• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

కొన్ని ఆలోచనలు-ఒక అవలోకన !

28 Friday Jul 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, Opinion, RELIGION, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

BR Ambedkar, caste discrimination, caste system, cristianity, Hinduism, Hinduthwa, Indian conistitution, manuvadam, RELIGION, Rule of reservations, scheduled castes

ఎం కోటేశ్వరరావు

2017 జూలై 28వ తేదీ ప్రజాశక్తిలో అరుణ గోగులమండ గారు ఆలోచనలు కలిగించటమే నా లక్ష్యం అని ముందే ప్రకటించుకొని కొన్ని ఆలోచనల పేరుతో కొన్ని అంశాలను పాఠకుల ముందుంచారు.http://www.prajasakti.com/Article/Prajagalam/1949493 అసలు బుర్రలకు పని పెట్టటమే మరచిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చేయటం అభినందనీయం. వాటిపై అవలోకన గురించి కూడా ఆలోచించాలని మనవి.

ప్రపంచంలో అనేక ఆలోచనా విధానాలున్నాయి. నూరు పువ్వులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న లోకోక్తి తెలిసిందే. దళితుల పట్ల సామాజిక వివక్షను అంతం చేసేందుకు, వారిని దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అంబేద్కర్‌ ఆలోచనా విధానమొక్కటే చాలదు, అందువలన సకల పీడితుల విముక్తికి చెబుతున్న ఇతర ఆలోచనా విధానాలను కూడా ప్రజల్లోకి వీలైనంతగా చేరవెయ్యాలేమో ?

మన విధి(డెస్టినీ)ని మనమే నిర్ణయించుకోవాలి అని చెప్పారు. ఇది సాధారణ అర్ధంలో అయితే అభ్యంతరం, ఇబ్బంది లేదు. దళితుల విధిని దళితులే నిర్ణయించుకోవాలి అనే ఒక పరిధి అర్ధంలో అయితే ఆలోచనలకు అడ్డుకట్ట వేయటమే. సంపదలకు మూలమైన వారిలో దళితులు కూడా ఒక భాగమే తప్ప దళితులే సర్వస్వం కాదు. సామాజికంగా వివక్ష లేకపోవటం లేదా అంత తీవ్రంగా లేకపోవచ్చు గాని దళితేతర కులాల్లోని పేదలందరూ సంపదలకు మూలమైన వారిలో భాగమే. సంఖ్యాపరంగా చూస్తే దోపిడీకి గురవుతున్నవారిలో వారే అధికులు. మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న కులాల్లో కూడా దళితులతో కలసి గని,వని,ఖార్ఖానాలో పని చేసే వారు వున్నారు. వారికి వూరడింపు సామాజిక వివక్ష లేకపోవటం, వూరి మధ్యలో కూడా వుండనివ్వటం తప్ప మిగతా వన్నీ సేమ్‌ టు సేమ్‌. అరుణగారు చెప్పినట్లు ఆధిపత్య కులాల ఫ్యాక్టరీలు, గనులు, పొలాల్లో పని చేసే దళితులే కాదు, ఆధిపత్య కులాల్లోని పేదలు కూడా తమకూ హక్కులున్నాయన్న సంగతే తెలియక బలౌతూనే వున్నారా లేదా ? దళిత కులానికి చెందిన వారు కూడా పెట్టుబడిదారులుగా వున్నారు. వారి సంస్ధలలో దళితుల పరిస్ధితి ఏమైనా మెరుగ్గా వుందా? సామాజిక వివక్ష తప్ప దోపిడీ సేమ్‌ టు సేమ్‌ కాదా ?

ఆధిపత్య వాదులందరికీ కుల గోడలను కూల్చటం సుతరామూ ఇష్టం లేదన్నారు. కులాల హెచ్చు తగ్గుల వల్ల వచ్చే ఆడంబరాలను, ఐశ్వర్యాలను ఎప్పటికీ వారే అనుభవించాలనే దుర్బుద్ధి అందుకు కారణం అని అరుణగారు చెప్పారు. కులాన్ని బట్టి ఐశ్వర్యాలు వచ్చి వుంటే స్వాతంత్య్రానికి ముందు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతంలో వేలు, లక్షల యకరాలపై ఆధిపత్యం కలిగిన భూస్వాములు, జాగీర్దార్లు, దేశ ముఖులు, జమిందార్లు కేవలం వేళ్లమీద లెక్కించదగిన వారు మాత్రమే ఎందుకున్నారు.ఆ కులాలో పుట్టిన వారందరికీ అదే మాదిరి సంపదలు ఎందుకు దక్కలేదు. దొరలు, జమిందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారితో కలసి అదే ఆధిపత్య కులాలకు చెందిన వారు ఎందుకు పోరాడినట్లు ? అలా పోరాడిన వారిలో ఆధిపత్య కులాలని పిలిచే వాటిలో వారి ప్రమేయం లేకుండా పుట్టిన ఎందరో భూస్వామిక కుటుంబాలకు చెందిన వారు కూడా వున్నారు. అలాగే క్రైస్తవం, ఇస్లాం ఇతర మతాలు మెజారిటీగా వున్న దేశాలలో ఆ మతాలలోని కొద్ది మందే దేశాలను సైతం శాసించగలిగిన కార్పొరేట్‌ సంస్ధల అధిపతులుగా వుండగా మెజారిటీ పౌరులు వాటిలో పని చేసే కార్మికులు, లేదా వుద్యోగులుగా ఎందుకున్నారు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఆధిపత్యం వహించింది క్రైస్తవులు, వారిని కూల్చి వేసిందీ క్రైస్తవులే కదా ? అంతెందుకు క్రైస్తవుడైన హిట్లర్‌ ఫాసిస్టుగా మారితే వాడిని సమర్ధించింది ఎవరు, వాడిని, వాడి ముష్కర మూకలను హతమార్చింది ఎవరు ? క్రైస్తవులే కదా ? అందువలన అరుణ గారు, ఆమె మాదిరి అభిప్రాయం కలిగిన వారందరూ కుల, మత పరిధి దాటి ఆలోచించటం అవసరం.

సామాజిక వివక్షకు గురవుతున్న కులాల జాబితాల్లో వున్నవారికి రిజర్వేషన్లు ఇస్తూ వారు మతం మారితే రద్దు చేయటం అన్యాయం అనటంలో ఎలాంటి పేచీ లేదు. ఎందుకంటే మతం మారినా వారి సామాజిక స్ధితిలో మార్పుండటం లేదు. కానీ అరుణగారు క్రైస్తవం పుచ్చుకున్న ఆధిపత్య కులాల వారు కూడా తమ కులం కోల్పోయి దళితులుగా మారిపోవాలి కదా అంటున్నారు. మతం మారినా దళితుల రిజర్వేషన్లు కొనసాగాలి, కుల విభజన గోడలు కూలిపోవాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలాంటి వాదనలు చేయటం గందరగోళ ఆలోచనకు నిదర్శనం. ఇక్కడ క్రైస్తవం దళితుల మతం కాదని గ్రహించటం అవసరం. హిందూమతంలో శైవులు, వైష్ణవులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వివిధ తాత్విక విభజనలు వున్నట్లే ఇస్లాం, క్రైస్తవంలో కూడా ప్రబోధకులను బట్టి కొన్ని రకాల విభజనలు వున్నాయి తప్ప కులాల ప్రస్తావన, విభజన లేదు.

దళితుల సాధికారత కోసం, రిజర్వేషన్ల కల్పనలో అంబేద్కర్‌ చేసిన కృషిని ఎవరైనా తక్కువ చేసే చూస్తే అది పాక్షిక దృష్టి తప్ప వేరు కాదు. అనేక మంది రిజర్వేషన్లు అనే భావన అంబేద్కర్‌తోనే ప్రారంభమైందనే అభిప్రాయంతో వున్నారు. ఇది కూడా పాక్షిక దృష్టే. అంబేద్కర్‌ కంటే ముందే కొల్లాపూర్‌ సంస్ధాన అధిపతి సాహు మహరాజ్‌ 1882,1891లోనే బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. తరువాత కాలంలో అంబేద్కర్‌ మరింత నిర్ధిష్టంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుతో సహా అనేక ప్రతిపాదనలపై కృషి చేశారు. దళితులు మతం మారితే వెనుకబడిన తరగతిగా పరిగణించబడటానికి కూడా ఆ అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగమే వీలు కల్పించిందని గుర్తించటం అవసరం. ఇదొక సంక్లిష్ట సమస్య. అందువలన ఆరుణగారు చెబుతున్నట్లు అది కుట్రే అయితే అందుకు వీలు కల్పించిన అంశాలేమిటి ? రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమే అయినప్పటికీ అవి శాశ్వతం కాదు, అంబేద్కర్‌ కూడా రిజర్వేషన్లును పది సంవత్సరాలు అమలు చేసిన సమీక్షించి మరో పదిసంవత్సరాలు పొడిగించమని చెప్పారు తప్ప శాశ్వతంగా వుంచాలని అభిప్రాయపడలేదు. అందువలనే ఎంతకాలమనే ప్రశ్న పదే పదే తలెత్తుతున్నది. సామాజిక వివక్ష అంతమయ్యే వరకు వాటిని కొనసాగించాలనటం న్యాయబద్దం. ఎంత త్వరగా దానిని అంతం చేస్తే అంత త్వరగా రిజర్వేషన్లను ముగించ వచ్చు.

ఇక మతం మారిన హిందూ దళితులకు రిజర్వేషన్లు వర్తించపోవటం సమస్య. దీన్ని కుట్రగా అభివర్ణించవచ్చునా ? రాజ్యాంగం అమలులోకి రాకముందే దీనిపై చర్చ జరిగింది. సిక్కు మతంలో కూడా దళితులు వున్నందున వారికి కూడా హిందూ దళితులకు వర్తించే సౌకర్యాలను వర్తింప చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. సిక్కు మతంలోకి మారేందుకు ఎవరూ ఎవనీ బలవంత పెట్టలేదని, సిక్కు మతం అంటరాని తనాన్ని గుర్తించలేదని, అందువలన సిక్కు మతాన్ని అవలంభించాలంటే రిజర్వేషన్లు వదులు కోవాలి, రిజర్వేషన్లు కావాలంటే సిక్కు మతాన్ని వదులుకోవాల్సి వుంటుందన్న వాదనలు వచ్చాయి. క్రైస్తవం, ఇస్లాం కూడా అలాంటివే. అవేవీ అంటరానితనాన్ని గుర్తించలేదు. అందువలన రిజర్వేషన్‌ అవసరం లేదనుకున్న వారు హిందూ మతం నుంచి మారవచ్చు లేదా కావాలనుకున్నవారు అదే మతంలో వుండాలన్నది లాజిక్కు. అయితే మతం మారినా వివక్ష కొనసాగుతున్నందున వారికి కూడా హిందూ దళిత రిజర్వేషన్లే అమలు జరపాలన్న వాదన ముందుకు వచ్చిందని గమనించాలి. అందువలన ఆలోచనకు చర్చ పెట్టే ముందు పూర్వపరాలను కూడా సమగ్రంగా వివరించకపోయినా ప్రస్తావించటం అవసరం? కాదంటారా ?

కుల వివక్ష, అంటరానితనం వంటి మాయని మచ్చలను సహించిందీ, అమలు జరిపిందీ హిందూమతం లేదా దాని పరిరక్షకులమని చెప్పుకొనే వారు. దానికి ప్రాతిపదిక మనువాదం. ఇప్పటికీ దానిలో ఎలాంటి సంస్కరణలు లేవు. అందువలన హిందూమతంలో వుండాలా లేదా అన్నది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన అంశం. మతం అన్నది మత్తు మందు. అది ఏమతానికైనా వర్తించే సాధారణ సూత్రం. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని చూసేవారు, మత విభజనతో సమాజాన్ని వెనక్కు తిప్పాలని చూసే వారు అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా సమాజానికి వ్యతిరేకులే. ప్రతి మతం తన మత్తు మందును తీసుకొనే జనాలు తగ్గకుండా చూసుకోవాలని చూస్తుంది. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని హిందూమత శక్తులు దళితుల మతమార్పిడికి ఎలా అడ్డంపడుతున్నాయో, మతం మారినా దళితులకు రిజర్వేషన్లు అమలు జరపాలని క్రైస్తవమత శక్తులు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటానికి చూస్తున్నాయి.

చివరిగా ఒక్క మాట. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ కృషి అమోఘం. ఇదే సమయంలో ఆయన ఆధ్వర్యాన ఏర్పాటయిన రాజ్యాంగం దళితుల సమస్యలకు జిందా తిలిస్మాత్‌ కాదని ఇప్పటికే రుజువైంది. స్వాతంత్య్రవుద్యమ ఆకాంక్షలను ఇంతవరకు అమలు జరపలేదు, అనేకానికి తూట్లు పొడిచారు. అందువలన ఈ రాజ్యాంగం జనానికి, ప్రత్యేకించి దళితులకు కల్పించిన రక్షణలను కాపాడుకొంటూనే వారితో పాటు ఇతర కష్టజీవుల విముక్తికి అవసరమైన ఆలోచనలు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరో జండా పండుగ-మన కర్తవ్యం !

16 Sunday Jul 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

beef, cow politics, independence day, INDIA, india 71st independence day, India Independence Day, Mahatama Gandhi, pig politics, RSS

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ?

ఎం కోటేశ్వరరావు

ఆగస్టు 15 సందర్భంగా మరోసారి టీవీలు, వీధులన్నీ దేశ భక్తి గీతాలతో మార్మోగనున్నాయి. జాతర్లలో పూనకం వచ్చినట్లుగా కొందరు దేశ భక్తితో వూగిపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాంప్రదాయ గూండాలు, రౌడీలు, కొత్తగా వునికిలోకి వచ్చిన కాషాయ గో గూండాలు, కాషాయ, ఆకుపచ్చ తాలిబాన్లు, మనువాదులు, మెజారిటీ, మైనారిటీ మతవాదులు, భావ ప్రకటనా స్వేచ్చా, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, స్వాతంత్య్ర వుద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి అన్ని రకాల వారసులు, రాజకీయ ప్రవేశానికి సోపానంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రయత్నించే సకల అవాంఛనీయ శక్తులు ఆరోజున వీధుల్లో దర్శనమివ్వబోతున్నాయి. నిజమైన స్వాతంత్య్రపోరాటానికి, స్వాతంత్య్ర భావనలకు వారసులుగా వున్నవారు కూడా అక్కడక్కడా బిక్కుబిక్కు మంటున్నట్లుగా జెండా పండగలను నిర్వహిస్తారు. అవాంఛనీయ శక్తులను వ్యతిరేకించే లేదా ఇష్టపడని వారు వారితో మనకెందుకు గొడవ అనుకుంటూ వారి ఆధీనంలో జండా కార్యక్రమం జరిగే ప్రాంతం నుంచి తప్పుకొని వెళ్లిపోయే దృశ్యాలు మరోసారి చూడబోతున్నాం.

వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించుకొని తమ వలసగా చేసుకున్నారని, వారికి వ్యతిరేకంగా పోరాడి అశేష త్యాగాలు చేసిన ఫలితంగానే ఇప్పుడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మన పాలన మనమే చేసుకుంటున్నాం అనే విషయం ఎంత మందికి తెలుసు ? అసలు ఏదేశానికైనా స్వాతంత్య్రం ఎందుకు ? ఎవరినైనా ఈప్రశ్న అడిగితే, స్వాతంత్య్రమా చట్టుబండలా 70 ఏండ్ల క్రితం మనం తెచ్చుకున్న స్వాతంత్య్రం కూడు పెట్టిందా, నీడ నిచ్చిందా అని నిట్టూర్పు లేదా ఈసడించుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి భావం సమాజంలో వుండటం అంటే నిరంకుశత్వం పెరగటానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లుగా భావించాల్సి వుంటుంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం, సోషలిస్టు చైతన్యం కలిగించటంలో చేసిన తప్పిదాలు లేదా లోపాల కారణంగా అంతకు ముందు తమ పూర్వీకులు కూల్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధను అక్కడి జనాలు కోరి పున: ప్రతిష్టించుకున్నారు. మొత్తంగా చూసినపుడు చరిత్ర ముందుకు పోయినప్పటికీ ఇలాంటి తిరోగమన వుదంతాలు కూడా జరుగుతాయని మన కళ్ల ముందు కనిపించిన పరిణామమిది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే దాని వలన లబ్ది పొందిన జనం కూడా ప్రేక్షక పాత్ర వహించారు. నియంతృత్వశక్తులు ప్రజాస్వామిక, ప్రగతిశీల అవతారాలెత్తితే గుడ్డిగా నెత్తినెక్కించుకున్నారు. మబ్బులను చూసి చేతుల్లో వున్న ముంత నీళ్లు పారబోసుకున్నారు.

సోషలిజమే కాదు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన, జీవన స్వేచ్చలకు సైతం అలాంటి ముప్పే ముంచుకు వస్తోంది. అనేక దేశాలలో పచ్చి మితవాద శక్తులు ప్రజాకర్షక నినాదాలతో ఎన్నికలలో విజయాలు సాధిస్తున్నాయి. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని తెలియని పసివారి సంగతి అటుంచుదాం. తెలిసిన వారు కూడా ఒకసారి పట్టుకొని చూద్దాం అన్నట్లుగా ఒక విధమైన వున్మాద స్ధితిలో వ్యవహరిస్తున్నారు. అదానీ, అంబానీల వంటి లాభాలే పరమావధిగా వున్న వారికి ఎవరైనా ఒకటే అనుకోండి. మంచి వాళ్లనుకున్నవారు ఏం ఒరగబెట్టారని, వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేముంది అన్నట్లుగా మితవాద, తిరోగామి శక్తుల గురించి తెలిసిన మేథావులు, సామాన్యులు కూడా వుదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

చరిత్ర పునరావృతం అవుతుంది. అంటే దాని అర్ధం హిట్లర్‌ లాంటి వాడే తిరిగి జర్మనీలోనే పుట్టి ఫాసిజాన్ని అమలు జరపనవసరం లేదు. ప్రతి చోటా కొత్త రూపాల్లో కొత్త శక్తులు పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని ఆక్రమించుకోవటంలో జర్మన్లు వెనుకబడ్డారు కనుక తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు హిట్లర్‌ ప్రయత్నించాడు. ప్రపంచంలో వలసరాజ్యాలు అంతరిస్తున్న దశలో చరిత్ర గతికి విరుద్దమది. అయినా అలా మొరటు పద్దతులలో నడపాలని చూసి ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రాణాలు పోవటానికి, జీవితాలు నాశనం కావటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు అమెరికా తన కార్పొరేట్‌ శక్తులకు మార్కెట్‌ కోసం కొత్త పద్దతులు, కొత్త రూపాలలో యుద్ధాలు, అంతర్యుద్ధాలను, వుగ్రవాదం, వుగ్రవాదులను సృష్టించి మార్కెట్లను హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో తమతో కలసి వచ్చే దేశాలను కూడగట్టి ప్రతి అమెరికా అధ్యక్షుడు నిత్యం ఏదో ఒక మూలన యుద్ధాలు చేస్తూ జనం ప్రాణాలను బలిగొంటూ, జీవితాలను నాశనం చేస్తూనే వున్నాడు. దీన్ని చరిత్ర పునరావృతం కావటం అనిగాక మరేమనాలి ?

మన ఏడుపదుల స్వాతంత్య్రాన్ని కూడా ఈ నేపధ్యంలోనే అవలోకించాలి. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి తప్పుకున్న సమయంలో మన నేతలు ఏం చెప్పారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించటం అవసరం. మన స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో వుట్టిన అనేక సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటి. వారేమి చెప్పుకున్నప్పటికీ స్వాతంత్య్ర వుద్యమానికి దాని నేతలు, అనుచరులు వ్యతిరేకంగా, దూరంగా వున్నారు. సావర్కర్‌ వంటి నాయకుడు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవలు చేసుకుంటానని లేఖలు రాశాడు.

సరిగా నిర్వహించారా లేదా అన్న చర్చ ఎలా వున్నప్పటికీ గాంధీ, నెహ్రూ వారి అనుచరులు స్వాతంత్య్ర వుద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించారు. వారి విధానాలతో ఏకీభవించని వారు కమ్యూనిస్టులుగా మారారు తప్ప కాషాయ శక్తుల మాదిరి బ్రిటీష్‌ వారి చంకనెక్కలేదు. మన పాలనను మనం చేపట్టిన తరువాత వారి నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలో వుంది, అనేక అక్రమాలకు పాల్పడింది, స్వాతంత్య్ర లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఒక బిడ్డ పుట్టిన తరువాత బతికి వయస్సు వచ్చిందా లేదా అంటే రాకుండా ఎలా వుంటుంది. అలాగే కాంగ్రెస్‌ వారు మా పాలనలో అసలేమీ అభివృద్ధి జరగలేదా అని అడ్డు సవాళ్లు విసురుతారు. పుట్టిన తరువాత బతికి వుంటే వయస్సు రావటానికి ఎవరూ తోడ్పడనవసరం లేదు. ఆ బతికిన బిడ్డ ఆఫ్రికాలో అకలితో మాడే జీవచ్చంలా వుందా ఆరోగ్యంగా పెరిగిందా లేదా అన్నది చూడాలి. అలా చూసినపుడు ఆఫ్రికా అంతగాక పోయినా మన దేశంలో మెజారిటీ జనజీవితాలు జీవచ్చవాలకు దగ్గరగానే వున్నాయి. పోషకాహారలేమితో గిడసబారిపోవటం, ఇరవైల్లోనే అరవై లక్షణాలు రావటం, శరీరాన్ని కప్పుకొనేందుకు తగినన్ని బట్టలు లేకపోవటం, వుండటానికి ఇళ్లు లేకపోవటం వంటి అనేక సమస్యలు ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత కూడా వుండబట్టే అనేక మంది దానిని అభివృద్ధిగా చూడటం లేదు, అందుకే స్వాతంత్య్రం మనకేమి తెచ్చింది, మాకేమిచ్చింది అని అడుగుతున్నారు.

ఇన్ని అనర్ధాలకు కారణం కాంగ్రెస్‌, దానికి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ వారి అనుచరులే కారణమని ఆరోపించే బిజెపి దేశ చరిత్రలో వారి పాత్రను పూర్తిగా చెరిపివేసే లేదా వక్రీకరించేందుకు పూనుకుంది. తమకెలాగూ మంచి చరిత్ర లేదు కనుక వున్నవారిపై బురదజల్లి తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకొనే యత్నమిదని విమర్శకులు భావిస్తున్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి తెలిసిందే. ఒకవైపు మహాత్ముడిని పొగుడుతూనే మరోవైపు ఆయన ఒక చతురుడైన కోమటి అని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చేసి వ్యాఖ్యను నరేంద్రమోడీతో సహా ఏ బిజెపి సీనియర్‌ నేతా తప్పు పట్టలేదు, గడ్డి పెట్టలేదు, ముసి ముసి నవ్వులతో చోద్యం చూశారు. ఇక నెహ్రూ గురించి చేస్తున్న ప్రచారం గురించి చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు, అసమానతలు,అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం, సామాజిక న్యాయలేమి వంటి సకల అవలక్షణాలకు మహాత్ముడు అధికారంలో ఎన్నడూ భాగస్వామి కాలేదు కనుక, నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ విధానాలు, వ్యవహరించిన తీరే కారణం అనటంలో ఎలాంటి పేచీ లేదు. అవన్నీ విధానాల కారణంగా వచ్చాయి తప్ప మరొకటి కాదు. వాటిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న, ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్న వామపక్షాలు, శక్తులు నెహ్రూ లేదా ఆయన వారసుల విధానాలను విమర్శిస్తే అర్ధం వుంటుంది.అధికారం కోసం ఆరాటం తప్ప ఏనాడూ ప్రత్యామ్నాయ విధానాల వూసులేని, ఏ కాంగ్రెస్‌నైతే విమర్శిస్తున్నారో దాని విధానాలనే మక్కీకి మక్కీ అనుసరిస్తున్న బిజెపి,ఎన్‌డిఏ పక్షాలకు అర్హత ఏమిటి అన్నది ప్రశ్న.

స్వాతంత్య్రం సందర్భంగా 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ చేసిన ప్రసంగంలో ‘ఆమె బిడ్డలందరూ నివశించాల్సిన స్వేచ్చా భారతాన్ని మనం నిర్మించాల్సి వుంది’ అని చెప్పారు. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత రాజధాని ఢిల్లీ రైలులో గడ్డం, టోపీ పెట్టుకోవటాన్ని చూసి నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావు, పాకిస్ధాన్‌ వెళ్లిపో అంటూ ఒక కుటుంబ సభ్యులపై వున్మాదంతో కొందరు దాడి చేసి రైలు నుంచి తోసి వేస్తుంటే దానిని అడ్డుకొనేందుకు ఒక్కరు కూడా ముందుకురాని ‘సహనపరుల’ సేచ్చా భారతంలో నేడు మనం వున్నాం. ఆ దాడిలో జునైద్‌ అనే 15 ఏండ్ల యువకుడు కత్తిపోట్లతో సోదరుడి ఒడిలో రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించాడు. మతోన్మాద కోణాన్ని మూసి పెట్టేందుకు దాన్ని సీట్ల గొడవగా చిత్రించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తే దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా మన మీడియా దానిని జనానికి అందించిందంటే ఏమనుకోవాలి?

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ? మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్నామనుకుంటున్న ప్రతివారూ కింది మెట్టులోని వారిని తక్కువగా చూస్తున్న స్ధితిలో పేరు,వేష భాషలను బట్టి అణచివేతకు పూనుకోరన్న గ్యారంటీ ఏమిటి ?

ఆధునికత విలసిల్లే ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటి. అలాంటి చోట గరగపర్రు అనే గ్రామంలో మిగతా నేతల విగ్రహాల సరసన అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతించం వేరే చోట పెట్టుకోండి అంటూ కొంత మంది అడ్డుకోవటంలో అర్ధం ఏమిటి? అంబేద్కర్‌ విగ్రహాన్ని వేరే చోట పెట్టుకోమనటానికి ముస్లింలను చూసి పాకిస్ధాన్‌ పొమ్మనటానికి తేడా ఏముంది. ఈ రోజు ముస్లింలు అయితే రేపు దళితులు,గిరిజనులు, వెనుక బడిన వారూ, మహిళలకూ అదే గతి పడుతుంది. వూరి మధ్యలో ఎవరైనా దళితులు, గిరిజనులు వుంటే గొడ్డు మాంసం తినేవారు మీరు, ఖాళీ చేసి మీ వాడలకు పోండి అనరన్న గ్యారంటీ ఏముంది ?(గొడ్డు మాంసం తినని దళితులు, గిరిజనులను కూడా సహించరని మనవి) విగ్రహాన్ని అడ్డుకోవటాన్ని ప్రశ్నించినందుకు దళితులను సాంఘిక బహిష్కరణ చేయటమే గాక అందుకు పాల్పడిన వారే తమకు న్యాయం చేయండి అంటూ గరగపర్రులో మాదిరి పోటీ దీక్షలకు దిగే పరిస్దితికి, దానిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పరిస్ధితికి కారకులెవరు ?నాడు అంబేద్కర్‌ అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడినపుడు దానిని పాటించే హిందువులలోని అనేకశక్తులు ఆ అనాచారానికి వ్యతిరేకంగా మద్దతుగా నిలిచాయి కనుకనే మనువాదులు మౌనంగా వున్నారు. అదే అంబేద్కర్‌ ఈ రోజు గరగపర్రులో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడి వుంటే పోటీ దీక్షలకు దిగిన వారు సహించి వుండేవారా ? ఇలాంటి వుదంతాలు, ప్రశ్నలను 70 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత చర్చించుకోవాల్సి రావటం గురించి ఆవేదన చెందటం కాదు, రానున్న ముప్పు గురించి ఆందోళనపడాలి. ఎదుర్కోవటానికి కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నం కాలేదా ?

దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే రైలు నుంచి తోసివేశారో ఆ పట్టణ కేంద్రంలో అక్కడి ప్రభుత్వం మహ్మాతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు నివాళి అర్పించింది. మన రాజ్యాంగ నిర్మాతగా కీర్తించబడే అంబేద్కర్‌ విగ్రహాన్ని వూరి మధ్యలో ప్రతిష్టించి తెలుగుదేశం ప్రభుత్వం, దాడి అనంతరం రైలు నుంచి తోసివేతకు గురై మరణించిన జునైద్‌ విగ్రహం లేదా చిహ్నాలను రైల్వే ఫ్లాట్‌ఫారంపై ప్రతిష్టించి నరేంద్రమోడీ సర్కార్‌ తమకు కులం, మత వివక్ష లేదని ప్రదర్శించుకుంటాయా ?

ఆవు, పంది కొవ్వులను తుపాకి తూటాల తొడుగులకు(కాట్‌రిడ్జ్‌) పూసిన బ్రిటీష్‌ వారి చర్య హిందూ-ముస్లింలను ఏకం చేసి 1857లో ప్రధమ స్వాతంత్య్ర యుద్దానికి తిరుగుబాటు కారణాలలో ఒకటని చరిత్రలో చదువుకున్నాం. తూటాలను తుపాకిలో నింపాలంటే నోటితో తొడుగులను కొరికి తొలగించాల్సి వచ్చేది. అణుబాంబును కనిపెట్టాం, అంతరిక్షంలో జయప్రదంగా వుపగ్రహాలను ప్రయోగిస్తున్నాం, క్షిపణులను తయారు చేశాం, అయితేనేం

నూట అరవై సంవత్సరాల తరువాత కూడా అదే ఆవు, పంది సమస్యలను డెబ్బయి సంవత్సరాల స్వతంత్రభారతంలో పరిష్కరించుకోలేక వుద్రిక్తతలు, మారణకాండకు కారణం అవుతున్నాయి. అన్ని మతాలవారూ గొడ్డు మాసం తింటున్నది వాస్తవం, అయినా కొన్ని శక్తులు ఒక మతం వారిని వెంటాడి తరిమి దాడులు, హత్యలు చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నామంటే ముందుకు పోతున్నట్లా తిరోగమిస్తున్నట్లా ? దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముస్లింలు విదేశీయులు, విదేశీ మతం అంటూ ప్రచారం, దాడులు చేస్తున్న కాషాయ దళాల గురించి తెలియందెవరికి ? అదే ప్రచారం, దాడులు కాశ్మీరులో చేయగలరా ? గొడ్డుమాంసం, అలాగే క్రైస్తవ మతవ్యాప్తి గురించి రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్న వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అదే చేయగలరా ? నాడు బ్రిటీషు వాడిది రాజకీయం అన్నాం మరి నేడు చేస్తున్నదానినేమనాలి ?

బ్లాక్‌ మార్కెటీర్లను లైటు స్ధంభాలకు కట్టి వురి తీయాలని ఒక సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రధాని నెహ్రూ చెప్పారు. ఆయన లేదా వారసుల హయాంలో ఒక్క బ్లాక్‌ మార్కెటీరుకు కూడా ఆ గతి పట్టలేదు. ఆ నెహ్రూను నిత్యం విమర్శించే బిజెపి నేతల పాలనలో జరిగిందేమిటి ? 2015లో పప్పుల ధరలు ఆకాశానికి అంటినపుడు ఎవరూ నియంత్రించలేకపోయారు. ఆకస్మికంగా ధరలు రెట్టింపు కావటం గురించి ఆదాయపన్నుశాఖ చేపట్టిన దర్యాప్తులో విదేశీ-స్వదేశీ పప్పుధాన్యాల వ్యాపారులు, దిగుమతిదారుల కుమ్మక్కు ఇందుకు దారితీసినట్లు రెండువేల పేజీల నివేదిక వెల్లడించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పప్పులను ముంబై, చెన్నయ్‌ రేవుల్లో దొంగనిల్వలు చేసినట్లు తేలింది. అందుకు బాధ్యులపై ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణమిది. పోనీ కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో కూడా మనకు తెలియదు.ఎవరు ఎవరిని రక్షిస్తున్నట్లు ?

1991లో కాంగ్రెస్‌ పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాలు అనేక అక్రమాలకు తెరతీశాయి. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. శతకోటీశ్వరులు పెరిగారు, అదాయ అసమానతలు పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత వుంటాయి. ఇవన్నీ మన స్వాతంత్య్ర వుద్యమ ఆకాంక్షలకు విరుద్ధం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్ధను అమలులోకి తీసుకు రావటం మరొక స్వాతంత్య్రం అన్నట్లుగా పాలకపక్ష నేతలు చిత్రిస్తున్నారు. గతంలో కూడా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో, భూసంస్కరణల బిల్లుల సందర్భంగా కూడా నాటి పాలకులు జనంలో ఇలాంటి ఆశలనే కల్పించారు. ఆ కోవకు చెందిందే ఇది తప్ప మరొకటి కాదు. విదేశీ, స్వదేశీ కంపెనీలు రాష్ట్రానికొక పన్ను చెల్లింపు విధానం లేకుండా వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఏ విధానం అయినా జనానికి చేసే మేలు ఏమిటన్నదే గీటురాయి. జిఎస్‌టి వ్యాపారులకు వుద్ధేశించింది తప్ప జనంపై భారాలు తగ్గించేది కాదు.నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దే వుంటే పెట్రోలియం వుత్పత్తులను కూడా దాని పరిధిలో చేర్చి వుండాల్సింది. కనీసం గత మూడు సంవత్సరాలలో పెట్రోలియం వుత్పత్తులపై అదనంగా పెంచిన పన్ను మొత్తాన్ని తగ్గించినా ఎంతో మేలు జరిగేది. జిఎస్‌టి వలన సామాన్య మానవుడి కుటుంబ బడ్జెట్‌లో పెద్ద మార్పులేమీ లేవన్నది ప్రాధమిక పరిశీలన.వ్యాపారం చేసుకొనేందుకు అనుమతి పేరుతో మన గడ్డపై కాలు పెట్టి క్రమంగా రాజకీయ అధికారాన్నే తెల్లవారు స్వాధీనం చేసుకున్నారు. మన సంపదలను కొల్లగొట్టారు. సారం వారు పీల్చుకొని మనకు పిప్పి మిగిల్చారు. ఇప్పుడు ప్రపంచంలోని కార్పొరేట్‌ శక్తులన్నీ మనదేశంలో కాలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తలుపులను కొద్దిగా తెరిస్తే బిజెపి పాలకులు బార్లా తెరిచి ఎర్రతివాచీ పరచి స్వాగతాలు పలుకుతున్నారు. ఇది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన షరతులపై విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే అది మన అధికారానికి చిహ్నం, అదే వారి షరతులకు అంగీకరిస్తే స్వాతంత్య్రాన్ని వారి కాళ్ల ముందు పెట్టటం తప్ప వేరు కాదు.

దీర్ఘకాలం పాటు అటు సోవియట్‌ కూటమిలోనూ ఇటు అమెరికా కూటమిలో చేరకుండా మన దేశం అవలంభించిన అలీన విధానం నుంచి మన ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతూ క్రమంగా అమెరికా కౌగిట్లోకి చేరుతోంది. శకుని రాజకీయానికి కౌరవులు బలైనట్లుగా అమెరికాతో చేతులు కలిపిన ఏదేశం కూడా బాగుపడలేదు. మన పక్కనే వున్న పాకిస్ధాన్‌ ఎలా నియంతలపాలనలో మగ్గిందీ చూశాం, అప్పుడప్పుడు పౌరపాలకులు అధికారానికి వచ్చినా సైన్యం కనుసన్నలలోనే వారు పని చేయాలి. ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత పాకిస్ధాన్‌ ఎంత దుస్ధితిలో వుందో చూశాము. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో అమెరికాతో చేతులు కలిపిన దేశాలన్నింటా సైనిక నియంతలు, ప్రజాద్రోహులు తప్ప మంచివారెవరినీ అధికారంలోకి రానీయలేదు. పాలస్తీనాను ఆక్రమించి అరబ్బులను వారి ప్రాంతాల నుంచి తరమివేసిన ఇజ్రాయెల్‌ను ఇప్పటికీ ప్రపంచమంతా చీదరించుకొంటోంది, అధికారికంగా ఐక్యరాజ్యసమితిలో దానిని వ్యతిరేకిస్తోంది. అలాంటి దేశంతో తొలిసారిగా మన ప్రధాని నరేంద్రమోడీ చేతులు కలపటం అంటే అమెరికాతో మన స్నేహం ఎక్కడికి దారితీయించిందో అర్ధం అవుతోంది. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న విషయం తెలిసిందే.

డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గతాన్ని నెమరు వేసుకొంటే మన మహత్తర లక్ష్యాల నుంచి ఎలా వైదొలిగామో, దాని పర్యవసానాలేమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వాటిని చూసి గుండెలు బాదుకోవటం గాక వర్తమానంలో కర్తవ్యాలను గుర్తెరగటం, అందుకోసం పని చేయటమే స్వాతంత్య్ర వుద్యమంలో అశేష త్యాగాలు చేసిన వారికి సరైన నివాళి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌, చైనా వస్తు బహిష్కరణపై కాషాయ సేన వంచన !

13 Thursday Jul 2017

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China goods boycott, Indo-China standoff, Indo-China trade, RSS, RSS China goods, RSS Duplicity, RSS Hypocrisy, Tibet

ఎం కోటేశ్వరరావు

చైనా-భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ జోక్యం చేసుకున్న కారణంగా చైనా-భారత్‌ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా వుభయ దేశాలలో పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వార్తలు వెలువడటం అవాంఛనీయ పరిణామం. తన ఆధీనంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ప్రారంభించిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని భూటాన్‌ తరఫున మన దేశ మిలిటరీ అడ్డుకోవటంతో చైనా-మన మధ్య ఒక ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఆ ప్రాంతంలో వుభయ దేశాల సైనికులు ఎదురెదురుగా గుడారాలు వేసుకొని మకాం వేశారు. సంప్రదింపుల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవటం అంత అసాధ్యమేమీ కాదు. వుద్రిక్తతలు తగ్గిన తరువాత ఏదో ఒక రూపంలో చర్యలు ప్రారంభమౌతాయి. ఈ లోగా ఎటు వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు వున్నప్పటికీ అది సమర్ధనీయం కాదు.

ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు మనం కూడా సంమయనం పాటించాల్సిన అవసరం లేదా ? నరేంద్రమోడీ సర్కారుకు నిత్యం మార్గదర&శనం చేసే సంఘపరివార్‌ సంస&ధల ప్రతినిధులు చేసే వ్యాఖ్యలుచ్చగొట్టేవిగా వున్నాయి. గత వారంలో ఇండో-టిబెట్టు సహకార వేదిక(బిటిఎస్సెమ్‌) ఆగ్రా సమావేశంలో మాట్లాడిన ఆరెసెస్సు నాయకుడు ఇంద్రేష్‌ కుమార్‌ చైనా నుంచి టిబెట్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని, చైనా ఆధీనంలోవున్న మానస సరోవర ప్రాంతాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మశాల(హిమచల్‌ ప్రదేశ్‌)లో వున్న టిబెట్టు ప్రవాస ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో ఇంద్రేష్‌ ప్రసంగాన్ని పెట్టారు. దాని ప్రకారం ప్రస్తుతం భారత్‌కు పాకిను కంటే చైనా ఎక్కువ ప్రమాదకారిగా మారింది. అందువలన టిబెట్‌ నాయకుడు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పర్యటనను గౌరవించటం ద్వారా ఇంకేమాత్రం చైనా గురించి భయపడటం లేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు చైనా ఆక్రమణలోని టిబెట్‌ విముక్తికోసం పోరాడుతున్న టిబెటన్లకు సామాజికంగా, నైతికంగా, రాజకీయంగా మద్దతు ఇవ్వాలని కూడా చెప్పారు.ఆర్‌ఎస్‌ఎస్‌ విషయానికి వస్తే అది చేసే అనేక తప్పుడు ప్రచారాల్లో టిబెట్‌ అంశం ఒకటి. అసలు మన దేశం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించలేదని గతేడాది కూడా అదే నాయకుడు చెప్పాడు.http://www.tibetanreview.net/india-has-never-recognized-tibet-as-historically-chinese/

మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) ఈ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో మన విదేశాంగశాఖ ప్రతినిధి ఒక వివరణ ఇస్తూ చైనాలో టిబెట్‌ అంతర్భాగం అన్న మన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.http://timesofindia.indiatimes.com/india/no-change-in-indias-position-on-tibet-being-part-of-china-mea/articleshow/58182984.cms?TOI_browsernotification=true మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) కాశ్మీరు వేర్పాటు వాదులు తమకు స్వాతంత్య్రం కావాలని కోరుతున్న విషయం తెలిసిందే. వారికి ఇప్పటి వరకు పాక్‌ పాలకులు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాశ్మీరును మన అంతర్భాగంగానే చైనా గుర్తిస్తున్నది, దొంగ భక్తుడికి పంగనామాలెక్కువన్నట్లుగా దేశ భక్తి గురించి అతిగా చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటలు విన్న తరువాత అది పాలక పార్టీ పరోక్ష అభిప్రాయంగా చైనీయులు పరిగణించి కాశ్మీరు వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తే పరిస్ధితి ఏమిటి ?

అందువలన సమస్యలను మరింత సంక్లిష్టం చేయటం ఎవరికీ మంచిది కాదు. అన్ని రంగాలలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చే ఎన్నికలలో జనం దృష్టి మళ్లించటానికి అవకాశాలను వెతుకుతున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. దానిలో భాగంగా సరిహద్దులలో వుద్రిక్తతలను రెచ్చగొట్టి ఆపేరుతో గట్టెక్కుదామనుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది.

మరోసారి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించి గుణపాఠం చెప్పాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల రెచ్చగొట్టుడు మాటలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా అధికారంలో వున్నది దాని నేతలే. ఒకవైపు వారే దిగుమతులను అనుమతిస్తారు, మరోవైపు బహిష్కరించమని పిలుపు ఇస్తారు. ఇంతకంటే మోసం, నాటకం మరొకటి ఏముంటుంది? ఎన్నికలలో నిధులు ఇచ్చే వ్యాపారుల కోసం దిగుమతులను అనుమతిస్తారు, చైనా వ్యతిరేక మనోభావాలకు రెచ్చిపోయే మధ్యతరగతి ఓట్ల కోసం చెవుల్లో పూలు పెడుతూ బహిష్కరణ పిలుపులు ఇస్తుంటారు. http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-of-chinese-goods-how-it-wont-help-india-but-can-harm-china/59543718 ఈ లింక్‌లోని విశ్లేషణను ప్రచురించిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికను కూడా దేశ ద్రోహిగా చిత్రించి ఆ పత్రికను కూడా బహిష్కరించమని పిలుపు ఇస్తారేమో తెలియదు. వస్తుబహిష్కరణ ద్వారా చైనాపై వత్తిడి తేగలమనేది పొరపాటు, దాని వలన భారత్‌కు ఒరిగేదేమీ లేదని, చైనా దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు హానికరమని పేర్కొన్నది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2016లో భారత్‌కు చైనా దిగుమతులు 0.2శాతం మాత్రమే పెరిగి 58.33 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు 12శాతం పడిపోయి 11.76 బిలియన్లకు తగ్గి వుభయ దేశాల మధ్య వాణిజ్య అంతరం 46.56 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని ఆ విశ్లేషణలో తెలిపారు. చైనా ప్రపంచ దేశాలకు వంద వస్తువులను ఎగుమతి చేస్తే దానిలో కేవలం రెండు మాత్రమే భారత్‌కు వస్తున్నాయి. అందువలన ఆ రెండింటిని మన ఆర్‌ఎస్‌ఎస్‌ యోధులు, దేశీయ ‘బాణ సంచా జాతీయో యోధులు’ బహిష్కరింపచేస్తే చైనీయులు కాళ్ల బేరానికి వస్తారని భావిస్తే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు. ఇదే సమయంలో ఆ విశ్లేషణలో పేర్కొన్నట్లు చైనా దిగుమతులపై ఆధారపడిన మన ఔషధ పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు చైనా ఒక చెరువు మాదిరి వుంది. అగ్రరాజ్యమైన అమెరికాయే దానితో మరిన్ని రాయితీలు పొందేందుకు బేరసారాలు చేస్తోంది తప్ప అలగటం లేదని గ్రహించటం అవసరం.

అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సేకరించిన సమాచారం ప్రకారం 2016లో 2011 బిలియన్‌ డాలర్లతో చైనా ప్రపంచ ఎగుమతులలో అగ్రస్ధానంలో వుంది.దీనిలో హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్లను కలపలేదు. తరువాత అమెరికా, జర్మనీ, 1471, 1283 బిలియన్లతో రెండు, మూడు స్ధానాల్లో వున్నాయి. మన దేశం 271 బిలియన్లతో 17వ స్ధానంలో వుంది. అందువలన మన 58 బిలియన్‌ డాలర్ల దిగుమతులను ఆపేస్తే తెల్లవారేసరికి చైనా దిగివస్తుందని అనుకోవటం మరుగుజ్జు ఆలోచన మాత్రమే. రెండవది తన వుత్పత్తికి ఎలాంటి ఢోకా లేకుండా చైనా తన అంతర్గత వినియోగాన్ని పెంచేందుకు పూనుకుందని అందరూ చెబుతున్నారు. ఇంతకూ చెప్పవచ్చేదేమంటే వాస్తవాల ప్రాతిపదికన ఆలోచించటం అవసరం.

చైనాతో మన కంటే ఎక్కువగా అమెరికా,జపాన్‌లు వివాదపడుతున్నాయి. సైనిక సమీకరణలు సాగిస్తున్నాయి. వుత్తర, దక్షిణ కొరియాలు ఏకం కాకుండా అడ్డుపడుతూ వుత్తర కొరియా నుంచి రక్షణ పేరుతో దక్షిణ కొరియాలో 30వేలకు పైగా సైన్యాన్ని, ఆధునిక క్షిపణులు, ఆయుధాలతో అమెరికన్లు తిష్టవేశారు. జపాన్‌తో రక్షణ ఒప్పందం ముసుగులో అక్కడ కూడా సైనిక స్ధావరాలను ఏర్పాటు చేసి మిలిటరీ, దానిపై ఆధారపడే వారిని లక్ష మందిని జపాన్‌లో దశాబ్దాల తరబడి అమెరికన్లు మకాం వేశారు. ఇవన్నీ చైనాకు వ్యతిరేకంగానే అన్నది స్పష్టం. ఇవేగాదు, సాధ్యమైన మేరకు చైనా చుట్టూ తన సేనలను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయినా చైనా వస్తువులను బహిష్కరించాలని అమెరికాలోని వారెవరూ పిలుపునివ్వటం లేదు.జపాన్‌ తన సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకొంటోంది. చైనాతో వివాదాలను పరిష్కరించుకొని మన ప్రయోజనాలను పరిరక్షించుకోవటం అవసరం. ఇవాళ వున్న పరిస్ధితుల్లో భారత్‌ – చైనా రెండూ యుద్ధాన్ని కోరుకోవటం లేదు.రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించగల క్షిపణులు వున్నాయి, అందువలన విజేతలెవరూ వుండరు. మన నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఎన్ని పిలుపులు ఇచ్చినా సమీప భవిష్యత్‌లో వాణిజ్యంలోభారత దేశం చైనాకు పోటీ అవుతుందని ఎవరూ భావించటం లేదు. ఎవరైనా అలా చెబితే మనలను వుబ్బేసి తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి తప్ప వేరు కాదు. నరేంద్రమోడీ ఇంతవరకు చైనా వస్తువుల దిగుమతి నిషేధం లేదా బహిష్కరణ గురించి తన మనసులోని మాటల్లో కూడా బయట పెట్టటం లేదు. అమాయకులను తప్పుదారి పట్టించి, మోసం చేసి ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నగుబాట్ల పాలు చేయటానికి తప్ప రాజును మించిన రాజభక్తి మాదిరి అగ్రరాజ్యం అమెరికా వంటి వాటికే లేని దురద మన కాషాయ సేనకెందుకు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

గో గూండాలకు గాంధీ సూక్తులు-నరేంద్రమోడీ పిట్ట, కట్టు కథలు !

01 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Acharya Vinoba Bhave, bjp cow politics, cow goondas, cow protectors, gandhi good words, Mahatma Gandhi, Narendra Modi, narendra modi cock and bull stories

నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది.

ఎం కోటేశ్వరరావు

భూమ్మీద మే నెలలో మాత్రమే పుష్పించే మొక్కలున్నాయి. అందుకే వాటిని వాడుక భాషలో మే పుష్పాలు అన్నారు. అది ప్రకృతి ధర్మం. మన ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు నోరు విప్పుతారో తెలియదు.దీన్ని వికృతి ధర్మం అనవచ్చా. ఏ గొప్ప సందేశమిచ్చారన్నదానితో నిమిత్తం లేకుండా తాము నమ్మే మౌన బాబా నోరు విప్పటమే భక్తులకు పరమానందం. నరేంద్రమోడీ కూడా భక్తులకు అలాంటి అనూహ్య సందేశం వినిపించారు. తిరిగి ఎపుడు నోరు విప్పుతారో తెలియదు. ఆయన నోటి ముత్యాల కోసం దేశం యావత్తూ ఎదురు చూడాల్సిందే తప్పదు మరి !

గతేడాది అంటే 2016 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని అమెరికా నేతలను అనుకరిస్తూ కొత్తగా ప్రారంభించిన ‘టౌన్‌ హాల్‌ ‘ కార్యక్రమంలో మాట్లాడుతూ (తరువాత అలాంటి కార్యక్రమాలు జరిగినట్లు, మాట్లాడినట్లు వార్తలేమీ లేవు) గో రక్షణ పేరుతో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నవారిపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు.( ఒక్క రాష్ట్రమైనా ప్రధాని వినతిని పట్టించుకొని తీసుకున్న చర్యల గురించి తెలిసిన వారు ఎవరైనా వివరాలు అంద చేయాలని మనవి) ‘ గో రక్షణ వ్యాపారానికి పూనుకున్న వారిని చూసి నాకు తీవ్ర కోపం వస్తోంది. గో భక్తి వేరు, గో రక్షణ వేరు. పగలు గో రక్షకుల ముసుగులు వేసుకొని రాత్రంతా నేరాలు చేస్తున్న కొంత మందిని నేను చూశాను. గో రక్షకుల అవతారమెత్తిన వారిలో 70-80శాతం మంది సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, వారి తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు గో రక్షకులుగా నటిస్తున్నారు. వారు నిజమైన రక్షకులైతే అత్యధిక ఆవులు ప్లాస్టిక్‌ కారణంగా మరణిస్తున్నాయి తప్ప వధించటం వలన కాదని తెలుసుకోవాలి. ఆవులు ప్లాస్టిక్‌ను తినకుండా వారు నిరోధించాలి.’ అని ఎంతో స్పష్టంగా చెప్పారు. తన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒక చచ్చిన ఆవుతోలు తీసినందుకు నలుగురు దళితులపై జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లడైన పూర్వరంగంలో వారిని బుజ్జగించే యత్నంలో భాగంగా ప్రధాని నోటి వెంట ఆ సుభాషితాలు వెలువడ్డాయి.

ఆ తరువాత మోడీ చెప్పినట్లు గో రక్షకుల ముసుగులో వున్న వారి ఆగడాలు ఆగలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి నిత్యకృత్యంగా మారాయి. ఎప్పుడు, ఎక్కడేం జరుగుతుందో తెలియదు. తరువాత జూన్‌ 29 గురువారం నాడు రెండు రోజుల గుజరాత్‌ పర్యటనలో మరోసారి నోరు విప్పి ‘ఆవు పేరుతో చేసే హత్యలను మహాత్మా గాంధీ అంగీకరించరు, అవి ఆయన సిద్దాంతాలకు వ్యతిరేకం ‘ అని సెలవిచ్చారు. రంజాన్‌ సందర్భంగా వస్తువులను కొనుగోలు చేసి దేశ రాజధాని ఢిల్లీ నుంచి రైలులో హర్యానాలోని స్వగ్రామానికి ప్రయాణిస్తున్న ముస్లిం కుటుంబంపై ముస్లిం వ్యతిరేక వున్మాదులు దాడి చేసి వారిని కొట్టి రైలులో నుంచి తోసివేసిన దుర్మార్గ వుదంతంలో పదిహేనేండ్ల ఒక యువకుడు మరణించిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా దేశ వ్యాపితంగా అనేక నగరాలలో తీవ్ర నిరసన ప్రదర్శనలు వ్యక్తమైన ఒక రోజు తరువాత నరేంద్రమోడీ నోరు విప్పారు. అంటే తీవ్ర ఘటనలు, వాటిపై వ్యతిరేకత వ్యక్తమై అధికారపక్షం గబ్బు పట్టే పరిస్ధితులు తలెత్తినపుడే ప్రధాని నోరు విప్పుతారన్నది స్పష్టమైంది. అంతకు ముందే జరిపిన విదేశీ పర్యటన వార్తల కంటే ఎక్కువగా నిరసన ప్రదర్శనల గురించి అంతర్జాతీయ మీడియా స్పందించిన తీరు కూడా నరేంద్రమోడీని కలవరపరచి వుంటుంది.

‘ గోరక్షణ, గో ఆరాధన గురించి మహాత్మాగాంధీ, వినోభా భావే కొన్ని విషయాలు చెప్పారు. అవెలా చేయాలో వారు మనకు చూపారు.దేశానికి, ప్రగతికి అది మార్గం. గో భక్తి పేరుతో జనాన్ని చంపటం ఆమోదయోగ్యం కాదు, మనకు వినోభా భావే జీవితం అలాంటి సందేశం ఇవ్వదు. ఒకసారి వినోభానే కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆయన నన్ను చూసి మరణించు, మరణించు అన్నారు. ఇదేమిటి ఇలా అంటారు అని దిగ్భ్రాంతి చెందాను. ఆవు కోసం మరణించు అని ఆ తరువాత ఆయనే చెప్పారు.మా గ్రామంలో నా చిన్నతనంలో ఒక ఆవు ప్రమాదవశాత్తూ ఐదు సంవత్సరాల బాలుడిని చంపింది. తరువాత అది మేతమేయటం మానుకొని ఆ బాలుడి తలిదండ్రుల ఇంటి ముందే పశ్చాత్తాపంతో మరణించింది. http://indianexpress.com/article/india/killing-in-name-of-cow-unacceptable-its-not-something-mahatma-gandhi-would-approve-pm-modi-4728580/ గాంధీ గురువుగా తెలిసిన జైన ఆధ్యాత్మికవేత్త శ్రీమద్‌ రాజచంద్ర 150వ జయంతి,ఆశ్రమ శతవార్షికోత్సవం జరుగుతున్నది, ఈ సందర్భంగా ఒకటి చెప్పదలచుకున్నాను, మనది అహింసాత్మక భూమి, మహాత్మాగాంధీ పుట్టిన నేల, ఏ సమస్యను కూడా ఎన్నడూ హింస పరిష్కరించజాలదు.నేను సబర్మతి ఆశ్రమంలో వున్నాను, ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితి గురించి నా ఆగ్రహం, విచారం, బాధను వ్యక్తం చేయదలచుకున్నాను. చీమలకు కూడా తినబెట్టాలని నమ్మేదేశం మనది, వుదయమే చెరువుల దగ్గరకు వెళ్లి చేపలకు మేత వేసేటువంటి సంస్కృతి కలిగినట్టి ఒక దేశం, దానిలో మహాత్ముడు మనకు అహింస గురించి పాఠాలు చెప్పారు. అలాంటిది ఏమైంది మనకు ? విఫలమైన ఆపరేషన్‌ కారణంగా రోగి మరణిస్తే బంధువులు ఆసుపత్రులను తగులబెడుతున్నారు. ప్రమాదమంటే ప్రమాదమే. ప్రమాదాలలో ఎవరైనా మరణించినా లేక గాయపడినా జనం వచ్చి వాహనాలను తగులబెడుతున్నారు. మనమందరం కలసి కట్టుగా పని చేయాలి, గాంధీ కలలను నిజం చేయాలి. మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడేట్లు చేయాలి.’ అని నరేంద్రమోడీ తన సందేశంలో చెప్పారు.

మోడీగారి ఈ మాటలు విన్న, చదివిన తరువాత చెవుల్లో పూలేమన్నా మొలిచాయా అని ఎవరైనా తడిమి చూసుకోవాల్సి వుంటుంది. ఆవు పేరుతో జరిగే హత్యలను మహాత్మాగాంధీ సహించరు అని నరేంద్రమోడీ ఎవరికి చెబుతున్నట్లు ? గాంధీ పేరు చెప్పుకొని ఎవరైనా అలాంటి దుర్మార్గానికి పాల్పడుతుంటే అలా చెబితే అర్ధం వుంటుంది. సాధు జంతువైన ఆవు రక్షణ పేరుతో చెలరేగుతున్న సాయుధ వున్మాదులకు ఆవు కోసం చంపు,చంపు అన్నవి తప్ప చావు, చావు అన్నవి రుచిస్తాయా ? అయినా విపరీతం గాకపోతే ఆవు కోసం మరణించటం ఏమిటి? సంఘపరివార్‌ లేదా అది ఏర్పాటు చేసిన ప్రత్యక్ష బిజెపి వంటి రాజకీయ పార్టీలు, సంస్ధలు లేదా పరోక్షంగా వేరే ముసుగులతో పని చేస్తున్న సంస్ధల వారు గానీ ఇంతవరకు గాంధీని జాతిపితగా గుర్తించలేదు. ప్రధాని నరేంద్రమోడీ- బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయపు శరీరాలు వేరు తప్ప ఆత్మలు, ఆలోచనలు ఒక్కటే అని అందరికీ తెలుసు. అలాంటి ఒక ఆత్మ అయిన అమిత్‌ షా మహాత్ముడిని ఒక చతురుడైన కోమటిగా వర్ణించటాన్ని తన మౌనం ద్వారా మరో ఆత్మ అయిన నరేంద్రమోడీ సమర్ధించారు. అదే పెద్దమనిషి ఆవు పేరుతో జరిగే వాటిని మహాత్ముడు అంగీకరించడు అంటున్నారు. ఇలాంటివి ఆత్మను చంపుకొని లేదా వంచనలో భాగంగా మాట్లాడేవి తప్ప మరొకటి కాదు. హిందూ-ముస్లిం మతసామరస్యతను దెబ్బతీయటమే పరమ ధర్మంగా పెట్టుకున్న పరివార సంతతి సామరస్యత కోసం తన ప్రాణాలనే బలి ఇచ్చిన ఆయన కలలను నిజం చేయాలి అని చెబితే చెవుల్లో పూలు పెట్టుకున్నవారు తప్ప అన్యులెవరూ ఆవగింజంతైనా విలువ ఇవ్వరు. అమిత్‌ షా నాయకత్వంలోని బిజెపి అనుయాయులు, ఆర్‌ఎస్‌ఎస్‌లో కొంతకాలం పని చేసి ఆ మహాత్ముడిన చంపిన గాడ్సేకు గుడులు, గోపురాలు కట్టాలంటూ కీర్తిస్తున్న శక్తుల చెవులకు అవి ఇంపుగా వుంటాయా ? ఎందుకీ రెండు నాలుకల వైఖరీ, ఎందుకీ వంచన ? మనుషులను చంపితేనే వురి శిక్షలు వద్దని సభ్య సమాజం ఒకవైపు కోరుతుంటే ఆవును చంపిన వారిని వురితీసే విధంగా చట్టాలను సవరించాలని బిజెపి, దాని ప్రత్యక్ష, పరోక్ష అనుబంధ సంఘాల వారు చెలరేగుతున్న స్ధితి. అరవై ఆరు సంవత్సరాల నరేంద్రమోడీ, 87 సంవత్సరాల వయస్సులో 1982లో మరణించిన వినోభావేను ఎప్పుడు, ఎక్కడ కలిశారో, ఈయనను చూసి అవు కోసం చావు చావు అని తన మౌనవ్రతం వీడి ఆయనెందుకు చెప్పారో, దానిలో అంత సుగుణం ఏమి వుందని ఆవుకోసం హత్యలకు సైతం వెనకాడని వున్మాదం ప్రబలిన స్ధితిలో మోడీ ఎందుకు ప్రత్యేకించి చెప్పారో అని ఆలోచిస్తే అనేక కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహాత్ము డు ఆవు గురించి ఏం చెప్పినా గొడ్డు మాంస నిషేధం గురించి చెప్పలేదు.https://thewire.in/12170/what-mahatma-gandhi-said-to-those-who-wanted-beef-banned-in-india/ పశు విక్రయాలపై కేంద్రం చేసిన నిర్ణయం పరోక్షంగా గొడ్డు మాంసాన్ని నిషేధించే దిశగా వుంది తప్ప వేరొకటి కాదు. ‘ఎవరికి వారికి బుద్ధి పుట్టకుండా ఆవును చంప వద్దని నేను బలవంతం ఎలా చేయగలను ? దేశంలో హిందువులు మాత్రమే లేరు. ముస్లింలు, పార్సీలు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారు వున్నారు’ అని చెప్పారు. అయినప్పటికీ దేశంలో బిజెపి నేతలు గొడ్డు మాంసానికి వ్యతిరేకంగా మాట్లాడటం, రెచ్చగొట్టటాన్ని గాంధీ అంగీకరిస్తారా ? గాంధీని పొగుడుతూ అపహాస్యం చేయటమే ఇది. ఇక వినోభా భావే గో రక్షణ గురించి చెప్పారు తప్ప అందుకోసం చావు లేదా చంపు అన్న తీవ్రవాది మాదిరిగా మాట్లాడినట్లు, రాసినట్లు ఇంటర్నెట్‌లో నాకు దొరకలేదు. ఎవరైనా వాటి గురించి శోధించి చెప్పవచ్చు. తమ బుర్రల్లో వున్నవాటిని ఇతరుల పేర్లతో ప్రచారం చేస్తున్న వర్తమానంలో నరేంద్రమోడీ ఒక ప్రధానిగా వుంటూ తననెప్పుడో ఆవు కోసం ప్రాణాలిమ్మని కోరినట్లు చెప్పటం గో రక్షణ పేరుతో చెలరేగుతున్నవారికి రివర్సులో అర్ధమై ప్రాణాలు ఇవ్వటానికి బదులు ప్రాణాలు తీయమని మరింత ప్రోత్సాహమిస్తుంది తప్ప వారిని దాడుల నుంచి, హత్యలు చేయటం నుంచి వెనక్కు మరల్చదు.

నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది. ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలు(బర్రెలు) కొన్ని సందర్భాలలో వాటి దగ్గరకు వెళ్లిన మనుషులను పొడుస్తాయి, తంతాయి. గాయాలు తీవ్రమైనవి లేదా ఆయువు పట్టులో తగిలితే ఎవరైనా మరణించ వచ్చు. ఆవుకు లేని లక్షణాలను ఆపాదించే వారి కోవలో భాగంగా మోడీ ఈ కథను వినిపించారన్నది స్పష్టం. బహుశా గుజరాత్‌ గోవులకు అంతటి మహత్తర గుణం వుందనుకుందాం. మోడీ చెప్పారు కనుక ‘పక్కా నిజం’ కూడా అయి వుంటుందనుకుందాం. గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లింల వూచకోతలో పాల్గొన్నవారు మోడీ గారి వూరి ఆవు మాదిరి ఆప్తులను కోల్పోయిన వారి ఇళ్ల ముందు తిండి మానుకొని మరణించకపోయినా కనీసం మోడీతో సహా ఒక్కరంటే ఒక్కరు కూడా పశ్చాత్తాపం తెలిపిన వుదంతం మనకు కనపడదు. మెదడు అంతగా ఎదగని, తింటున్నది ప్లాస్టిక్కో కాదో కూడా తెలియని ఆవు పశ్చాత్తాప గుణం మెదడు బాగా ఎదిగిన వారిలో మృగ్యమైంది. సిగ్గు పడాల్సిన విషయం కదా ! ప్రపంచంలో రెండో పెద్ద దేశానికి ప్రధానిగా వున్న ఒక వ్యక్తి ఇలాంటి కాకమ్మ కథలు వినిపిస్తున్నారంటే ప్రపంచంలో మన పరువేంగాను? ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాల నాడే ఎలాంటి పెట్రోలు లేకుండా, పైకీ కిందికీ, వెనక్కు ముందుకు ఎటు కావాలంటే అటు, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే విమానాలను భారతీయులు తయారు చేశారని, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలను మహాభారత కాలంలోనే పుట్టించారని, మనిషికి ఎనుగు తలను అతికించి ఎప్పుడో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, ఇవన్నీ సంస్కృత గ్రంధాలు,వేదాలలో వున్నాయని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకుంటుంటే విదేశాల్లో భారతీయలు తలెత్తుకోలేకుండా వున్నారు. ఇప్పుడు మోడీ వాటికి మరో ఆవు కథను తోడు చేశారు.

ఒకవైపు నరేంద్రమోడీ ఆవు పశ్చాత్తాప కథలు, గోవు పేరుతో హత్యలను గాంధీ సహించరని చెబుతున్న సమయంలోనే బిజెపి పాలిత రాష్ట్రమైన ఝర్ఖండ్‌లో ఒక ముస్లిం ఒక వాహనంలో నిషేధిత గొడ్డు మాంసాన్ని తరలిస్తున్నాడంటూ ఒక గుంపు దాడి చేసి చచ్చేట్లు కొట్టటమే గాక ఆ వాహనాన్ని కూడా తగుల బెట్టారు. అంతకు ముందు ఒక ముస్లిం ఇంటి ముందు ఆవు తల కనిపించిందంటూ అతడిపై దాడి చేయటమే గాక ఆ ఇంటిని గో గూండాలు తగుల బెట్టారు. ఆవు పేరుతో ముస్లింలు, దళితులను ఏం చేసినా తమనేం చేసే వారుండరనే భరోసా పెరగటమే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోవటానికి కారణం. గత మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రులతో సహా బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి అనుయాయుల చర్యలకు, నరేంద్రమోడీ సుభాషితాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు.https://thewire.in/152839/modi-cow-violence-gap-words-bjps-deeds/

గత ఏడు సంవత్సరాలలో (2010-17జూన్‌ 25వరకు) దేశంలో జరిగిన పశు సంబంధ హింసాకాండలో 51శాతం ముస్లింలే లక్ష్యంగా జరిగాయని ఇండియా స్పెండ్‌ విశ్లేషణ తెలిపింది. అరవై మూడు సంఘటనలలో28 మంది మరణించగా 124 మంది గాయపడ్డారు, మరణించిన వారిలో ముస్లింలు 86శాతం వున్నారు.ఈ మొత్తం వుదంతాలలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక జరిగినవి 97శాతం వున్నాయి. ఎనిమిది సంవత్సరాలలో 63 జరగ్గా 2014-17లో 61 వున్నాయి, 2016లో 25 జరగ్గా, ఈ ఏడాది ఆరునెలల్లోనే 20 జరిగాయి. అరవై మూడు సంఘటనల్లో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగాయి. యాభై రెండు శాతం దాడులకు పుకార్లే ప్రాతిపదిక. 2016 మొత్తంలో నమోదైన ఘటనల సంఖ్యలో 2017 తొలి ఆరునెలల్లోనే 75శాతం జరిగాయని ఆ విశ్లేషణ తెలిపింది. ఇదంతా గతేడాది ఆగస్టులో నాకు కోపం వస్తోంది, చర్యలు తీసుకోండంటూ గో గూండాలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత నెలకొన్న పరిస్ధితి ఇది. గో గూండాయిజం ఘటనలు వుత్తర ప్రదేశ్‌లో 10, హర్యానా 9, గుజరాత్‌ 6, కర్ణాటక 6, మధ్య ప్రదేశ్‌, రాజస్ధాన్‌, ఢిల్లీలలో నాలుగేసి చొప్పున జరిగాయి. దక్షిణాది, బెంగాల్‌, ఒడిషాతో సహా ఈశాన్య రాష్ట్రాలలో 13 సంఘటనలు జరిగితే ఒక్క కర్ణాటకలోనే ఆరున్నాయి.63 వుదంతాలలో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరగ్గా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎనిమిది, మిగతావి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలలో జరిగాయి.

ఇండియా స్పెండ్‌ విశ్లేషణలోని మిగతా వివరాల ప్రకారం జరిగిన ఘటనలలో 50.8శాతం ముస్లింలు లక్ష్యంగా జరిగితే 7.9శాతం దళితులు, 4.8శాతం సిక్కులు లేదా హిందువులు, 1.6శాతం క్రైస్తవుల లక్ష్యంగా జరిగాయి. 20.6శాతం కేసులలో మతం ఏమిటో పేర్కొనలేదు. మన శిక్షా స్మృతిలో గుంపులు చేసే లించింగ్‌ అంటే చిత్రవధ చేయటం లేదా విచారణ లేకుండా చంపటం, చంపించటం అనే అంశాల ప్రస్తావన లేదు. ఐదుశాతం వుదంతాలలో దాడి చేసిన వారి అరెస్టుల వివరాలు లేవు, 21శాతం కేసులలో దాడులకు పాల్పడిన వారితో పాటు బాధితులపై కూడా కేసులు నమోదు చేశారు. 36శాతం కేసులలో గుంపులుగా పాల్గొన్న వారు భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ లేదా స్ధానిక గోరక్షణ దళాల పేరుతో వున్నవారే వున్నారు.

హింసాకాండ తీరు తెన్నులు ఎలా వున్నాయంటే, 2012 జూన్‌ 10 పంజాబ్‌లోని జోగా పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ సమీపంలో 25 ఆవు కళేబరాలు కనిపించాయి. విశ్వహిందూ పరిషత్‌, గోశాల సంఘాల నాయకత్వంలో ఒక గుంపు ఆ ఫ్యాక్టరీలో ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు. ఆ ఫ్యాక్టరీని నడుపుతున్నవారిలో ఇద్దరి ఇండ్లను తగుల బెట్టారు, ఈ వుదంతంలో నలుగురు గాయపడ్డారు. గతేడాది ఆగస్టులో గొడ్డు మాంసం తింటున్నారనే పేరుతో హర్యానాలోని మేవాట్‌లో ఒక మహిళ, 14 ఏండ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టటంతో పాటు ఇద్దరు బంధువులను హత్య చేశారు.

ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ చెప్పిన సుభాషితాలు, కట్టుకథలు, పిట్ట కథలు ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలను తప్పించుకోవటానికి తప్ప నిజంగా దోషులను అదుపు చేసేందుకు కాదన్నది స్పష్టం. ఢిల్లీ నుంచి హర్యానా వెళ్లే రైలులో ముస్లిం కుటుంబంపై దాడి చేసి వారిని రైలు నుంచి తోసివేసిన వున్మాద చర్యలో ఒక యువకుడు మరణించిన వుదంతంపై అనేక చోట్ల ‘నాట్‌ ఇన్‌ మై నేమ్‌ ‘పేరుతో జరిగిన నిరసన ప్రదర్శనలలో అనేక సంస్ధలు, పార్టీలకు చెందిన వారు పాల్గొన్నారు. నిజంగా ఆ వుదంతాన్ని బిజెపి ఖండిస్తున్నట్లయితే వారు కూడా వాటిలో పాల్గొని తమ వైఖరిని వెల్లడించి వుండాల్సింది. కానీ అందుకు భిన్నంగా రైలులో కూర్చునే దగ్గర తలెత్తిన గొడవలో ఆ యువకుడు మరణించాడని బిజెపి చెప్పింది, నిరసనలలో పాల్గొన్నవారంతా నరేంద్రమోడీ వ్యతిరేకులని ఆరోపించింది. రైళ్లలో సీట్ల దగ్గర గొడవలు జరగటం మన దేశంలో సర్వసామాన్యమే. అవి దాడులు, హత్యలు, రైళ్ల నుంచి తోసివేయటానికి దారితీస్తే ప్రతి రోజూ ప్రతి సాధారణ ప్రయాణీకుల రైళ్లలో అలాంటి వుదంతాలు అసంఖ్యాకంగా నమోదయ్యేవి. సమస్య తీవ్రతను, దేశంలో పెంచుతున్న ముస్లిం వ్యతిరేకత తీవ్రతను తగ్గించటానికి ‘సీటు దగ్గర గొడవని’ పోలీసులు, ఇతరులు సృష్టించిన కట్టుకధ తప్ప మరొకటి కాదు. ఢిల్లీ, హర్యానా, వుత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు రైల్వే పోలీసులు కూడా బిజెపి పాలిత అధికార యంత్రాంగం కింద పని చేసే వారే. ఆ దాడికి పాల్పడ్డ నిందితులెవరో, వారిని అరెస్టు చేశారో లేదో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇలాటి వుదంతాలను, గొడ్డు మాంసం, గోవుల పేరుతో చేస్తున్న వున్మాద చర్యలను అడ్డుకోకపోతే వారి దాడులు ఒక్క ముస్లింలు, దళితులకు మాత్రమే పరిమితం గావు. ఇస్లామిక్‌ దేశాలలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు సృష్టించి వదిలిన ఇస్లామిక్‌ తాలిబాన్లు అన్ని జీవన రంగాలలోకి, అందరి జీవితాలలో జోక్యం చేసుకొని నియంత్రించేందుకు పూనుకొని యావత్‌ సమాజానికే ముప్పుగా తయారు కావటాన్ని చూస్తున్నాము. మన దేశంలో హిందూత్వ శక్తులు తయారు చేస్తున్న కాషాయతాలిబాన్లు వారి కంటే తీసిపోరు. అందుకే హిట్లర్‌ పాలనా కాలంలో నాజీల చేతులలో జైలు పాలైన ఒక ప్రొటెస్టెంట్‌ మతాధికారి రాసిన కవితను పదే పదే గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక మిన్నకున్నాను

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక పట్టించుకోలేదు

చివరికి వారు నా కోసం వచ్చారు

పట్టించుకొనేందుకు నా వెనుక ఎవరూ మిగల్లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెజావర్‌ మఠం- ఇప్తార్‌ విందు-హిందూ మతవాదుల వంచన !

29 Thursday Jun 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

buddism, Hinduism, hindutva, iftar, Iftar At The Pejawar Mutt, Islam, Pejawar Mutt, sankaracharya

ఎం కోటేశ్వరరావు

ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుంది అన్న నాజీ గోబెల్స్‌ జర్మనీలో అదేపని చేశాడు. వాడి నాయకుడైన హిట్లర్‌ జర్మనీ ఔన్నత్యాన్ని పునరుద్ధరించే పేరుతో జర్మనీలో, ప్రపంచంలో ఎంతటి మారణకాండకు కారకుడయ్యాడో తెలిసిందే. ప్రపంచమంతా అసహ్యించుకోవటంతో జర్మన్లు హిట్లర్‌ పేరును వుచ్చరించటానికే ఇష్టపడరు. చెప్పాల్సి వస్తే ఆ కుక్క అన్నట్లుగా సంబోధిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి శక్తులు తామరతంపరగా పెరుగుతున్నాయి. వారిని ఎలా సంబోధించాలో వాటి దుష్ఫలితాన్ని అనుభవించబోయే తరాల నిర్ణయానికి వదలివేద్దాం.

ఏ మతాన్ని అవలంభించాలో, మత రహితంగా వుండాలో నిర్ణయించుకొనే హక్కు ఎవరికైనా వుంటుంది. ఇక్కడ పుట్టావుగనుక హిందువుగానే వుండాలనే నిరంకుశ భావం పెరుగుతోంది కనుకనే సమస్య వస్తోంది. సహజంగానే తాము నమ్మిన మతం గొప్పతనం గురించి చెప్పుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇబ్బంది లేదు. తమ మతానికి లేని గొప్పలను ఆపాదించి, ఇతర మతాలను ద్వేషించే వున్మాదానికి గురైతే మాత్రం సహించకూడదు. ప్రపంచంలో అనేక అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు. వాటంతటవే పుట్టవు. హిందూ మతం సహనశీలి, హిందువులకు సహనం పుట్టుకతో వస్తుంది అన్నది అలాంటి వాటిలో పెద్దది.

కర్ణాటక వుడిపిలోని పెజావర్‌ మఠాధిపతి శ్రీ విశ్వేష తీర్ధ స్వామీజీ రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు మఠ ప్రాంగణంలో ఇప్తార్‌ విందు ఏర్పాటు, వారి ప్రార్ధనలకు అనుమతివ్వటం మతోన్మాద శక్తులకు మింగుడుపడటం లేదు. అది హిందూమత గొప్పతనానికి చిహ్నం అంటూనే కొందరు ఇతర మతాలకు లేని సహనం మనకెందుకు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి కొందరు మింగలేక కక్క లేక తేలు కుట్టిన దొంగల మాదిరి వున్నారు. వుమ్మెత్త కాయలు తిన్నవారు ఆ చర్య హిందూమతానికి అవమానం అంటున్నారనుకోండి. ముస్లింలను మఠానికి ఆహ్వానించటం, వారికి భోజనం పెట్టటాన్ని ఒక సమస్యగా చేయవద్దని, ఇదేమీ కొత్తగా జరిగింది కాదని ఆ స్వామీజీ తన చర్యను సమర్ధించుకున్నారు. మఠంలో అందరికీ భోజనాలు పెడతారు, ఈసారి ప్రత్యేకతేమంటే నేనే ముస్లింలను ఆహ్వానించాను అని స్పష్టం చేశారు. అన్ని సందర్భాలలో తనకు వారు సహకరించారని, మఠానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. భక్తల్‌,గంగావతి వంటి చోట్ల ముస్లింలు తమ ఇండ్లకు తనను ఆహ్వానించటంతో పాటు మసీదుల ప్రారంభానికి పిలిచారని కూడా చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ప్రార్ధనలను ఎలా అనుమతించారన్న ప్రశ్నకు ముస్లింలు తమ దేవుడిని ప్రార్ధించేందుకు నమాజ్‌ చేశారు, దానిలో హిందూమతాన్ని కించపరచలేదన్నారు. గొడ్డు మాంసం తినేవారిని ఎలా ఆహ్వానించారన్న ప్రశ్నకు ముస్లింలే కాదు అనేక మంది హిందువులు గొడ్డు మాంసం తినటం లేదా అని ఎదురు ప్రశ్నించి హిందువులైనా ముస్లింలనైనా గొడ్డు మాంసం తినవద్దని శాంతియుత పద్దతులలో ఒప్పించాలని అన్నారు.

ఇతర సందర్భాలలో ముఖ్యంగా దళితుల పట్ల, బ్రాహ్మణులకు ప్రత్యేక పంక్తులు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టటం వంటి విషయాలలో పెజావర్‌ మఠనిర్వాహకుల వైఖరిని సమర్ధించకూడదు కానీ ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితులలో హిందూ మతోన్మాదులు రెచ్చిపోతారని తెలిసి కూడా ఇప్తార్‌ విందు ఇవ్వటం, ప్రాంగణంలో ప్రార్ధనలను అనుమతించటం అభినందనీయమే. ఇదే సమయంలో ఈ చర్యను సమర్ధిస్తున్నట్లు కనిపిస్తూ కొందరు చేస్తున్న వాదనలు, ప్రచారాన్ని ఎండగట్టక తప్పదు.

ముఖం మీదే పచ్చబొట్టు పొడిపించుకొని ప్రదర్శించుకున్నట్లు ఏ మాత్రం సిగ్గుపడకుండా తాము భారతీయ మితవాదులమని రాసుకొనే ‘స్వరాజ్య’ పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ ఆర్‌ జగన్నాధన్‌ సదరు మఠ స్వామీజీ తానేమిటో, ఎటువైపో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు ‘ కులంతో సహా హిందూయిజంలో అనేక బేధాలున్నాయి. దౌర్జన్యపూర్వక మతమార్పిడి అజెండాలతో వున్న చర్చి, మసీదులతో సహా అనేకం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిపై కేంద్రీకరించి, హిందూయిజాన్ని అంతర్గతంగా పట్టిష్టపరచటమా లేక తన లౌకికవాదాన్ని ప్రదర్శించేందుకు మసీదులను ప్రారంభించటమో తేల్చుకోవాలి’ అంటూ ఎద్దేవా చేస్తూ తన వ్యాసాన్ని ప్రారంభించారు. ఇస్లాం, క్రైస్తవం ఇతర విశ్వాసాలలోని నిజాన్ని అంగీకరించవని, హిందూమతం దేవుళ్లను నమ్మటాన్ని నమ్మకపోవటాన్ని కూడా అంగీకరించే వుదారత్వం కలిగి వుందని, స్వామీజీ మసీదులకు వెళ్లి భగవద్గీత, వేదాలను చదవటాన్ని అంగీకరిస్తే అది ముస్లిం సమాజపు వుదారత్వానికి చిహ్నం అవుతుందని, ఒక్కరిని అయినా హిందూమతంలోకి మార్చగలిగితే స్వామీజి పెద్ద విజయం సాధించినట్లేనని ఎద్దేవా చేశారు. ఇంకా తన పాండిత్యాన్నంతటినీ ప్రదర్శించి స్వామీజీని హిందూమతావలంబకుల ముందు దోషిగా నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు.

హిందూ మత పునరుద్ధరణ, దాని పెత్తనాన్ని రుద్దాలనే శక్తులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. అందుకు సామాజిక మీడియాను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇతర అన్ని వనరులను వాడుకుంటున్నాయి. ఏ మతమైనా సామాన్యులకు దూరమైందంటే దానిలోని తిరోగామి లక్షణాలే కారణం. ఒకవైపు హిందూమత పెత్తన పునరుద్ధరణకు కొందరు పూనుకుంటే దానిలోని తిరోగామి ధోరణులను, కులాల కుంపట్లను సజీవంగా వుంచే ధోరణులు కూడా సమాజంలో పెరుగుతున్నాయి.మన దేశానికే పరిమితం కాకుండా ఏ దేశం వెళితే ఆ దేశానికి కూడా కుల గజ్జి, మతోన్మాదాన్ని తీసుకుపోతున్నారు. ఇంతకాలంగా ఇతర మతాలవారితో సంబంధాలను వ్యతిరేకించిన ఫ్యూడల్‌ శక్తులు ఇప్పుడు కుల, కుటుంబ మర్యాదలను కాపాడే పేరుతో హిందూ మతంలోని అంతర కుల వివాహాలను అంగీకరించటం లేదు. ఎవరైనా ముందడుగేస్తే అలాంటి యువతీ యువకులను అత్యంత కిరాతకంగా చంపివేస్తున్న దుర్మార్గ పరిస్ధితులు నేడున్నాయి. ఒక ముస్లిం, క్రైస్తవుడు మతం మారితే హిందూ మతంలో వారికి ఏ కులాన్ని కేటాయిస్తారు? అన్న చిన్న ప్రశ్నకు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. ఇంకా ఇలాంటివే ఎన్నో వున్నాయి.

పెజావర్‌ స్వామీజీ ముస్లింలను మఠానికి పిలిచి వుపవాస దీక్ష విరమణ తరువాత భోజనం లేదా పండ్లు పలహారాలు పెట్టారు. దాన్ని ముస్లింలు ఇప్తార్‌ అంటారు. గొడ్డు మాంసం పెట్టలేదు. హలీం రుచి చూపించలేదు. మఠ ప్రాంగణంలో అల్లా గురించి ప్రార్ధన చేసుకోమన్నారు తప్ప ఖురాన్‌ పఠనం చేయించలేదు. ఈ మాత్రం కూడా సహించని మతోన్మాదులు నిజంగా గొడ్డుమాంసం, ఖురాన్‌ పఠనాన్ని అనుమతిస్తే స్వామీజీని ఏం చేసి వుండేవారో ?

ఇతర మతాలకు లేదని, తమకు మాత్రమే వుదారత్వం వుందని చెప్పుకొనే హిందూత్వ వాదులు దాన్ని రుజువు చేసుకోవాలంటే దేవాలయాల్లో బైబిలు, ఖురాన్‌ పఠనాలను అనుమతించిన తరువాత భగవద్గీత గురించి ఆ మతాల వారికి, ఇతరులకు అడ్డు సవాళ్లు విసరాలి. ఒక మత ప్రార్ధనలు, ప్రవచనాలు మరొక మత కేంద్రం నుంచి చేయటం లేదనే చిన్న సాంకేతికాంశం తప్ప ఆచరణలో జరుగుతున్నదేమిటి ? పొద్దున లేస్తే రాత్రి పొద్దు పోయే వరకు, దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి చెవులు చిల్లులు పడేలా వినిపించే వాటిని, వీధుల్లో చేసే భజనలు, ఇతర హంగామాలను అన్ని మతాల వారు, మతాలను విశ్వసించని వారు కూడా సహించటం లేదా ? దేవాలయాల నుంచి వినిపించేవి మసీదులు, చర్చీలలో వుండేవారికి వినిపించటం లేదా, వారివి వీరికి వినిపించటం లేదా ? ఈ గోల భరించలేకపోతున్నామని మొత్తుకొనే అన్ని మతాలకు చెందిన రోగులు, చెప్పలేని పసి పిల్లలు, ఇతర సమస్యలున్న వారి గోడు ఏ ప్రార్ధనా స్ధలమైనా, మతమైనా పట్టించుకొంటోందా ? మైకుల సౌండ్‌ తగ్గిస్తోందా ? ఎందుకీ ఆత్మవంచన? ఓట్ల కోసం గతంలో ఒక రాజకీయం నడిస్తే ఇప్పుడు సులభంగా ఓటు బ్యాంకులు ఏర్పాటు చేసుకొనేందుకు మత రాజకీయాలను ముందుకు తెస్తున్నారు తప్ప ప్రస్తుతం జనానికి కావాల్సింది మతమా ? మానవత్వమా, గౌరవప్రదమైన జీవనమా ?

ఇక హిందూమత విశాల, వుదారత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనేక మంది మన దేశంలో మసీదులు, చర్చిల నిర్మాణాల గురించి చెబుతారు. వాటికి వెళ్లే జనాభా పదుల కోట్లలో వున్నారు. కొన్ని లక్షల మంది హిందువులు నివశించే లేదా పనులకోసం వలస వెళ్లే పశ్చిమాసియా , ఐరోపా, అమెరికాలలో హిందూ దేవాలయాల నిర్మాణాలను అక్కడ కూడా అనుమతిస్తూనే వున్నారుగా అది విశాల, వుదారత్వం కాదా ? http://www.catchnews.com/world-news/west-asia-temples-hindu-1439789867.html బౌద్దమతాన్ని అవలంభించే తూర్పు ఆసియా, ఇస్లాం దేశమైన ఇండోనేషియాలో పురాతన హిందూ దేవాలయాలు ఇప్పటికీ భద్రంగానే వున్నాయిగా ! అది ఆయా దేశాల మెజారిటీ మతాల విశాల వైఖరికి చిహ్నం కాదా ?

ఎంతో విశాలమైనది అని చెప్పుకొనే మన దేశ చరిత్రను చూస్తే అనేక జైన, బౌద్ధ ఆలయాలను శైవ, వైష్ణవ దేవాలయాలుగా మార్చిన విశాల వైఖరి మనకు కనిపిస్తూనే వుంది.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చిన వుదారత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు.http://bapumraut.blogspot.in/2013/02/how-adi-shankara-destroyed-buddhism-and.html ,
http://rupeenews.com/2010/10/how-adi-shankara-destroyed-buddhism-and-founded-hinduism-in-the-8th-century/  శంకరాచార్యుడు బౌద్దాన్ని నాశనం చేసి హిందూయిజాన్ని ముందుకు తెచ్చిన చరిత్రను విశాల హృదయులైన హిందువులకు వేరుగా చెప్పనవసరం లేదు. ఆ ‘ఘన ‘చరిత్రలను కమ్యూనిస్టులు రాయలేదు.

మానవ సమాజాలు ఎక్కడ వునికిలోకి వస్తే అక్కడ ఆయా కాలాల్లో ఏదో ఒక తత్వశాస్త్రం దానిని అనుసరించి ఏదో ఒక మతం వునికిలోకి వచ్చింది. సామాజిక అభివృద్ధి క్రమంలో ఆదిమ కమ్యూనిజం అంతరించిన తరువాత వునికిలోకి వచ్చిన ప్రతి దోపిడీ వ్యవస్ధ అంతకు ముందున్న వ్యవస్ధ కంటే పురోగామి లక్షణాలతోనే ప్రారంభమైంది. దానితో పాటు ఒక దశలో అది సమాజపురోగతికి ఆటంకమైనపుడు దానిని కూల్చివేసే శక్తులను కూడా అదే వ్యవస్ధ తయారు చేసిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. బానిసలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు ఆ కోవకు చెందినవారే. అక్రమంలోనే వునికిలోకి వచ్చిన మతాలు కూడా ఒక దశలో అవి సమాజ పురోగతికి అడ్డుపడినపుడు వాటిపై తిరుగుబాటుగా కొత్త తత్వశాస్త్రాలు వాటికి అనుగుణంగా చిన్నవో పెద్దవో కొత్త మతాలు వచ్చాయి. అనేక మతాలు ప్రారంభమైన చోట అంతరించి కొత్త చోట్ల మెజారిటీ మతాలుగా మారాయి. కొన్ని ప్రాంతాలలో అంతరించాయి, పరిమితంగా మారాయి. యూదు మతంపై తిరుగుబాటుగా క్రైస్తవం, క్రైస్తవంలోనే అంతర్గతంగా ప్రొటెస్టెంట్‌ వంటి కొన్ని అంశాలపై ఏకీభవించే శాఖలు, మొత్తంగా క్రైస్తవంపై తిరుగుబాటుగా ఇస్లాం వునికిలోకి వచ్చింది. కొత్త మతాలన్నీ పాతమతాలతో ఘర్షణ పడ్డాయి. ఒకదానినొకటి అంతం చేసుకొనేందుకు ప్రయత్నించాయి. అయితే ఇవి అన్ని చోట్లా ఒకే విధంగా జరగలేదు.

మన దేశంలో కూడా మత చరిత్ర అదే చెబుతోంది. క్రైస్తవానికి ఏసు క్రీస్తు-బైబిల్‌, ఇస్లాముకు మహమ్మద్‌ ప్రవక్త-ఖురాన్‌ మాదిరి హిందూ మతం అని పిలుస్తున్నదానికి ఆద్యుడునదగిన పేరు గాని, నిర్ధిష్ట గ్రంధంగానీ లేదు. వేదాలు, వుపనిషత్తులు, రామాయణ, మహాభాగవతాల వంటివెన్నింటినో హిందూ మత గ్రంధాలుగా చెబుతున్నారు. వేదాలను ప్రమాణంగా పరిగణించిన వేదమతం, తరువాత వునికిలోకి వచ్చిన జైన, బౌద్ధ మతాలు, వాటిలో శాఖోపశాఖలు, వాటి మధ్య జరిగిన ఘర్షణలు, రక్తపాత చరిత్రను చూస్తే ఈనాడు చెబుతున్న హిందూమతం పరమతాలను సహించిన వుదారవాది అన్నది వాస్తవం కాదన్నది స్పష్టం. క్రీస్తుశకం 788లో పుట్టి 820లో మరణించారని చరిత్ర చెబుతున్న శంకరాచార్య గురించి కంచి మఠ వెబ్‌ సైట్‌ పేజీలలో ఫ్రొఫెసర్‌ పి సూర్యనారాయణ తన వ్యాసంలో ఇలా రాశారు. ఆయనేమీ విదేశీయుడు కాదు, కమ్యూనిస్టు అంతకంటే కాదు. ‘వేద మతం మరియు తత్వశాస్త్రం,దేవుడు, ఆత్మలను వ్యతిరేకించిన తిరుగుబాటు బిడ్డే బుద్ధిజం. వేదాల ఆలోచన మూలాలకే అది గొడ్డలిపెట్టుగా తయారై దాని వునికికే పెద్ద ప్రమాదకారిగా మారింది. ఈ దాడిని వీలైనపుడల్లా ఎదుర్కొని కట్టడి చేయటం వల్లనేే బుద్ధిజం ఇతర ప్రాంతాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ ఖ్యాతి ప్రాధమికంగా మీమాంసక, కుమారిల భట్టులకు చెందాలి. దానికి కారణం శ్రీ శంకరాచార్య తార్కిక పద్దతి, తిరుగులేని వాదనలు, అవి వేద మత వారసుల మనస్సులను ఆకట్టుకొని వూగిసలాటలను పోగొట్టాయి.’ మన దేశంలో బౌద్దాన్ని నాశనం చేయటంలో శంకరాచార్య బోధనలను అనుసరించిన వారితో పాటు అదే సమయంలో మన దేశంపై దండయాత్రలు చేసిన ముస్లిం పాలకులు కూడా బౌద్ధంపై దాడి చేశారన్నది ఒక అభిప్రాయం. శైవుడైన బెంగాల్‌ రాజు శశాంకుడు బౌద్దాన్ని నాశనం చేయటంలో భాగంగా బుద్ద గయలోని బోధి చెట్టును కొట్టి వేయించాడని, అనేక బౌద్దారామాలను ధ్వంసం చేయించటంతో పాటు చివరి బౌద్ద రాజును హత్య చేయించాడని కూడా చరిత్రలో వుంది.

ముస్లిం దండయాత్రలకు ముందు మన దేశంలో శివ, వైష్ణవ మతాలను అవలంభించిన రాజులు, వారు రెచ్చగొట్టిన మతోన్మాదం, జరిగిన రక్తపాత చరిత్ర దాస్తే దాగని సత్యం. అశోకుడు బౌద్ద మతాన్ని అనుసరించాడు కనుక ఆయన కాలంలో బౌద్ద పరిఢవిల్లింది, విదేశాలకూ వ్యాపించింది. ఇప్పుడు ఇస్లామిక్‌ దేశంగా వున్న ఇండోనేషియాలో, బౌద్ధమతం అవలంభించే ధాయ్‌లాండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ హిందూ పురాణాలు, ఇతి హాసాలలో కనిపించే పేర్లను పెట్టుకోవటం చూస్తున్నాం. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో(సుకర్ణుడు) ఆయన ఒక భార్య పేరు పట్మావతి(పద్మావతి) కుమార్తె పేరు మేఘావతి పుత్రి కూడా దేశాధ్యక్షురాలిగా పని చేశారు. ఇది విశాల దృక్పధమా, సంకుచితమా ?

మన దేశంపై ముస్లింలకు ముందు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి దండయాత్రలు జరిగాయి. ఒక దేశంపై మరొక పెద్ద రాజ్యం దండయాత్రలు చేయటం రాజరిక లక్షణాలలో ఒకటిగా పరిగణించటమే కాదు, మహా సామ్రాజ్యాలను నెలకొల్పటం గొప్పగా భావించిన చరిత్ర ప్రపంచమంతటా కనిపిస్తుంది. ముస్లిం దండయాత్రలు, తరువాత వారి స్ధానాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనలో వారి మతాలైన ఇస్లాం, క్రైస్తవాన్ని వ్యాపింప చేసేందుకు ప్రయత్నం జరిగింది. హిందూ మతాలను అవలంభించే రాజులు తమ రాజ్యాలను కాపాడుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు గనుక కాల క్రమంలో ఇస్లాం, క్రైస్తవ మతాల ధాటిని తట్టుకోవటానికి శైవులు, వైష్ణవులు అందరూ రాజీపడ్డారు. ఈ మతాలకు మూలమైన మనువాదం సమాజాన్ని కులాల వారీగా చీల్చటమే గాక గణనీయ సంఖ్యలో వున్న అణగారిన వర్గాలను అంటరాని వారిగా మార్చి గ్రామాలకు దూరంగా పంపింది. అలాంటి సామాజిక అణచివేత పీడితులు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆశ్రయించి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు. ఇలాంటి పరిణామం ఎంతో విశాలమైదని చెప్పుకొనే హిందూ మతం వ్యాపించిన మన దేశంలో తప్ప మరెక్కడా కనపడదు.

ప్రలోభాలు పెట్టి క్రైస్తవం మతమార్పిడులు చేయించిందని అనేక మంది గుండెలు బాదుకొనే వారు అంటరానితనం గురించి మాట్లాడరు. ఇప్పటికీ దానిని పాటిస్తూనే వున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో సామాన్య దళితులతో పాటు అగ్రవర్ణాలుగా పరిగణించబడే వారు కూడా క్రైస్తవ మతంలోకి మారారు. నిజానికి వారికి సామాజిక అణచివేత లేదా అంటరానితనం సమస్య లేదు. వారెందుకు మారినట్లు ? ఎలాంటి మార్పు లేకుండా, అన్నీ వేదాల్లోనే వున్నాయష అని చెప్పేవారి ప్రభావానికిలోనై నూతన ఆవిష్కరణలకు దూరమైన వారు ఆంగ్ల విద్య, పారిశ్రామిక విప్లవ ఫలాలను చూసి క్రైస్తవ మతం, అది ఏర్పాటు చేసిన ఆధునిక విద్యా సంస్ధలకు ఆకర్షితులయ్యారు. అనేక ప్రాంతాలలో క్రైస్తవ విద్యా సంస్ధల పేరుతో ప్రఖ్యాతి గాంచిన వన్నీ వారి వారసులు ఏర్పాటు చేసినవే. అంటే ఆ మార్పిడి ద్వారా కూడా ఆర్దికంగా లబ్దిపొందవచ్చని గ్రహించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవమతంలోని ప్రధాన అధికారులుగా అగ్రవర్ణాలనుంచి మతం మారిన వారే కనిపిస్తారు. వారి వివాహాలు కూడా అదే తరగతులకు చెందిన వారి మధ్య జరుగుతాయి.

హిందూమతం గత ఘనతను చూడండి, దాన్ని పునరుద్దరించండి అంటూ మతరాజకీయాలు చేయటంలో భాగంగానే పెజావర్‌ మఠ స్వామిని కొందరు విమర్శించుతున్నారు.హిందూమతానికి లేని విశాల దృక్పధాన్ని ఆపాదిస్తున్నారు.ఆత్మవంచన, పరవంచనకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అశాస్త్రీయ ప్రచారాలు-ఆవు, పేడ రాజకీయాలు !

17 Saturday Jun 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, cow, cow dung, cow politics, cow sciences, cow urine, subhash palekar

ఎం కోటేశ్వరరావు

శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటం ద్వారా ఎవరైనా విరుద్ధ భావాలను వ్యాపింపచేయగలరు అని ఇటాలియన్‌ శాస్త్రవేత గెలీలియో ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ప్రపంచంలో రెండే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండవది మానవుల బుద్దిహీనత, అయితే మొదటిదాని గురించి నేను అంత ఖాయంగా చెప్పలేను అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్‌ అన్నాడు.లోకం పోకడలను కాచి వడపోసిన వారే ఇలాంటి తిరుగులేని అంశాలను గతంలో చెప్పారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకుండానే ‘ఆణిముత్యాలను’ ప్రవచించటానికి అనంతమైన బుద్ధి హీనులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మనకు కావాల్సింది కాస్త బుర్రకు పని పెట్టి వారి లోకాన్ని విమర్శనాత్మకంగా చూడటమే !

భూమి చుట్టూ సూర్యుడు తిరగటం కాదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని తొలిసారిగా చెప్పింది గెలీలియో. అప్పటివరకు వేల సంవత్సరాలుగా వున్న విశ్వాసాలను పటాపంచలు చేశాడు. అయితే బైబిల్‌ చెప్పిందానికి భిన్నంగా తమ మనోభావాలను గాయపరిచాడంటూ నాటి క్రైస్తవ మతోన్మాదులు గెలీలియోను గృహనిర్బంధం కావించారు. చివరికి కళ్లు పోయిన స్ధితిలో కూడా ఆ కరుణామయులు ఆయనను విడుదల చేయలేదు. ఆయనను తరువాతి తరాల వారు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో శాస్త్రీయంగా రుజువైన వాటిని కూడా తిరస్కరించే వున్మాదం క్రమంగా వ్యాపిస్తోంది. అది ఆవు ఆక్సిజన్‌ గ్రహించి దాన్నే విడుదల చేస్తుందని చెప్పటం కావచ్చు, వేదాల్లోనే అన్నీ వున్నాయట అనే రుజువు కాని శాస్త్రీయ భావాలు, విమానాలు,టెస్టుట్యూబ్‌ బేబీలు, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి ఆధునిక ఆవిష్కరణలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో వున్నాయని చెప్పటం కావచ్చు. ఈ అశాస్త్రీయ వాదనలను సవాలు చేసే, వ్యతిరేకించే వారు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వసుధైక కుటుంబం, సర్వేజనాసుఖినో భవంతు, నీవు ఎవరు నేను ఎవరు సర్వం నేనే అని సుభాషితాలు పలికే కొందరు దాడులు, హత్యలకు దిగుతున్నారు.

అలాంటి వారిని పాలకులు ప్రోత్సహిస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు. గెలీలియో కొత్త విషయాన్ని చెప్పినందుకు అక్కడి మతవాదులు భగ్గుమంటే, రుజువులున్నా పాత విషయాన్నే ఆమోదించాలంటూ ఇక్కడి మతవాదులు దాడులు చేస్తున్నారు. మన సమాజం ముందుకు పోతోందా? తిరోగమనంలో వుందా? నూతన ఆవిష్కరణలను నిరుత్సాహపరిచే ఇలాంటి ధోరణులతో ఇప్పటికే మనం ఎంతో నష్టపోయిన విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా ? విషాదం ఏమంటే శాస్త్రీయ అంశాలను చదువుకొని వాటి ఆధారంగా పని చేస్తున్న పెద్దలు ఎక్కడో ఒకరో అరా తప్ప మనకెందుకులే అన్నట్లుగా ఇలాంటి శక్తుల పట్ల మౌనం దాలుస్తున్నారు. బుద్ది హీనత మనలో పెరుగుతోందా ? ఇవన్నీ వేదాల్లోనే వున్నాయా? పోతులూరి వీరబ్రహ్మంగారు దీని గురించి ఏం చెప్పారు ?

గతంలో పది సంవత్సరాలు అధికారంలో వున్న కాలంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ – కుప్పం ప్రాజెక్టు అంటూ వ్యవసాయం గురించి వూదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఘోరంగా విఫలమైన ఆ పధకం, టెక్నాలజీ వూసే ఎత్తటం లేదు. సూక్ష్మంలో మోక్షం మాదిరి ఇప్పుడు ఆవు పేడ వ్యవసాయ టెక్నాలజీ గురించి రైతులకు చెప్పేందుకు కాబినెటు హోదా ఇచ్చి ఒక సలహాదారును నియమించేశారు. కేంద్రంలోని పాలకులు ఆవు రాజకీయం చేస్తున్నారు గనుక వారితో స్నేహం కారణంగా చంద్రబాబు సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే మంటే ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతి వ్యవసాయం చేయిస్తానంటూ ముందుకు వచ్చిన సుభాష్‌ పాలేకర్‌ అనే పెద్ద మనిషికి వంద ఎకరాలు, వంద కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చిన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను అవమానించటం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు. తమకు డబ్బులిస్తే బంగారం తయారు చేసే చిట్కాలు చెబుతామని, లంకె బిందెలను చూపిస్తామంటూ మోసాలకు పాల్పడే దొంగబాబాలను చంద్రబాబు గుర్తుకు తెస్తున్నారు. చివరికి ఈ పిచ్చి ముదిరి వేదాల్లోనే అన్నీ వున్నాయి, విమానాలు, క్షిపణులు తయారు చేసే పరిజ్ఞానం మన దగ్గరే వుంది అని చెబుతున్నవారికి కూడా భూములు, డబ్బు ఇచ్చి అమరావతిలో తిష్ట వేయించినా ఆశ్చర్యం లేదు.

అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచారంలోకి పెట్టటంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారందరికీ పెద్ద దిక్కుగా వుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన ఒక ప్రచార కరపత్రం. జూన్‌ 21న యోగా దినం సందర్బంగా మాతాశిశు సంరక్షణ కోసమంటూ రాసిన దానిని మంత్రి శ్రీపాద నాయక్‌ విడుదల చేశారు. గర్భం దాల్చిన తరువాత మాంసం తినవద్దు, శృంగారానికి దూరంగా వుండాలి. దుష్టులను దూరంగా వుంచాలి, దైవపరమైన ఆలోచనలతో వుండాలి, గదులలో మంచి, అందమైన బొమ్మలను అలంకరిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అన్నది ఆ కరపత్ర సారాంశం. ఈ వార్తలను చదివిన వారు కొందరు నిషేధిత జాబితాకు ఖర్జూరాలను, మరికొన్నింటిని కూడా చేర్చి ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి విపరీతం ? అనేక పేద దేశాలతో పోల్చితే మన దేశంలో రక్తహీనత సమస్య అధికంగా వుంది. దానిని అధిగమించేందుకు అవసరమైన ప్రొటీన్లు, ఇనుము మాంసంలో లభిస్తాయి. అలాంటి మాంసాన్ని గర్భిణులు తినకూడదన్నది ఒక అశాస్త్రీయ సలహా. అనేక మూఢనమ్మకాలకు నిలయమైన మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అలా చెబుతుంటే దానిని పాటిస్తే ప్రసూతి మరణాలు ఇంకా పెరగటం తప్ప తగ్గవు. ఆరోగ్యవంతులైన తల్లీ పిల్లల కోసం ప్రభుత్వాలు చేయాల్సిందెంతో వుంది. వాటిన్నింటినీ వదలి పెట్టి శాస్త్రీయంగా రుజువు కాని, అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం గర్హనీయం. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన కరపత్రంలోని అంశాలపై తీవ్ర విమర్శలు రావటంతో తమ కరపత్రలో కామాన్ని(లస్ట్‌) అదుపు చేసుకోవాలని పేర్కొన్నామే తప్ప శృంగారం( సెక్స్‌) అనే పదం వాడలేదని సదరుశాఖ ఒక వివరణ ఇచ్చింది. ఇది చిల్లు కాదు తూటు అని సమర్ధించుకొనే అతి తెలివి తప్ప మరొకటి కాదు. సమస్యాత్మక కేసులలో గర్భిణులే కాదు సాధారణ మహిళలను కూడా కొన్ని సందర్భాలలో శృంగారానికి దూరంగా వుండాలని నిపుణులు చెప్పటం వేరు, కానీ కేంద్ర ప్రభుత్వ కరపత్రంలో దానిని సాధారణీకరించటమే విమర్శలకు గురైంది.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనికిరాని అంశాలను ప్రచారం చేయటం ఎక్కువైంది. సమాజంలో శాస్త్రీయ దృష్టి, ఆసక్తిని పెంచటంపై దాని పురోభివృద్ధి ఆధారపడి వుంటుంది. దానికి బదులు అన్నీ వేదాల్లోనే వున్నాయంటూ మెదళ్లను కలుషితం చేయటంలో తిరోగమన వాదం జయప్రదమైంది. మన దేశానికి అది చేసిన హాని అంతా ఇంతా కాదు. ఆధునిక ఆవిష్కరణలకు మన యువతను దూరం చేశారు.ఎందుకు అనే ప్రశ్నను వేయనివ్వకుండా నోళ్లను మూయించారు ఇప్పుడు మరోసారి అలాంటి శక్తులు చెలరేగిపోతున్నాయి. అధికారంలో వున్నవారే వాటికి సాధికారత చేకూర్చేందుకు పూనుకున్నారు.

గతంలో కాంగ్రెస్‌ ఒక తరహా ఓట్ల రాజకీయాలకు పాల్పడితే, ఇప్పుడు దాని స్ధానాన్ని ఆక్రమించిన బిజెపి హిందూత్వ, రామాలయం, గోమూత్రం, పేడ, గొడ్డు మాంస రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తోంది. దానిలో భాగంగానే బిజెపిని బలపరిచే సంస్ధలు,శక్తులు, వ్యక్తులు ఆవుకు లేని ప్రాధాన్యత, పవిత్రత, మహత్తులను ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి చర్యలు, వాదనలను చూస్తే చీకటి యుగాల రోజులను గుర్తుకు తెస్తున్నారు. వారి ప్రచారాంశాల శాస్త్రీయత,అధారాలను ప్రశ్నించే, విబేధించేవారు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అనేక రకాల దాడులకు తెగబడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే 2016 ఆగస్టులో గో సంరక్షకుల మంటూ తెగబడుతున్నవారి గురించి ఇలా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. ‘ గో సంరక్షణ పేరుతో జనాలు దుకాణాలు నడపటం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొంత మంది పగలు గో రక్షకులుగా ముసుగు వేసుకొని రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.’ అన్నారు. చిత్రం ఏమంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అలాంటి ఒక్క దుకాణదారును శిక్షించిన దాఖలాలు లేవు. దాంతో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవులను రవాణా చేస్తున్న లారీలపై కూడా గో గూండాలు దాడి చేస్తే వాటిని పోలీసు రక్షణతో రాజస్ధాన్‌ బిజెపి సర్కార్‌ రాష్ట్ర సరిహద్దులను దాటించాల్సిన తీవ్ర పరిస్ధితులు అక్కడ నెలకొన్నాయి. స్వయంగా ప్రధాని, ఆయన అనుచరగణం నిరూపితం కాని, శాస్త్రవిరుద్దమన, అతిశయోక్తులను ప్రచారం చేయటం వారి ద్వంద్వ ప్రవృత్తి, చతురతకు నిదర్శనం.

మన కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ గారు ఒక సందర్భంలో అమెరికా వ్యవసాయశాఖ నివేదికను వుటంకిస్తూ దాని ప్రకారం ఆవులో కనుగొన్న జీన్స్‌లో 80శాతం మానవులలో కూడా వున్నాయని అందువలన ఆవును రక్షించి పూజించాలని చెప్పారు. పొద్దున లేస్తే ముస్లిం, క్రైస్తవ మతాలను, వాటిని అవలంభించే వారికి వ్యతిరేకంగా ప్రచారం, దాడులు చేస్తున్నారు. వారిలో కూడా అదే మోతాదులో ఆవు జీన్సు వున్నాయని అందువలన వారికి వ్యతిరేకంగా వున్మాదాన్ని రెచ్చగొట్టం గోవును అవమానించటమే అని గుర్తించటం అవసరం. సరే వున్మాదాన్ని రెచ్చగొట్టటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలనుకోండి. ఇక్కడ మెదళ్లను వుపయోగించాల్సిన అవసరం వుంది. అందరికీ సుపరిచితమైన సైన్సు అనే పత్రికలో వెల్లడించినదాని ప్రకారం మానవులలో వుండే జీన్సును పోలినవి చింపాంజీలు, పిల్లులు, ఎలుకలు, కుక్కలలో వరుసగా 96,90,85,84 శాతాల చొప్పున వున్నాయట. అంటే అవు కంటే ఎక్కువ శాతం. అరటి వంటి అనేక పండ్లలో కూడా అలాంటి జీన్సు వున్నాయి, మరి వాటికి లేని పవిత్రత ఆవు కెందుకు అంటే సమాధానం వుండదు. ఆవు పేడ, మూత్రం, అది పీల్చే, విడిచే వాయువుల గురించి కూడా అతిశయోక్తులు, కట్టుకధలను ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదని పేరు పెట్టాలన్నట్లుగా ఓట్లు దండుకొనేందుకు ఆవుకు లేని పవిత్రతను ఆపాదించటం కూడా అలాంటిదే.

దాని కొనసాగింపులో భాగంగా రాజస్ధాన్‌ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవలనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దానిని చంపితే మరణశిక్ష విధించాలని చెప్పారు. న్యాయమూర్తులు చట్టంలో వున్నదానికి భాష్యం చెప్పటానికి తప్ప లేని దానిని, తమ స్వంత బుర్రలలో వున్నవాటిని న్యాయ పీఠాలపై కూర్చొని చెప్పటానికి వీలులేదు. దేశమంతా ఆవు రాజకీయం నడుస్తోంది, ఆ పేరుతో కొందరు చట్టవిరుద్దమైన గూండాయిజానికి పాల్పడుతున్నారు. సదరు న్యాయమూర్తి చర్య గూండాయిజం కాకపోవచ్చుగాని చట్టవిరుద్దమైనదే. ఇదే న్యాయమూర్తి మగనెమలి కంటి నీటిని తాగిన ఆడ నెమళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభమౌతుందని,మగ నెమళ్లు ఆజన్మ బ్రహ్మచారులని కూడా సెలవిచ్చారు. ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పటానికి గెలీలియో చెప్పినట్లు శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటమే అర్హత. వాటికి చదువులతో పని లేదు. ఇందుకు కొన్ని వుదాహరణలను చూద్దాం. మనం కొద్దిగా ఆలోచిస్తే కర్ణుడి జన్మను చూస్తే ఆరోజుల్లోనే మనకు జన్యుశాస్త్రం, వినాయకుడికి ఏనుగుతలను అతికించటాన్ని బట్టి ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని అర్ధం అవుతుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బిజెపికి చెందిన వుత్తరాఖండ్‌ మాజీ ముఖ్య మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ పదిలక్షల సంవత్సరాల నాడే రుషి కణాదుడు అణుపరీక్షలను నిర్వహించాడని చెప్పాడు.పైథాగరస్‌ కంటే మూడువందల సంవత్సరాల ముందే ఆ సూత్రాన్ని మన వారు కనుగొన్నారని ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహిలీకర్‌ సెలవిచ్చాడు. విమానాలు, మోటారు కార్లు, అంతరిక్ష ప్రయాణాల వంటి వన్నీ మన పూర్వీకులెప్పుడో ఆచరించి వదలివేసినవే అని చెప్పేవారికి కొదవ లేదు.

తినే తిండిని బట్టి కొంతమంది మానభంగాలకు పాల్పడుతున్నారని ఒకడు, చికెన్‌, చేపలు తిన్నవారే ఎక్కువగా రేపులు చేస్తున్నారని ఒక బీహార్‌ మంత్రి, దక్షిణాది స్త్రీలు అందంగా వుండటానికి కారణ వారికి డ్యాన్సు తెలిసి వుండటమే అని ఒక రాజకీయనేత, హిందువుల జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ కనీసం నలుగుర్ని కనాలని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌, రాసిఫలాలను బట్టి ఏ మహిళ అత్యాచారానికి గురవుతుందో తాను చెప్పగలనని ఒక జ్యోతిష్కుడు, ఒక లీటరు ఆవు మూత్రంలో మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం లభించిందని చెప్పే విశ్వవిద్యాలయ పరిశోధకులు, తమ వుత్పత్తులు చక్కెర వ్యాధిని సహజంగానే నయం చేస్తాయని పతంజలి సంస్ధ ప్రచారం, యజ్ఞం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, కొన్ని పరీక్షల ద్వారా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారిని తిరిగి బ్రతికించగలనని ఒక వైద్యుడు, ఐనిస్టీన్‌ సిద్ధాంతం పరీక్షకు నిలవదని చెప్పే మేథావులు మనకు ఎక్కడబడితే అక్కడ కలుపు మొక్కల్లా పెరిగిపోయారు.

గో లేదా పశు మాంసం తినటం విదేశీ ముఖ్యంగా ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు చేసిన తరువాతే ప్రారంభమైందన్నది ఒక తప్పుడు ప్రచారం. దీనిని కూడా గుడ్డిగా నమ్ముతున్నవారు లేకపోలేదు. పండ్ల అమరిక తీరుతెన్నులను చూస్తే మాంసాహార జీవుల కోవకే మానవులు చెందుతారన్నది తిరుగులేని సాక్ష్యం. వివేకానందుడు హిందూమతావలంబకుడు అనటంలో సందేహం లేదు, అది తప్పు కూడా కాదు. కానీ నేడు కాషాయ వేషాలు వేసుకు తిరిగే అనేక మంది స్వామీజీలు, వారిలో కనిపించే పరమత ద్వేషం ఎక్కడా ఆయన వుపన్యాసాలలో కనపడదు. కాలిఫోర్నియాలోని షేక్స్పియర్‌ క్లబ్బులో 1900 ఫిబ్రవరి రెండున చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు.’నేను దాని గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు, పురాతన క్రతువుల ప్రకారం గొడ్డు మాంసం(బీఫ్‌) తినకపోతే అతను మంచి హిందువు కాడు.కొన్ని సందర్భాలలో అతను విధిగా ఎద్దును బలిచ్చి తినాల్సిందే.’ అంతే కాదు వేదకాలం గురించి పరిశోధన చేసిన చరిత్రకారుడు సి.కున్హన్‌ రాజా ఇలా చెప్పారు.’బ్రాహ్మణులతో సహా వేదకాలపు ఆర్యన్లు చేపలు, మాంసం చివరికి గొడ్డు మాంసం కూడా తిన్నారు.ప్రముఖులు వచ్చినపుడు వారి గౌరవార్ధం గొడ్డు మాంసం వడ్డించేవారు. వేదకాలపు ఆర్యులు గొడ్డు మాంసం తిన్నప్పటికీ పాలిచ్చే ఆవులను తినేవారు కాదు. ఒక వేళ గొడ్డు మాంసం పెట్టాల్సి వస్తే ఎద్దులు, వట్టిపోయిన ఆవులు, దూడలను మాత్రమే వధించాలనే నిబంధనలు వుండేవి ‘ అని చెప్పారు.

నాజీ జర్మనీ కాలంలో జైలు పాలైన ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ మతాధికారి మార్టిన్‌ నియోమిల్లర్‌ హిట్లర్‌ చర్యలను వ్యతిరేకించినందుకు జైలు పాలు చేశారు. అక్కడ నాజీల ఎత్తుగడలు, నాటి జనం వాటిని వుపేక్షించి చివరికి ఎలాంటి దుస్ధితికి లోనయ్యిందీ వివరిస్తూ ఒక కవితను రాశాడు. ఆ కవిత ఇలా సాగుతుంది. ఆరోజుల్లో జర్మన్‌ కమ్యూనిస్టులను సోషలిస్టులని పిలిచారు.

తొలుత వారు సోషలిస్టుల కోసం వచ్చారు

నేను సోషలిస్టును కాదు కనుక మిన్నకుండి పోయాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం ఎవరూ మిగలలేదు

ముస్లింలు మాత్రమే ఆవు మాంసం తింటారని ప్రచారం చేసిన మతశక్తులు గోవధ నిషేధం గురించి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. వారి వత్తిడికి లొంగి రాజ్యాంగంలో దానిని ప్రస్తావించినప్పటికీ నిషేధ అంశాన్ని రాష్ట్రాలకు వదలివేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మొదలైన ప్రచారం తరువాత అన్ని మతాలవారు తినే పశుమాంసానికి కూడా వర్తింప చేశారు. దేశమంతటా గోవధ, పశుమాంస నిషేధం గురించి చెప్పే బిజెపి గోవా, కేరళ, గిరిజనులు ఎక్కువగా వున్న ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఓట్ల కోసం భిన్న గళం వినిపిస్తోంది. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలు గొడ్డు మాంసం తినే అన్ని మతాల వారికే గాక మెజారిటీ హిందూమతం వారికి, జీవన భృతికోసం పశుపాలన చేసే పేదవారికి అందరికీ నష్టదాయకంగా మారాయి. అందువలన మతశక్తులకు కావాల్సింది సెంటిమెంట్ల ద్వారా కొల్లగొట్టే ఓట్ల కోసం ఎవరినీ వదలవు అని గుర్తించటం అవసరం. గతంలో రాజులు, రంగప్పలు యజ్ఞ, యాగాదుల పేరుతో ప్రజాధనాన్ని ఎంతగా తగలేసిందీ చదువుకున్నాం. ఇప్పుడు నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి పాలకులు కూడా మరో రూపంలో అదే చేస్తున్నారు. ఆశాస్త్రీయమైన వాటిని నిరూపించేందుకు పరిశోధనల పేరుతో జనం సొమ్మును వుదారంగా ఖర్చు చేస్తున్నారు.

రామాయణంలో చెప్పిన సంజీవని మొక్కలను కనుగొనేందుకు వుత్తరాఖండ్‌ సర్కార్‌ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలాగే అనేక విశ్వవిద్యాలయాలలో సంస్కృతంలో నిక్షిప్తమైన పరిజ్ఞానాన్ని వెలికితీసే పేరుతో డబ్బు, మానవ శ్రమ, మేధస్సును కూడా దుర్వినియోగపరిచేందుకు పూనుకున్నారు. చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతున్న సుభాష్‌ పాలేకర్‌ చెబుతున్నట్లు ఎలాంటి ఎరవులు, పురుగుమందులు వేయకుండా ఆవు పేడ, మూత్రంతో సాగు చేస్తే ఎకరానికి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. నరేంద్రమోడీ వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయల నల్లధనం సొమ్ము బదిలీకోసం ఎవరూ ఎదురు చూడరు. చంద్రబాబు చెప్పే ఐటి వుద్యోగాల జోలికి యువత అసలే పోదు. ఆవు మూత్రాన్ని సేకరించి బంగారాన్ని, పేడను వాడి వ్యవసాయం చేస్తారు. చంద్రబాబు హెరిటేజ్‌ కంటే ఎక్కువ లాభాలు పొంది ఆయనకంటే ఎక్కువగానే సంపాదించగలరు.సుభాష్‌ పాలేకర్‌ మాటలను చూస్తుంటే నాకు లక్ష రూపాయలిస్తే మీకు కోట్ల రూపాయల బంగారాన్ని తెచ్చిపెట్టే ఫార్ములా చెబుతా అనే మాయగాళ్లను గుర్తుకు తెస్తున్నారు. వారికి ఆ ఫార్ములా తెలిస్తే ఆ బంగారమేదో వారే సంపాదించుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో కూడిన ఎరువులను పొలాల్లో చల్లటం రైతాంగానికి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం దానితోనే పంటలు పండుతాయని చెప్పటమే అభ్యంతరకరం. అలాగే ప్రకృతి సాగు చేస్తున్నా అంటున్న పాలేకర్‌ చెప్పేది నిజమైతై ఆయన వ్యవసాయం చేశానంటున్న మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్య లెందుకు చేసుకుంటున్నట్లు ? ఆవు పేడ వ్యవసాయాన్ని వారెందుకు చేయటం లేదు, అసలు పాలేకర్‌ చెప్పేదానికి రుజువులేమున్నాయి అని అడగాల్సిన అవసరం లేదా ? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏ రూపంలో అయినా కనీసం ఒక రూపాయి అయినా చెల్లించే ప్రతి ఒక్కరికీ పాలేకర్‌కు చేసే ఖర్చు గురించి అతని చర్యల శాస్త్రీయత గురించి ప్రశ్నించే హక్కు వుందా లేదా ?

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

30 Tuesday May 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Buddha, Dalit, manuvadis, mental slavery, soaps, Yogi Adityanath

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

అసంగ్‌ వాంఖడే

ఇదిగో నా నైవేద్యం

మనువు నన్ను మలినం గావించాడు

మీ అసహ్యబుద్ది

మాకు దుర్గంధం వంటి కులనామాన్నిచ్చి వెలివేసింది

గాయాల వాసనతోనే నేను ప్రకాశించాను

నాపై వున్నది అణచివేత జాడలు తప్ప మీ దుర్గంధం కాదు

మీ దేవుడి ప్రసన్నం కొరకు

ఈ రోజు నాకు షాంపూ, సబ్బులు ఇచ్చారు

మైనారిటీల హింస, మానభంగాలను వల్లించే

మీ కంపునోళ్లను కడిగేందుకు వాటినెప్పుడైనా వాడారా

మనువాదం, వర్ణాశ్రమ ధర్మం అని ప్రవచించే

బుద్ధి శుద్ధికి పుపయోగించారా

మీ కానుకలతో

మీరు నా మాన మర్యాదలను మంటగలిపారు

నా నైవేద్యంతో

మీ అహంభావ, గర్వాలను అసహ్యించుకుంటున్నా

మా బాబా సాహెబ్‌ చర్యలు

నా క్షణభంగురమైన వాసనలను శుద్ధి చేస్తాయి

నా కుల అణచివేత, వెలి గాయాలను సబ్బులు మరింత మండిస్తాయి

నాకు మీ సానుభూతి అవసరం లేదు

నాకు మీపై ద్వేషం కావాలి

నిరసన కేకల మధ్య

నా ఆత్మప్రతిష్ట గానం వినిపిస్తాను

అదే నాకు ఆత్మగౌరం, స్వాతంత్య్రాలను,

రణానికి స్వేచ్చ నిస్తుంది.

రెండు సార్ల తిండి కోసం

నేను నీ మలమూత్రాలను మోస్తాను

లేదంటే ఈ సర్వసత్తాక రాజ్యంలో

నేను ఆకలితో నిద్రపోవాలి

సబ్బులు, షాంపులు మీ అజా&క్షన ఆకలిని తప్ప

మా కడుపులను నింపవు

దేశ వెలుగుల ప్రసరణ కోసమే మీ ప్రభువు ఇక్కడున్నాడు

ఆయన ఆహ్లాదం కోసం మమ్మల్ని శుద్ధి చేశారు

భజనపరుల మాదిరి చిరునవ్వులు చిందించమన్నారు

మా అంతరంగం తన మౌనాన్ని వీడితే ఎలాంటి కంపనలు వస్తాయో తెలుసా ?

ఓ దేవుడా మా ఇంటిని చూసేందుకు దయచేయి

అది మీ కాషాయ అంగవస్త్రం కంటే శుభ్రంగా వుంటుంది

అయితే నీ అంతరంగం పరిశుద్ధంగా వున్నపుడు మాత్రమే మాట్లాడు

మనువును తగులబెట్టిపుడు మాత్రమే నవ్వు

నీ హృదయంలో నృత్యం చెయ్యి

నా నిశ్శబ్దం బద్దలు కాబోతున్నది

ఇప్పటికే వుషోదయమైంది

మీరు వెనుదిరిగి వెళ్లే ముందు ఇదే నా నైవేద్యం

నేను అంబేద్కర్‌, బుద్దుడు అనే సబ్బులను అర్పిస్తున్నాను

వెళ్లి మీ మానసిక బానిసత్వాన్ని శుద్ధి చేసుకోండి

మీ తాత్వికతలో మనువు చొప్పించిన కులాన్ని అంతం చేయండి

మీ కాషాయ అంగవస్త్రాన్ని తెల్లగా చేయండి

మా వైపు ఇద్దరు సూర్యులు వుండ కూడదు

మిమ్మల్ని భస్మం చేసేందుకు మా స్వంత సూర్యుడున్నాడు

కొద్ది రోజుల క్రితం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధుడు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సందర్భంగా దళితులకు సబ్బులు, షాంపూలు ఇచ్చి యోగి దర్శనానికి శుభ్రంగా స్నానం చేసి రమ్మని ఆదేశించారు. దానిపై న్యాయవాది, కవి అయిన అసంగ్‌ వాంఖడే స్పందనే ఈ కవిత. అనువాదం ఎం కోటేశ్వరరావు. నేను స్వతహాగా కవిని కాదు కనుక అనువాదంలో ఆ ఆవేశం వుండదు కనుక విమర్శకులు మన్నించాలి. అందువలన ఆంగ్ల మూలాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

Here is my offer
Manu made me unclean.
Your prejudiced mind makes me
reek of caste names and exclusion
I glow with the fragrance of sores,
I stink of oppression and not your shit.

To please your lord, you offered me
soap and shampoo today.
Have you ever used them to clean
those foul smelling tongues,
which talk of raping minorities and violence?
Or used them to clean those brains,
that preach Manuvād and varnashramadharma?

With your offer,
you have abused my dignity.
With my offer,
I am abusing your conceit.

Appropriators of my Babasaheb
act as my ephemeral cleansers.
Soap exacerbates my wounds
of caste oppression and exclusion,
I don’t want your sympathy,
I want your detestation.
I play the song of assertion
in the cries of protests;
It gives me dignity and freedom,
a freedom to fight for.

For two meals
I carry your faeces!
If I don’t, I will sleep
hungry in this Republic.
Soap and shampoo only feed your ignorance,
not my stomach.

Your lord is here to capture the nation’s spotlight
We are bleached, to look presentable;
We are told to cheer like minions,
What will tremble when my insides break their silence?

Oh Lord, come see my home!
It is cleaner than your bhagwa drape.
But talk only when your consciousness is clean;
Smile only when you burn the Manu
dancing in your heart.
For my silence is about to break,
It is dawn already.

Before you turn your back
here is my offer.
I offer you my soaps, Ambedkar and Buddha.
Go clean your mental slavery,
Go annihilate caste and the Manu infused in your reason,
bleach your bhagwa to white.
There cannot be two Suns on this side, and
We have our own, to incinerate yours.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాబరీ విధ్వంస కుట్ర కేసు విచారణ మధ్యంతర ఎన్నికలకు బాట వేయనుందా ?

19 Wednesday Apr 2017

Posted by raomk in AP, BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Guajarat., LOK SABHA, lok sabha midterm poles, Narendra Modi, Trial in Babri Masjid Case

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

29 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION

≈ Leave a comment

Tags

ban oncow slaughter, beef, cow, cow slaughter, Cow Vigilante Groups, dalits, Gau Rakshaks, Muslims

Image result for Gau Rakshaks, and their apologists

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అక్రమ పశువధ శాలలను మూసివేయిస్తానంటూ ప్రకటించి మారోసారి బీఫ్‌ లేదా పశుమాంసం, గో సంరక్షణ సమస్యను ముందుకు తెచ్చారు. దీన్ని కావాలని తెచ్చారా లేక ఆయన సహజత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదాని గురించి చర్చించనవసరం లేదు. చర్చ ఎటు తిరిగి ఎటు ముగిసినా పర్యవసానం ఒకటే.ఈ పూర్వరంగంలో పర్హాన్‌ రహమాన్‌ ఆనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో గో సంరక్షకులకు వారి సమర్ధకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. దానిలో ఆసక్తి కలిగించే అంశాలు వున్నందున పాఠకుల కోసం అనువాదాన్ని దిగువ అందచేస్తున్నాం.ఈ లేఖలోని అంశాలలో అసంబద్ధత, వక్రీకరణలువుంటే ఎవరైనా వాటిని చర్చకు పెట్టవలసిందిగా కోరుతున్నాము.

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

మార్చి 28,2017

ప్రియమైన గోరక్షకులకు

2014లో పాలకులలో వచ్చిన మార్పుతో ధైర్య భావనతో వున్న మీరు ప్రస్తుతం అధికార అలలపె సవారి చేయటాన్ని నేను అర్ధం చేసుకోగలను.ఈ ఆకస్మిక పరిణామం తెల్లవారేసరికి తయారైన రాజకీయ వాక్సూరత్వ వుత్పాదనకాదని, దీర్ఘకాలంగా అణచిపెట్టిన భావోద్వేగాల ఫలితమని కూడా నేను అర్ధం చేసుకోగలను.అనేక దశాబ్దాలుగా మీ పవిత్రమైన గోవును అపవిత్రం గావించిన, దూషించిన, హింసపెట్టిన వారిపై ప్రతీకారం చేయాలని మీరు వాంఛిస్తారు. ఇప్పటి వరకు రాజ్య రక్షణ పొందినవారికి ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వైపుగా వున్న మీ చర్యను నేను అర్ధం చేసుకోగలను.

మీకు బోధ చేయాలని గానీ లేదా మీ చర్యలు తగినవి కాదని గానీ చెప్పటానికి నేనీ లేఖ రాయటం లేదు.లేదా కపటత్వంతో కూడిన మీ చర్యలను హేళన చేయటానికి గానీ కాదు.అదేమంటే గోవధ సమస్యపై ఒకవైపున మీరు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు గొడ్డు మాంస ఎగుమతులలో ప్రపంచంలో విజయవంతంగా భారత్‌ను అగ్రస్ధానంలో నిలపాలని చూస్తున్న కొత్తగా వచ్చిన ప్రభుత్వం (దానికి మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధమై వున్నారు) గులాబి విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నది. మీరు కూడా నా మాదిరి వినమ్రులైన వ్యక్తులే. వుద్రేకం హేతువుపై ఆధిపత్యం చెలాయించటం ప్రారంభించినపుడు భావోద్వేగాలకు లోనవుతాము.మన శక్తిని సరైనదారిలో వుపయోగించగలిగితే అది మీకు అదే విధంగా దేశానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది.శక్తి పనిచేస్తే వుద్రేకంపై హేతువుది పైచేయి కావాలి.

Image result for Gau Rakshaks, and their apologists

నాలేఖలో కొన్ని ప్రశ్నలు వున్నాయి. వాటికి మీరు నాకు సమాధానం చెప్పనవసరం లేదుకానీ మీకు మీరు చెప్పుకోవాలి. మీ చర్యలు సరైనదారిలో వున్నాయా లేక తమ భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయ, ఆర్ధిక రంగాల పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారా అని మీకు మీరు హేతుబద్దంగా అలోచించండి.

మీ రోజువారీ కార్యకలాపాలతో ప్రారంభించనివ్వండి.

1.వుదయం లేవగానే మీరు వుపయోగించే టూత్‌ పేస్టు పవిత్రమైన ఆవు కొవ్వు నుంచి తీసిన గ్లిజరీన్‌తో తయారు చేసింది కాకూడదని మీరు కోరుకుంటారు. అవును గ్లిజరీన్‌ కొవ్వు నుంచి తీస్తారు. కాల్గేట్‌, క్లోజ్‌అప్‌ మరియు పియర్స్‌( లేదా ఈ విషయానికి వస్తే ఏ బ్రాండ్‌ అయినా) కేవలం మీ విశ్వాసాన్ని గౌరవించేందుకు కూరగాయ వనరులైన సోయాబీన్‌ లేదా ఆయిల్‌పామ్‌ నుంచి గ్లిజరీన్‌ తయారు చేసినట్లు చెప్పుకుంటాయి. మాంస వనరునుంచి తయారు చేసే దాని కంటే శాఖాహార వనరుల నుంచి తయారు చేసే గ్లిజరీన్‌ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మీరు నిజంగా నమ్ముతారా?

2.మీరు వుపయోగించే షేవింగ్‌ క్రీమ్‌, సబ్బు,హెయిర్‌ క్రీమ్‌, షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్‌ తదితరాలను పవిత్రమైన ఆవు నుంచి సేకరించినవి కాదని మీరెప్పుడైనా తనిఖీ చేశారా ?పాంథనోల్‌ అమినో యాసిడ్స్‌ లేదా విటమిన్‌ బిలను జంతు లేదా చెట్ల వనరుల నుంచి సేకరిస్తారు.వాటిని వుపయోగించబోయే ముందు దయచేసి తనిఖీ చేయండి. వస్త్రాలను సాపు చేసేందుకు వుపయోగించే వాటిలో డీహైడ్రోజనేట్‌ చేసిన కొవ్వు నుంచి తీసే డై మిథైల్‌ అమోనియం క్లోరైడ్‌ వుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది?

3.మీ దంతాలను తోముకుంటారా? ఒక కప్పు టీ తాగుతారా ? అయితే కాస్త ఆగండి, మీరు వుపయోగించే పంచదారను తెల్లగా చేయటానికి ఆవు ఎముకలను వుపయోగించలేదని నిర్ధారించుకోండి.

4.మనం పొద్దునే వుపాహారం తీసుకుంటాం, ఏం కావాలని మీరు కోరుకుంటారు ?చోలేతో పూరీ, చపాతీయేనా ? మీరు వుపయోగించే అదానీ తయారు చేసే ఖాద్య తైలాలలో గొడ్డు కొవ్వు కలవలేదని నిర్ధారించుకోండి. మీ సమాచారనిమిత్తం తెలియచేస్తున్నదేమంటే కూరగాయల నుంచి ఖాద్యతైలం వనస్పతిని తయారు చేస్తున్న కంపెనీలు గొడ్డు కొవ్వును వినియోగిస్తున్నట్లు బయటపడిన తరువాత 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గొడ్డు కొవ్వు వినియోగంపై విధించిన నిషేధాన్ని 32 సంవత్సరాల తరువాత మీరు ఎన్నుకున్న దేశభక్త ప్రభుత్వం మోసపూరితంగా తొలగించింది.

5. సరే దీన్నుంచి బయటకు వద్దాం. మీకు కారు, మోటార్‌ సైకిళ్లలో దేనిని ఎంచుకుంటారు ? దయచేసి టైర్లను తనిఖీ చేయండి. గాలి వత్తిడి ఎంతవుందో చూసేందుకు కాదు. వుపరితల రాపిడిని తట్టుకొని ఆకృతి మారకుండా వుండేందుకు రబ్బరుకు సహాయపడే జంతు సంబంధిత స్టెయరిక్‌ యాసిడ్‌ను టైర్ల తయారీదార్లు వుపయోగించారో లేదో చూడండి.

6. దేన్నయినా అంటించాలనుకుంటున్నారా ? జిగురును వుపయోగించండి. అయితే మరగపెట్టిన జంతు ఎముకలు, సంధాన కణజాలము, లేదా పశువుల చర్మాల నుంచి దానిని తయారు చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి. ఫెవికాల్‌ అంత గట్టిగా వుంటుంది, తెగదు.

7.ఇప్పుడు షాపింగ్‌కు వెళదాం. అయితే ప్లాస్టిక్‌ సంచులను వినియోగానికి దూరంగా వుండండి. ఎందుకని? షాపింగ్‌ బ్యాగ్స్‌తో సహా అనేక ప్లాస్టిక్స్‌ పదార్ధాలలో వత్తిడిని తగ్గించే స్లిప్‌ ఏజంట్స్‌ వుంటాయి.వాటిని దేని నుంచి తయారు చేస్తారు ? జంతు కొవ్వు నుంచి అని చెప్పనవసరం లేదనుకోండి.చమురును వుపయోగించి పోలిమర్స్‌ను తయారు చేసినప్పటికీ పదార్ధ గుణాలు, ధర్మాలను మెరుగు పరిచేందుకు జంతుసంబంధితమైన వాటిని ప్లాస్టిక్స్‌ తయారీదారులు తరచూ వుపయోగిస్తారు మరియు ముడి పోలిమర్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు కూడా వుపయోగిస్తారు.

8.దళితులు, ఆవు వ్యాపారులైన ముస్లింలపై దాడి చేసే మీ ప్రాధమిక పని గురించి చూద్దాం.దయచేసి ఆ కొట్లాటలో మీరు గాయపడకుండా చూసుకోండి. ఒకవేళ జరిగితే దయచేసి కాప్సూల్స్‌ కాకుండా టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్‌ను అడగండి. ఎందుకంటే కాప్సూల్‌ కవర్‌ మళ్లీ జంతు ప్రొటీన్‌ నుంచే తయారు చేస్తారు. మీకు కుట్లు వేయాల్సి వస్తే అందుకు వుపయోగించే దారాలు దేనితో తయారు చేసినవో దయచేసి డాక్టర్‌ను అడగండి. సాధారణంగా వాటిని పవిత్రమైన ఆవు పేగుల నుంచి తయారు చేస్తారు.

9.ఆశాభంగం చెందారా ? ఒకే ఐపిఎల్‌ మాచ్‌ చూద్దాం. అయితే ఆగండి. పరుగెట్టిస్తూ మిమ్మల్ని కట్టిపడవేసే ఆ క్రీడలో ఆవు ప్రమేయం వుందని మీకు తెలుసా ? పవిత్రమైన ఆవు. క్రికెట్‌లో వినియోగించే బంతిని కప్పి వుంచే తోలు ఆవు దూడ చర్మం నుంచి తీసిందే.

10.సరే.చలిగా వుంది. ఒక దమ్ము కొడదాం. అయితే సిగిరెట్‌ కూడా నాన్‌ వెజిటేరియన్‌ అయిపోయిందే. సిగిరెట్‌ బడ్‌లో పంది రక్తం కలుస్తుంది. అయితే ముస్లింలకు పంది అంటే ఇష్టం వుండదని తెలుసు కదా ? మీకు దానితో ఎలాంటి సమస్య లేదు. గుట్కా సంగతేమిటి? పశు చర్మాల శుద్ది తరువాత మిగిలిపోయే వక్క నుంచి సేకరించేదే గుట్కాలోని వక్క అని మీకు తెలుసా ?రెండు రూపాయల ఖరీదు చేసే పాకెట్‌ నుంచి మీరేమి ఆశిస్తారు? తాజా వక్కలా ? స్వయంగా పరిశీలించుకోండి, తయారీదారు చిరునామా కాన్పూరు, తోళ్ల పరిశ్రమ కేంద్రం, గ్రహించారా? కావాలంటే గూగుల్‌లో స్వయంగా తెలుసుకోండి.

11.సరే, వాటిని వదిలేయండి,ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం. అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలకోసం ఇంటికి తీసుకు వెళ్లే జెల్లీ బీన్స్‌, కాండీ కూడా మాంసాహారమే. వాటిని జంతు ఎముకల నుంచి తయారు చేస్తారు. ఆరుద్ర పురుగుల నుంచి తయారు చేసే అద్దకపు ఎరుపు రంగుతో పాటు మహిళలు వుపయోగించే లిప్‌స్టిక్‌ కూడా జంతు కొవ్వు నుంచి తయారు చేసిందే.యగ్‌హర్టు(పెరుగు వంటి పుల్లటి తినే పదార్ధం) ఐస్‌క్రీమ్‌, కనుపాపలను తీర్చిదిద్దే క్రీములో కూడా అది వుంటుంది.

ఇలాంటి వందల వుత్పత్తుల గురించి నేను వివరించగలను.(నిజాయితీగా చెప్పాలంటే వీటిపై పరిశోధన చేసేందుకు అవసరమైన వుత్సాహ హేతువును మీరు నాకు అందించారు) కానీ నేను ఒక అంశాన్ని స్పష్టం చేయకతప్పదు. అదేమంటే మీ విశ్వాసాలను నాశనం చేస్తున్నది దళితులు, ముస్లింలు కాదు. కార్పొరేట్‌ ప్రపంచం మీ విశ్వాస వ్యవస్ధలు విముక్తి పొందలేనంత గట్టిగా బిగించి వేసింది. అందువలన కొద్దిపాటి మొత్తాలు వచ్చే సొమ్ముతో సర్దుబాటు చేసుకొని జీవించేందుకు ఆ జంతువులతో వ్యాపారం చేస్తున్నవారి మీద మీరు దాడులు చేయటం ఎందుకు ? నిజమైన వ్యాపారం చేస్తున్నది కార్పొరేట్స్‌, వారి మీద దాడి చేయటానికి మీకు ధైర్యమున్నదా ?

సరే మీరు గొడ్డు మాంసం తినటానికి వ్యతిరేకం. మీ నిత్య జీవితంలో వుపయోగించే వస్తువుల తయారీకి వుపయోగించే జంతువుల ఎముకలు, కొవ్వు, చర్మాలు తదితరాలను మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కాబట్టి మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అందరికీ అవకాశం వుంది. మీ మతావేశంతో ఎప్పటి నుంచో వున్న బంధాలను నాశనం చేస్తున్నారు. దేనికోసమిది?

Image result for Gau Rakshaks, and their apologists

కలసిమెలసి జీవించండి. వాక్శూరనాయకుల చేతిలో బొమ్మలుగా మారకండి.మిమ్మల్ని సైనికులుగా వాడుకొనే వారు తమ రాజకీయలక్ష్యం తీరగానే చచ్చిన ఆవును పారవేసినట్లుగానే మిమ్మల్ని కూడా వదలివేస్తారు. ఎప్పటి నుంచో వున్న బంధాలను పున:జీవింపచేయండి.మీ ఇరుగుపొరుగు లేదా మీ స్నేహితులతో సంతోషంగా వుండండి, వారు మీ సామాజికతరగతికి చెందినవారే అయి వుండనవసరం లేదు. మీ దేశ ప్రజలను ప్రేమించండి. అయితే బాణసంచాపేల్చకండి.కాలుష్యం కావాలని ఎవరూ కోరుకోరు.బాణ సంచాలో అల్యూమినియం, ఇనుము వంటి లోహాల పౌడర్‌కు కోటింగ్‌ వేసేందుకు స్టియారిక్‌ ఆసిడ్‌ను ఎక్కువగా వాడతారు. అదిఆమ్లజనీకరణను నిరోధిస్తుంది.అందుకుదోహదం చేసేవాటిని దీర్ఘకాలం నిలువవుంచుతుంది.స్టియారిక్‌ యాసిడ్‌ను దేని నుంచి తయారు చేస్తారో ఎవరైనా వూహించారా?

పర్హాన్‌ రహమాన్‌

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆత్మవంచన మాని బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా !

27 Monday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BJP values, Casinos, Goa, Goa BJP, Goa Casinos, RSS, RSS Duplicity, The hippocratic BJP, UP News, Yogi Adityanath

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d