• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Anti communist

ప్రతి వారికి ఒక రోజు అవకాశం వస్తుందన్నపుడు కమ్యూనిస్టులకు ఎందుకు రాదు ?

04 Thursday May 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Left politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, communist, Donald trump, mayday, pope, Pope Francis

Image result for anti communist

ఎం కోటేశ్వరరావు

మొన్ననే మహాకవి శ్రీశ్రీ జయంతి జరుపుకున్నాం. అనేక అంశాలను విస్మరిస్తున్నట్లుగానే ఆయన చేసిన రచనలను కూడా చదవటం తగ్గిపోతోంది. ఆయన రచనలలో ఒకదానిలో ఎంత వున్నతమైన సందేశం దాగి వుందో చూడండి.

కుక్క పిల్లా / అగ్గిపుల్లా/ సబ్బు బిళ్లా

హీనంగాచూడకుదేన్నీ/కవిత్వమేనోయ్‌ అన్నీ

రొట్టె ముక్కా/అరటి తొక్కా/బల్లచెక్కా

నీ వైపే చూస్తుంటాయ్‌/ తమ లోతు కనుక్కో మంటాయ్‌

ఇక శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ భాషలో చెప్పాలంటే ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది. రోజులన్నీ ఒకే విధంగా వుండవు. అంటే ప్రతి వారికీ ఏదో ఒక రోజు తామేమిటో నిరూపించుకొనే అవకాశం వస్తుంది. దానికి కమ్యూనిస్టులు మినహాయింపు ఎలా అవుతారు ? ఎరుపంటే భయం భయంగా చూసే అనేక మందికి ఈ చిన్న లాజిక్కు ఎందుకు అర్ధం కాదో తెలియదు. సినిమా వారు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పదాలలో ‘గీకటం లేదా గోకటం ‘ ఒకటి. ఇష్టం వున్న వారు ఆ పని చేస్తే కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే ఏం జరిగేదీ మనం రోజూ చూస్తున్నదే. బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయిన చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య ఒక కుటుంబం తమ అమ్మాయికి కమ్యూనిస్టు రాజకీయాలు వున్న వరుడు కావాలని ఒక ప్రకటనలో కోరినట్లు వార్తలు వచ్చాయి. అంటే కమ్యూనిస్టు అబ్బాయి చాలా మంచోడు ( సమాజ దుష్ట ప్రభావం పడో, మరొకటో జరిగో మిగతావారి మాదిరి భార్యలను వేధించే వారు లేరని కాదు) అన్నది వారి అనుభవం. చాలా మంది దృష్టిలో కమ్యూనిస్టులు ఈ కాలానికి పనికిరాని మంచి వారు. వారి వలన ముప్పు లేదని ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక అధిపతి అమెరికా పాలకులే పాతికేండ్ల క్రితం ప్రకటించారు. అలాంటపుడు వారి మానాన వారిని వదిలేయాలి కదా !

ఆ పని చేయకుండా అనవసరంగా కొంత మంది వ్యతిరేకులు కమ్యూనిస్టులను గోకుతున్నారు. అమెరికాలోని సియాటిల్‌ మరికొన్ని చోట్ల మేడే రోజున కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రదర్శనలు జరటం, ఆ సందర్భంగా మీడియా నిండా చెడరాయటం, చూపటం దానిలో భాగమే. వామపక్షం, సోషలిజం, కమ్యూనిజం భావజాలానికి దూరంగా వున్న యువతలో కూడా ఇదేమిటి అన్న ఆసక్తి కలిగించి కొంత మందిని అయినా ఆ వైపు నెడుతున్నందుకు అలాంటి వారిని సహజంగానే కమ్యూనిస్టులు అభినందిస్తారు. అలా వచ్చిన వారు మరింత గట్టిగా తయారు కావటం తెలిసిందే.

మే ఒకటవ తేదీన ప్రపంచ వ్యాపితంగా కార్మికదినాన్ని పాటించారు. ఈ సందర్బంగా ఇష్టం వున్న, లేని మీడియా పెద్దలు కూడా ఆరోజు గురించి చెప్పక తప్పలేదు. ‘అమెరికన్‌ స్పెక్టేటర్‌ ‘ అనే ఒక పత్రికలో ‘ డియర్‌ కామ్రేడ్‌ ఏ ట్రంప్‌డ్‌ అప్‌ మే డే ‘ అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశారు. దీనిలో రెండు అర్ధాలున్నాయి. ప్రియమైన కామ్రేడ్‌ మేడే నగారా వూరించిన ‘ట్రంప్‌ ‘ అని ఒకటైతే ప్రియమైన కామ్రేడ్‌ మే డే నగరా అన్నది మరొకటి. ‘ విధిగా కూలదోయాల్సిన జారు చక్రవర్తి మాదిరి మన అధ్యక్షుడిని చూస్తున్నారు’ అంటూ వుక్రోషంతో తొలి వ్యాక్యంతో ఆ వ్యాసాన్ని ప్రారంభించారు. (అమెరికాలో సామాన్య జనం అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నిజంగా అమెరికా అభినవ జారు చక్రవర్తిగా భావించే మెజారిటీ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే అక్కడున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం వలన ప్రత్యక్ష ఓట్లకు బదులు ఎలక్టొరల్‌ కాలేజీలో ట్రంప్‌ను బలపరిచేవారు మెజారిటీ తెచ్చుకొని అతగాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.)https://spectator.org/a-trumped-up-may-day/ దీనిని జోష్‌ డెక్‌, పాల్‌ కెంగర్‌ అనే ఇద్దరు రాశారు. దీనిలో కమ్యూనిస్టు వ్యతిరేకతకు, వుక్రోషం, వ్యంగ్యానికి, ఆరోపణలకు కొదవ లేదు. డ్రడ్జ్‌ రిపోర్ట్‌ అనే బహుళాదరణ గల వెబ్‌ సైట్‌లో గతంలో తామెన్నడూ చూడని ఒక ప్రత్యేక అంశం అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌ పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసపు లింక్‌ను చూశామని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే మంటే అమెరికా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగపు కార్యదర్శి ఎమిలీ షెపర్స్‌ క్యూబా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్రాన్మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ. దానిలో http://www.peoplesworld.org/article/communist-party-membership-numbers-climbing-in-the-trump-era/ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తరువాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం గురించి అభ్యర్ధనలు పెద్ద ఎత్తున పెరిగాయని, అయితే అమెరికా అంతటా ఇప్పటికీ మెకార్ధీ కాలం నాటి భూతం(కమ్యూనిస్టు వ్యతిరేక) ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాల గురించి ఆసక్తి పెరుగుతోందని చెప్పటాన్ని వారు నొక్కి వక్కాణించారు. వారు కమ్యూనిస్టు పార్టీతో పాటు డిఎస్‌ఏ అనే ఒక వామపక్ష పార్టీ గురించి కూడా తమ వ్యాసంలో వ్యాఖ్యానించారు. వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు పైన ఇచ్చిన లింక్‌ ద్వారా చదువు కోవచ్చు. అయితే వ్యాసాన్ని ముగిస్తూ వారు చెప్పిన మాటలను మననం చేసుకోవటం అవసరం.

Image result for anti communist

‘ అందరికీ కొంత ప్రత్యేకమైనది వుంది ప్రియమైన కామ్రేడ్‌, అది నిజమైన కమ్యూనిస్టు పూలు, పండ్లతో నిండి వున్న కల్పవృక్షం’. దేశ వ్యాపితంగా మేడేను నిర్వహించటం ద్వారా వలస వచ్చిన వారు, మహిళలు, కార్మికులు, నల్లజాతి జీవన్మరణ వుద్యమం, పర్యావరణవేత్తలు, మరియు ట్రంప్‌ ముప్పు ఎదుర్కొంటున్న అందరూ ఐక్యం కావటానికి మంచి అవకాశమని జాకోబిన్‌ పత్రిక రచయిత్రి కష్మా సావంత్‌ వివరించినట్లుగా పెద్ద బృందాలైన ప్లానెడ్‌ పేరెంట్‌ హుడ్‌ ( ఏంజెలా డేవిస్‌ సహ అధ్యక్షురాలితో పాటు మహిళా ప్రదర్శన నిర్వహించినవారు) వంటి పెద్ద బృందాల మద్దతు పొందటం ద్వారా మేడే ట్రంప్‌ వ్యతిరేక ప్రతిఘటనలో అది అంతర్బాగం అవుతుందనే ఆశాభావాన్ని సావంత్‌ వ్యక్తం చేశారు. విస్తృతమైన వామపక్షం -దీనిలో డెమోక్రటిక్‌ పార్టీ వుంటుందని చెప్పనవసరం లేదు- అణచివేత, దోపిడీ, వివక్ష రూపాలు, వ్యవస్ధల గురించి వాటికి గురైన శక్తులు తరచుగా పరస్పరం తమ అనుభవాలను కలబోసుకుంటూ వుమ్మడి సామాజిక అస్తిత్వాన్ని పంచుకొనే నూతన అవగాహనను(ఇంటర్‌ సెక్షనాలిటీ) అనుసరించటం ఇటీవల వామపక్ష శక్తుల మధ్య ప్రారంభమైంది. దీనిని ప్రముఖంగా ప్రస్తావించటం ద్వారా పలు బాధిత బృందాలను కలుపుకొంటూ వారి అణచివేతకు మూలం ట్రంప్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీ అని స్పష్టం చేయటం ద్వారా కొత్త ప్రాంతాలకు విస్తరించటం , కొత్త వారిని ఆకర్షించటం సమరశీల వామపక్ష లక్ష్యంగా వుంది. ఈ 2017 మేడే ఒక పెద్ద ప్రచారం, ఐక్యతను పెంపొందించే అవకాశం.ఈ ఏడాది అంతర్జాతీయ మేడేను పాటించటానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది రష్యన్‌ విప్లవ శతవార్షిక సందర్బం.’

ఇలా చెబుతూనే చివరికి తమ వుక్రోషాన్ని కూడా ఎలా వెలిబుచ్చారో చూడండి.’ బోల్షివిక్‌లు తమ చారిత్రాత్మక హింస, అణచివేత ప్రారంభించిన వంద సంవత్సరాల తరువాత కూడా నూతన అధ్యక్షుడికి వ్యతిరేకంగా ‘భిన్నత్వం, ఏకీకరణ,’ప్రతిఘటన పేరుతో పెద్ద సంఖ్యలో అమెరికన్‌ వామపక్ష వాదులు తమకు తెలియకుండానే లెనిన్‌ చెప్పినట్లు ప్రయోజనకరమైన బుద్ధి హీనుల( యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌) మాదిరి ఒక అణచివేత భావజాలానికి విశ్వాసపాత్రులుగా మారుతున్నారు.’ ముందే చెప్పినట్లు ‘పీపుల్స్‌ వరల్డ్‌ ‘లోని కమ్యూనిస్టు ఇంటర్వ్యూను గోకటం ద్వారా స్పెక్టేటర్‌ పత్రిక తన పాఠకులందరికీ దాని మీద ఆసక్తి రేకెత్తించింది. అంతకు ముందు వినని వారు తప్పకుండా ఏం చెప్పారో, లెనిన్‌ ఆ పదాన్ని ఏ సందర్భంగా వాడారో, దాని మీద ఈ వ్యాస రచయితలు ఎందుకు విరుచుకుపడుతున్నారో అనే వుత్సుకత కలుగుతుంది. వానపడుతున్నా కదలని…… మాదిరి ఏమీ పట్టని వారికి ఇది వర్తించదని మనవి.

అమెరికన్‌ మేథావులు తాజాగా మార్క్సిజం లెనినిజం పట్ల ఆకర్షితులు కావటంపై కొందరు వుక్రోషం వెలి బుచ్చటం అర్దం చేసుకోగలిగినదే. పెట్టుబడిదారీ విధానం ఎందుకు విఫలం అవుతున్నదో, ఆర్ధిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ఆ విధాన సమర్ద పండితులు చెప్పలేకపోతున్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజాల విశ్లేషకులు వాటికి కారణాలు చెబుతున్నపుడు యువతరం, మేథావులు ఆకర్షించటం సహజం. లెనిన్‌ వుపయోగించిన పదాన్ని అసందర్బంగా వుపయోగించటం రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. అందువల పై వ్యాస కర్తలు పేర్కొన్న గ్రాన్మా పత్రికలో అమెరికా కమ్యూనిస్టు నేత ఏం చెప్పారో చూద్దాం. సెర్గియో అలెగ్జాండరో గోమెజ్‌ స్పానిష్‌ భాషలో వున్న ఇంటర్యూను ఆంగ్లంలో సంక్షిప్తీకరించారు. దానిని గ్రాన్మాతో పాటు పీపుల్స్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు. ‘ అమెరికాలో అంతర్ధానం అయ్యేందుకు తిరస్కరిస్తున్న కమ్యూనిజం ‘ అనే శీర్షికతో గ్రాన్మా ప్రచురించింది. http://en.granma.cu/mundo/2017-04-17/communism-refuses-to-disappear-in-the-united-states

‘డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని దాని కంటే అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సభ్యత్వ అభ్యర్దనలు అందుతున్నాయి. 1919లో వారి పార్టీ ఏర్పడినప్పటికీ 1917లో అక్టోబర్‌ విప్లవం సంభవించినపుడు తొలిసారిగా మార్క్సిస్టు భావజాలంతో సంఘటితమైన వారిలో అమెరికన్‌ పౌరులు కూడా వున్నారు, త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్నారు. పార్టీ ఏర్పాటయిన నాటి నుంచి రెండు యుద్దాల మధ్యకాలం, ప్రచ్చన్న యుద్ద అణచివేతలో, దీనిలో వాస్తవంగా రహస్య సంస్దగా పని చేయాల్సి వచ్చింది. ముఫ్పై కోట్ల మంది జనం వున్న దేశంలో ప్రస్తుతం ఐదువేల మంది సభ్యులు వున్నారు. మెకార్ధీ కాలం నాటి భూతం అమెరికా అంతటా ఇప్పటికీ వున్నప్పటికీ కమ్యూనిస్టు భావజాలం పట్ల అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది.

ఎమిలీ షెపర్స్‌ వృత్తి రీత్యా మానవశాస్త్రవేత్త, దక్షిణాఫ్రికాలో జన్మించారు. జాత్యహంకార వ్యవస్దను తప్పించుకొనేందుకు ఆయన తలిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఎమిలీ 1987లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. అయితే మార్క్సిస్టు భావజాలం ఆయన చిన్నతనంలోనే మేరీ లాండ్‌, చికాగో సమీపంలోనిఒక పోర్టారికో నివాస ప్రాంతంలోనే అబ్బింది. ‘ కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే అమెరికాలో ఏ రీత్యా చూసినా విప్లవానికి ముందుండే పరిస్ధితి లేనప్పటికీ ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం అంత్య దశలో వున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనేక మందిని ప్రభావితం చేసింది. వామపక్షాలుగా చెప్పాలంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలు అత్యంత హీన స్ధితిలో వున్నారు. దేశంలోని మెజారిటీ పౌరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఇటీవలి డెమోక్రటిక్‌ లేదా రిపబ్లికన్‌ పార్టీల ప్రభుత్వాలు పరిష్కరించగలిగిన స్ధితిలో లేవు. జనంలో వున్న అసంతృప్తి అన్ని వేళలా సరైన పురోగమన బాట పట్టదు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికలలో సైద్ధాంతిక పరమైన తిమ్మినిబమ్మిని కారణంగా ఒక మితవాద వైఖరికి దారితీసింది. మా స్వంత రాష్ట్రమైన వర్జీనియా కేవలం ధనవంతమైనదే కాదు, ఎందరో తెల్లవారైన పేదలు కూడా వున్నారు. వారంతా ట్రంప్‌కు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. బొగ్గు తవ్వకం ఆప్రాంతంలో ప్రధాన వుపాధి వనరు. ఇటీవలి సంవత్సరాలలో వేలాది మంది కార్మికులను పనుల నుంచి తొలగించారు. రిపబ్లికన్లు దీనంతటికీ బరాక్‌ ఒబామా పర్యావరణ విధానాలు కారణమని ప్రచారం చేశారు.

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి ఎన్నిక ప్రచారం సందర్బంగా మిలియన్ల మంది యువత బెర్నిశాండర్స్‌ పురోగామి భావజాలం వైపు సమీకృతమయ్యారు.శాండర్స్‌ కనుక ట్రంప్‌ ప్రత్యర్ధి అయి వుంటే ఆయన గెలిచి వుండేవారు.ఈ నేపధ్యంలోనే షెపర్స్‌ ప్రస్తావించిన ‘కుహనా వర్గ చైతన్యం ‘ మరియు తిమ్మిని బమ్మిని చేయటాన్ని వ్యతిరేకించటానికి వామపక్షం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఎత్తి చూపింది.’ మీడియాను కార్పొరేషన్లు అదుపు చేసిన స్ధితిలో స్ధానిక న్యూస్‌ ఛానల్స్‌లో ప్రసార బోధకులు ప్రపంచం అంతం కావటం గురించి చెబుతున్నపుడు ఇది చాలా కష్టం ‘అని షెపర్స్‌ చెప్పారు. అందుకే అన్ని రకాల పద్దతులలో సాధ్యమైనంత మేరకు తన భావజాలాన్ని జనంతో పంచుకోవటానికి, వారిని చైతన్యవంతులను చేయటాన్ని కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఆ రీత్యానే కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం, పార్టీలో ఎలా చేరాలనే సమాచారాన్ని పొందుపరిచారు. అయినప్పటికీ కార్మికుల హక్కులను రక్షించుకుంటూ వారి అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా కార్మికులు, కార్మిక సంఘాలను సంఘటితపరచటం ఒక పెద్ద సవాలే అన్నారు.

అమెరికా కమ్యూనిస్టు పార్టీ పాలస్తీనాను సమర్ధిస్తుంది మరియు అమెరికా మిలిటిరిజాన్ని వ్యతిరేకిస్తుంది. అనేక సంవత్సరాలుగా క్యూబా విప్లవాన్ని మరియు ఇటీవల బొలివేరియన్‌ రిపబ్లిక్‌ వెనెజులాను సమర్ధిస్తున్నది. క్యూబాతో సాధారణ సంబంధాలను పునరుద్దరించుకోవాలని అమెరికా ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రకటనను కమ్యూనిస్టు స్వాగతించింది.’2014 డిసెంబరు 17వ తేదీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది,అయితే అది మంచి వార్త. కొన్ని విషయాలలో ముందుకు పోయినప్పటికీ ఒబామా తాను చేయగలిగినదంతా చేయలేదు’ అని షెపర్స్‌ చెప్పారు. అయినప్పటికీ క్యూబాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనేందుకు పార్లమెంట్‌లోని డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండింటిలోనూ పెరుగుతోంది.’దీనికి మానవతాపూర్వకమైన మనోభావాలతో కొందరు ఇతరులు ఆర్ధిక ప్రయోజనాలకోసం ఇద్దరూ దిగ్బంధం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. దిగ్బంధనాన్ని కొనసాగించాలని కోరుతున్న ఏకైక తరగతులెవరంటే ప్రత్యేకించి ఫ్లోరిడాలోని క్యూబన్‌-అమెరికన్లు మాత్రమే ‘ అన్నారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని తాజా సర్వేలో మెజారిటీ అమెరికన్‌ పౌరులు వెల్లడించారు. ట్రంప్‌ ఏం చేస్తాడో మాకు తెలియదు, జనం మాట వింటారా సిద్ధాంతవేత్తల మాట వింటారో తెలియదు. అయితే మొత్తంగా చెప్పాలంటే అమెరికన్‌ కమ్యూనిస్టులు ఆశాభావంతో వున్నారు ‘ అని చెప్పారు.

Image result for pope francis communist

మే డే రోజునే ‘పోప్‌ ఫ్రాన్సిస్‌ కమ్యూనిస్టు గురువు’ అనే శీర్షికతో స్పెక్టేకర్‌ పత్రికే మరో వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘ రాజకీయ పోప్‌ ‘ అనే పేరుతో జార్జి న్యూమర్‌ రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలను దానిలో వుటంకించారు.https://spectator.org/pope-franciss-communist-mentor/ ‘ పోప్‌ నోటి నుంచి వెలువడిన స్వచ్చమైన మార్క్సిజం ఇది ‘ అని రేడియో వ్యాఖ్యాత రష్‌ లింబా, ‘ లెనిన్‌ గారి పోప్‌ ‘ అని మరో వ్యాఖ్యాత మైఖేల్‌ శావేజ్‌ నోరు పారవేసుకున్నారు. వాటి గురించి ఇటాలియన్‌ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పోప్‌ తోసి పుచ్చారు.’ నా జీవితంలో నేను ఎందరో మంచి వారైన మార్క్సిస్టులను కలుసుకున్నాను. అందువలన అలాంటి మాటలకు నేను బాధపడటం లేదు’ అన్నారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్ధ మధ్యకాలం 1922-39 మధ్య పని చేసిన పోప్‌ పదకొండవ పయస్‌ కమ్యూనిస్టు వ్యతిక ప్రకటన చేశారు.’ ఒకే సారి మంచి కాథలిక్‌గానూ నిజమైన సోషలిస్టుగానూ ఎవరూ వుండలేరు’ అని పయస్‌ ప్రకటిస్తే దానికి విరుద్దంగా ఈ రోజు పోప్‌ ఫ్రాన్సిస్‌ చెబుతున్నది వింటే ‘ ఒక మంచి కాథలిక్‌ సోషలిజం వ్యతిరేకిగా వుండజాలరు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు అని సదరు రచయిత వ్యాఖ్యానించారు.

‘పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ మరియు పోప్‌ 16వ బెండిక్ట్‌ శిలువతో అసహజంగా ప్రవర్తించారా వారు దానిని తమ మోకాళ్ల ముందు వుంచుకొని వుండవచ్చు, పోప్‌ ఫ్రాన్సిస్‌ అలా కాదు. సుత్తీ కొడవలి చిహ్నంగా వున్న శిలువను ఎంతో సాదరంగా స్వీకరించారు. విమానంలో రోమ్‌కు తిరిగి వస్తూ విలేకర్లతో మాట్లాడుతూ ‘ఈ పనిని నేను అర్ధం చేసుకోగలను, నా వరకు ఇదేమీ ఒక అపరాధం కాదు’ అన్నారు. పోప్‌ పర్యటన తరువాత నాకు ఒక పోప్‌ వున్నారనే భావన నాకు ఇప్పుడు కలిగింది. ఇంతకు ముందు నాకు ఆభావన కలగలేదు ‘ అని బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.ఈ రెండు వ్యాసాలలోని అంశాలను చూసినపుడు సోషలిజం, కమ్యూనిజంపై అటు రాజకీయంగానూ ఇటు మతపరంగానూ దాడి ఎలా జరుగుతోందో, పేదలకు మంచి జరగాలి, దోపిడీ వుండకూడదని చెప్పిన జీసస్‌ తొలి కమ్యూనిస్టు అని చెప్పిన పోప్‌ ఫ్రాన్సిస్‌ వంటి వారి మీద ఎలా వ్యతిరేకత రెచ్చగొడుతున్నారో చూడవచ్చు. పాడిందే పాడరా పాచి పళ్ల పాటగాడా అన్నట్లుగా కమ్యూనిస్టు మానిఫెస్టోను రాయక ముందే ప్రారంభమైన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కమ్యూనిస్టు భావజాల ప్రచారం, ప్రభావం, విస్తరణను అడ్డుకోలేకపోయింది. ఇంకా ఆ తుప్పు పట్టిన ఆయుధంతోనే ఈ ఇంటర్నెట్‌ యుగంలో కూడా ప్రయత్నిస్తున్నారు.

నాజీజం మాదిరి ఎందుకు కమ్యూనిజాన్ని ద్వేషించటం లేదు అనే శీర్షికతో ఒక వ్యాఖ్యాత మరో పత్రికలో రాశాడు. http://www.theblaze.com/news/2017/05/01/watch-why-isnt-communism-as-hated-as-nazism/ . దానిలో ఏం చెప్పినప్పటికీ నాజీజం అన్నది లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నదని, అంతర్జాతీయ న్యాయస్ధానంలో అందుకు బాధ్యులైన వారిని విచారించిన విషయం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి జరిపిన వ్యతిరేక ప్రచారం అక్కడ అంత మందిని చంపారు ఇక్కడ ఇంత మందిని చంపారు అంటూ తప్పుడు లెక్కలు, కట్టుకధలు ప్రచారం చేయటం తప్ప రుజువులను జనం ముందుంచలేకపోయారు. సిద్ధాంత పరంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వారందరూ కమ్యూనిస్టులు హంతకులు అనే కట్టుకధలను నమ్మరు. తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులు అనేది కళ్ల ముందున్న వాస్తవం. ఆ సందర్భంగా కమ్యూనిస్టు గెరిల్లాల చేతిలో హతమైన వారందరూ దోపిడీదారులు, వారికి ఏజంట్లుగా, గూండాలుగా, జనంపై దాడులు చేసిన పోలీసులు, రజాకార్లు తప్ప సామాన్యులను కమ్యూనిస్టులు చంపలేదనే విషయం జనానికి తెలుసు. అందుకే కమ్యూనిస్టులపై నాటి నిజాం, కాంగ్రెస్‌, నెహ్రూ ప్రభుత్వం, మీడియా చేసిన ప్రచారాన్ని తోసిరాజని తొలి ఎన్నికలలో వుద్యమం జరిగిన, దాని ప్రభావం వున్న ప్రాంతాలన్నింటా కమ్యూనిస్టులనే జనం గెలిపించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో కమ్యూనిస్టుల గురించి చేసిన తప్పుడు ప్రచారం ఎల్లకాలం జనాన్ని మోసం చేయలేదు. చైనాలో నానాటికీ దారిద్య్రం తగ్గుతోందని ప్రపంచబ్యాంకే చెబుతోంది, అదే సమయంలో అమెరికాలో దారిద్య్రంలోకి చేరే వారి సంఖ్య పెరుగుతోంది. సోషలిస్టు దేశమైన చైనా ఎన్నో విజయాలు సాధిస్తున్నపుడు అదే మాదిరి మన దేశంలో కూడా సోషలిస్టు వ్యవస్ధను నెలకొల్పుకుంటే నిరుద్యోగం, దారిద్య్రాల నుంచి బయటపడవచ్చు కదా అన్న ఆలోచన రాకుండా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల యువత మెదళ్లను ఎవరైనా ఎలా కట్టడి చేయగలరు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులపై కాషాయ దళాల ఆత్మవంచన, పరవంచన ?

04 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, china boycott, chinese investments, RSS Outfits anti china, RSS Outfits anti china feets, saffron brigade hypocrisy

సత్య

    కాషాయ తాలిబాన్లకు దేశభక్తి గురించి ఆకస్మికంగా మెలకువ వచ్చిందా ? లేక ఎవరైనా వెనుకనుంచి పొడుస్తున్నారా ? కాషాయ పరంపరలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వారం రోజుల క్రితం పేటిమ్‌ సంస్ధలో చైనా పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలని తన విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)ను కోరినట్లు వారం రోజుల క్రితం మీడియాలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం ఈ విషయమై విచారణ జరపాలని కోరుతున్నట్లు తాజాగా ఆ సంస్ధ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వెల్లడించారని ఒక వార్తా సంస్ధ ఆదివారం నాడు తెలిపింది. పద్నాలుగు నెలల క్రితం మన దేశానికి చెందిన పేటిమ్‌ కంపెనీలో 68కోట్ల డాలర్లకు 40శాతం వాటాను చైనా ఇ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కొనుగోలు చేసినట్లు లోకానికంతటికీ తెలిసిందే. అదేమీ రహస్యంగా జరగలేదు. ఇన్ని నెలల తరువాత ఆ లావాదేవీ, దాని పర్యవసానాలపై విచారణ జరపాలని కోరటమే విచిత్రం. ఇది వారికి కలిగిన ఆలోచనా , వేరే ఎవరినైనా సంతుష్టీకరించేందుకు ఇలా చేస్తున్నారా ? చైనా కంపెనీలు మన దేశ సంస్ధలలో పెట్టుబడులు పెట్టటం, వాటాలు కొనుగోలు చేయటం ఈ వారంలోనే ప్రారంభమైందా ?

     స్వదేశీ జాగరణ మంచ్‌ వారు చెబుతున్న అభ్యంతరం ఏమిటి ? పేటిమ్‌ ద్వారా చైనా కంపెనీలు మన దేశ సమాచారాన్ని తెలుసుకొని దుర్వినియోగం చేసే అవకాశం వుందని, అసలు ఏ కంపెనీకి ఎంత వాటా వుందో, ఎలా ఇచ్చారో వెల్లడించాలని కోరటంతో పాటు పేటిమ్‌ తన వాణిజ్య ప్రకటనలలో ప్రధాని నరేంద్రమోడీ బొమ్మను వుపయోగించుకోవటం అభ్యంతరకరం అని మహాజన్‌ చెప్పారు. పది సంవత్సరాల పాటు అధికారంలో వున్న యుపిఏ సర్కారు సంస్కరణలను సంపూర్ణంగా అమలు జరపలేదని, తాము వాటిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని బాసలు చేసిన కారణంగానే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు, వాటి కనుసన్నలలో మెలిగే మీడియా నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యమే. దానిలో భాగంగానే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు మరింతగా తెరిచిన ఖ్యాతి తమదే అని చెప్పుకుంటున్న కాషాయ ‘దేశ భక్తులు’ ఆ విదేశీ పెట్టుబడుల గురించి లబలబలాడటం ఎనిమిదో ప్రపంచ వింత.

    చైనా సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. మనం కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలూ కూడా ప్రవేశిస్తాయి, వాటి బెడదను వదిలించే శక్తి తమకు వుందన్నారు. మన దేశ పాలకవర్గం కూడా సంస్కరణల పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధ కిటికీని బాహాటంగా తెరిచింది. మన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుబడుల కోసం తిరగని విదేశీ నగరం లేదు, కలపని చేయిలేదు. ఎక్కడా ఫలానా దేశాల నుంచి పెట్టుబడులు వస్తే తిరస్కరిస్తాం అని ఎన్నడూ, ఎక్కడా చెప్పలేదు. అందువలన అనేక దేశాల కంపెనీలు వచ్చిన మాదిరే చైనా కంపెనీలు కూడా అన్ని దేశాలలో ప్రవేశించినట్లుగానే మన దేశంలో కూడా కాలుపెడుతున్నాయి. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దుర్వినియోగం చేసినట్లు గమనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఏ ప్రభుత్వానికైనా సర్వ హక్కులూ వున్నాయి. అలాంటిది కేవలం చైనా కంపెనీలే దుర్వినియోగం చేస్తాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటి ?మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయనుకుంటే అది ఒక్క చైనా కంపెనీయే చేస్తుందని, మిగతా కంపెనీలు చేయవనే గ్యారంటీ ఏముంది. తనకు మార్గదర్శనం చేసే, తన కార్యకలాపాలను సమీక్షించే స్వంత సంస్ధలే డిమాండ్‌ చేస్తున్నాయి గనుక చైనాతో సహా మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని విదేశీ కంపెల గురించి గతంలో తీసుకున్న చర్యలేమిటి? భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ద్వారా ప్రకటించటం అవసరం.

     పేటిమ్‌ కంపెనీ ఏ లావాదేవీలనైతే నిర్వహిస్తున్నదో వాటినే ముఖేష్‌ అంబానీ రిలయన్సు జియో మనీ పేరుతో నిర్వహించేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పేటిమ్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. తాను వెనుకబడిపోతానని అంబానీ ఆందోళన చెందుతున్నారా ? సరిగ్గా ఈ సమయంలో స్వదేశీ జాగరణ మంచ్‌కు పేటిమ్‌ విదేశీ (చైనా) సంబంధాల గురించి గుర్తుకు వచ్చింది. నిత్యజీవితంలో మన సమాచారాన్ని తెలుసుకోని,తెలుసుకోలేని విదేశీ కంపెనీలు ఏమున్నాయి గనుక. మనం మాట్లాడే ప్రతి మాటా, పంపే ప్రతి ఎస్‌ఎంఎస్‌, ప్రతి ఇ మెయిల్‌ సమాచారాన్ని అవసరం వున్నా లేకపోయినా అమెరికా సిఐఏ ఎప్పటిప్పుడు సేకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్‌ కార్డుల గురించి అందరికీ తెలిసిపోయింది. పాన్‌ కార్డుల ద్వారా ఎవరి నగదు లావాదేవీలేమిటో ఎవరైనా తెలుసుకోవచ్చు. టీవీలలో అమర్చిన సాధనాల ద్వారా మన ఇండ్లలో, చివరికి పడక గదుల్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకొనే రోజులు వచ్చాయి. మన సమాచార గోప్యత ఎక్కడుంది కనుక. వాటన్నింటినీ వదలి చైనా గురించి మాత్రమే సందేహాలు వెలిబుచ్చేవారి గురించి సందేహించాల్సిన అవసరం కలుగుతోంది. ఎవరికైనా ఏజంట్లుగా పని చేస్తున్నారా ? ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన వార్తలు మనకు తెలియదు. పాలస్తీనా అరబ్బులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ వస్తువులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎప్పటి నుంచో పిలుపులు ఇస్తున్నాయి.

Image result for boycott chinese products

    సదరు స్వదేశీ జాగరణ మంచ్‌ గత కొంత కాలంగా చైనా వస్తు బహిష్కరణ గురించి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజమే కదా అని అమాయకులు వీర సైనికుల్లా పని చేస్తున్నారు. అధికారంలో వున్న వారి ప్రతినిధులేమో చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెబుతుంటారు. అక్కడి వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయిస్తుంటారు ! డాలర్ల కేటాయింపు నిలిపివేస్తే చైనా వస్తువుల దిగుమతులు ఎప్పుడో ఆగిపోయి వుండేవి కదా ! మోడీ సర్కారు ఆపని ఎందుకు చేయదు ? దొంగతనంగా దిగుమతి అయితే పట్టుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారు ? ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేద్దామని ? ఎవరి చెవుల్లో పూలు పెడతారు ? ఇంతకాలం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రతినిధులు సర్కారు పగ్గాలు చేపట్టి చైనాతో నానాటికీ బంధం పెంచుకుంటూ పోతుంటే మిన్నకుండటం ఆత్మవంచన కాదా ? వీధుల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పరవంచన కాదంటారా ? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

    నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశంలో చైనా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయని మీడియా కోడై కూస్తున్నది.http://www.livemint.com/Politics/X9NBWqqs0JzkX0OQ3UaMQO/Chinese-investments-in-India-increased-sixfold-in-2015.html 2000 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి నెల వరకు మన దేశంలో చైనా పెట్టుబడుల మొత్తం 135 కోట్ల డాలర్లయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 230 కోట్ల డాలర్లు వచ్చాయట.http://www.vccircle.com/news/economy/2016/08/30/chinese-investment-india-shoots-23-bn-past-3-months-against-135-bn-2000-16 వీటి గురించి స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు మాట్లాడదు ? విచారణ జరపాలని ఎందుకు డిమాండ్‌ చేయదు ? ఈ ఏడాది అక్టోబరు 6-7 తేదీలలో ఢిల్లీలో స్వయంగా నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చైనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల సహకార ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదు ?

    నల్ల ధనాన్ని వెలికి తీసే పేరుతో ఆ పని చేసిన వారు తరువాత బాణీ మార్చి నగదు రహిత లావాదేవీల గురించి ఎక్కువగా చెబుతున్నారు. చెప్పుకోలేని బాధ ఏమిటో సానుభూతి చూపుదాం. నోట్ల రద్దు తరువాత బిజెపి నేతలందరూ ఇప్పుడు చైనా భజన చేస్తున్నారు. మన కంటే పెద్ద దేశమైన చైనాలో నగదు రహిత కార్యకలాపాలు జయప్రదం అయినపుడు మన దేశంలో ఎందుకు కావు అన్నది వారి ఒక ప్రశ్న. చైనా చర్యలను సమర్ధించిన కమ్యూనిస్టులు అదే పని మన దేశంలో చేస్తే విమర్శిస్తారు ఎందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. రోజంతా చైనా కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోయటం, సాయంత్రం కాగానే దాన్ని అడ్డం పెట్టుకొని తమ చర్యలను సమర్ధించుకోవటం. అవకాశవాదానికి హద్దులు లేవు. మేథోపరంగా ఎంతదివాళా స్ధితిలో వున్నారో కదా !

   నల్లధనాన్ని, నగదు రహిత లావాదేవీలను కమ్యూనిస్టులే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ మన కంటే ఎన్నోరెట్లు పెద్దది. అక్కడ నగదు రహిత లావాదేవీలను మోడీ సర్కార్‌ మాదిరి బలవంతంగా రుద్దలేదు. తగినంత నగదు రాదని, నగదు రహితానికి మళ్లాలని తెలంగాణా ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్‌ చంద్ర ప్రకటించటాన్ని బట్టి తగినన్ని నోట్లను ముద్రించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావటం లేదని తేలిపోయింది. నగదు రహిత కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు చేయని, కార్డులు గీకటానికి నిరాకరించే విద్యా, వైద్య సంస్ధలు, దుకాణాల తగిన గడువు నిచ్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కార్డుల వినియోగం భారం కాదని జనాన్ని ఒప్పించగలిగితే వారే దుకాణాలలో డిమాండ్‌ చేస్తారు. ఒక పరిమితి దాటిన లావాదేవీలు కార్డుల ద్వారా మాత్రమే చేయాలని, అందుకు రెండున్నర శాతం రుసుం అదనం అని వసూలు చేస్తే శిక్షించటం వంటి చర్యలు తీసుకుంటే క్రమంగా అలవాటు పడిపోతారు. ఆ పని చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టినట్లు నగదును అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా అమలు చేయపూనుకోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేం మీతో వున్నాం ! ఫెబ్రియానా ఫిర్దౌస్‌ ముందుకు సాగిపో !!

15 Wednesday Jun 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 Symposium, Anti communist, Febriana Firdaus, Indonesia, Indonesian Communist Party (PKI)., victims of 1965

కమ్యూనిస్టు వ్యతిరేకుల వత్తిళ్లకు లొంగవద్దు,

ఎం కోటేశ్వరరావు

స్థలం ఇండోనేషియా రాజధాని జకర్తా నగరం !

సమయం 2016 జూన్‌ రెండవ తేదీ !!

      సందర్భం కమ్యూనిజం నుంచి దేశాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేకుల సభ రెండవ రోజు కొనసాగింపు !!!

    ఆ సభ ప్రాంగణం దగ్గరకు వచ్చారు కొందరు క్రైస్తవ విద్యార్ధులు. కుక్క మనిషిని కరవటం సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే వార్త. ప్రపంచంలో కమ్యూనిస్టుల కార్యకలాపాలు, అందులో భాగంగా సభలు సమావేశాలు సాధారణం. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడండని సభ పెట్టటమే వార్త. ఆ సభకు వచ్చిన క్రైస్తవ యువకులు సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో శిలువ గుర్తు కూడా వుంది. ఆ చిహ్నాన్ని వుపయోగించుకోవటం పట్ల తమకు అభ్యంతరం వుందంటూ తమ నిరసనను వారు నిర్వాహకుల ముందు వెల్లడించారు.

     ఇంకేముంది జర్నలిస్టులకు అదొక మిర్చి మసాలా ! మిరప చిన్నదా పెద్దదా అని కాదు అన్నయా అది కారంగా వుందా లేదా అన్నదే పాయింటు అన్నట్లుగా అది చాలా హాట్‌గా వుంటుంది కదా !! మూడుపదులు దాటిన ఒక మహిళా జర్నలిస్టు ఆ విద్యార్ధులను పక్కకు పిలిచి మీ అభ్యంతరం ఏమిటని వారితో మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో తెల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు. దుర్వాసుడికి దూరపు బంధువులా వుంది ముఖం. వస్తూనే ఈమె ఫెబ్రియానా ఫిర్దౌస్‌ , తప్పుడు వార్తలు రాస్తుంటుంది.ఆమెతో మాట్లాడకండి అంటూ వాదులాటకు దిగాడు.ఇంతలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా వున్న మరో తలపాగా వాలా వస్తూనే ఈ వార్త కనుక అచ్చయిందో, నీ ఫొటో, వివరాలన్నీ మా దగ్గర వున్నాయి, జైల్లో తోయిస్తాం జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగాడు. ఇస్లాం రక్షణ సంఘటన, దేశ రక్షణ వుద్యమం పేరుతో వున్న సంస్ధలకు చెందిన వారు ఈ వ్యక్తులు.

    అసలే కోతి, ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా రెండు తలపాగాలూ పెద్దగా రంకెలు వేస్తూ వుండటంతో అసలే ఎరుపు భయంతో వున్న సభికులు తాము మట్టుబెట్టిన లక్షలాది మంది కమ్యూనిస్టులలో ఎవరైనా భూతంగా ఆ సభకు వచ్చిందేమో అని భయపడ్డారో లేక భ్రమపడ్డారో గాని అనేక మంది అక్కడకు చేరుకున్నారు. ఇంకే ముంది . ఆ రెండు పత్రికల వార్తలను పట్టించుకోకూడదని వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ పత్రిక, ఛానల్‌ వారు తమ వార్తలను కవర్‌ చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్లుగా ఫెబ్రియానా రాసే వార్తలు మాకు అవసరం లేదు, అసలు ఆమెను మేం పిలవలేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు ఆమె మీదకు వెళ్లారు.జాగ్రత్త మన మహిళల్లో కొందరు నకిలీ ముస్లింలు బురఖాలు వేసుకొని వస్తారు, నిజానికి వారు కమ్యూనిస్టు తొత్తులు, బురఖాలతో మోసం చేయవద్దు అంటూ వీరంగం వేశారు. వున్మాదంతో వున్న జనం, విచక్షణ జ్ఞానం వుండదు వారికి వివరించినా ప్రయోజనం శూన్యం అని గ్రహించి ఆ ప్రాంగణం నుంచి ఆమె నిష్క్రమించారు. ఆ తరువాత ఆమె అంతం చూస్తామంటూ సామాజిక మీడియాలో మతశక్తులు బెదిరింపులు ప్రారంభించాయి.

AJI Condemns Intimidation against Journalist

     ఫెబ్రియానా ఫిర్దౌస్‌ గురించి ఇంక పరిచయం అవసరం లేదేమో ! ఇండోనేషియాలో వున్న తాజా పరిస్థితికి ఆ వుదంతం అద్దం పట్టింది. ఇంతకూ ఆమె చేసిన అపరాధం ఏమిటి ? నియంత సుహార్తో నాయకత్వంలో అమెరికా కుట్ర ప్రకారం మిలిటరీ, పారా మిలిటరీ, రజాకార్ల వంటి మతోన్మాద గూండాలను తయారు చేసి దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను హతమార్చిన దారుణ మారణం కాండ గురించి ఆ నియంత మరణించిన వచ్చిన కొద్దిపాటి వెసులు బాటును వుపయోగించుకొని బుద్ధి జీవులు ఆ దారుణాల గురించి మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. అది క్రమంగా వూపందుకొని ఆ దారుణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని, ప్రభుత్వం హత్యాకాండపట్ల క్షమాపణ చెప్పాలని తదితర డిమాండ్లు ముందుకు వచ్చాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు తాము ప్రజాస్వామ్యయుతంగా వున్నామని జనం ముందు ప్రదర్శించుకోవాలి కదా ? కొంత మంది అభిప్రాయం ప్రకారం పాలకులకు ఇష్టం లేకపోయినా పెరుగుతున్న వత్తిడిని తట్టుకోలేక, ఏదో ఒక పేరుతో ఆ చర్చకు తెరదించాలనే లక్ష్యంతో కొద్ది వారాల క్రితం ఇండోనేషియా ప్రభుత్వం 1965నాటి వూచకోతపై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. ఆచరణలో గతంలో మాదిరే ప్రస్తుత ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు భావజాలం, పదజాలం వున్న కళారూపాలు, డాక్యుమెంటరీలు, పాటలను కూడా నిషేధించారు.కేసులను నమోదు చేశారు. అంతకు ముందున్న పరిస్ధితికి వర్తమానానికి తేడా లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

    అయినప్పటికీ దేశంలోని నిరంకుశ, మతశక్తులు గగ్గోలు ప్రారంభించాయి.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి ఇండోనేషియాలో వ్యాపింప చేయాలనే వారు ప్రభుత్వ సదస్సు వెనుక వున్నారని కొందరు, అసలు ప్రభుత్వంలోనే కమ్యూనిస్టులున్నారని మరి కొందరు, ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందని, వచ్చే ఏడాది లాంఛనంగా ప్రకటన చేయనున్నారని ఇలా రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. వీటిలో వాస్తవాలు ఎంత వరకు అన్నది చెప్పలేము గాని 1965 మారణకాండ గురించి జనానికి నిజాలు చెప్పాలన్న ప్రజాతంత్ర డిమాండ్‌ మాత్రం నానాటికీ అక్కడ పెరుగుతోందన్నది స్పష్టం.

     ఈ పూర్వరంగంలోనే కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు, నాటి మారణకాండలో భాగస్వామ్యులైన మాజీ సైనికాధికారులు, వారితో చేతులు కలిపిన మతోన్మాద శక్తులు, సంస్ధలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు కలిసి ప్రభుత్వం పెట్టినదానికి పోటీ సదస్సును పెట్టి కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని, గతంలో జరిగినదానిపై ఎలాంటి క్షమాపణ చెప్పటం, విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తీర్మానించారు. దాని గురించి విమర్శనాత్మకంగా వార్తలు,వ్యాఖ్యలు రాయటమే ఫెబ్రియానా చేసిన పని. అంతకు ముందు కూడా కమ్యూ నిస్టులు, సానుభూతిపరులు అన్న అనుమానం వున్న కళాకారులు, రచయితల సభలు,సమావేవాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వ అధికార యంత్రాంగం తీసుకున్న నిషేధ చర్యలు మొదలైన వాటి గురించి కూడా ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె పేరు ఎత్తితేనే కమ్యూ నిస్టు వ్యతిరేకులు, మతశక్తులు మండి పడుతున్నాయి. భౌతిక దాడులకు ప్రయత్నించటంతో ఆమె ప్రస్తుతం అజ్ఞాతవాసంలో వున్నట్లు వార్తలు వచ్చాయి.

     ఒక్క ఫెబ్రియానా గురించే కాదు, ఇండోనేషియాలో పత్రికా స్వాతంత్య్రం గురించి అనేక మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఫెబ్రియానాకు బెదిరింపుల గురించి జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకొనే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా అక్కడి కరెన్సీలో 50 కోట్ల రుపయాల( 34,500 డాలర్లకు సమానం) జరిమానా విధించవచ్చు.తమ జర్నలిస్టును సభ నుంచి గెంటివేయటం అక్రమం అని ఫెబ్రియానా ఒక సంపాదకురాలిగా పనిచేస్తున్న రాప్లర్‌ డాట్‌ కాం యాజమాన్యం ఒక ప్రకటనలో ఖండించింది.ఆగ్నేయాసియా ప్రెస్‌ అలయన్స్‌ ఇండోనేషియా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసింది.ఇండోనేషియా ఇండిపెండెంట్‌ జర్నలిస్టు అలయన్స్‌ ఫెబ్రియానా రక్షణకు చర్యలు తీసుకుంది.ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండోనేషియాలో కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా !

04 Saturday Jun 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, Indonesian Communist Party, PKI, victims of 1965

ఎంకెఆర్‌

    ఇండోనేషియాలో అంత మైంది అనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా ? కొంత మంది చెబుతున్నట్లు 2017లో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందా ? లేక మరికొందరు అంటున్నట్లు ఎక్కువ చేసి చెబుతున్నారా ? యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోశారు. మరికొన్ని లక్షల మందిని అనుమానంతో కమ్యూనిస్టులుగా భావించి జైళ్లలో పెట్టారు, చిత్రహింసల పాలు చేశారు. కమ్యూనిజాన్ని అణచివేశామని అదింకేమాత్రం ఇండోనేషియాలో కనిపించదని సంబరాలు చేసుకున్నారు. ఆసియాలో కమ్యూనిజ వ్యాప్తి నిరోధంలో భాగంగా అమెరికా సిఐఏ రూపొందించిన ఒక దుష్ట పధకం ప్రకారం ఇదంతా జరిగింది.నాడు ఏక్షణంలో ఏ సైనికులు, పోలీసులు, వారి కిరాయి ఏజంట్లు వచ్చి తమను హతమారుస్తారో అని కమ్యూనిస్టులు, అభిమానులు, సాధారణ ప్రజాతంత్ర వాదులు భయపడ్డారు. నేడు అందుకు విరుద్ధంగా ఏ మూల నుంచి కమ్యూనిస్టులు పుట్టుకు వస్తారో అని భయపడుతూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు వీధులకెక్కుతున్నారు. అనేక సంస్థలకు చెందిన వారూ, రిటైర్డ్‌ మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితం కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సు పెట్టి ఆ సందర్భంగా రాజధాని జకర్తాలో ఒక ప్రదర్శన చేశారు.అరుణ పతాకాలను తగుల పెట్టారు.కమ్యూనిస్టులను చంపటం సరైనదే అని వున్మాదంతో నినాదాలు చేశారు. కమ్యూనిజం, ఇతర భావజాలాల నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రదర్శన జరిపినట్లు వుపన్యాసాలు చేసిన వారు చెప్పారు. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసి ఎంతో మందిని చంపిన అమెరికా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిందని, కమ్యూనిస్టులను చంపటం కూడా యుద్ధంలో భాగంగానే పరిగణించి ప్రభుత్వం ఎలాంటి క్షమాపణలు చెప్పకూడదని వాదించారు. ఇంతకాలంగా కార్యకలాపాలలో లేని ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(పికెఐ) తన వునికిని చాటుకొనేందుకు పధకాలు వేసిందని, దానిని అడ్డుకోవాలని కోరారు. కొన్ని పత్రికలు మూడువేల మంది పాల్గొన్నట్లు రాస్తే మరికొందరు పదివేలని పేర్కొన్నారు.

    దీనికి కొద్ది వారాల ముందు ప్రభుత్వమే 1965 హత్యాకాండ బాధితుల గురించి వారి కుటుంబాలు, మేథావులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో ఒక సదస్సు జరిపిన విషయం తెలిసినదే.అదే ప్రభత్వం కమ్యూనిస్టు ప్రచారం, పునరుద్ధరణలో భాగంగా చివరికి కమ్యూనిస్టు చిహ్నాలున్న టీ షర్టులను అమ్ముతున్నవారిని, ధరించిన వారిని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పికెఐ భావజాలం వున్న వారు చెప్పింది మాత్రమే వినవద్దు, మేము చెప్పేది కూడా వినాలి, 1965లో మరణించిన వారిని (కమ్యూనిస్టులను) బాధితులుగా ప్రభుత్వం గుర్తిస్తే వారిని హతమార్చిన వారిని(మిలిటరీ, ఇతర కిరాయి ఏజంట్లు) నేరస్థులుగా పరిగణించాల్సి వుంటుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు పేర్కొన్నారు.

  ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికలిగిస్తున్నాయి.ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేశామని అమెరికన్లు ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత అదే అమెరికాలో తాము సోషలిస్టుల మంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా సోషలిస్టును అని ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ ప్రస్తుతం ప్రచారంలో మునిగిన విషయం, ఆయనకు యువత నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.

   ఇండోనేషియాలో నియంత సుహార్తో పతనం తరువాత 1965 నాటి మారణకాండపై విచారణ జరపాలనే అంశం మెల్లగా వూపందుకుంది. మొత్తాన్ని అంతం చేసిన తరువాత కూడా ఇంకా కమ్యూనిస్టులు మిగిలి వున్నారా ? వుంటే ఏ పేరుతో వున్నారు, తాజా డిమాండ్‌ వెనుక వారున్నారా ? అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులను వేధిస్తున్న ప్రశ్న. కమ్యూనిస్టుల నాయకత్వాన నైజా నవాబు, దేశముఖ్‌లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణా సాయుధ పోరాట సందర్బంగా కోస్తా జిల్లాలో ఆ పోరాటానికి మద్దతు తెలిపిన వారిని కూడా మిలిటరీ, పోలీసులు అనేక మందిని కాల్చి చంపటమే గాక గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి చిత్ర హింసల పాలు చేశారు. పోలీసులకు ఎవరు కమ్యూనిస్టులో ఎవరు కాదో తెలియని స్ధితి, వచ్చిన స్పెషల్‌ ప ోలీసులకు జనాన్ని బాదటం తప్ప తెలుగు తెలియదు. గాంధీ విగ్రహాల ముందు జనాన్ని మందవేసి చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో కొంత మంది తాము యాంటీ కమ్యూనిస్టుల మని చెప్పుకున్నారట. అసలే పోలీసు, తలమీద టోపీ పెట్టగానే బుర్ర అసలు పని చేయదని తెలిసిందే. దాంతో వున్న కమ్యూనిస్టులతోనే వేగలేకపోతుంటే వీరెవరో కొత్తగా యాంటీ కమ్యూనిస్టులట వీరికి నాలుగు అదనంగా తగిలించమని పురమాయించినట్లు చెప్పేవారు. అలాగే ఇండోనేషియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఎంతవరకు పోయిందంటే కమ్యూనిస్టు వ్యతిరేక పుస్తకాలను కూడా మిలిటరీ, పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఏమిటంటే కమ్యూనిస్టులను విమర్శించాలన్నా కమ్యూనిస్టులు ఏమి చెప్పేది వివరించాలి కనుక అది కూడా కమ్యూనిస్టు ప్రచారానికి తోడ్పడుతందని వారు భయపడుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకత ముసుగులో నియంత సుహార్తో అనుసరించిన మేథోవ్యతిరేక ధోరణులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇలాంటి చర్యలు ఫలితాలనివ్వవని తెలిసినప్పటికీ అదే మొరటు పద్దతులను పాటిస్తున్నారు. మిలిటరీ, పోలీసులు ఎంతగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడితే యువతరం అంతగా దానిపట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం లేకపోలేదని కొందరు భయపడుతున్నారు.

   ఇండోనేషియాలో కమ్యూనిస్టు కార్యకలాపాల పునరుద్ధరణ గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తులని దేశ వుపాధ్యక్షుడు యూసఫ్‌ కలా వ్యాఖ్యానించారు.’ కమ్యూనిజం అనేది సమానత్వం కోరుతున్న ఒక భావజాలం,అందుకే కాబోలు జనం దానిని భిన్నంగా చూస్తున్నారు, ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ అనేది అతిశయోక్తి అనుకుంటున్నా. అది అనేక దేశాలలో విఫలమైంది, ప్రస్తుతం వుత్తర కొరియాలో మాత్రమే వుంది, అక్కడి ప్రభుత్వం కూడా విఫలమైంది, ఒక భావజాలంగా ఒకసారి తిరస్కారానికి గురైంది తిరిగి వేళ్లూను కుంటుంది అనుకోవటం లేదు.’ అన్నారు. మిలిటరీ అధికారి కివలన్‌ జెన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరించబడింది, 2017లో ప్రకటన వెలువడ నుంది అన్నారు. రాజకీయ, భద్రత, న్యాయ వ్యవహారాల మంత్రి లుహుత్‌ బిన్సర్‌ పండజైటన్‌ మాట్లాడుతూ ‘ అదే నిజమైతే ఆ సంస్ధ ఎక్కడుందో చెప్పమనండి, నాకు చాలా కళ్లు,చెవులు వున్నాయి కానీ ఒక్క నివేదిక కూడా నాకు అందలేదు’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది ఆసక్తి కలిగిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి టీ షర్టులతో భయపడిన ఇండోనేషియా సర్కార్‌

15 Sunday May 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist symbols, Indonesian Communist Party (PKI)., Jokowi, PKI, victims of 1965

ఎంకెఆర్‌

  ప్రపంచంలో సోషలిజాన్ని తొక్కి వేశామని, కమ్యూనిజాన్ని కాలరాశామని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రకటించిన పాతిక సంవత్సరాలు దాటింది. అయితేనేం వారి కనుసన్నలలో నడుస్తున్న ఇండోనేషియా పాలకవర్గం ఇప్పుడు ఎటు వైపు నుంచి ఎప్పుడు కమ్యూనిస్టులు తమకు దర్శనమిస్తారోనని భయపడి చస్తోంది, మాటి మాటికీ వులికిపడుతోంది. యాభై సంవత్సరాల నాడు ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, వారి సానుభూతి పరులుగా పరిగణించిన వారిని వూచకోత కోసిన వారు ఇప్పుడు ఏ సమాధి నుంచి ఎవరు ఎక్కడ లేచి వస్తారో అన్నట్లుగా సామూహిక సమాధులను కూడా కానరాకుండా చేసేందుకు పూనుకుంది.

     లేకపోతే కార్మిక, కర్షక చిహ్నాలైన సుత్తీ, కొడవలి ముద్రించిన టీ షర్టులు అమ్ముకుంటున్న ఇద్దరు చిరు వ్యాపారులు కమ్యూనిజాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ అరెస్టు చేస్తారా? అలాంటి టీ షర్టులను తయారు చేయవద్దని యజమానులను ఆదేశిస్తారా ? ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అక్కడి పాలకవర్గం వామపక్ష భావజాల చర్చను బహిరంగంగా అనుమతిస్తే ఏం జరుగుతుందో, అనుమతించక ఇంకా అణచివేత కొనసాగనిస్తే దాని మీద ఇంకా యువతలో మోజు పెరుగుతుందా అన్నది తేల్చుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు యాభై సంవత్సరాల నాడు జరిగిన అణచివేతకు గురైన వారి కుటుంబాలతో సర్దుబాటు చేసుకోవాలనే పేరుతో మారణకాండ గురించి ప్రభుత్వమే అధికారికంగా ఒక సదస్సు నిర్వహించి వివరాలుంటే చెప్పమని కోరింది.మరోవైపున అదే ప్రభుత్వం కమ్యూనిస్టు చిహ్నాలను పంపిణీ చేస్తూ కమ్యూనిజాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదు, ఏకపక్షంగా రాసిన చరిత్రను, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇంకా అధికారికంగా కొనసాగిస్తూనే వుంది.

    ఈ కారణంగానే పోలీసులు తాజాగా సుత్తీ,కొడవలి గుర్తులున్న టీ షర్టులను విక్రయించేవారిని అరెస్టు చేసి, వాటి తయారీని నిలిపివేయాలని కోరారు.ఈ చర్య కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ చర్యను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టు చిహ్నాలను ప్రదర్శిస్తున్న, వ్యాపింప చేస్తున్నవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియా మిలిటరీ, నేషనల్‌ ఇంటలిజెన్స్‌, అటార్నీ జనరల్‌ కార్యాలయాలను ఆదేశించించినట్లు జాతీయ పోలీసు ప్రధాన అధికారి బద్రుదిన్‌ హయతీ వెల్లడించారు.దేశంలో కమ్యూనిస్టు భావజాలం అదుపులేకుండా విస్తరించటం ఆందోళన కలిగిస్తున్నదని బద్రుదిన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. కమ్యూనిజం గురించి చర్చించటం, సమావేశాలు జరపటం వంటి కార్యకలాపాలు పెరగటాన్ని గమనించామన్నారు.ఈ పరిస్ధితులను కొన్ని బాధ్యతారాహిత్య పార్టీలు వినియోగించుకోచూడటాన్ని నిరోధించేందుకు పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి సుత్తీ, కొడవలి గుర్తులున్న టీ షర్టులు ధరించి వున్నా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎందుకు వాటిని ధరించారో విచారణ జరుపుతారని చెప్పారు. కమ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. మ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవమని తేలితే అలాంటి వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులతో పాటు కమ్యూనిస్టులని అనుమానం వున్నవారి సమాచారం చేరవేసేందుకు ఏజంట్లను కూడా వినియోగిస్తున్నారు. టీషర్టులను అమ్మేవారిని నిర్బంధించటంతో వెల్లువెత్తిన నిరసనలతో దిక్కుతోచని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్‌ బౌడీ ఒక ప్రకటన చేస్తూ భద్రతా సిబ్బంది ఈ విషయంలో అతిగా స్పందించారని, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చను పరిరక్షించేందుకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధ్య క్షుడు కోరినట్లు నష్ట నివారణకు ప్రయత్నించారు.

   కమ్యూనిజం పునరుద్ధరణను నిరోధించే పేరుతో పౌర విధుల్లో మిలిటరీ ప్రమేయం ఎక్కువ అవుతోందని అనేక మంది విమర్శిస్తున్నారు. తూర్పు జావాలో ఈనెల మూడవ తేదీన ‘చెరకు తోటల్లో సుత్తీ, కొడవలి ‘ అనే పేరుతో వున్న గ్రంధ కాపీలను మిలిటరీ స్వాధీనం చేసుకుంది. మరొక ప్రాంతంలో గిరిజన సంఘం సభ్యుల వద్ద వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు గుర్తులున్న టీ షర్టులు ధరించారనే పేరుతో నలుగురిని అరెస్టు చేశారు.

   టీ షర్టులపై ముద్రించేందుకు ఏ గుర్తులు బాగుంటాయో చూద్దామని తాము ఇంటర్నెటలో వెతికామని దానిలో 1990 దశకం నాటి తూర్పు జర్మనీ చిత్రం ఆకర్షణీయం వుండటంతో దానిని తీసుకొని టీ షర్టులపై ముద్రణకు ఇచ్చాం తప్ప ఆ గుర్తుల గురించి వాటిని కలిగి వుంటే ఇలా జరుగుతుందని తమకు తెలియదని వాటిని అమ్మిన చిరు వ్యాపారులు చెప్పారు. పోలీసులు కూడా తరువాత దానిని నిర్ధారించారు.అయితే ఆ చిహ్నాలను ముద్రించిన ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే జకర్తాలో జరిపిన ఆసియన్‌ సాహిత్య వుత్సవాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం తలపెట్టారంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు దానిని జరగనీయరాదని డిమాండ్‌ చేశారు.అయితే పోలీసు రక్షణలో అది జరిగింది. ఇదిలా వుండగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ప్రతినిధులు జావా,సుమత్రా దీవులలో 122 సామూహిక సమాధుల వివరాలను వెల్లడించింది. ఇండోనేషియా విశ్వవిద్యాలయ ఆంత్రోపాలజిస్టు దవే లుమెంటా మాట్లాడుతూ పాఠశాలల్లో బోధించినది తప్ప అత్యధికులకు దేశ చరిత్ర అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం అందించిన దానిని అంగీకరించటం తప్ప దాని అర్ధం చేసుకోలేక జనం కమ్యూనిజం గురించి భయపడుతున్నారని అన్నారు. ఆ పాఠాలలో కూడా చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో వరుసగా చెప్పటం తప్ప అలా జరగటానికి కారణాలు, పర్యవసానాల గురించి వాటిలో వుండదని, ప్రస్తుతం వునికిలో లేని కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమీ వుండదని తెలిపారు. 1965నాటి సామూహిక హత్యాకాండ గురించి ఏకపక్షంగా చెప్పే కధనాల ప్రకారం కమ్యూనిస్టులు కేవలం అంతరాత్మలు లేని నాస్థికులుగా చిత్రితమైందని దవే చెప్పారు. 1965 తరువాత మిలిటరీతో సహా కొన్ని పార్టీలకు రాజకీయ చట్టబద్దత లభించిందని, వాటికి పైన చెప్పిన చెప్పిన కథనాలను పరిరక్షించటం తప్ప మరొకదానిపట్ల ఆసక్తి లేదంటూ నూతన అధికార వ్యవస్ధ కాలంగా పరిగణించబడుతున్న 1966-1998 మధ్య మిలిటరీకి చెందిన వారిని రాజకీయాలు, వాణిజ్యంలో కూడా అనుమతించారని తీవ్రవాదంతో కూడిన మితవాద శక్తులను ప్రోత్సహించటం ప్రమాదకరమని అన్నారు. యాభయి సంవత్సరా క్రితం సామూహిక హత్యాకాండకు గురైన వారి, లేదా దాని నుంచి తప్పించుకున్నవారి కుటుంబాలపై ఇప్పటికీ నింద, వివక్ష కొనసాగుతోందని ఇండోనేషియా విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజిస్టు రువైదా నూర్‌ చెప్పారు. ప్రభుత్వం దానిని సంస్థాగతంగా జోక్యం చేసుకొని సరిదిద్దాలన్నారు. కుటుంబం, స్కూలు, మీడియా ద్వారా ఇది జరగాలని చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

As long as communism is ‘threat’, democracy is flawed – Ririn Sefsani and Timo Duil

13 Sunday Dec 2015

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communism, democracy, Human Rights, Indonesia, PKI, victims of 1965

13 December 2015

A spectre is haunting Indonesia, the spectre of communism. All the powers of the political establishment have entered into a holy alliance to exorcise this spectre: Muslim and Christian clerics, politicians and bureaucrats, the military and vigilante rackets.

Karl Marxs famous first sentences of the manifesto of the Communist Party, written in 1848, precisely depict Indonesia’s current situation. But, in sharp contrast to Europe in the mid-19th century, there is no leftist party worthy of mention in Indonesia. Communism in Indonesia is a mere spectre indeed.

Fifty years after the bloody extermination of the Communist Party, the very term of communism is still an effective tool to exclude from public debates those that are perceived as a threat by the ruling elite. This tool can be applied to virtually all leftist movements opposing the established political and economic order.

The political elite can count on various groups whom, despite not knowing what communism actually is, remain willing to oppose this ideology as it has been depicted as a threat not solely to the elite, but to the nation in general.
It is doubtful whether members of the Islam Defenders Front (FPI) or the Anticommunist Front are able to explain how Marxist economic thought explains economic exploitation, what surplus value is, what the concept of the working class is about.

Communism, to those people, is without any precise content and is merely something that should be feared. It is exactly this perception of communism which makes large parts of society mentally captivated by Cold War doctrines.

Approximately 32 years of indoctrination by an anticommunist regime continues to show its effect and it could be that this consciousness is one of the biggest obstacles for both reconciliation and democratization.

Before the International People’s Tribunal was held in The Hague recently, the School of Southeast Asian Studies at Bonn University, Germany, conducted a workshop on the 1965 incidents and on the question of how to deal with that bloody past. The event was attended a crowd of Indonesian citizens, by lawyers, journalists and survivors.

Participants were able to discuss sensitive topics with the Indonesian deputy ambassador in Germany. The deputy ambassador listened to what the victims had to say.

In contrast, the reactions coming from the administration of President Joko “Jokowi” Widodo and Vice President Jusuf Kalla leave much to be desired since they are not willing to pay any attention to those victims proving testimony to the cruelty they experienced.

The decision of Balinese authorities at the Ubud Writer’s Festival and even by universities to ban the screening of Joshua Oppenheimer’s films on the 1965-issue is also a clear sign that the fostered fear of communism is still a reason to restrict the freedom of expression.

It is this mixture of ignoring those stigmatised people who suffered painful experiences on behalf of a harmonious, conflict-free society and the ignorance of what communism actually is that makes it so hard for Indonesia to deal adequately with its past.

However, while these attitudes linger on, Indonesia will not succeed its transition towards democracy because of two reasons; firstly, because this attitude clearly highlights a gesture of suppressing points of view considered cumbersome for the elite and for those many citizens with minds still rooted in New Order ideology.

Furthermore, the attitude of fear toward the confused thread named communism prevents Indonesia’s political culture from becoming democratic as it hampers socialist or labor parties from the political stage.

As long as that is the case, voters in Indonesia will not have real alternatives in elections because the established parties do not differ fundamentally in their ideologies.

All parties are more or less bound to fuzzy nationalist and Islamic notions and are pragmatic and usually pro-capital in their political operations.

The fostered fear of communism is still a reason to restrict the freedom of expression.

However, democracy needs alternatives and the most urgently needed one continues to remain as a spectre of fear in Indonesia; a leftist alternative to pro-capitalist realpolitik with blurry nationalist notion.

For as long as Indonesia is unready to face the truth about the actual idea of communism, violation of human rights such as freedom of speech and the stigmatisation of the victims of 1965 will persist. In contrast to his opponent Prabowo Subianto, Jokowi highlighted his commitment to implement human rights during his campaign.

In alliance with parties supporting him, he also stressed in his Nawacita program that he would “create space for dialogue between citizens”. It is obvious that he will fail to do so if the government keeps on demonising communism and those victims of the anti-communist massacres.

The International People’s Tribunal was an excellent opportunity for the President to provide proof of the promises made during the election campaign.

But instead of “creating space for dialogue between citizens”, Kalla reduced the incidents of 1965 to the issue of the six murdered generals and did not even mention the hundreds of thousands of victims.

Also, Attorney General Muhammad Prasetyo called the tribunal “irrelevant” and said Indonesia doesn’t need intervention from other countries, indirectly blaming the Dutch government which had nothing to do with the tribunal.

The organisers, in contrast, stressed that they would have conducted the tribunal in Jakarta, but as many victims did not felt safe in Indonesia, they decided to perform it at The Hague, the city of international law.

Given that facts, the government effectively limited the space for dialogue between citizens because they are still not able to leave New Order narratives behind.

Until today, Marxist works are officially banned in Indonesia – works that represent the foundations of major political parties in many well-established democracies all over the world. Social democracy, socialism, labor parties and left-wing green parties are all based on Marxist political thoughts.

Through leftist parties, Marxist thoughts enrich democratic pluralism and provide political identities that are not solely based on religion and nationalism. Indonesia, with its immense workforce of labourers, peasants and urban poor, needs a political ideology that can represent and articulate these people’s economic demands.

Institutional reforms alone do not make a democracy work; for as long as conflicting ideological alternatives have yet to be established and socialism is excluded from Indonesian politics, Indonesia’s democracy is flawed. – December 13, 2015.

Courtesy: themalaysianinsider.com

Share this:

  • Tweet
  • More
Like Loading...

THE BLACK BOOK OF CAPITALISM

06 Sunday Dec 2015

Posted by raomk in History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, CAPITALISM, Goebbels, Propaganda

Anti communists are always branding communists as genocides  and misleading the peoples with false propaganda. They believe in Goebbels, the facts are not true,  But who is really genocides, look into …..

THE BLACK BOOK OF CAPITALISM

By Daniel Gilbert

Rwandan GenocideMost Americans today think that communism has been one of the most genocidal ideologies in human history. Many are misinformed by anti-communist propaganda stating that we have killed over 100 million people when in fact this is not true remotely. I will save that for another time today we are here to discuss the deaths caused by capitalism.

In India when the English colonized India in the 19 century they tried to make it as profitable as possible this included making the Indian farmers switch from food production to cotton production this lead to a massive famine that killed 30 million people in India.

While in America we were undergoing one of the best examples of ethnic cleansing to date. The forced removal of the Native Americans from their homelands resulted in over 14 million people dying and the rest forced to live on reservations. All this done because a need for raw resources, required more land.  All those keeping track at home this brings the count to 44 million dead and we haven’t even got into the 20th century.

An examination of imperial Russia shows that because of a lack of modernization and greedy hoarding done by capitalist and nobles lead to routine famine called the “hungry years” leading to countless deaths and starvation. This continued until the 1920-1930 through which the collectivization of agriculture by Soviet Union lead to less deaths and ended widespread starvation. When China was under the Qing dynasty, British merchants illegally sold opium. A 3 year long war resulted which ended in China’s defeat. This left hundreds of thousands dead the results of the war lead to Te Tai Ping rebellion. A famine later happened due to the countless fighting, corruption and bad weather again this death toll is incalculable.

The exploitation of the African people who due to the domination of foreign governments where second-class citizens in their own country. When African nations finally became independent from imperialist rule the Europeans left Africa in a “cookie cutter” state. Meaning that nations where drawn out on a map without consideration of the local ethnicity. Which lead to many civil wars including the famous one in Rwanda where 800,000 lost their lives due to imperialist favoritism. The international world did nothing to stop this atrocity.

In Yugoslavia with lack of care from the international world the government collapsed due to pressure put on them by the World Bank and the IMF lead to war within the country. Now this article leaves out many things that also happened under capitalist rule that is because it is nearly impossible to figure out the total death toll if you may know any more events please feel free to comment.

From Peoples World

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d