• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

మోడీగారూ పాచి పాటతో బోర్‌ కొట్టిస్తున్నారు !

22 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS

ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

ఎం కోటేశ్వరరావు

       ప్చ్‌ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్‌ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్‌ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్‌ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

      గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్‌ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్‌ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్‌ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.

     ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్‌ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్‌ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్‌ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

     స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్‌ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

      ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్‌ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్‌ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్‌,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్‌ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్‌ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్‌ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్‌ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్‌ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్‌ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.

      మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్‌ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్‌ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్‌ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్‌ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్‌ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్‌ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్‌ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్‌ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్‌ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలు ధర్మం అనేది వుంటే కదా రక్షించటానికి ?

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

budda, Dharma, Hinduism, Hinduthwa, vedas

కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని రక్షించటం అంటే ? అనే శీర్షికతో రిటైర్డ్‌ డిజిపి కె అరవిందరావు తన వ్యాసపరంపరలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన ప్రస్తావించిన విషయాల మంచి చెడ్డలను పరిశీలించబోయే ముందు ధర్మాన్ని రక్షించటానికి ముగింపులో ఆయన చెప్పిన మార్గంతో ప్రారంభిద్దాం. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరు చేయటం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చెప్పారని, అందరికీ వుపనయనం చేయాలని, గాయత్రీ మంత్రం నేర్పాలని ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనపడవచ్చు కానీ లోతుగా ఆలోచించాల్సిస విషయం.పైన చెప్పిన వర్గాల వారికి మేలు చేస్తున్నామనే భావంతో వారిని వుద్యమాల్లోకి దింపి మన దేశాన్నీ, సంస్కృతిని ద్వేషించేట్లు చేసేవారిని అడ్డుకోవటానికి ఇదొక మార్గం అని అరవిందరావు గారు సూక్ష్మంలో ధర్మాన్ని రక్షించే మోక్ష మార్గం చెప్పారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి మహానుభావులు ఆనాటికి తమకు తోచిన దానిని నిజాయితీగానే చెప్పారు. మన సమాజం ఎంతగా చీలిపోయి వుందంటే కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

      ఇక అరవిందరావుగారు ఆరోపించినట్లుగా మొదటి విషయం ఈ దేశంలో పుట్టిన వారెవరూ దేశాన్ని ద్వేషించటం లేదు. పుట్టుక అనేది ఒక ప్రమాదం వంటిది. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు తెలియదు. యాదృచ్చికంగా ఒక కుటుంబంలో పుడితే అగ్రకులమని, మరొక కులంలో పుడితే అధమ కులమని వెంటనే ముద్రవేసే కుసంస్కృతిని, సామాజిక దుష్టత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి కులాల అంతరాలను తరతరాలుగా కాపాడుతూ, అనుమతిస్తున్న ‘మను’ సంస్కృతిని కాపాడాలి అని ఎవరైనా అంటే ఏడునిలువులలోతున పాతి వేయాలంటూ దానిని ద్వేషిస్తున్న వారు మెజారిటీగా వున్నారు. సంస్కృతి పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి అడ్డగోలు వ్యవహారాలను రుద్దాలంటే కుదరదు. పనికిరానిదానిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆరోగ్యకరమైన దానిని ప్రోత్సహించటమే మానవ సంస్కృతి. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ప్రతిదాని మంచి చెడ్డలను విశ్లేషించినట్లే సంస్కృతిపై కూడా నిరంతరం చర్చ జరగాలి. నవీకరణ జరగాలి. కానీ అరవిందరావు గారు కొన్ని విశ్వవిద్యాలయాలూ, మీడియాలోనూ జరుగుతున్న చర్చను అసత్య ప్రచారంగా చిత్రిస్తున్నారు. విమర్శలకు రెండు కారణాలంటూ ఒకటి మన దేశాన్ని బలహీన పరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న వుద్యమాలు, రెండోది నిజంగానే మన వ్యవస్ధలో రావాల్సిన మార్పు. మొదటి అంశాన్ని ఇక్కడ చర్చించటం లేదు, కొంత మంది వేదాలు చదవటానికి అనర్హులు అని గీత గీసినట్లు రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోది అని చెప్పేశారు.

      పోలీసు వ్యవస్ధలో దీర్ఘకాలం పనిచేసిన అరవిందరావు వంటి వారికి విశ్వవిద్యాలయాలూ, మీడియాలో జరుగుతున్న చర్చలు దేశాన్ని బలహీనపరచాలనే వుద్యమాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఒక ఆరోపణ చేసి వాటిని ఇక్కడ చర్చించటం లేదు అని తప్పుకుంటే కుదరదు. మీ ఆరోపణ కూడా ఒక మీడియా వేదికలో చేసిందే అని గమనించండి. మీ దగ్గర ఆ చర్చలకు సరైన సమాధానం లేదని అనుకోవాల్సి వస్తుంది. రెండోది మన వ్యవస్ధలో రావాల్సిన మార్పులు పీఠాలు, ఆచార్యుల పరిధిలోనివి అన్నారు. ప్రపంచ మతాల చరిత్రలో ఏ పీఠం లేదా ఆచార్యులు కూడా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మనకు ఎక్కడా కనపడదు. వారిపై తిరుగుబాటు చేసిన వారికి ప్రతి దేశం,ప్రతికాలంలోనూ సామాన్య జనం మద్దతు ఇచ్చారు. మన దేశంలో స్థూలంగా హిందూ మతం అని పిలిచేదానిపై తిరుగుబాటుగానే బౌద్దం,జైనం అవతరించాయి. ఆ హిందూ మతంలో భిన్న భావజాలంతో వున్న శైవ, వైష్ణవ శాఖలు ఎలా కొట్టుకున్నాయో, ఒకదానినొకటి అంతం చేసుకోవటానికి ఎంత రక్తపాతానికి పాల్పడ్డాయో, అవే రాజీపడి బౌద్ధ,జైనాలను, అసలు మతాలనే సవాలు చేసే చార్వాకులు, లోకాయతులను, వారి గ్రంధాలను ఎలా నాశనం చేశాయో చరిత్రలో నమోదయ్యే వుంది. అనేక బౌద్ధ,జైనాలయాలను శివాలయాలుగా మార్చిన చరిత్ర ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందువలన ఇసు నుంచి తైలాన్ని తీయవచ్చుగానీ పీఠాధిపతుల నుంచి సంస్కరణలు ఆశించటమా? ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు జరగవు. మొత్తంగా చెప్పాలంటే సంస్కృతి మంచి చెడ్డల గురించి చర్చించటానికి, మార్చుకోవటానికి అరవిందరావు వంటి వారు సిద్ధం కాదు.

     ‘ప్రస్తుతం ఎలాంటి ఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టటం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించటం, అందుకు మన సమాజం మౌనం వహించటం ప్రమాదకరం.’ అని అరవిందరావుగారు వాపోయారు. పురాతన కాలంలో తక్షశిల, పాటలీ పుత్రవంటి మన విశ్వవిద్యాలయాలకు విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే వారని గర్వంగా చెప్పుకుంటాం. ప్రస్తుతం అంతకంటే విస్తృతమైన ప్రపంచీకరణ యుగంలో వున్నాము. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా విమర్శలు సరైనవా కావా అన్నది పాయింటు. అనేక తూర్పు ఆసియా దేశాలలో హిందూమతం, ఆచారాలు వ్యాపించాయి. వర్తమానంలో అనేక దేశాలలో మన దేశం నుంచి వలస వెళ్లిన వారు అక్కడ స్ధిరపడుతున్నారు, దేవాలయాలు నిర్మిస్తున్నారు, మతాచారాలను మరింతగా రెచ్చిపోయి పాటిస్తున్నారు. అందువలన ఎవరు ఎక్కడ చర్చించాలో చర్చించకూడదో గీతలు గీయటం సంకుచితం.

    ప్రతిదానికీ సంస్కృతితో ఎవరు ముడిపెడుతున్నారు? మతం వేరు సంస్కృతి వేరు. అన్ని మతాలు,అలవాట్లు, ఆచారాలను సహించటం మన సంస్కృతి. దాన్ని తిరస్కరించటం మత సంస్కృతి.దానిలో భాగంగానే అది ఏమతమైనా ఎవరేం తినాలో, దుస్తులు ఎలా ధరించాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పరుగెత్తాలో కూడా నిర్దేశించేందుకు పూనుకున్నారు. మీరే చెప్పినట్లు భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు వున్నాయనేది నిర్వివాదాంశం అయినపుడు చర్చలపై సమాజం మౌనం వహిస్తున్నదంటే వాటిని అంగీకరించినట్లే, మీ కెందుకు అంత దుగ్ద, లేదూ మీరు మౌనం వీడి చర్చలు, విమర్శలు ఎలా సరైనవికాదో విమర్శించండి. ఇస్లాం పుట్ట ముందే భారత దేశంలో బ్రాహ్మణులు లేత గోమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినటం గురించి రాసింది వాస్తవమా కాదా? గోవులు, కోడె దూడల మాంసం తినటం గురించి వేదాల్లో వుందా లేదా ? అలాంటపుడు గోవును హిందూ సంస్కృతికి ముడిపెట్టి గోవధ చేసిన వారిని చంపివేయాలని వేదాలు చెప్పాయని తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారి గురించి అరవిందరావు ఏమంటారు ? భారత్‌లో పురాతన కాలంలోనే హిందూ మత భావజాలాన్ని అనేక మంది సవాలు చేశారు. దాన్ని మన సమాజం అంగీకరించింది. అరవిందరావుగారే చెప్పినట్లు వైదిక సంప్రదాయంలోనే శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్దాంతాన్ని ఒకరు విమర్శించుకున్నారు. అలాంటిది వీరందరి సిద్ధాంతాలను కమ్యూనిస్టులో మరొకరో ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని అసహనం ఎందుకు వెల్లడి అవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశం వివిధ మతాల, మతరహిత భావజాలాల కేంద్రంగా వుంది. అలాంటి దానిలో జాతీయత అంటే హిందూయిజమే, హిందూయిజమే జాతీయత అన్న తమ భావాన్ని రుద్దేందుకు కాషాయ తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.వాదనలో తమతో ఏకీభవించని వారిని అంతం చేసేందుకు కూడా వీరశైవులు వెనకాడలేదని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు అది మరో రూపంలో పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

    పురాణాలు, ఇతిహాసాలపై విశ్వాసం వున్న వారి ప్రకారం నాలుగు యుగాలున్నాయి. వాటిలో మొదటిదైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచిందట. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సమాజం వున్నప్పటికీ ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదని, ఎవరి వృత్తి వారికి గొప్పదని, అందరికీ దేవుడు ఒక్కడేనని, ఆయనను ,స్వర్గం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి తపస్సు చేసుకోవటానికి అవకాశం వుందని చెబుతారు.ఈ యుగాలు, సామాజిక తరగతుల గురించి ఎవరికి వారు తమవైన వ్యాఖ్యానాలు చేస్తున్నందున వాటిలో ఒకదానిని నేను ప్రస్తావించాను.త్రేతాయుగం నాటికి ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదంతో నడుస్తుందని చెబుతారు. ఇది కలియుగ అంతం కనుక అసలు ఏకపాద ధర్మం అయినా వుందో లేదో తెలియటం లేదని బాధ పడేవారు కూడా లేకపోలేదు. అరవిందరావు వంటి వారు కలియుగ అంతంలో అసలు ధర్మం ఏమిటో అంత స్పష్టంగా తెలియని స్ధితిలో గడిచిపోయిన యుగాలలోని ధర్మాలను ఇప్పుడు అమలు జరపాలని చెబుతున్నారా అనిపిస్తోంది. ఎలా సాధ్యం ? మాతృగర్భం నుంచి ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తరువాత తిరిగి అమ్మకడుపులోకి వెళ్లటం ఎంత అసాధ్యమో గడచిపోయినట్లు చెబుతున్న యుగ ధర్మాలను ఇప్పుడు అమలు జరపటం అంత కష్టం.

     సత్యయుగంలో అందరూ సమానమే అని చెబుతూనే శూద్రులు మిగతా తరగతులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేయాలని కూడా చెప్పారు. ఇదొక వైరుధ్యం. సత్యయుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చని చెప్పారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి శూద్రులు తపస్సు చేయటం ధర్మవిరుద్ధంగా మారిపోయింది. వాల్మీకి రామాయణంలోని వుత్తరకాండలో రాసినదాని ప్రకారం ఒక రోజు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని శ్రీరాముడి వద్దకు వస్తాడు. నీవు కచ్చితంగా పాపం చేసిన కారణంగానే తన బిడ్డ మరణించాడని లేకుంటే బతికేవాడని ఆరోపిస్తాడు. ఆ సమయానికి ప్రత్యక్షమైన నారదుడు అసలు విషయం రాముడి పాపం కాదని ఒక శూద్రుడు తపస్సు చేస్తున్న కారణంగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడని చెబుతాడు. వెంటనే రాముడు తనిఖీకి బయలు దేరి వెళ్లగా శంబుకుడు కనిపిస్తాడు. రామా నేను బొందితో కైలాసానికి వెళ్లటానికి ఈ తపస్సు చేస్తున్నానని చెబుతాడు.అది అధర్మం అంటూ శంబుకుడిని రాముడు వధిస్తాడు. తన కంటే ముందున్న సత్య యుగంలో శూద్రులు కూడా తపస్సు చేయటానికి అవకాశం వున్న విషయాన్ని రాముడెందుకు గ్రహించలేకపోయాడు. అప్పుడు కానిది తరువాత అధర్మం ఎందుకు అయింది అని ధర్మ చర్చకు ఎందుకు పెద్దలను సమావేశ పరచలేకపోయాడు? నియంతల పాలనలో మాదిరి అంతా రామరాజ్యంలో కూడా ఏకపక్షంగా నడిచినట్లు కనిపించటం లేదూ?అసలు శూద్రులు తపస్సు చేయటం ఎందుకు నిషిద్ధం ? అరవిందరావు వంటి వారు చెబుతున్నట్లుగా వేదాలలో చేసిన వృత్తులు బట్టి వర్ణాలు వచ్చాయంటున్నారే, రాముడి కాలంలో ఆ వేదాలలో చెప్పిన దాని ప్రకారం శూద్రులు తపస్సు చేయటం ఎలా అధర్మం అవుతుంది? అంటే వేదాల స్ఫూర్తిని రాముడి కాలంలోనే తోసిపుచ్చారా ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవచేయటానికి శూద్రులు కట్టుబడి వుండాలి తప్ప ఇతరత్రా పనులు చేస్తే ఇదే జరుగుతుందని శంబుక వధతో రాముడు మిగతా శూద్రులను హెచ్చరించాడా ? నేటి దృష్టితో నాడు జరిగిన వాటిని ప్రశ్నించటం సమంజసమా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. నిజమే ! అది ప్రశ్నించేవారికే కాదు, నాటి ఆదర్శాలను నేటికీ వల్లె వేస్తున్నవారికి అమలు జరపాలని చూస్తున్న వర్తించదా ?

     బ్రాహ్మలు కాని వారు పూజా పునస్కారాలు, పౌరోహిత్యం చేయటం వల్ల, కమ్యూనిస్టులు వేదమంత్రాలతో పనిలేకుండా వివాహాలు చేయటం వలన బ్రాహ్మలకు కష్టకాలం వచ్చిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నారద మునీంద్రుల వంటి వారు నిజమే అని చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా ? తనపైన ప్రశ్నించే మరొకరు లేరనే కదా ఎవడో ఏదో అన్నాడని శ్రీరాముడు గర్భిణీ అని కూడా చూడకుండా సీతను అడవులలో వదలి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నేను రాముడిని అనుసరిస్తున్నాను, నా భార్య శీలం గురించి ఎవరో ఏదో అన్నారు కనుక నేను ఆమెను వదలి వేస్తున్నాను అంటే చెల్లుతుందా? లేదా నేను కృష్ణ భక్తుడిని ఆయన మాదిరి బహు వివాహాలు చేసుకుంటుంటే నిత్య పెళ్లి కొడుకు అని పోలీసులు జైల్లో పెట్టి నా మనోభావాలను గాయపరిచారు అని అంటే కుదురుతుందా ?

     ధర్మం నిర్వచనాన్ని ఎప్పుటి కప్పుడు పున:పరిశీలించాలి, మత పెద్దలు తప్ప మరెవరు చెప్పినా దీనికి ప్రామాణ్యం వుండదు అని అరవిందరావు అభిప్రాయపడ్డారు. అది జరిగేదేనా ? మత రాజ్యాలలోనే అలా జరగలేదు. అనేక మంది రాజులు మతాలు మారారు లేదా ఇతర మతాలను అనుమతించారు. ఇప్పుడు అది అసలు కుదిరేది కాదు.మత ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మా విశ్వాసంలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోకూడదు, మా మనోభావాలు దెబ్బతినకూడదు అంటున్నారు.ఇటువంటి స్ధితిలో ధర్మాన్ని ఎవరు నిర్ణయించాలి శైవులా, వైష్ణవులా ఇతర శాఖల వారా ?పోనీ వీరంతా రాజీ పడినా, ఇతర మతాల వారి ధర్మాన్ని అంగీకరించే పరిస్ధితి వుందా ?

     చివరిగా అరవిందరావు గారి మరో ఆవేదన గురించి చూద్దాం. ‘ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటి కపుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు…..ఎదుటి వాడి సిద్దాంతాన్ని సమీక్షించి తమ సిద్దాంతాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించటం, విమర్శలు వచ్చినా మన పండితులు, మత పెద్దలు స్దబ్దంగా వుండటం చాలా ఆశ్చర్యకరం ‘ అని వాపోయారు. మన మతం గురించి విదేశీ విశ్వవిద్యాలయాలలో చర్చించటాన్ని తప్పుపట్టిన అరవిందరావు ఈ విషయంలో పాశ్చాత్యులు కూడా వేలెత్తి చూపారని తన వాదనకు సమర్ధనగా తీసుకున్నారు. ఇది అన్యాయం కదా ? షెల్డన్‌ పోలాక్‌ అనే రచయిత ‘పదహారవ శతాబ్దం వరకు వున్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలు ఎలా వున్నా ఈ వ్యాఖ్యలో మాత్రం సత్యముంది అని ముక్తాయింపు నిచ్చారు.

     ‘ఈ కాలమందు మత త్రయము వారు( అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మత శాఖల్ని ప్రచారం చేసిన శంకర-రామానుజ- మధ్వాచార్వుల గురించి ) తమ తమ మత వ్యాప్తికై పరస్పర హింసా దూషణములతో వివాదపడి హిందూ రాజ్యముల దుర్బలతకు, తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునదేకు, తర్వాతి యరాజక స్ధితికి దేశము య్కె అత్యంత దయనీయ స్ధితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో, ఎంత గొప్ప భాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంధమవసరమగును’ అని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంలో రాశారు. విజయనగరం, కాకతీయ సామ్రాజ్యపతనాలకు ఈ మతాల చిచ్చు ఒక కారణంగా చెబుతారు. అవి పతనమైన తరువాత వాటి స్దానాన్ని నవాబులు, ఆంగ్లేయులు ఆక్రమించిన చరిత్ర తెలిసిందే. ఈ కాలంలో మత కొట్లాటలలతో లాభం లేదని ఆదరించే వారు వుండరని గ్రహించి ఒకరు కొకరు రాజీపడి కొత్త పాలకులను కొలవటానికి, బోగలాలసతకు అలవాటు పడిన మత పెద్దలు, పండిత లోకం వాడి,వేడిగా తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేనికీ ‘అసహనం’, ఎందుకా ‘సహనం ‘ ఓ మహాత్మా ! ఓ మహర్షీ !!

13 Saturday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

Intolerance, Reservations, Tolerance

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆవు, ఎద్దుల వేద శాస్త్రాలు నవకల్పనలకు దారి చూపవు

06 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

cow, cow sciences, innovations, innovations index, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

     ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అనటానికి అనేక కొలమానాలు వుంటాయి.  ఎక్కడో ఒక దగ్గర చోటు దక్కితేనే మనం కూడా ఆ రేసులో వున్నట్లు లెక్క. మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ చెబుతున్నదాని ప్రకారం చైనా కంటే కూడా అభివృద్ధి రేటులో ముందున్నాం. జైట్లీ గారి వేద గణితం ప్రకారం దేశం కంటే చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. కావాలంటే పెట్టుబడులకు అనువైన వాతావరణం వున్న రాష్ట్రాలలో మన స్ధానం ఏమిటో ప్రపంచబ్యాంకు నివేదికలను చూడండి అంటారు. వారు చెప్పే మాటలనే తీసుకొనేట్లయితే మనం ఇంక పెద్దగా అభివృద్ధి చెందాల్సిన పని లేదు.

     మన దేశానికి చెందిన సిఐఐతో సహా ప్రపంచంలో అనేక సంస్ధల ప్రతినిధులు, నిపుణులతో కూడిన బృందం రూపొందించే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌(ప్రపంచ నవకల్పన సూచీ)లో మనం ఎక్కడ అని చూసుకుంటే మన స్ధితి ఏమిటో తెలుస్తుంది. దీనికిగాను అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని భిెన్న సూచికలను తయారు చేస్తారు. ఏడాదికొకసారి ఈ నివేదికను విడుదల చేస్తారు. దీనిలో పైకి పోతున్నామా కిందికి దిగజారుతున్నామా అన్నది వ్యాఖ్యానం లేకుండానే మన స్ధితిని తెలుపుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అమెరికా మొదటి స్ధానంలో వుంది. తరువాత స్ధానంలో ఇప్పుడు చైనా చేరింది. త్వరంలోచైనాను మనం అధిగమించబోతున్నామని మన నేతలు చెబుతున్నారు. బహుశా ఇది కూడా వేదాల్లోనే చెప్పి వుంటారు.

      ఈ ఏడాది నవకల్పన సూచీలలో వంద మార్కులకు గాను 68.3తో స్విడ్జర్లాండ్‌ ప్రధమ స్ధానంలో,60.1తో అమెరికా ఐదవ, 47.47తో చైనా 29వ స్ధానంలో వుంది. 2013 జాబితాలో 36.17 మార్కులతో మన దేశం మొత్తం 71 దేశాలలో 66వ స్ధానంలో వుంది. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన తరువాత అసలు జాబితాలో పేరు లేకుండా పోయింది.మరో సూచిక ప్రకారం 2014లో 76వ స్ధానంలో వున్న మన దేశం 81కి దిగజారింది. 2011 నుంచి దిగజారుతూనే వుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ అనే సంస్ధ అనేక అంశాలను తులనాత్మకంగా విశ్లేషించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 90శాతానికి ప్రాతినిధ్యం వహించే 56 దేశాలను అది పరిగణనలోకి తీసుకుంది. తలసరి ప్రాతిపదికన ప్రపంచ నవకల్పనకు తోడ్పడటంలో ఫిన్లాండ్‌, స్వీడన్‌, బ్రిటన్‌ ముందు స్ధానాలలో వున్నాయి. భారత్‌, ఇండోనేషియా, అర్జెంటీనా చివరి దేశాలలో వున్నాయి.ఈ తోడ్పడటం అంటే ఏమిటి అంటే వాటిని అంగీకరించవచ్చు, విబేధించవచ్చు. పన్నులు ఎక్కువగా వుంటే, మేథో హక్కుల పరిరక్షణ బలహీనంగా వుంటే, స్ధానిక రక్షణ విధానాలను అనుసరిస్తే ప్రతికూలంగానూ లేకుంటే అనుకూలంగానూ పరిగణిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్ధితులలో వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ తమ ఆర్ధిక వ్యవస్ధలకు దెబ్బతగుల కుండా చూసుకోవటం కత్తిమీద సామువంటిదే. చైనా, వియత్నాం, లావోస్‌, కంపూచియా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కాపాడు కుంటూ సంస్కరణలతో ముందుకు పోతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన సంక్షోభం లేదా అననుకూలతలను అవి వినియోగించుకొంటున్నాయి.ఈ క్రమంలో నవకల్పనలకు ప్రోత్సాహమిచ్చిన దేశాలు లబ్ది పొందుతాయని వేరే చెప్పనవసరం లేదు.అటువంటి చొరవ చూపటానికి బదులు వేద విద్య, ఆవు,ఎద్దుల రాజకీయాల చుట్టూ తిప్పుతూ తిరోగమనంవైపు దేశాన్ని నడిపిస్తున్నారనేదే ఇక్కడ విమర్శ.

    ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువగా వున్న బ్రిటన్‌ ప్రచురితమైన పరిశోధనాంశాలలో 16శాతం కలిగి వున్నదని ఆ దేశ మంత్రి లూసీ నెవిలే చెప్పారు. ప్రపంచ నవకల్పన సూచీలో రెండవ స్ధానంలో కొనసాగటానికి ఇలాంటి పరిశోధనే ప్రధాన కారణం అని చెప్పనవసరం లేదు.మన దేశంలో పరిశోధనకు కేటాయిస్తున్న నిధులే చాలా తక్కువగా కాగా వాటికి కూడా కోత విధించటానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డీలకు నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌లకు కోత విధించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా గతేడాది విద్యార్ధులు యుజిసి ఆక్రమణ వుద్యమం జరిపిన విషయం తెలిసినదే. అన్ని రంగాలలో ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పరిశోధక రంగం నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది. దాని పర్యవసానమే ఇది. సామాజిక శాస్త్రాల పరిశోధనను నిరుత్సాహపరిచేందుకు ఈ చర్య అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సైన్సు పరిశోధనల పరిస్ధితి కూడా ఇంతే. పరిశోధనా రంగంవైపు యువత మొగ్గు చూపకపోవటమే ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదన్న విషయాన్ని వెల్లడిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ రాష్ట్రపతి పాలన కారణాలలో ‘గోవధ ‘ కూడా వుంది.

01 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Arunachal pradesh, BJP, Governer, President's rule

పంజాబ్‌ గోసేవ కమిషన్‌ అధ్యక్షుడు కిమిటీ భగత్‌ ఒక ప్రకటన చేస్తూ రోడ్లపై వదలి వేసిన ఆవులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని కోరారు.ఇదెక్కడో బయట చేసిన ప్రకటన కాదు, జలంధర్‌ నగరంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలోనే చెప్పారు.

ఎం కోటేశ్వరరావు

     ఈ శాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో కేంద్రం విధించిన రాష్ట్ర పతి పాలన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్నోసార్లు అక్రమంగా ఆ అస్త్రాన్ని వాడుకున్న మీకు మా చర్యను విమర్శించే హక్కు లేదని కాంగ్రెస్‌ నేతలను బిజెపి పెద్దలు చీల్చి చెండాడుతున్నారు. రాజభవన్‌ వెలుపల జరిగిన గోవధ కారణంగా అక్కడ శాంతి భద్రతలు దిగజారిపోయాయని గవర్నర్‌ జ్యోతి ప్రసాద్‌ రాజ్‌కోవా కేంద్రానికి పంపిన నివేదికలలో వున్నదంటే నమ్ముతారా ? రాష్ట్ర పతి పాలన విధింపునకు గల కారణాలను తెలపాలని అడిగిన సుప్రీం కోర్టుకు గవర్నర్‌ న్యాయవాది సత్యపాల్‌ జైన్‌ సమర్పించిన ఆధారాలలో గోవధకు సంబంధించిన ఫొటోలు కూడా వున్నాయి.అరుణాచల్‌లో ఆవును మిథున్‌ అని పిలుస్తారు, దానిని రాష్ట్ర జంతువుగా ప్రకటించారు.అసెంబ్లీ సమావేశాలను ముందుగానే జరపాలని గవర్నర్‌ జారీ చేసిన ఆదేశాలను గౌహతి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసిన తరువాత డిసెంబరు 17న రాజభవన్‌ ఎదుట అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పాల్గొని ఆవును బలి ఇవ్వటం కూడా శాంతి భద్రతలు దిగజారాయనటానికి ఒక కారణంగా గవర్నర్‌ పేర్కొన్నారు.

    దేశంలో రాజకీయాలు ఎటు పోతున్నాయి? ఏదైనా ఒక వ్యాసం రాయమంటే అటు తిప్పి ఇటు తిప్పి ఆవు మీద రాసినట్లుగా కాషాయపరివార్‌ ప్రతిదానికీ ఆవును రాజకీయాలలోకి తెస్తోందన్నది ఇంకా అర్ధం కాని వారెవరైనా వుంటే తెలుసుకోవటం మంచిది.ఆవును వధించిన వారిని చంపాలని వేదాలు చెప్పాయని ఈ రోజుల్లో చెప్పటమంటే సమాజాన్ని మధ్యయుగాల్లోకి, అంతకు ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. గొడ్డు మాంసం తినటానికి, అమ్మటానికి వీల్లేదని ఆంక్షలు విధించటం, తిన్నవారిని ఆవు మాంసం తిన్నారనే పేరుతో చంపివేయటం పచ్చి అనాగరికం.

     భారత్‌లో పశువధ శాలలు ఎక్కువగా పాలఫ్యాక్టరీలు ఎక్కువగా అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం పాల ఫ్యాక్టరీలు ఎక్కువ అని. కానీ వాస్తవాలు అలా లేవు మరి. మన కేంద్ర ప్రభుత్వ పశుసంరక్షణ, పాడి పరిశ్రమ, మరియు మత్స్యశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం పశువధ శాలలే ఎక్కువగా వున్నాయి.అధికారికంగా నమోదైన పశువధ శాలలు 1,623, పాల ఫ్యాక్టరీలు 213 , శీతలీకరణ కేంద్రాల వంటివి 793 వున్నాయి. ఆసక్తికరమైన దేమంటే పశుమాంసంపై నిషేధం గురించి బహుళ ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్ర 316 పశువధ కేంద్రాలతో ముందున్నది.తరువాత వరుసగా వుత్తర ప్రదేశ్‌ (285), తమిళనాడు(130) కేరళ(55) పశ్చిమ బెంగాల్‌ (11) సిక్కిం(4) మిజోరం(2) వున్నాయి.ఇవన్నీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినవే అని పాల ఫ్యాక్టరీల కంటే మాంస ఫ్యాక్టరీలకు ఎక్కువగా అనుమతిచ్చారని సమాచార హక్కు కార్యకర్త ఒకరు పేర్కొన్నారు.పైన పేర్కొన్నవి ప్రభుత్వం వద్ద నమోదైనవి మాత్రమే. ఇవిగాక స్ధానిక సంస్ధల వద్ద నమోదైన వధశాలలు 4000, నమోదు కానికి 25వేలు వుండవచ్చని అంచనా. అనేక చోట్ల అనుమతి లేకుండా వధిస్తున్నవి రెట్టింపు వుంటాయని వెల్‌కన్‌ యానిమల్‌ హెల్త్‌ సాంకేతిక విభాగ అధిపతి డాక్టర్‌ అవినాష్‌ శ్రీవాత్సవ అంటున్నారు.

    బీహార్‌ ఎన్నికలలో లబ్ది పొందేందుకు బిజెపి ఆవు రాజకీయం చేసిందని, తమిళనాడులో ఎద్దుల రాజకీయం చేసిందన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కేరళ, పశ్చిమ బెంగాల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలో అవులతో సహా దేని వధపైనా ఎలాంటి నిషేధాలు లేవు.

పశువధ నిషేధం-ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం

    ప్రపంచంలోని పశు సంపదలో 13శాతం(19.1కోట్లు) మన దేశంలోనే వుంది, ప్రపంచ గేదె(బర్రెలు)లలో 56శాతం(11 కోట్లు) మనవే.ఇంత పశుసంపద వున్నపుడు వాటిని మాంసం కోసం వధించకుండా నిషేధిస్తే ఆర్ధిక వ్యవస్ధపై దాని ప్రభావం తప్పుకుండా వుంటుంది. ప్రపంచంలో ఎక్కువగా పాలు వుత్పత్తి చేసే మనదే అయినప్పటికీ వాటిలో 55శాతం గేదె పాలే. మాంస వుత్పత్తిలో ప్రపంచంలో ఐదవ స్ధానంలో వున్నాము.ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం మధ్య, తూర్పు రాష్ట్రాలలో కోడెలు, ఎద్దులను మాత్రమే వధించటానికి అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఎంపీ, పంజాబ్‌, రాజస్ధాన్‌,యుపిలలో పూర్తి నిషేధం వుంది. ఈ కారణంగానే ఈ రాష్ట్రాల నుంచి పశుసంపదలను తరలించటం అక్రమంగా పరిగణించి కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో అదే జరిగింది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్‌,నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో కొన్ని షరతులకు లోబడి పశువధకు అనుమతి వుంది.

     ఆవు, పశుమాంస రాజకీయాల కారణంగా మాంస ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. రాయిటర్‌ వార్తా సంస్ధ వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఏప్రిల్‌-సెప్టెంబరు)ఆరునెలల్లో 13.2శాతం గేదె, దున్న మాసం ఎగుమతులు పడిపోగా 15.5శాతం ఆదాయం పడిపోయింది. తోళ్ల పరిశ్రమపై 25లక్షల మంది వుపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులే అని చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ పరిశ్రమలోని వారు కూడా ఎప్పుడేం జరుగుతుందో ఎవరు వచ్చి ఆవుతోళ్లను తీస్తున్నారని దాడులు చేస్తారోనని భయపడుతున్నారు.చివరకు చచ్చిపోయిన ఆవులను ముట్టుకొనేందుకు కూడా భయపడుతున్నారని కాన్పూరుకు చెందిన ఒక తోళ్ల శుద్ది యజమాని వాపోయారు. పులి చర్మకంటే ఆవు చర్మ రవాణా ప్రమాదకరంగా మారిందన్నారు.దీంతో అనేక కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయి.

    సాధారణంగా రైతులు వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయిస్తారు. వాటిని కొన్నవారు పశువధ శాలలకు తరలిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు మాంసం, వధపై నిషేధం విధించటంతో రైతులు వాటిని వీధులలో వదలి వేస్తున్నారు. అది వారికి ఆర్ధికంగా నష్టంతో పాటు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఎవరైనా వాటిని పట్టుకొని తరలిస్తే సంఘపరివార్‌ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, వాటిని వీధుల్లో వదలి వేస్తే పర్యావరణ సమస్యలు ముఖ్యంగా పట్టణాలలో రవాణా, తదితర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. 2012 గణాంకాల ప్రకారం దేశంలో 53లక్షల పశువులు అటు పాడికి, ఇటు వ్యవసాయానికి పనికిరానివి వున్నాయని అంచనా.వాటిలో పదిలక్షల పశువులను పట్టణాల్లో వదలి వేశారని లెక్కలు చెబుతున్నాయి. వీటికి ఆహారం, వైద్యం ఏవీ అందవు. ఎవరూ బాధ్యత తీసుకోరు. అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలకు ఈ పశువులు కారణమౌతున్నాయి. భారత దేశం ఎదుర్కొంటున్న అపరిశుభ్రత సమస్య లలో ఇలా వదలి వేసిన పశువుల నుంచి కూడా వుత్పన్నమౌతోందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చెప్పింది. పర్యావరణ సమస్యలతో పాటు అనేక వ్యాధులను ఇవి ఒక చోటి నుంచి మరోచోటికి వ్యాపింప చేస్తున్నాయి.

ఆవులకూ స్మార్ట్‌ సిటీలు !

     నరేంద్రమోడీ సర్కార్‌ సమాజంలోని ధనికులకే కాదు, వారితో సమంగా వీధులలో తిరిగే ఆవులూ, గేదెలకూ స్మార్ట్‌ సిటీలను నిర్మిస్తుందా ? మానవులకు అన్ని వసతులూ ఒకేచోట కల్పించినట్లుగా ఈ పశువులకూ కల్పించని పక్షంలో అవొక సమస్యగా మారేట్లు వున్నాయని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ గోసేవ కమిషన్‌ అధ్యక్షుడు కిమిటీ భగత్‌ ఒక ప్రకటన చేస్తూ రోడ్లపై వదలి వేసిన ఆవులను స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని కోరారు.ఇదెక్కడో బయట చేసిన ప్రకటన కాదు, జలంధర్‌ నగరంలో జరిగిన ఒక అధికారికి సమావేశంలోనే చెప్పారు.కొంత మంది కేవలం ఆవులకు మాత్రమే పునరావాసం ఎందుకు కల్పించాలి? మిగతా పశువులను ఎందుకు మినహాయిస్తున్నారని అభ్యంతర పెట్టారు.వీధి కుక్కలు అనేక మందిని బలిగొన్నాయని, వాటిని స్మార్ట్‌ సిటీ పరిధిలోకి ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. గోవులకు మాత్రమే గోవుల బోర్టు వుంటే అంతరిస్తున్న మిగతా జంతువుల సంగతేమిటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు మాత్రమే సరిపోయే జంతువుల గురించే మాట్లాడటం సరైనది కాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    పంజాబ్‌లోని అనేక పట్టణాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. లూధియానా చుట్టూ ఒక్క్కొ దానిలో 70వేల ఆవులున్న రెండు పెద్ద డైరీలు వున్నాయి. చిన్నవి చాలా వున్నాయి. వట్టి పోగానే వాటినుంచి వీధులలోకి వదలి వేస్తున్నారు. వీధి ఆవుల సంరక్షణకు లూధియానా నగరపాలక సంస్ధ ఏటా కోటీ 30లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.అయినా సమస్య తీరలేదు.ఏడాది కేడాది పెరుగుతూనే వున్నాయి. నిధుల కొరతను అధిగమించేందుకు పంజాబ్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌ ఆవు సెస్సు పేరుతో వినియోగదారులను బాదటం మొదలు పెట్టింది.యూనిటక్‌ పది పైసల వంతున విధిస్తే నెలకు అదనంగా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమైంది వెంకయ్య గారూ ? మీ సమస్య ఏమిటి ?

31 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ 1 Comment

Tags

BJP, Dalit, Rahul gandhi, Rohith Vemula, University of Hyderabad (UoH), Vemula Rohit, Venkaiah naidu

లేఖల మీద లేఖలు రాసే మీ తోటి మంత్రి దత్తన్న స్ఫూర్తితో ఒక బహిరంగ లేఖ

      వెంకయ్య నాయుడు గారూ తెలుగు రాష్ట్రాలలో ప్రాసలను గుమ్మరించి వుపన్యాసాలు చెబుతూ జనాన్ని ఆకట్టుకొనే దిట్టలలో మీరు ఒకరు. దానితో సమస్య లేదు. హైదరాబాదు నగరాభివృద్ధికి వాజ్‌పేయి ఆద్యులు-చంద్రబాబు బాధ్యులు అన్నది మీ మాటల పొది నుంచి తాజాగా తీసిన నినాదం. కొత్తవారు ఎవరైనా హైదరాబాద్‌ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే చార్మినార్‌ , హుస్సేన్‌ సాగర్‌, గోల్కోండ కోట, కొండలు, గుట్టలు మొదలు ఇక్కడ లక్షలాది మందికి వుపాధి కలిగిస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమలను వాజ్‌పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగానే వచ్చాయని అనుకొనే ప్రమాదం లేకపోలేదు.వారికి అంత సీన్‌లేని చెప్పటం అవసరమోమో ఆలోచించండి.

     ఒక బిహెచ్‌యిఎల్‌, ఒక ఇసిఐఎల్‌ ఇలా ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమను హైదరాబాదులో వారి హయాంలో నెలకొల్పకపోగా హెచ్‌ఎంటి, ప్రాగా, ఐడిపిఎల్‌, ఇలా ఎన్నో పరిశ్రమలను మూసివేయించి పుణ్యం కట్టుకున్న పెద్దలు అంటే అతిశయోక్తి కాదు.ఈ మాట చెప్పగానే రింగ్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, ఐటి కంపెనీల మాటేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఒక అందగత్తె గర్వంతో ఒక రోజు తన భర్తతో ఏమండీ నేనే గనుక పుట్టి వుండకపోతే మీరు ఎవరిని వివాహం చేసుకొని వుండేవారు అని అడిగిందట. దానికా భర్త నువ్వు గాక పోయివుంటే నీ అమ్మను చేసుకొని వుండేవాడిని అన్నాడట.

      వాజ్‌పేయి, చంద్రబాబు నాయుడు లేకుండానే ఐటి పరిశ్రమలు బెంగళూరులో,చెన్నయ్‌, పూనేలలో ఎలా వచ్చాయి. నరేంద్రమోడీ వంటి కారణజన్ముడు పుట్టిన గుజరాత్‌లో ఐటి పరిశ్రమలు ఎందుకు రాలేదు, బిజెపి బలంగా వున్న వుత్తరాది ఇతర రాష్ట్రాలలో ఎందుకు రాలేదు అంటే వెంకయ్య గారేమంటారు? చంద్రబాబు మాదిరి అడిగిన వారు ఆ రాష్ట్రాలలో లేకపోయారా ? విజయవాడ, విశాఖ, వరంగల్‌, చివరికి మీ నెల్లూరును ఎందుకు అభివృద్ధి చేయలేదు? కేవలం రాజధాని నగరాలను మాత్రమే అభివృద్ధి చేయాలనేది ఒక విధానమా లేక రహస్య అజెండాగా అమలు జరిపారా ? రింగ్‌ రోడ్‌ విషయానికి వస్తే వారి హయాంలో వేసినదాని కంటే పెద్దదాన్ని రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు సార్‌ ?అయినా వాజ్‌పేయి వంటి వ్యక్తి కేవలం హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేసి మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆయనేమి జాతీయ నాయకుడు ? అడగటానికి ఇలా చాలా వుంటాయి. ఏదో ఓట్ల కోసం వచ్చారు, అడిగారు అంతవరకు మంచిది, మిగతా విషయాలపై మూసుకుంటే మంచిదేమో ?

      వెంకయ్యగారూ మీరు ఓట్ల కోసం హైదరాబాదు వస్తున్న సమయంలోనే కాంగ్రెస్‌ నేతో రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక రోజు దీక్ష కోసం వచ్చారు. మీ కడుపు మంట ఏమిటి ? కాంగ్రెస్‌, వామపక్షాలు ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ విషయమై రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు.అసలు ముందు అక్కడి వ్యవహారాలలో జోక్యం చేసుకున్నదెవరు? రాజకీయం చేసిందెవరు ? బిజెపి ప్రజాప్రతినిధులు, మంత్రులు కాదా ? రోహిత్‌ మరణాన్ని దళితేతర సమస్యగా మార్చే అతి పెద్ద రాజకీయానికి తెరతీసిందెవరు ? అసలు మీ సమస్య ఏమిటి ? హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అంతకు ముందు చాలా మంది మరణిస్తే, వరంగల్‌లో రాజయ్య కుటుంబంలో మరణాలు జరిగినపుడు ఎందుకు రాలేదు అంటున్నారు ? నిజమే సార్‌ రాలేదు, వాటి వెనుక కూడా మీ మంత్రులు, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏల లేఖలు, హస్తాలు, వత్తిడి వున్నాయా లేక నాటి కాంగ్రెస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధుల వత్తిడులు వున్నాయా చెప్పండి, అన్నింటినీ కలిపి అఖిలపక్ష ఆందోళన చేస్తే దళితులు ఎందుకు ఆత్మహత్య లు చేసుకుంటున్నారో తేలుతుంది. అన్నట్లు గుర్తొచ్చింది, దేశంలో అనేక మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి దాని మీద స్పందించకుండా కూడికలు-తీసివేతల లెక్కలు వేసుకొని ఐదు రోజులు అయినా ఇంకా ఇంత లాభం వస్తుంది అని వేద గణితంలో నిర్ధారణకు వచ్చిన తరువాతే కదా రోహిత్‌ వుదంతం మీద ప్రధాని నరేంద్రమోడీ స్పందించటం రాజకీయం కాదా ?

      హర్యానాలో ఇద్దరు దళితుల పిల్లలను సజీవ దహనం చేసిన దుర్మార్గం మీద ‘ఎవరో రాళ్లు వేసి వీధిలో ఒక కుక్కను చంపితే ప్రభుత్వం ఎలా బాధ్యురాలు అవుతుంది’ అన్న మీ మంత్రి వీకె సింగ్‌ మాదిరి రోహిత్‌ మరణాన్ని కూడా అలాగే తీసుకోవాలనా ? అసలు మీ సమస్య ఏమిటి ? ఈ వుదంతాన్ని అసలు ఖండించాలా వద్దా ? ఖండించాలి అనుకుంటే రాజకీయ వాసనలు తగల కుండా ఎలా ఖండించాలో కావాలనుకుంటే మీ తరహా యతి ప్రాసలను చేర్చి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక పత్రాన్ని రూపొందించి దేశం మీదకు వదలండి , దాన్ని నలుగురి చేతా కనీసం మీకు నొప్పితగలకుండా మోసే తెలుగుదేశం, పోనీలే, పోయింది ఒక దళితుడే మన వాడే కదా అయినా అతని కులమేమిటో నిర్ధారణ కాకుండా స్పందించటేమిటి అసహ్యంగా అన్నట్లు వున్న , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తెరాస వంటి పక్షాల చేత ముందు వప్పించండి, తరువాత దాని మీద అందరూ స్పందించి సంతకాలు చేస్తారు. అవేమీ లేకుండా ఎంతగా మాట్లాడినా జనం అదేదో సినిమాలో అడిగినట్లు అసలు నువ్వు ఎవరు ? అన్నట్లుగా అసలు వెంకయ్యగారి ఏమిటి అని అడుగుతూనే వుంటారు.

భవదీయుడు

ఒక పాఠకుడు

Share this:

  • Tweet
  • More
Like Loading...

Despite having 40 Dalit MPs, why has the BJP ignored Dalit complaints? Dr Ambedkar has the answer

28 Thursday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Readers News Service, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, BJP, Dalit, MP, Reservations, Rubber stamps

After a failed two-decade bid for separate electorates, Ambedkar asked for reservation for Dalits in legislatures to be scrapped, arguing that these MPs did not represent the Dalit community.
Shoaib Daniyal  ·
Despite having 40 Dalit MPs, why has the BJP ignored Dalit complaints? Dr Ambedkar has the answer

The Bharatiya Janata Party’s conduct in the case of Dalit scholar Rohith Vemula shows that Dalits still have a very small stake in power in Delhi.

Before the young man’s death, the Union Labour Minister Bandaru Dattatreya and the Union Human Resources Ministry had hounded the Ambedkar Student Association – a Dalit body at the University of Hyderabad of which Vemula was a member – calling it “casteist” and “anti-national”.

After his suicide, a BJP spokesperson called Vemula an “abusive anti-national” and a “terror apologist” on Twitter. In the same vein, BJP general secretary P Muralidhar Rao describedVemula as a supporter of terrorism, while Human Resources Development Minister Smriti Irani denied that the case had anything to do with caste.

BJP’s Dalit paradox

The BJP is often characterised as a “Brahmanical party” by Indian liberals and leftists – but it’s a description that, in real terms, could fit the Indian left and Congress as well. It must be remembered that Rohith Vemula had joined the Ambedkar Student Association after leaving the Marxist Student’s Federation of India because he was bitterly disappointed with its casteism.

Moreover, on paper, the BJP has a significant number of Dalit Lok Sabha members. Out of the 66 reserved Dalit Lok Sabha constituencies, the BJP won 60% – that is, 40 seats – in the 2014 elections. Almost 15% of the BJP’s Lok Sabha strength consists of Dalit MPs elected from reserved seats.

In spite of having such an impressive Dalit contingent, why did the BJP go so wrong in addressing this matter? Why did so many Dalit MPs not affect the functioning of their government and party? Why was, say, Dattatreya allowed to hound the Ambedkar Students Association? And how was the BJP spokesperson permitted to paint Rohith Vemula as a terrorist sympathiser even after his death?

Reduced to rubber stamps?

The answer to these maybe lies in the fact that the reservation of seats in the Lok Sabha is an ineffective mechanism for ensuring Dalit representation in politics.

In this system, the BJP has 40 MPs elected from seats reserved for Dalits – making it the largest “Dalit party” in the Lok Sabha. However, the real political strength of these MPs can be gauged from the fact that not one of them made it to Narendra Modi’s cabinet when he was sworn in as prime minister. Later on, in November 2015, Modi did add two of these 40 to the government but neither were made cabinet ministers and had to be content being ministers of state.

Clearly then, this number of 40 Dalit MPs means almost nothing in terms of wielding real political power. While the BJP is dependent on the Dalit vote, these 40 Dalit MPs elected from reserved seats are not seen as crucial to attracting actual Dalit voters.

Ambedkar’s critique of the system

While this is only the latest manifestation, the ineffectiveness of this system of reservation has been a long-standing complaint of the Dalit movement, right from the time of BR Ambedkar.

In the 1931 Second Round Table Conference, held to discuss India’s constitutional future, Ambedkar had argued for separate electorates for Dalits, in which Dalit voters would elect Dalit representatives. Gandhi, as the leader of the Congress, opposed this, pushing for no caste-wise electorates (basically the current system). In 1955, Ambedkar minced no wordswhen he said that Gandhi’s system of a common electorate would elect Dalit nominees who “would really by slaves of the Hindus, not independent people”.

In the end, however, Ambedkar had to bend, since Gandhi went on a fast-unto-death. He signed the Poona pact, as per which Dalit representatives would not be elected by a separate Dalit electorate but by all castes. As a small concession to Ambedkar, however, a primary election was to be held for each Dalit constituency where only Dalits would be allowed to vote. The names of the four leading candidates from this primary would then be put to the common electorate for the final election.

As Ambedkar has predicted, the system of joint electorate was disastrous for his party and beneficial for the Congress, even though the latter’s leadership was completely dominated by upper castes. In 1937, in the first election held under the Poona pact, the Congress won more than half of the reserved Dalit seats. Ambedkar’s outfit, the Independent Labour Party, won just 12. In the next election in 1946, Congress’s win and Ambedkar’s defeat was even more decisive. The former won 123 out of 151 Dalit seats. Ambedkar’s party won only two.

‘Sham representation’

Ambedkar was angry at the results and blamed the system of joint electorates for it. Hepointed out that in the 1946 election primaries, in which only Dalits voted, his party got 26% of the votes compared to the Congress’s 29%. Yet the Congress got 60 times the number of seats when the final elections, in which all castes could vote, took place. Thus these elected nominees from reserved seats did not really represent the Dalits, he argued. In late 1946, Ambedkar said:

A separate electorate would alone guarantee to the Scheduled Castes the possibility of electing to the legislatures members of their own who could be trusted to fight in the legislatures and the executive whenever they did anything which had the effect of nullifying the rights of the Untouchables […]. It will be noticed that the Congress has been able to elect on its ticket representatives of the Scheduled Castes all throughout India in the different provincial legislatures. And yet, not one of them has even asked a question, moved a resolution or tabled a cut motion in order to ventilate the grievances of the Scheduled Castes […]. It would be much better not to have representation at all than to have such sham representation in the legislature.”

And this wasn’t only Ambedkar’s bugbear. MC Rajah, who was described by Oliver Mendelsohn and Marika Viczianyand as “the most prominent pre-Independence Untouchable politician other than Ambedkar”, was originally a strong supporter of Gandhi and had fully backed the Poona pact. Yet, after only a year of seeing joint caste electorates in action, Rajah agreed with Ambedkar (in spite of their personal rivalry). In 1938, after the Congress government in Madras province refused to support temple entry legislation, Rajah wrotebitterly to Gandhi:

“I am forced to think that our [Dalits] entering into the Joint Electorates with the Caste Hindus under the leadership of the Congress, far from enabling us, has enabled the Congress, led by Caste Hindu leaders to destroy our independence and cut our own throats. “

Post-Independence

After 1947, there was no question of having separate Dalit electorates. To begin with, a separate electorate for Muslims was widely believed to have been a crucial enabler for the creation of the Pakistan. Secondly, the Congress dominated the Constituent Assembly and there was little possibility of it suddenly reversing its two-decade-old stand, with or without Partition. In fact, the Indian Constitution, as it was scripted, further diluted Dalit rights vis-a-vis the Poona Pact, scrapping the system of Dalit-only primaries. As a final, desperate attempt, Ambedkar sponsored an amendment which aimed to ensure that candidates from reserved constituencies should also get 35% of the Dalit vote, thus ensuring that Dalit legislators were truer representatives of the community. However, Vallabhai Patel dismissed it, patronisinglyarguing, ” I resist this only because I feel that the vast majority of the Hindu population wishes you [Dalits] well. Without them where will you be? Therefore, secure their confidence and forget that you are a Scheduled Caste[…] or else if they carry this inferiority complex, they will not be able to serve the community.” [Emphasis added]

Unsurprisingly, in independent India’s first election in 1952, Ambedkar’s party won only two Lok Sabha seats. From this, Ambedkar concluded that the system of reserving seats for Dalit legislators elected via joint electorates was disastrous, the worst of both worlds. These elected MPs were not representing Dalit interests and by having reserved seats in the first place, Dalits were unable to build electoral coalitions with other social groups. In 1955, Ambedkar’s party formally passed a resolution asking for Dalit reservation in legislatures to be scrapped.

Like in 1932, Ambedkar was ignored in 1955 as well, and the system of Dalit reservation in India’s legislatures remained the same as before. That this is “sham representation” is borne out by the fact that, though upper caste interest groups keep on railing against Dalit reservations in jobs and education, no one really chafes at reservation in Parliament, given how limited its impact is on the structures of power. As Christophe Jaffrelot points out, in the initial years after independence, the Congress “became adept at co-opting Scheduled Caste leaders and and getting them elected by mobilising non-Scheduled Caste voters.” And now this system has been replicated by the Bharatiya Janata Party. So even though it is the party with the largest number of Lok Sabha Dalit MPs, the BJP is baffled when it comes to responding to a grave Dalit tragedy such as Rohith Vemula’s suicide.

This article first published on scroll.in

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీకి 20నెలలు నిండినా……….

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

20 months of narendra modi rule, BJP, Narendra Modi, Narendra Modi Failures

సత్య

ఈ పదవికి నేను అసలే కొత్త చిక్కులు,తికమకలు తెలుసుకోవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అనుకున్నాను, కానీ అంత వ్యవధి అవసరం లేదని మొదటి నెలలోనే అర్ధం అయింది అని ప్రధాని నరేంద్రమోడీ 2014 జూన్‌ 26న దేశ ప్రజానీకానికి లేఖ రాసి పందొమ్మిది నెలలైంది.ఆంటే ఆయన పదవిలోకి వచ్చి 20నెలలు పూర్తయింది. పదవీ కాలంలో మూడోవంతు అయిపోయింది. పదవిలోకి రాకముందు తానేం చెప్పారో, వచ్చిన తరువాత ఏం చేశారో, ఎందుకు చేయలేకపోయారో నెలనెలా జనానికి చెబుతారని తొలి నెల లేఖతో అనేక మంది ఆశించారు. విలేకర్లకు దూరంగా వున్న మన్మోహన్‌ సింగ్‌ మౌన ముని అని పేరు తెచ్చుకుంటే నరేంద్రమోడీ ఆయనే మంచోడు అనిపిస్తున్నారు. ఏకపక్షంగా మన్‌కీ బాత్‌(మనసులోని మాట) పేరుతో నెల నెలా రేడియోలో చేస్తున్న వుపన్యాసాలలో ఏం చెబుతున్నారో కనీసం బిజెపి వారికి అయినా అర్ధం అవుతోందో లేదో తెలియదు కానీ సామాన్య జనానికి అంతుబట్టటం లేదు.

కొండంత రాగం తీసినట్లుగా అనేక అంశాలను దేశం ముందుకు వదిలారు. వాటిలో గుజరాత్‌ మోడల్‌ను దేశం మొత్తానికి వర్తింప చేయటం ఒకటి. ఇన్ని నెలలు అవుతున్నా అదొక బ్రహ్మ పదార్ధంగానే వుంది. మచ్చుకు నర్మదా ప్రాజెక్టు కింద 18లక్షల హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించాల్సి వుండగా ముఖ్యమంత్రిగా మోడీ 13 సంవత్సరాల పాలనతో సహా గత 35 సంవత్సరాల తరువాత కూడా లక్షా 17వేల హెక్టార్లకు మాత్రమే నీరిందించారు, 21శాతం పిల్లకాలవలే పూర్తి చేశారు. గుజరాత్‌ మోడల్‌ అంటే ఇదేనా ! దీన్ని దేశానికంతటికీ వర్తింప చేస్తారా ?

కమ్యూనిస్టులంటే గిట్టని వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని మేకిండియా పిలుపునిచ్చిన మోడీ స్వరాష్ట్రంలో లేక దేశంలోనే తయారు చేసే ఫౌండ్రీలే లేకనా కమ్యూనిస్టు చైనాలో తయారు చేయిస్తున్నారు? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు చైనాను చూసి మన దేశంలో కూడా వస్తువులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటూ మేకిండియా పిలుపునిచ్చారు. కొత్తగా తయారు చేయటం దేవుడెరుగు , ఇప్పటికే తయారు అవుతున్నవే కొనేవారులేక ఎగుమతులు నెలనెలా తగ్గిపోతున్నాయి. ఆర్ధిక వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తానని, వురుకులు పరుగులు పెట్టిస్తానని చెప్పారు ? ధరల పెరుగుదల, మత వుద్రిక్తతలు, అసహనం తప్ప మిగిలిన అన్ని రంగాలలో 20 నెలల క్రితం కంటే తిరోగమనం తప్ప పురోగమనం ఎక్కడా కనపడటం లేదు. మోడీ అధికారానికి రాక ముందు ఐదేళ్ల సగటు పారిశ్రామిక వృద్ధి రేటు 9.9శాతం వుండగా ఏడాది క్రితంతో పోల్చితే నవంబరులో 3.2 నమోదైంది. పారిశ్రామిక రంగంలో గుజరాత్‌ మోడల్‌గా దీన్ని పరిగణించాలా ? పెట్టుబడుల సమీకరణ, దేశ ప్రతిష్టను పెంచేందుకే విదేశీ పర్యటనలు అని చెప్పిన ప్రధాని గతేడాది 26 దేశాలలో పర్యటించారు. నెలకు కనీసం రెండు దేశాలు వెళ్లి వచ్చారు.వుల్లి పాయలు, కందిపప్పుల ధరలు పెరిగి జనాన్ని వురుకులు పరుగులు పెట్టించి రికార్డుల మీద రికార్డులు నమోదు చేశాయి.

మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ 24,716గా వుంది, తరువాత 30వేల వరకూ పెరిగింది. ఈనెల 25న 24,486 పాయింట్లుగా నమోదైంది. నాలుగువేల పాయింట్లు పడిపోయింది.అంటే మన పరిశ్రమలు, వాణిజ్యం పనితీరు బాగోలేదని ప్రతిపక్షాలు చెప్పనవసరం లేదు. సెన్సెక్స్‌ ప్రమాణం కాదు అని ఎవరైనా అంటే ఒక్క మహారాష్ట్రలోనే మూడువేల మంది రైతులు గతేడాది ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయమూ గిట్టుబాటు కావటం లేదనేగా, కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ బీమా పధకం ఎలా వుపయోగపడుతుందో ఇంకా చూడాల్సి వుంది.

తమ మోడీ అధికారానికి వస్తే బక్క చిక్కిన రూపాయి పాపాయి బొద్దుగా తయారై 2013లో వున్న రికార్డు విలువ 68.6 నుంచి డాలరుకు రు.40-45కు పెరుగుతుందని ఆయన మద్దతుదారులు చెప్పారు. ప్రస్తుతం రు 68-67 మధ్య కదలాడుతోంది. ఈ కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గిపోయినా ఆమేరకు వినియోగదారులకు పెట్రోలు డీజిల్‌ ధరలు తగ్గకపోగా కేంద్రం, రాష్ట్రాలు పన్నులు పెంచాయి.ఏదో ఒక సాకుతో పన్నులు పెంచటంలో మోడీ సర్కార్‌ ముందుంది. స్వచ్చభారత్‌ పేరుతో పన్నులపై సెస్‌ వడ్డించటం దీనిలో భాగమే. ఏటా ఆరులక్షల కోట్ల రూపాయల వరకు వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులు, డ్యూటీలు మినహాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం దానిలో ఒకేడాది సగం తగ్గించినా జనం మీద అదనపు భారం లేకుండా చూడవచ్చు.అటువంటి ఆలోచనే లేదు.

ముంబై-అహమ్మదాబాదు మధ్య ఇప్పటికే ఎన్నో రైళ్లు, విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలు వున్నాయి. ఇప్పుడు జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అయినా 98వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి(2015 అంచనా ప్రకారం, అది పూర్తయ్యే 2024 నాటికి ఇంకా ఎంత అవుతుందో తెలియదు) ధనికులు తప్ప సామాన్యులు అడుగు పెట్టటానికి వీలులేని ఖరీదైన బుల్లెట్‌ రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించారు. దాని నిర్వహణకే ఏడాదికి నాలుగున్నరవేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. ఇది అంత అత్యవసరమా ? మిగతా ప్రాంతాలలో రైలు సర్వీసులు మెరుగు పరచాలని జనం నెత్తీ నోరు కొట్టుకుంటున్న విషయం మోడీ జమానాకు పట్టలేదు.

సంఘపరివార్‌ అంటేనే పిల్లిని చంకన పెట్టుకున్నట్లని అనేక మంది భావిస్తారు. అనేక సంస్ధలలో ఆ పరివార్‌ అనుయాయులు, వీర విధేయులతో నింపివేస్తున్నారు, లేదా వున్న సంస్ధలు తమ భావజాలానికి అనుగుణంగా నడిచేట్లు వత్తిడి తెస్తున్నారు. దానిలో భాగమే తన అవార్డు పొందిన కన్నడ రచయిత కలుబర్గి హిందూ మతోన్మాదుల చేతిలో హత్యకు గురైనా కేంద్ర సాహిత్య అకాడమీ ఖండించటానికి ముందుకు రాలేదు. అ ందుకు నిరసనగా కవులు, కళాకారులు అవార్డుల వాపసు నిరసన తెలిపారు. దాని మీద నోరు మెదపకుండా నరేంద్రమోడీ అనుసరించిన వైఖరి దానిని నిర్ధారించింది.హిందూత్వను గట్టిగా వ్యతిరేకించే హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం వారిపై కక్షగట్టి ఐదుగురు విద్యార్ధులను బహిష్కరించటం,వారిపై తప్పుడు కేసులు పెట్టటం , కేంద్ర మంత్రులు ఇద్దరు వత్తిడి తేవటం , వారిలో ఒక విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. దానిపై కూడా సానుభూతి ప్రకటించటానికి ప్రధానికి ఐదు రోజులు పట్టింది.

విదేశాల్లో దాచుకున్న నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికీ పదిహేను లక్షల చొప్పున పంచుతామని చెప్పిన ఎన్నికల ప్రచారం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.దాన్నసలు మరిచేపోయారు. ఒక్కటంటే ఒక్క ఖాతా నుంచి కూడా నల్లధనాన్ని తెచ్చిందిలేదు.అందుకు ప్రయత్నాలు కూడా లేవు.చిన్న ప్రభుత్వం పెద్ద పాలన అంటూ కబుర్లు చెప్పి 66 మందితో పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పోనీ అదేమన్నా పని చేస్తోందా అంటే లోక్‌పాల్‌ గురించి తాను రాసిన లేఖలకు ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి సమాధానం కూడా రాలేదని అన్నా హజారే ఇటీవలనే వాపోయిన విషయం తెలిసిందే. ఇలాంటివే ఇంకా ఎన్నో. మోడీ ప్రభుత్వ తీరు తెన్నులు చూస్తుంటే మరో 40 నెలలు కూడా మనం ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Editors Guild Condemns ABVP Threats to The Wire‘s Founding Editor

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, communalism, RSS

12628388_945979525487243_1572144722424597240_o (1)

New Delhi: In a statement issued on Saturday, the Editors Guild of India strongly condemned “the blatant acts of intimidation and threats to Siddharth Varadarajan, Editor of The Wire, by student members of the ABVP in Allahabad University that forced the police to intervene to escort him to safety.”

Varadarajan had been invited to deliver a public lecture on ‘Loktantra, media aur abhivyakti ki svatantrata’ (Democracy, the Media and Freedom of Expression)” by the president of the Allahabad University Students’ Union and the event was scheduled to be held at the university’s Senate Hall on January 20, 2016.The Editors Guild statement notes that after students belonging to the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) – the student wing of the Bharatiya Janata Party – threatened violence, the university’s vice-chancellor withdrew permission for the programme and got the district administration to prohibit it from being held anywhere else on campus. As a result, “Varadarajan was forced to deliver the lecture at a hall near the campus.”After the lecture, when The Wire’s founding editor went to meet the V-C in his office along with the students’ union president, Richa Singh, the ABVP – which declared that Varadarajan was “anti-national” and would not be allowed to set foot inside the university campus – surrounded the exit.

The university security warned Varadarajan that they could not guarantee his safety, and it was only after the police arrived that he was escorted to safety.

“For a senior journalist to be threatened in such a manner at a leading university is deplorable. It is a brazen attack on freedom of expression, and the Editors Guild of India finds this mob mentality to silence those with divergent views unacceptable”, the Editors Guild statement said.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిజమే అయితే ? ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Rohith Vemula, RSS, University of Hyderabad (UoH), Vemula Rohit

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు.

సత్య

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఏ కులానికి చెందిన వాడన్నది నాకు ముఖ్యం కాదు, ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ? దానికి దారితీసిన పరిస్ధితులు ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం దాని మంత్రులు ,ఎబివిపి, విశ్వవిద్యాలయ అధికారులు ఇంకా తెరవెనుక ఎవరైనా వుంటే ఎందుకీ పుణ్యం కట్టుకున్నారు ? అన్నదే ముఖ్యం, సమాధానం రావాల్సిన ప్రశ్న.

వుదంతాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నం జరుగుతూనే వుంది. రోహిత్‌ దళితుడు కాదు బిసి అని నిరూపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనుబడిన తరగతి విద్యార్ధే అని నిరూపించారనుకుందాం అప్పుడు మీడియాకు మరొక కొత్త శీర్షిక ‘ఒక బిసిని బలి తీసుకున్న హిందూత్వ, కేంద్రం, మంత్రులు , అధికారులు !’ వచ్చినట్లే ! ఇప్పటి వరకు మన వాడు కాదులే అని దూరంగా వున్న జనాభాలోని మెజారిటీ బీసిలు వీధులలోకి వస్తారు. లేదు ఫరవాలేదు పోయినోడు ఎలాగూ పోయాడు మన బిసి మంత్రిని రక్షిద్దాం అనుకుంటే అది వేరే విషయం. దీని వెనుక వున్న పూర్వరంగం అది ఒక్క రోహిత్‌తో ఆగేది కాదు. హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ వర్తిస్తాయి . మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని అలా మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

అందువలన అన్యాయాన్ని అన్యాయంగా ఖండించకుండా, నిరసించకుండా వుంటే చివరికి నీవరకు వచ్చే సరికి నిరసించటానికే కాదు, అయ్యో పాపం అనటానికి కూడా ఎవరూ మిగలరు.

అసలు మొదలైన వివాదం ఏమిటి ? రోహిత్‌ కులం గురించి కాదు. ఆ విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని ఘటనల గురించి కదా ! అవేమిటి? యాకూబ్‌మెమెన్‌ వురి తీతకు నిరసన తెలపటం, సంస్మరణ సభ జరపటం. నిరసన తెలిపిన వారు కులతత్వవాదులు, వుగ్రవాదులు, దేశవ్యతిరేక శక్తులు అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. దీనికి నిరసన తెలిపిన దేశభక్తుడైన ఎబివిపి విద్యార్ది సుశీల్‌ కుమార్‌పై దాడి చేసిన ఫలితంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఇటు వంటి ఘటనలు జరుగుతున్నా విశ్వవిద్యాలయ యంత్రాంగం మౌన ప్రేక్షకురాలిగా వుండి పోయింది కనుక సహించలేక సంగతేమిటో చూడమని కేంద్రమంత్రి దత్తాత్రేయ రాశారు. ఆయన రాసిన తరువాత పట్టించుకోకపోతే ఎలా అంటూ మరో మంత్రి స్మృతి ఇరానీ రాశారు. సుశీల్‌ కుమార్‌ పై దాడి, గాయాలతో ఆసుపత్రిలో చేరాడన్నది కట్టు కధ అన్నది తేలిపోయింది. ఈ విషయాలు మంత్రికి తెలియకుండా వుండవు. అయినా ఎందుకు రాశారంటే రోహిత్‌ వ్యతిరేకించిందీ, చావక ముందు వరకు వ్యతిరేకిస్తున్నదీ, ద్వేషిస్తున్నదీ హిందూత్వను. దానికి బండారు దత్తాత్రేయ ఒక స్థంభం వంటి వ్యక్తి. అందుకే అంతగా స్పందిచారు.

విద్యార్ధులు చెబుతున్నది, బయటికి వారికి కనిపిస్తున్నదీ దత్తాత్రేయ, సంబంధిత శాఖ మంత్రిని స్మృతి ఇరానీ ఒకదాని తరువాత ఒకటిగా లేఖలు రాసిన తరువాత విశ్వవిద్యాలయ అధికారులు తీసుకున్న చర్యల పర్యవసానం రోహిత్‌ బలవన్మరణం. అసలు వీటన్నింటిలో అతని కుల ప్రస్తావన ఎక్కడ వుంది? అతను విశ్వవిద్యాలయంలో దళితుడిగానే పరిచయమయ్యాడు, దళితులు ఎక్కువగా వుండే అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యకర్తగానే మరణించిన తరువాత దళిత విద్యార్ధి ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి తప్ప మరొకటి కాదు.

దళిత విద్యార్ధి, అందునా వ్యక్తిగత కారణాలు కాకుండా ఒక సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక కారణాలతో బలవన్మరణం చెందాడు కనుక సహజంగానే యావత్‌ దేశంలో కదలిక వచ్చింది. దాని తీవ్రత తగ్గించటానికి సంఘపరివార్‌ మేథావులు కనుగొన్న చిట్కా రోహిత్‌ దళితుడు కాదు బిసి అని చెప్పటం. కులాంతర వివాహాలు చేసుకున్న వారి కులం ఏదవుతుంది, వారికి పుట్టిన బిడ్డల కులం ఏది అనే వివాదాలపై కోర్టులలో అనేక కేసులు నడిచాయి. హిందూ పర్సనల్‌ లా ప్రకారం తండ్రిది ఏ కులమైతే బిడ్డలకు ఆ కులం అన్నది ఒక అంశం. ఇక్కడ తల్లి దళిత తండ్రి బిసి, సాధారణ సూత్రం ఇక్కడ వర్తించదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బిడ్డలు ఏ వాతావరణంలో పెరిగారనే దానిపై ఏ కులం వర్తిస్తుందనేది నిర్ణయించాలని కొన్ని సందర్బాలలో కోర్టులు చెప్పాయి. ఇక్కడ ప్రభుత్వ గుర్తింపును బట్టి బిసి వడ్డెర కులం ఒక అడుగు దళిత కులం కంటే ముందు వుండవచ్చు గానీ సామాజికంగా చూస్తే అగ్రకులాలనబడే వారి దృష్టితో చూసినా జీవన పరిస్ధితులను చూసినా రెండూ ఒకటిగానే వుంటాయి. రోహిత్‌ చిన్న తనం నుంచి తల్లికి చెందిన దళిత కుల వాతావరణంలోనే పెరిగాడు తప్ప వేరు కాదు. అసలు ఇక్కడ తేలాల్సిన సమస్య అది కాదు. దళితుడైనా, బిసి అయినా ఓసి అయినా సంఘప్రచార్‌ హిందూత్వ పోకడలను వ్యతిరేకించటం దగ్గర మొదలైంది. అందువలన తేల్చాల్సింది, తేల్చుకోవాల్సింది దాని గురించి, హిందూత్వను వ్యతిరేకించేవారందరినీ ఏదో విధంగా వేధిస్తారా ? దాన్ని సమాజం సహించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d