిని చెల్లని పాతనోట్లని చిన్న పిల్లాడు కూడా పట్టించుకోవటం లేదన్నా !

    పెళ్లి మంత్రాలు పెళ్లికి-తద్దినపు మంత్రాలు తద్దినానికి చదవాలన్నట్లుగా సందర్భాన్ని బట్టి కదన్నా స్పందించాల్సింది? చిన్నపుడు మా పిసినారి అమ్మమ్మ లడ్లు, కారప్పూస నెలల తరబడి దాచి చివరికి ఎప్పుడో పిల్లలికి పెడితే ఆమె చూడకుండా బయటపడేసి పారిపోయేవారు. మా కాటమ రాయుడికి అలాంటి సలహాలు ఇచ్చే నిపుణులెవరో గానీ వెతికి పట్టుకొని వీరతాళ్లు వేయాలని మన వారంతా సిద్ధం అవుతున్నారన్నా.

     రెండున్నర సంవత్సరాలయినా సాధించిన పెద్ద విజయమిది అని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేక వుత్తర ప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాలలో ఓటర్ల ముందుకు ఎలా పోవాలా అని తలలు పట్టుకొని నరేంద్రమోడీ- అమిత్‌ షా ఒకరి గడ్డాన్ని మరొకరు ు నిమురు కుంటుంటే ఒక అర్దరాత్రి పెద్ద నోట్లు రద్దు ఆలోచన వచ్చినట్లు మన పవర్‌ స్టార్‌కు ఈ ఆలోచన ఏ సమయంలో వచ్చిందో అని జనం గుసగుసలాడుకుంటున్నారన్నా. ట్వీట్లతో బిజెపి మీద పేలుస్తున్న షాట్లు అరవై ఏండ్ల తరువాత వెనుకటి కెవడో అమ్మా అని అరిచాడన్నట్లుగా వుందిరా అబ్బాయ్‌ అని మా మాస్టారు అన్నారు. అసలేమీ మాట్లాడని వారి కంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడటం మంచిదే కదా అని సమర్ధించాం అనుకో.

     ఒక చిన్న సందేహమన్నా మనం జన సేన రాజకీయ పార్టీని పెడుతున్నట్లా లేనట్లా ? లేక సినిమా టైటిల్‌ రిజిస్టరు చేసి దశాబ్దాలు గడిచినా తీయకుండా వున్నట్లుగా వుంటామా ? వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారకులు బిజెపి వారన్నది మీ ట్వీట్‌ అర్దం అని మేము అనుకుంటున్నాం . రోహిత్‌ వంటి వారు ఆత్మహత్యకు పాల్పడకుండా ఎలా చూడాలా అన్నది ఆలోచించాల్సింది పోయి బిజెపి వ్యతిరేక పార్టీలు ఆ వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తే బిజెపి , దాని మిత్ర పక్షాలు రోహిత్‌ దళితుడు కాదని నిరూపించేందుకు ప్రయత్నించాయని మీరు విమర్శించారు. ఈ తర్కం మీ పికె బుర్రలో పుట్టిందా లేక తెలివి తక్కువ మేథావుల నుంచి అరువు తెచ్చుకున్నదా అని ఇక్కడ అడుగుతున్నారన్నా.మీ పీకె అంత పోటు గాడయితే ఎన్నికల సమయంలో బిజెపి-తెలుగుదేశం భుజాలెక్కి, తరువాత అప్పుడప్పుడు సినిమాలు లేనపుడు, కాల్షీట్లు ఖాళీగా వున్నపుడు ఇలా వచ్చి అలా పోవటం తప్ప పీకిందేమిటి అని అడుగుతూ మీకంత సీన్‌ లేదంటున్నారన్నా !

    తప్పును తప్పుగా ఖండించటం తప్పయితే రోహిత్‌ బలవన్మరణం చెందిన పదకొండు నెలల తరువాత అదీ ఆ సమస్యపై జనం మరచి పోయిన తరువాత పికె ఇప్పుడు తప్పుపట్టటం ద్వారా మీ జనసేన పార్టీ ఏ రాజకీయ ప్రయోజనం ఆశిస్తోంది? తమను దోషులుగా చూపిన పార్టీలపై బిజెపి కూడా ఇదే మాదిరి ఎదురు దాడి చేసింది, దానికి పికె ఆరోపణకు తేడా ఏమిటి ? పోనీ ఇతర పార్టీలను తప్పుపట్టిన మీ నేత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేయాలో ఇంతకాలం తరువాత కూడా ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలతో జనం మా తలంటుతున్నారన్నా ? మాక్కూడా నిజమే కదా అనిపిస్తోంది. అవు, నోట్ల రద్దు, ఏపికి ప్రత్యేక హోదా ఇలా ఏ సమస్యపై అయినా ఎవరైనా విమర్శిస్తే అధికారంలో వున్న పార్టీలన్నీ రాజకీయ లబ్దికోసమే వీటిపై విమర్శలు చేస్తున్నాయనే కదా ఎదుటి పక్షాలపై దాడి చేస్తోంది. దేశం మీకేమిచ్చిందని కాదు ఆడగాల్సింది దేశానికి మీకేమిచ్చారని ఆలోచించుకోవాలన్నట్లుగా ఇలాంటివన్నీ ప్రత్యర్ధులను నోరు మూయించటానికి అధికారపార్టీ ప్రయోగించే అస్త్రాలు. రాజకీయాలలో ఇవన్నీ పాతబడి తుప్పు పట్టిన ఆయుధాలన్నా !

   రాజకీయాలలోకి రాదలచుకుంటే ఎప్పటికప్పుడు స్పందించాలి తప్ప ఆరునెలలకో, సంవత్సరానికో అయితే నలుగురూ నవ్వుతారన్నా, జరిగిందేదో జరిగింది. మీ ట్వీట్లకు మీడియా పెద్దగా స్పందించలేదని మీకు కూడా అర్ధం అయిందనుకుంటా ! ఇక ముందైనా వెంటనే స్పందిస్తేనే ఫలితం, ప్రయోజనం !!

మీ అభిమాని

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనం సహనం చూస్తుంటే భయంగా వుంది బాబాయ్‌ !

16 Friday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

black money, black money unearth, Demonetisation, demonetisation worries, failure Modi, narendra modi bhakts

Image result for narendra modi bhakts

ఎంకెఆర్‌

బాబాయ్‌ బాగున్నావా !

ఏదోరా అబ్బాయ్‌ మీ నరేంద్రమోడీ పుణ్యమాని అని మా ఇంటిదాని పోరు పడలేక రోజూ అలా ఏటిఎం, బ్యాంకుదాకా వెళ్లి ఇలా గంటల తరబడి నిలబడి వస్తుంటే కాళ్లు లాగుతున్నాయ్‌. ఇదిగో ఇప్పుడే వచ్చా బ్యాంకులో రెండువేల రూపాయల నోటిచ్చారు. భోంచేసి సాయంత్రానికి దాన్ని మళ్లా మార్చటానికి మరో గంట ఆ షాపూ ఈ షాపుకూ తిరగాలి !

సరేగాని బాబాయ్‌ ఈ రోజు పత్రికలు చూశావా మా బిజెపి ఎంఎల్‌ఏ ఒకాయన పెళ్లికి ఇంతింత ఖర్చు చేయటం అవసరమా అన్నాడని ఒక యువతి ఔరంగాబాదులో తన పెళ్లి కోసం కేటాయించిన 150 కోట్ల రూపాయలతో తన గ్రామం వెళ్లి 90 మందికి సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించిందట చూశావా మా వారెంత నిరాడంబరులో !

చూశాన్రా అబ్బాయ్‌ మీ పార్టీనేత గాలి జనార్డనరెడ్డి, నితిన్‌ గడ్కరీ కుమార్తెల వివాహాలు ఎంత నిరాండబరంగా జరిగాయో లోకంతో పాటు నేనూ చూశా. సరేగానీ అబ్బాయ్‌ నీకు ఆ యువతి వార్త చదివి అనుమానాలు రాలేదా ?

నీకన్నీ అనుమానాలే ప్రతిదానినీ అనుమానిస్తావు. ఏముంది అందులో అనుమానించటానికి ?

కాదురా అబ్బాయ్‌ టీ అమ్మిన మోడీ, ఇండ్లు తుడిచిన మోడీ అన్న మీ పిట్టకథల మాదిరి ఇది కూడా అనుమానంగా వుంది. నూటయాభై కోట్లతో 90 సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లా, ఒక్కో ఇంటికి కోటీ అరవైఆరు లక్షల అరవై ఆరువేల ఆరువందల అరవై ఆరు రూపాయల అరవయ్యారు పైసలు అంటే ! నల్లధనాన్ని తెల్లధనంగా లెక్కల్లో చూపేందుకు వేసిన ఎత్తుగడ కాదు కదా ? చదివిన నీ లాంటి వారికి ఎలాగూ బుర్రతక్కువే అనుకో , చెప్పేవాడికి వినేవాడు లోకువ గనుక ఏదో ఒకటి చెబుతారు. వారికిి బుర్రలేకపోతే రాసిన వారికి వుండొద్దా ! ఇంతకీ దానికి స్వచ్చభారత్‌ పధకం కింద మరుగుదొడ్డి కట్టించారో లేదో విద్యాబాలన్‌కు ఫిర్యాదు చెయ్యి .

ఏంటి బాబాయ్‌ ఆ వార్త అతిశయోక్తి అంటావా ?

అరే అబ్బాయ్‌ రోజూ మీడియాలో అలాంటి కట్టుకధలు, అతిశయోక్తులు వస్తూనే వుంటాయి. నీకు అసలైన అతిశయోక్తి చెప్పనా అదేమిటంటే నోట్ల రద్దు తరువాత ప్రధానితో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు మాత్రమే నట, ఇంకెవరూ మాట్లాడలేదని, తాను చెప్పిన కొన్ని సలహాలు, సూచనలు కనుక ప్రధాని అమలు చేస్తే బంగారు భారతమే అని స్వయంగా ఆయనే చెప్పారు. అసలు మోడీకి నోట్ల రద్దు సలహా ఇచ్చింది తానేనని చంద్రబాబు నాయుడు చెప్పారా. దాంతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి సలహా మాత్రం చంద్రశేఖరరావు చెప్పారట. మొత్తానికి మోడీకి కుడిఎడలమల ఢాల్‌ కత్తుల మాదిరి ఎలా వున్నారో కదా !

ఏదోలే బాబాయ్‌ ఎంత చెట్టుకు అంతగాలి, ఎవరి తిప్పలు వారివి. ఇప్పటికే తెలంగాణాను బంగారంగా మార్చేశారు కదా, తన కుమార్తెకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే దేశం మొత్తాన్ని కూడా బంగారు భారతంగా మార్చివేద్దామని సలహా ఇచ్చి వుంటారేమోలే !

అవున్రా అబ్బాయ్‌ ఒకరేమో ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండా ప్రత్యేక పాకేజితో బంగారు ఆంధ్రగా మార్చేశారు, మరొకరేమో దేశమంతటినీ మార్చేందుకు పూనుకున్నారు. ఏమి దేశ భక్తి !

భలే గుర్తు చేశావు బాబాయ్‌ దేశభక్తి అంటే గుర్తుకు వచ్చింది. ఏం బాబాయ్‌ నల్లధనాన్ని రద్దు చేయటం మంచిదే అంటారా ! దానిలో భాగంగా తీసుకొనే చర్యలను కొద్ది రోజులు ఓర్చుకోలేరా ! మీరు దేశభక్తులు కాదా !!

ఓర్చుకుంటాను రా అబ్బాయ్‌…… డిసెంబరు 30 వరకు. ఆ లోగా ఆగ్రహిస్తే దేశ భక్తులు కాదని, బ్యాంకుల ముందు కూడా వుగ్రవాద, పాక్‌ అనుకూల నినాదాలు చేసినట్లు ముద్రవేసి మీరంతా జనాన్ని ఎక్కడ తంతారోనని కిక్కురు మనకుండా జనం ప్రతి రోజూ క్యూలలో నిలబడుతున్నారు. ఎన్నిరోజులిలా అని ఎవరిని కదిలించినా డిసెంబరు 30, ఇంకా కొద్ది రోజులే కదా అంటున్నారు.

నీ చోద్యంగానీ బాబాయ్‌ జనం భయపడే అలా వుంటున్నారంటావా !

నిన్ను, నీలాంటి వారి పనులు చూస్తే అలా అనాలనిపిస్తోంది గానీ, జనం ఏదో మంచి జరుగుతుందనే ఆశతోనే క్యూలలో నిలవటం అలవాటు చేసుకున్నారు.

హమ్మయ్య మా మోడీ తీసుకున్న చర్య గురించి ఎంత కాలానికి ఒక మంచి మాట చెప్పావు బాబాయ్‌ ! కానీ బాబాయ్‌ నీతో చెప్పటానికి భయమెందుకు గానీ జనానికి అంత నమ్మకం వుండటాన్ని చూస్తే మాకు భయమేస్తోంది.

మీకు భయమా ! పొద్దున లేస్తే ప్రజాస్వామ్యం గురించి పారాయణం చేస్తారా ! పార్లమెంట్‌లో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు గానీ బయట మోడీ-షా అలా కనిపించటం లేదుగా !

నూటికి నూటయాభై మంది మమ్మల్ని బలపరుస్తున్నారు, నగదుకు ఇబ్బంది లేదు, అంతా బాగుంది అని బయట గప్పాలు కొట్టటం కాదురా మన డబ్బును మన ఖాతా నుంచి ఒక కార్డు మీదో, చెక్కు మీదో పట్టుమని పది వేలు తీసుకురావటం చేతకాదు గానీ శేఖరరెడ్డి లాంటి వాడి ఇంటికి కోట్లు కోట్లు ఎలా పంపిస్తున్నారు అంటూ అమ్మా, చెల్లి నన్ను ఆట పట్టిస్తున్నారు. ఆలస్యంగా ఇంటి కెళ్తే క్యూలో నిలబడి వస్తున్నానంటే నమ్మటం లేదు. డబ్లు లేకుండా ఇంటి కెళ్లాలంటే ఏదోగా వుంది. మొన్నటికి మొన్న కూరగాయల షాపులో ఐదు రూపాయల కొత్తిమీర, కరేపాకు తీసుకొని గీక్కోమని కార్డు ముందు పెడితే షాపు ఆంటీ ఎగాదిగా చూసి జాలి పడి డబ్బు వద్దులే బాబూ తరువాత ఎప్పుడన్నా ఇవ్వు అంటూ నా మొహాన కొట్టింది. తల తీసేసినట్లయింది.

అబ్బా అయితే మీ ఇంట్లోనే అనుమానం ప్రారంభమైందన్నమాట !

ఏ మాటకామాటే చెప్పుకోవాలి బాబాయ్‌ ఇన్ని రోజులు క్యూలలో నిలబడినపుడు జనం వేస్తున్న జోకులు చూస్తుంటే ఒక వైపు నవ్వొస్తోంది, అఫ్‌ కోర్సు అమ్మాయిలు కూడా వుంటున్నారు గనుక ఎంజాయ్‌ చేస్తున్నాం అనుకో . కానీ మరోవైపు మా మోడీని తుగ్లక్‌, నీరో అంటుంటే మా డాడీనే అన్నట్లుగా నీరసం, కోపం వస్తోంది. అసలు చివరికి ఏమౌతుంది బాబాయ్‌ !

అరే అబ్బాయ్‌ ఏమౌతుందో అనేక మంది పెద్దలు ఇప్పటికే చెప్పారు ! కోట్లకు కోట్లు కొత్త నోట్లు కొందరిళ్లలో దొరుకుతుంటే ఏం జరుగుతోందో మీరందరూ స్వయంగా చూస్తున్నారు. మేము ఏదన్నా అంటే మీరు నల్లధనులను బలపరుస్తున్నారంటూ గయ్యాళి నోరేసుకొని ఇంతెత్తున లేస్తున్నారు.

కాదు బాబాయ్‌ ఒకవైపు రిజర్వుబ్యాంకు వారేమో డిసెంబరు పదినాటికే 12.44 లక్షల కోట్ల మేరకు రద్దయిన నోట్లు బ్యాంకులకు వచ్చాయని చెబుతుంటే మరోవైపు ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్‌ ఒక నోటును రెండుసార్లు లెక్కవేసి వుంటారులే, లేకపోతే అంత మొత్తం ఎక్కడ జమ అవుతుంది అంటాడేమిటి బాబాయ్‌ !

నువ్వు కుర్రాడివి అనుభవం తక్కువ. అవసరం ఎక్కువ వున్నపుడు మన దగ్గర ఎంత తక్కువుందో తెలిసి కూడా ఒక వెయ్యి అయినా పెరుగుతాయోమో అని ఒకటికి మూడు సార్లు లెక్కపెట్టుకుంటాం. ఇప్పుడు వూహించని విధంగా కరెన్సీ చేరుతుంటే అంత రాకూడదురా బాబూ కనీసం లక్ష కోట్లయినా తగ్గాలిరా భగవంతుడా అని శక్తి కాంతదాస్‌ కూడా అదేపని చేస్తున్నాడేమో ? ఈ వరస చూస్తుంటే రద్దయిన నోట్ల కంటే బ్యాంకుల దగ్గరకు ఎక్కువ వస్తుందని భయపడుతున్నాడో లేక వస్తే చెప్పకుండా దాచేందుకు లెక్కల గందరగోళం చేయబోతున్నారేమో ?

ఏమో బాబాయ్‌ ! దాసుగారేమో అలా చెబుతున్నారు. మన అశోక్‌ గజపతిరాజు గారి దివాణంలో సహాయ మంత్రిగా వున్న జయంత్‌ సిన్హా గారేమో సొమ్మంతా తిరిగి రావటం అద్బుతం, రెండు మూడులక్షల కోట్ల రూపాయలను బయటపెట్టకుండా ఎక్కడో అడవుల్లో తగుల బెడితే ఎవరి దగ్గర నగదు వుందో, దాన్ని ఎలా వుపయోగిస్తున్నారో తెలియకుండా పోయేది కనుక బ్యాంకుల్లో వేయటం మంచిదేగా అంటున్నాడేమిటి బాబాయ్‌ ! ప్రతిపక్షాలేమో నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అంటున్నాయి. యూ టూ బ్రూటస్‌ అన్నట్లుగా మోడీ మంచోడే అంటూనే బాబా రామ్‌దేవ్‌ కూడా ఇది రెండు మూడు లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు. అవినీతి బ్యాంకర్లు ప్రధానిని తప్పుదారి పట్టించారని చెబుతున్నాడు . అంతా అయోమయంగా వుంది.

మీ వారందరికీ ఇదొక జబ్బు, కిందపడ్డా మాదే విజయం అంటారు . చెప్పిందేమో నల్లధనాన్ని వెలికి తీయటం అని ప్రచారమేమో నగదు రహితం ! ఇప్పుడేమో అంతా బ్యాంకుల్లోకి రావటం కూడా మంచిదేగా అంటారా ? అసలు మీరు ఒక మాట మీద కట్టుబడి వుంటారా ?

నీకు తెలియందేముంది బాబాయ్‌ నువ్వు మాత్రం ఓటమిని ఒక పట్టాన ఒప్పుకుంటావా అయినా నాకు తెలియక అడుగుతున్నా ఇన్ని రోజులూ ఖాళీగా వుండి ఎంపిలందరూ నియోజకవర్గాలకు వెళ్లి నోట్ల రద్దు ప్రయోజనాల గురించి జనానికి చెప్పమని అమిత్‌ షా ఆదేశించారట. నన్ను మా అమ్మ తిట్టినట్లే అమిత్‌ షాకు కూడా ఇంట్లో తలంటారంటావా !

ఏమో నాకయితే పక్కింట్లోకి తొంగి చూసే అలవాటు లేదు గానీ…. తలంటించుకోవటం మాత్రం తెలుసు !

కాదు బాబాయ్‌ కలుగుల్లోంచి పందికొక్కులు బయటకు వచ్చినట్లు ఎక్కడ దాడి చేస్తే అక్కడ కొత్త నోట్లు కోట్లకు కోట్లు, బంగారం కడ్డీలకు కడ్డీలు దొరుకుతోంది.దీన్ని చూస్తున్న జనం నోట్లు దొరక్కపోతే ఇంకా సహనంతోనే వుంటారంటావా ? అందుకే మాకు భయమేస్తోంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

Upcoming Railway Recruitment 2017

15 Thursday Dec 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Indian Railways, Railway Jobs, Railway Jobs Notification

Railway Jobs 2017, 43297 Vacancies, Upcoming Railway Recruitment 2017

Railway Jobs 2017: In this Article, you will be getting introduced with the jobs in the largest network in the country India, Indian Railways. Here we will discuss about the availability of Railway Jobs in India and the criteria to attempt the railway examination and the procedures. The Inception of Indian Railways begins from April 16, 1853 and the Headquarters of Indian Railway is in New Delhi, India. Indian Railway is one of the largest world’s railway networks which is appreciated and accepted by the rest world.

The tracks of the Indian Railways are spreading over 115000 km in the route of 65000 km and 7500 stations. Indian Railways is Indian state – owned network which is operated and control by the Ministry of Railway, Government of India. Indian Railways is divided into 4 zones – Northern Railways, Eastern Railways, Southern Railways and Western Railways. Indian Railways has around 1.3 million of employees dedicated to sharpen the quality and workings of Indian Railways. And Indian Railways keep recruiting more employees throughout the year.

Railways Jobs are the one of the highly preferred and searchable jobs by the desirable candidates and also having a huge scope in India. Well, Indian Railway are never ending network in India that means there may be a chances of Advancement and Development but there will be 0% Percent chances of the termination of Indian Railways. So having Jobs in Indian Railways is the great thing to be secure in the whole life and to earn higher income.From the Low Level to the Top Level, Indian Railways issued the vacancies to join the Indian Railways each year. The regions are divided into four and each region released their recruitment notification. Every Year around Lakhs number of vacancies is released by the Indian Railways of the every region in which large number of people applied for and some of them deserving and suitable candidates get the job in the Railways.

Latest Railways Jobs 2016 – 2017:-

Latest December 2016 Railway Jobs:-

Company Name No. of posts Qualification Last Date
West Central Railway Recruitment 2016 592 10th/12th qualified/ Graduate Engineer 30th December 2016
C & W Workshop New Bongaigaon Recruitment 2017 60 10th/ ITI Qualified Will be updated soon
NMRC Recruitment 2016 745 B.Tech 15th December 2016

 November Month Railway Jobs 2016

Company Name No. of Posts Qualification Last date
NMRC Recruitment 2016 745 B.Tech 15-12-2016
Central Railway Recruitment 2016 2326 10th class 30-11-2016
North Eastern Railway Recruitment 2016 133 Higher secondary (10+2) pass 30-11-2016
RRB Recruitment 2017 26567 Degree Will be updated soon

October Month Railway Jobs 2016

  Railway RRB Recruitment 2017- 26567 Assistant loco Pilot Vacancies
Company Name No of Posts Qualification Last Date
RRB Patna Recruitment 2017 1981 10th 12th Updates Soon
RRB Muzaffarnagar Recruitment 2017 1153 10th 12th Update soon
RRB Allahabad Recruitment 2017 1527 10th 12th Update Soon
RRB Ranchi Recruitment 2017 2661 10th 12th Update Soon
RRB Secunderabad Recruitment 2016 21 Diploma/Graduation 17th October 2016
RRB Bangalore Recruitment 2016-2017 1172 Graduation Update Soon
RRB Recruitment 2017 26567 10th 12th/ Graduation Update Soon
RRB Siliguri Recruitment 2017 345 10th 12th/ Diploma Updates Soon
RRB Bhubaneswar Recruitment 2017 1538 10th 12th Updates Soon
RRB Bilaspur Recruitment 2017 1680 10th 12th Updates Soon
RRB Mumbai Recruitment 2017 4155 10th 12th Updates Soon
RRB Malda Recruitment 2017 373 10th 12th Updates Soon
RRB Gorakhpur Recruitment 2017 78 10th 12th Updates Soon
RRB Chandigarh Recruitment 2017 1161 10th 12th Updates Soon
RRB Ajmer Recruitment 2017 771 10th 12th Updates Soon
RRB Bhopal Recruitment 2017 326 10th 12th Updates Soon
RRB Ahmedabad Recruitment 2017 546 10th 12th Updates Soon
RRB Chennai Recruitment 2017 1680 10th 12th Updates Soon
RRB Thiruvananthapuram Recruitment 2017 294 10th 12th Updates Soon
RRB Jammu Sirnagar Recruitment 2017 475 10th 12th Updates Soon
RRB Kolkata Recruitment 2017 2038 10th 12th Updates Soon
RRB Guwahati Recruitment 2017 538 10th 12th Updates Soon

Latest September Month Railway Jobs 2016

Company Name No. of Posts Qualification Last Date
DMRC Recruitment 2016 3428 BE/B.Tech 15th October 2016
KMRL Recruitment 2016 18 Diploma/B.Tech 27th October 2016
Konkan Railway Recruitment 2016 57 ITI 29th September 2016
Railtel Recruitment 2016 61 Diploma/ Graduattion 26th August 2016
East Central Railway Recruitment 2016-17 50 10+2 20th October 2016

July Month Railway Jobs 2016

 Company Name No. of Posts Qualification Last Date
KMRL Recruitment 2016 36 ICWA/CA/B.Tech/Diploma/MBA 10th August 2016

 

BMRCL Recruitment 2016

 

50 B.E/B.Tech/Diploma (Civil) 22nd August 2016
North Western Railway Recruitment 2016 21 10+2 Graduation 22nd August 2016
Southern Railway Recruitment 2016 117 12th 01st August 2016
Konkan Railway Recruitment 2016 08 ITI 05th August 2016
Company Name No. of Posts Qualification Last Date
BMRCL Recruitment 2016 308 10th/ITI/Diploma/B.E/B.Tech 11th July 2016
SR Railway Recruitment 2016 117 10th/12/ Typing Speed 1st August 2016

 For getting information about the current vacancies visit here: http://www.indianrailways.gov.in

Sources where the Railways Jobs can be find: Newspaper, Employment News Newspaper, Jobs Website likes Naukri.Com, Shine. Com, Monster.Com Etc., Websites, Internet.

Railways Jobs Eligibility Criteria:

The Eligibility Criteria for the Railways Jobs is generally depends on the nature of post or job. If the posts are related to Technical you need to have a degree in the Technical Education, if job is related to Human Resource, then you need to have a degree on the same. But if we look usually, a candidate have to pass a Graduation Degree to get Railway Job and the candidate should be between 18-45 of age to apply for the Railway Jobs, the rest is depends on the nature of posts or jobs.

Railways Jobs Selection Procedures:

The Procedures to apply for the Railways Jobs is sometimes easy and sometimes difficult. But initially you have to look for the vacancies and follow the recruitment notification. You have to Apply Online for the posts and have to send you filled application form with the required documents and Demand Draft to the respective offices of Indian Railways.

There are 4 Steps usually undertaken by the Indian Railways to recruit employees in the India Railways.

Written Test: Written Test is conducted in the different examination centers where the knowledge of candidates about the English Language, General Knowledge, Mathematics is examine by the examination committee of Indian Railways.

Medical Exam: Medical Exam or Medical Test is conducted to check the health and physically capabilities of candidates either he/she fit or not fit.

Personal Interview: The purpose behind conducting Personal Interview to meet the candidate face to face and having a communication with him/her which can define the knowledge of that candidates and the ability of presentation.

Merit List: At Last, after considering the all these 3 steps marks score, the Merit List is prepared which shows the Name of the selected, suitable and deserving candidate for the posts.

The Appointment Letter is given to the candidate to join this biggest network of India Railways and the initial Six months is the month of Training and after successfully completion of training, a candidate get permanent job.

The average salary in the Railways Jobs is Analyze that it is Rs.240000 per Annum which is a great thing about Railways Jobs and there are wonderful chances of increment in future.

Railway Jobs Notification 2016:

Here we have discussed about the Railway Jobs 2016 and the things related to it. We hope you get relevant and useful information about the jobs in the largest network in the world, Indian Railways.

Source by result24…

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చే దిన్‌ కాదు అంగిట్లో ముల్లు !

14 Wednesday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

achhe din, Demonetisation, Indian currency, Narendra Modi, Rupee

Image result for people have got quinsy,demonetisation

ఎం కోటేశ్వరరావు

    నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు చెప్పినట్లు అచ్చే దిన్‌ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయో తెలియటం లేదుగానీ పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితి అంగిట్లో ముల్లులా తయారైంది. దాన్ని మింగలేము, ఒక పట్టాన బయటకు తీయలేము. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటకు వచ్చాయట. (ఈ సామెత రంకు  చేసే ఆడ మగా ఇద్దరికీ వర్తిస్తుంది). విదేశాల్లో వున్న నల్లధనాన్ని బయటకు తెస్తే ప్రతి వారి బ్యాంకు ఖాతాలో తలా పదిహేను లక్షల రూపాయలు వేయవచ్చని నరేంద్రమోడీ ఎన్నికలలో వూరూ వాడా చెప్పారు. అది నల్లధనాన్ని తెచ్చి ఖాతాల్లో వేస్తామని చెప్పినట్లు కాదు, ప్రతిపక్షాలు, మీడియా దానిని నిజంగానే మోడీ చేసిన వాగ్దానంగా చిత్రించి తమ నేతను బదనాం చేస్తున్నాయని మోడీ భక్తులు లేదా అనుయాయులు చెబుతున్నారు. మోడీకి నీడగా భావించే బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా దాని గురించి అడిగితే అలాంటి వాగ్దానం చేసినట్లు గానీ చేయలేదని గానీ ఎటూ చెప్పకుండా అరే భాయ్‌ ఎన్నికలలో అనేకం చెబుతుంటాం ఇదీ వాటిలో ఒకటి అని చిరుగడ్డాన్ని సవరించుకుంటూ చెప్పారు.

Image result for venkaiah naidu,demonetisation

     ఇక అచ్చే దిన్‌కు సంబంధించి వాగ్దానం చేసిన మాట నిజమే గాని ఎన్ని రోజుల్లో అని చెప్పామా ? అంటూ ఎప్పుడో ఎదురుదాడికి దిగారు మన తెలుగువాడైన వెంకయ్య నాయుడు.http://indianexpress.com/article/india/india-others/venkaiah-naidu-defends-pm-narendra-modi-1-year-is-too-short-to-judge/ మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరువాత ఒక సభలో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎవరైనా ఒక బిడ్డను కనవచ్చు, ఆ బిడ్డ పెరిగి పెరిగి పెద్దయి పరుగెత్తటానికి సమయం పడుతుందా లేదా ! అలాగే జనం ఓపిక పట్టాలి. కొత్త వస్తువులను సృష్టించటానికి నరేంద్రమోడీ ఏమీ ఇంద్రుడు కాదు’ అన్నారు. దీన్నే అచ్చ తెలుగులో గోడమీద అప్పు రేపు అని రాయటం అని చెప్పుకోవాలి. ఎప్పుడు వచ్చి చూసినా అదే దర్శనమిస్తుంది. వెంకయ్య నాయుడిగారి ప్రాస ప్రకారం సిద్దాంతం లేదా రాద్దాంతం ప్రకారం బిడ్డ పుట్టి పరుగెత్తగానే మంచి రోజులు రావు. పరిపూర్ణ వ్యక్తిగా ఇంకా ఇంకా చాలా చాలా జరిగినపుడే మంచి రోజులు వస్తాయి.

   అసలింతకీ అచ్చే దిన్‌ అనే నినాదం కూడా నరేంద్రమోడీ స్వంతం కాదట. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి అరువు తెచ్చుకున్నదని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.http://blogs.timesofindia.indiatimes.com/chakallas/truth-behind-narendra-modis-acche-din-slogan/ 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఏర్పడిన మాంద్య పరిస్థితుల నుంచి బయటపడి త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ఆశాభావం వెలిబుచ్చారు. ఆ మరుసటి రోజు గుజరాత్‌ ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ మాట్లాడారు. అప్పటికే తన గుజరాత్‌ మోడల్‌ అభివృద్ది గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సభలో వుక్కు దిగ్గజం ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కూడా వున్నారు. నరేంద్రమోడీ తనదైన ప్రత్యేక శైలిలో వుపన్యాసం ప్రారంభిస్తూ మిట్టల్‌వైపు చూపుతూ ఇదిగో ఆయన లండన్‌లో తినే టొమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండినవే అంటూ తన ఘనతతో ప్రారంభించారు. తరువాత నిన్న మన ప్రధాన మంత్రి మంచి రోజుల గురించి చెప్పారు. నేను కూడా చెబుతున్నాను త్వరలో ఆ మంచి రోజులు నిరుపమాన రీతిలో తీసుకొస్తాం’ అని చెప్పగానే సభలో మోడీ మోడీ అంటూ పెద్ద స్పందన వచ్చిందట. దాంతో ఇది బాగుందని ఆ నినాదాన్ని కొనసాగించారట. అయితే అది ఇప్పుడు అంగిట్లో ముల్లులా తయారైందని ఇటీవలనే గడ్కరీ చెప్పారట. అంటే దానిని అమలు జరపలేము, అలాగని ఆ వాగ్దానానికి దూరంగా పోలేక అటూ ఇటూగాని స్థితిలో వున్నట్లు అంగీకరించటమే. బహుశా అందుకేనేమో తాజాగా 50 రోజుల్లో మంచి రోజులు అంటూ పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కొత్త నినాదమిచ్చారని కోవాలా ?

    దీన్నుంచి తప్పించుకోవటానికి షరతులు వర్తిస్తాయని కొన్ని స్కీములకు కంపెనీలు షరతు పెట్టినట్లుగానే ముందు కొన్ని రోజులు ఇబ్బందులు పడాలి, తరువాత అంతా మంచే అని చెప్పారు. అంటే యాభై రోజుల తరువాత వెంటనే మంచి రోజులు రానట్లే. డిసెంబరు 31 తరువాత ఎలాగూ నరేంద్రమోడీ తిరిగి మౌన ప్రతంలోకి లేదా ఏ విదేశాలకో వెళ్లిపోతారు కనుక ఆయన మాట్లాడరు. మనం తిరిగి వెంకయ్య సమాధానాలు వినటానికి సిద్ద పడాలి. ఎన్నో రోజులు లేవు గనుక ఏం చెబుతారో చూద్దాం !

Image result for people have got quinsy,demonetisation

     చలామణిలో వున్న కరెన్సీలో రద్దు చేసిన పెద్ద నోట్ల మొత్తం 14.44 లక్షల కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కొత్త 500, 2000 నోట్లతో పాటు మిగిలిన పాత కరెన్సీ కూడా ప్రచురించి పంపిణీ చేసింది కేవలం 4.61లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే అని రిజర్వుబ్యాంకు స్వయంగా ప్రకటించింది. ఇప్పటికి బ్యాంకులకు చేరిన పాతనోట్ల మొత్తం విలువ 12.4 లక్షల కోట్లు ఆ తరువాత నాలుగు రోజులు గడిచాయి కనుక. మరో యాభైవేల కోట్లయినా డిపాజిట్‌ అయి వుంటాయని అంచనా. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది కనుక రద్దయిన 14.44 లక్షల కోట్లకు గాను కేవలం తొమ్మిది లక్షల కోట్లు అచ్చువేస్తే చాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వచ్చాయి. వెయ్యి రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేస్తామని(ఇప్పటికి, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి రేపేం ప్రకటిస్తారో తెలియదు ) చెప్పినందున వాట స్ధానంలో రెండు వేల నోట్లు ఎలాంటి చిల్లర సమస్యలను తెస్తున్నాయో గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అంటే అంతకంటే తక్కువ నోట్లు అచ్చువేయాలి. ఒక రెండువేల నోటుకు ఐదు వందలైతే నాలుగు, వంద అయితే 20,యాభై అయితే 40, ఇరవై అయితే వంద ఇలా తగ్గే కొద్దీ అచ్చేయాల్సిన నోట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వానికి అదొక తలనొప్పి. చిల్లర కావాలన్నా జనం కమిషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు అవసరమైన నోట్ల ముద్రణ కూడా వచ్చే ఏడాడి ఏప్రిల్‌ నాటికి, అదే మొత్తం నోట్లు అచ్చేయాలంటే జూలై వరకు పడుతుందని చెబుతున్నారు.

    మన దౌర్భాగ్యం ఎలాంటి దంటే మనకు కావాల్సిన నోట్లను కూడా మనం స్వయంగా అచ్సేసుకొనే స్ధితిలో లేమట. 1997-98లో లక్ష కోట్ల రూపాయల విలువగల వివిధ కరెన్సీ నోట్లను మన రిజర్వుబ్యాంకు బ్రిటన్‌, అమెరికా, జర్మనీలలో ముద్రణ చేయించిందని పార్లమెంటరీ కమిటీ నివేదికలో తేలింది. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటూ దూడగడ్డి కోసం అని చెప్పినట్లుగా ఎందుకీ పని చేశారంటే ఆ మూడు దేశాలు మనకు కావాల్సిన కరెన్సీని వేగంగా ముద్రించి ఇచ్చే సామర్ధ్యం కలిగి వున్నాయని అధికారులు చెప్పారట.http://timesofindia.indiatimes.com/India/House-panel-pulls-up-govt-for-outsourcing-printing-of-currency-notes/articleshow/5878095.cms ఇదంతా కాంగ్రెస్‌ హయాంలో జరిగింది. అవినీతి అక్రమాలకు, కుంభకోణాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ హయాంలో బయటి దేశాలలో నోట్ల ముద్రణ లావాదేవీలలో పాలుపంచుకున్న రెండు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో భవిష్యత్‌లో వాటితా లావాదేవీలు జరపకూడదని మన ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తివేయటమే విశేషం. ఎందుకు ఎత్తివేశారయ్యా అంటే అవి 150 సంవత్సరాల నుంచి నోట్లచ్చువేసే వ్యాపారంలో వున్నాయి. ఒక దేశ సమాచారాన్ని మరొక దేశానికి అవి చేరవేసి అవి వ్యాపారాన్ని పొగొట్టుకుంటాయా ? మా దర్యాప్తుల అలాంటిదేమీ లేదని తేలింది. అందుకే ఎత్తివేశామని అధికారులు చెప్పారట. ఇలా పొరుగుసేవల కాంట్రాక్టు కోసం సదరు కంపెనీ ముడుపులు కూడా చెల్లించిందని వార్తలు.http://greatgameindia.com/secret-world-indian-currency-printers-de-la-rue/ ఆ నిషేధం ఎత్తివేసిన తరువాత ఆ కంపెనీ షేర్ల ధరలు బాగా పెరిగాయట కూడా. ఇవన్నీ నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా వుండవు. వీటిపై నిజా నిజాలను వెలికి తీసి జనానికి వెల్లడి చేయాలి. మనకు నోట్లు సరఫరా చేసే లేదా అచ్చువేసే కంపెనీలే పాకిస్థాన్‌కు కూడా చేస్తాయట. అంటే మన నోట్లనే కొన్నింటిని దానికి కూడా సరఫరా చేస్తే ? మనం కూడా అక్కడి నుంచే కొన్ని పాక్‌ నోట్లను తెచ్చుకోవాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d