• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: KCR

కష్టజీవుల్లో భ్రమలను పోగొడుతున్న కెసిఆర్‌కు ‘అభినందనలు’ !

08 Tuesday Oct 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KCR warning to RTC staff, TS RTC staff strike

Image result for kcr

ఎం కోటేశ్వరరావు
ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ‘అభినందనలు’ చెప్పాలి. కార్మికులు, వుద్యోగులు,సకల కష్ట జీవుల్లో నెలకొన్న భ్రమలను తొలగించేందుకు, కార్మిక, వుద్యోగ సంఘాల ఐక్యతకు దోహదం చేస్తున్న ‘ఒకే ఒక్కడు ‘ కెసిఆర్‌ అంటే అతిశయోక్తి కాదు. చరిత్రలో అనేక సందర్భాలలో ఇదే రుజువైంది.దశాబ్దాల తరబడి చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించిన ఉద్యమకారుల కృషి కంటే కొందరు పాలకుల ఒకటి రెండు చర్యలు జనానికి కనువిప్పు కలిగించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
పోరుబాట వదలి, పాలక పార్టీల సార్ల ముందు సాష్టాంగ ప్రమాణ బాట పడితే సమస్యలన్నీ పరిష్కారమౌతాయంటూ ఇటీవలి కాలంలో అనేక సంఘాల నాయకత్వాలు చెప్పిన సూక్ష్మంలో మోక్షాన్ని అందుకోవచ్చని కష్టజీవులు కూడా గుడ్డిగా నమ్మారు. ఎండమావుల వెంట పరుగులెత్తుతున్నారు. ఇదేదో రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామం కాదు. రూపం మార్చుకున్న పెట్టుబడిదారీ విధానం నేతి బీరలో నెయ్యి మాదిరి నయా వుదారవాదం ముందుకు తెచ్చిన అస్ధిత్వ ధోరణులు లేదా రాజకీయాలు కష్టజీవులను భ్రమల్లో ముంచుతున్నాయి. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా కష్టజీవుల పరిస్ధితి తయారైంది.

Image result for kcr
సమ్మెలో పాల్గొన్న కార్మికులను వుద్యోగాల నుంచి ఊడగొడతానని సార్‌ కెసిఆర్‌ ఇప్పుడు కొత్తగా ప్రకటించారని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి గతేడాది జూన్‌ 11 నుంచి తలపెట్టిన సమ్మె సందర్భంగానే హెచ్చరించారని మరచి పోరాదు. అయినా సరే తరువాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఆయన నాయకత్వానికే ఓటు వేశారు. తెలంగాణా రాష్ట్ర ఆందోళన సమయంలో తామంతా పాల్గొన్నామని ఇప్పుడు ఇలా చేయటం ఏమిటని అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. పరాయి పాలకులను నెత్తినెక్కించుకోవటం కంటే మా దొరలను మోయటమే మాకు గర్వకారణంగా వుంటుందని గతంలో వాదించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. అలా దొరలను నెత్తినెక్కించుకున్న వారిలో కార్మికులు, వుద్యోగులు, వుపాధ్యాయులతో సహా ఎవరూ తక్కువ కాదు.
ఒకసారి అస్ధిత్వ ధోరణులకు ప్రభావితులై వర్గదృక్పధం కోల్పోయిన తరువాత దొరలు, దొరసానులనే కాదు చివరకు వివిధ రూపాల్లో ముందుకు వచ్చే ఫాసిస్టు లక్షణాలను, ఫాసిస్టు శక్తులను సైతం బలపరచటానికి జనం వెనుకాడరు. ప్రపంచ ద్రవ్యపెట్టుబడి విధానాల పర్యవసానంగా జీవనోపాధి కుచించుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఉద్యోగాలలో వున్న వారు గతంలో సంపాదించుకున్న హక్కులను నిలబెట్టుకొనేందుకుగానీ, పోగొట్టుకున్నవాటిని తిరిగి పొందేందుకు గానీ ముందుకు రాకపోగా అధికార పార్టీని ఆశ్రయిస్తే ఎలాగొలా నెట్టుకురావచ్చని ఆశపడతారు.పోరుబాటను విడిచిపెడతారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దేనికైనా సిద్ధపడతారు. కనుకనే తాను కొత్తగా ఆర్టీసిలోకి తీసుకోబోయే ఉద్యోగులు తాము యూనియన్లకు, సమ్మెలకు దూరంగా వుంటామని హామీ పత్రాలను రాసివ్వాల్సి వుంటుందనే ఒక నిరంకుశమైన అంశాన్ని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పగలుగుతున్నారు. రిక్రూట్‌మెంట్‌ చేస్తే గీస్తే ప్రభుత్వ వుద్యోగులు, వుపాధ్యాయులు కూడా తాము ఏ యూనియన్‌ సభ్యత్వం తీసుకోము అని రాసివ్వాలని అడగరనే హమీ ఎక్కడుంది. ఇన్ని సంఘాలు ఎందుకని ఒకసారి మాట్లాడతారు. తాను ఇచ్చిన హామీలనే అమలు జరపమని కోరినందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్ధల సిబ్బందిని వుద్దేశించి తోక కుక్కను నడుపుతుందా లేక కుక్క తోకను ఆడిస్తుందా అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఒక్కో సమయంలో ఒక్కో శాఖ సిబ్బందిని అవమానాలపాలు చేసి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆర్టీసి యూనియన్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయని అంటున్నారు.
అస్ధిత్వ ధోరణుల కారణంగానే ఎవరి సంగతి వారు చూసుకోవాలనే వైఖరి నేడు వివిధ కార్మిక సంఘాల మధ్య నెలకొని వుంది. ఆర్టీసి వుద్యోగులకు రెండున్నర సంవత్సరాలుగా పిఆర్‌సి డిమాండ్‌ను పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రభుత్వ వుద్యోగులు తమ పిఆర్‌సిని పట్టించుకుంటారని నమ్మటం భ్రమగాకపోతే ఏమిటి? ఆర్‌టిసి కార్మికుల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుంటే మిగతా వుద్యోగ, కార్మిక సంఘాలు ఖండించటం, తోటి వుద్యోగులకు కనీసం నైతిక మద్దతు ప్రకటన కూడా ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి ? రేపు తాము పోరుబాట పడితే ఇతరుల మద్దతు అవసరం లేదా ? ఎవరికి వారు ఆలోచించుకోవాలి.

Image result for kcr
ఆర్‌టిసి కార్మికుల విషయానికి వస్తే దసరా పండగ ముందు సమ్మె చేయటం ఏమిటంటూ వారికి వ్యతిరేకంగా జనంలో మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. సామాజిక మాధ్యమంలో హిందూత్వ ప్రభావానికి లోనైన వారు హిందువుల పండగ సందర్భంగానే సమ్మె చేస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. వారికి మతోన్మాదం తప్ప సమ్మెలో వున్నవారు కూడా అత్యధికులు హిందువులే అన్న విషయం వారికి పట్టదు. గతేడాది జూన్‌లో సమ్మె నోటీసు ఇచ్చినపుడు ఏ పండగా లేదు. అయినా సరే ప్రభుత్వం సమ్మె నోటీసును తీవ్రంగా తీసుకుంది. జూన్‌ 7న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ ఒక వేళ సమ్మెంటూ జరిగితే ఆర్‌టిసి చరిత్రలో ఇదే చివరిది అవుతుంది, సిబ్బంది వుద్యోగాలను కోల్పోతారు అని బెదిరించారు. అప్పుడు మూడువేల కోట్ల నష్టం గురించి మాట్లాడిన సిఎం దాన్ని పూడ్చేందుకు లేదా కొత్త నష్టాలను నివారించేందుకు తీసుకున్న చర్యలేమీ లేవు. ఇప్పుడు తిరిగి తాజా అంకెలతో, ప్రయివేటు బస్సులు, కొత్త సిబ్బంది అంటూ కార్మికులను భయపెట్టేందుకు లేదా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. పదహారు నెలల క్రితం చేసిన వాదనలనే ముందుకు తెచ్చారు. కొత్త ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. అవన్నీ ఆర్‌టిసిని మరింతగా దెబ్బతీసేవే తప్ప బాగు చేసేవి కాదు. ఆ సంస్ధకు వున్న విలువైన ఆస్ధులను కాజేసేందుకు ఎవరు అధికారంలో వున్నప్పటికీ పాలకపార్టీల పెద్దలు ఉమ్మడిగా వున్నపుడు, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రయత్నిస్తూనే వున్నారు.
తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐర్‌ అండ్‌ పిఆర్‌( తాత్కాలిక భృతి, వేతన సవరణ)పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు లేవు గనుక వాటిని సాధ్యమైన మేరకు వాయిదా వేసేందుకు, ఒక వేళ ఇవ్వాల్సి వచ్చినా నామ మాత్రంగా పెంచేందుకు అవసరమైన నేపధ్యాన్ని సిద్దం చేశారని ఉద్యోగులు మరచి పోరాదు. సంక్షేమ చర్యలతో జనాలను ఆకర్షించేందుకు చూసే పాలకులు ఆర్ధిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నపుడు వాటికే ఎసరు పెడతారని గ్రహించాలి. అలాంటి పరిస్ధితి ఎదురైనపుడు కార్మికులు, వుద్యోగుల ముందు రెండు మార్గాలు వున్నాయి. బెదిరింపులకు భయపడి ప్రభుత్వాలకు లొంగిపోయి ఆర్ధికంగా నష్టపోవటం ఒకటైతే అందరూ ఒక్కటై ఒకరికి ఒకరు తోడై ఉమ్మడిగా పోరుబాట పట్టి న్యాయమైన కోర్కెలను సాధించుకోవటం రెండవది. ప్రపంచ వ్యాపితంగా మొదటిదే ఎక్కువగా జరుగుతోంది. నయా వుదారవాద ప్రభావం కార్మికవర్గం మీద తీవ్రంగా వుంది.

Image result for kcr
ప్రపంచంలో అతి పెద్ద దేశమైన చైనాలో ఏటేటా కార్మికుల,వుద్యోగుల వేతనాలు పెరుగుతున్నందున పరిశ్రమలు, వాణిజ్యాలు గిట్టుబాటుగాక వేతనాలు ఎక్కడ తక్కువగా వుంటాయో అక్కడికి తరలి పోవాలని చూస్తున్నాయనే వార్తలను చూస్తున్నాము. దానికి కారణం అక్కడి పాలకులు కష్టజీవుల పక్షాన వుండటమే అన్నది స్పష్టం. చైనా నుంచి బయటకు పోయే వాటిని మన దేశానికి రప్పించాలని కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ, ఆయన విధానాలనే అనుసరిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారు. ప్రభుత్వ వుద్యోగులు, కార్మికుల వేతనాలు పెరిగితే ప్రయివేటు రంగంలో వున్న వారి వేతనాల పెంపుదలకు వత్తిడి, ఆందోళనలూ ప్రారంభమౌతాయి. అందువలన సంఘటితంగా వున్న వారినే దెబ్బతీస్తే అసంఘటిత రంగంలో వున్న వారు ముందే నీరుగారి పోతారు.
పెట్టుబడులను ఆకర్షించాలని చూసే ప్రతి రాష్ట్ర పాలకులూ ఈ పరిస్ధితినే కోరుకుంటారు. దీనికి కెసిఆర్‌ మినహాయింపు కాదని అర్ధం చేసుకోవాలి. ఉన్న యూనియన్ల నాయకత్వాలను లోబరచుకోవటం, సాధ్యంగాకపోతే వాటిని చీల్చి తమ కనుసన్నలలో పనిచేసే వారితో కొత్త సంఘాలను ఏర్పాటు చేయటం వంటి పాలక టీఆర్‌ఎస్‌ పార్టీ అజెండా, పరిణామాలు, పర్యవసానాలన్నీ దానిలో భాగమే. ఇది రాస్తున్న సమయానికి ఆర్‌టిసి సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. ప్రభుత్వ బెదిరింపులు కార్మికుల మీద పని చేయలేదు. తోటి వుద్యోగ, కార్మిక సంఘాల మద్దతు లేకపోతే ఈ ఐక్యత, పట్టుదల ఎన్ని రోజులు వుంటుంది అన్నది సమస్య. దసరా తరువాత నిరంకుశ, నిర్బంధ చట్టాల దుమ్ముదులుపుతారు. ఆర్‌టిసి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌ వైఖరి వారికే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. యావత్‌ వుద్యోగ, కార్మికులకూ ఆ ముప్పు పొంచి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలంగాణా రైతు బంధు లబ్దిదార్లపై 144 సెక్షన్‌ ఎందుకు ?

14 Thursday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

farmers fate, Fertilizers subsidies, KCR, kisan samman, KTR, rythu bandhu beneficiaries, TRS government

Image result for why trs government imposed 144 section on rythu bandhu beneficiaries

ఎం కోటేశ్వరరావు

తెలంగాణా ‘రైతు బంధు ‘ సర్కార్‌ నిజామాబాద్‌ జిల్లాలో 13 మండలాల్లో రైతులు గుమి కూడకుండా 144వ సెక్షన్‌ విధించింది. పడిపోతున్న పసుపు, ఎర్రజొన్నల ధరలతో ఆందోళన చెందిన రైతన్నలు గత వారం రోజులుగా ఆందోళన హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఏడవతేదీ ఒక రోజు ఆందోళన చేసి 11వ తేదీలోగా పంటలకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకోకపోతే పన్నెండున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కదిలింది, ఎలా? ధరలకు హామీ ఇచ్చికాదు, పోలీసు శాఖ ద్వారా 144వ సెక్షన్‌, ముఖ్యనాయకులు అనుకున్నవారిని అరెస్టులు చేయించింది. అయినా రైతులు పెద్ద సంఖ్యలో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేశారు. వారంతా రైతు బంధు పధకం కింద ఎకరానికి నాలుగు వేలు తీసుకున్నవారే, అందుకు కృతజ్ఞతగా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారే. ముఖ్య మంత్రి సచివాలయానికి రాకపోతే ఏమైతది అని కెసిఆర్‌ ప్రశ్నిస్తే అవును నిజమే ఏమైతది,ఏం కాలేదు రానవసరం లేదంటూ ఆయనకు మద్దతుగా గుండుగుత్తగా ఓట్లు వేసిన వారే. అసెంబ్లీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటింది, అయినా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే ఏమైతది అని ఇంకా అదే కెసిఆర్‌ అనలేదు గానీ ఒక వేళ అన్నా నిజమే ఏమైతది అని మద్దతు ఇవ్వటానికి సిద్దంగా వున్నవారే వారంతా. నిజామాబాద్‌ ఎంపీ కవితక్క వారి దగ్గరకు రాలే, ప్రతి వారి దగ్గరకు వెళ్లి నే వున్నా, మీ వాడినే అని చెబుతున్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆ వైపు చూడలే. ఎంఎల్‌ఏలంతా తమకు అత్యవసరమైన, దరొక్కపోతే ప్రాణాలు పోయే మంత్రిపదవులు ఇతర అవసరాల కోసం తిరగటానికే ఖాళీ లేకపోవటంతో రైతుల గురించి పట్టించుకోలా. అయితే ఎవరూ పట్టించుకోనపుడు మనం చూస్తూ వూరుకోకూడదు కదా అని పోలీసులు 144వ సెక్షన్‌ ప్రయోగించి, కొందరిని అదుపు లేదా అరెస్టు చేసి తమకు చేతనైన సాయం చేశారు. దిక్కులేక, దరితోచక రైతులు ఆంక్షలను ధిక్కరించి రోడ్డెక్కారు.పదహారవ తేదీలోగా ధరల సంగతి చూడకపోతే తిరిగి ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైతు బంధువు ఎలా స్పందిస్తారో !

రైతు బంధుపేరుతో కెసిఆర్‌ ఎకరానికి నాలుగు లేక ఐదు వేలు ఇస్తేనో, కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఐదెకరాలలోపు రైతులకు నరేంద్రమోడీ ఆరువేలు ఇస్తేనో దేశంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదని నిజామాబాద్‌ రైతాంగ ఆందోళన వెల్లడిస్తోంది. ఇవాళ నిజామాబాద్‌ పసుపు రైతులైతే రేపు గుంటూరు జిల్లా దుగ్గిరాల, కడప పసుపు రైతులు కావచ్చు. రైతు బంధు లేదా కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఇచ్చే సాయాన్ని తప్పు పట్టనవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా బలి ఇవ్వబోయే ముందు పశువులకు పూజలు చేసి అలంకరణలు చేయటం తెలిసిందే. ఈ బంధులు, సమ్మాన్‌లు కూడా అలాంటివే అని నమ్మేవారి నమ్మకాన్ని, అనుభవాన్ని కూడా కొట్టిపారవేయలేము. మార్కెటింగ్‌తో సహా వ్యవసాయరంగాన్ని తమకు పూర్తిగా అప్పగించి, ప్రత్యక్ష సాయం పేరుతో నాలుగు రూకలు వెదజల్లి రంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని ప్రయివేటు వాణిజ్య బకాసురులు ఎప్పటి నుంచో మనదేశం మీద వత్తిడి తెస్తున్నారు. నయా వుదారవాద విధానాలు లేదా సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాల వంటి ముద్దు పేర్లతో పిలుస్తున్న విధానాల సారం ఏమంటే సరిహద్దులు, మిలిటరీ, కరెన్సీ, పోలీసు, న్యాయవ్యవస్ధ వంటివి మినహా మిగిలిన అన్ని అంశాలను మార్కెట్‌ శక్తులకు అంటే పెట్టుబడిదారులు, పెట్టుబడిదారీ పద్దతుల్లో వ్యవసాయం చేసే వారికి అప్పగిస్తే అభివృద్ధి ఫలాలు కిందికి వూటమాదిరి దిగుతాయి. అన్నింటినీ తెల్లవారేసరికి అమలు జరపటం సాధ్యం కాదు గనుక ముందు వున్న వ్యవస్ధల లోపాలను చూపి కించపరచటం, పనికిరానివిగా చిత్రించటం, తరువాత వాటిని క్రమంగా కూల్చివేయటం.

స్వయం సమృద్ధి అన్నది స్వాతంత్య్ర వుద్యమ లక్ష్యం. అందుకే తొలి రోజుల్లో జై జవాన్‌ జైకిసాన్‌ పేరుతో హరిత విప్లవానికి శ్రీ కారం చుట్టి ఒక మేరకు జయప్రదం అయ్యాం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తరణ సేవలు, దిగుబడులను పెంచేందుకు సంకర విత్తనాలు, రసాయనికి ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. రైతుల వద్ద తగిన పెట్టుబడులు లేని కారణంగా సబ్సిడీలను అందచేశారు. నయా వుదారవాద విధానాల బాట పట్టగానే సబ్సిడీలు ఇవ్వటం అంటే సోమరితనాన్ని ప్రోత్సహించటమే అని, లక్షిత ప్రయోజనాలకు బదులు ఇతర వాటికి వినియోగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికీ పెద్దఎత్తున కొనసాగిస్తున్నారు. దుర్వినియోగం, సద్వినియోగం అన్నది ఎప్పుడూ వుంటాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకొనే చర్యలను ఎవరూ తప్పు పట్టటం లేదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా ఇంటికే నిప్పుపెట్టుకుంటారా?

వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు రైతాంగ జేబులు నింపేవి మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది తెలియని తనమే. అవి మొత్తం సమాజానికి ఇచ్చే రాయితీలు. వుదాహరణకు కాలువల ద్వారా , విద్యుత్‌ మోటార్ల ద్వారా వరిసాగు ఖర్చును పోల్చుకుంటే రెండవది రైతులకు గిట్టుబాటు కాదు. తాము పెట్టిన ఖర్చుకు అనుగుణంగా ఎక్కువ ధరకు అమ్ముతామంటే కొనే వారు వుండరు. అందువలన ప్రభుత్వాలు విద్యుత్‌ రాయితీ ఇస్తున్నాయి. అది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లా లేక ఆ పొలాల్లో పని చేసే కార్మికులకు, బియ్యాన్ని ఆహారంగా వాడే అందరికీ ఇస్తున్నట్లా ? మొత్తం నీటి వనరులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి జనాభా అవసరాలకు సరిపడా పంటలను పండించే విధానాలను అనుసరిస్తే విద్యుత్‌తో వరిసాగు చేసే అవసరం వుండదు, రాయితీలతో పని లేదు. నీరు లేని చోట మరొక పంటను ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు కలిగిస్తే వారిలో అసంతృప్తి వుండదు.

Image result for nizamabad farmers agitation

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, పరిమితంగా అయినా కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రచారం చేసే వారు వీటిని వ్యతిరేకించకపోగా మద్దతు ఇస్తున్నారు. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదా ? తెలంగాణాలో వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదార్లకు మొండిచేయి చూపి, వ్యవసాయం చేయని భూ యజమానులకు నగదు ఇవ్వటం ఏమిటన్న విమర్శలు వచ్చాయి కదా ! ఆ లోపాన్ని సవరించాలి తప్ప ఆ పేరుతో సాయాన్ని వ్యతిరేకించనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈసాయాన్ని సాకుగా చూపి పంటలకు గిట్టుబాటు ధరల ప్రకటన, మార్కెట్‌ మాయాజాలం నుంచి రక్షణ చర్యలకు ప్రభుత్వాలు మంగళం పలుకుతాయని కొందరు చెబుతున్నదానిని కొట్టి పారవేయగలమా, నిప్పులేనిదే పొగ వస్తుందా ?

Image result for nizamabad farmers agitation

రైతాంగానికి వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావటం లేదు అంటే సాగు పెట్టుబడులు పెరగటం, తగిన ఆదాయం లేకపోవటం తప్ప మరొకటి కాదు. ఒకవైపు అమెరికా వంటి ధనిక దేశాలు ప్రపంచ వాణిజ్య నిబంధనల పరిమితులకు మించి మన రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నారంటూ దాడి చేస్తున్నాయి. మరోవైపు మన దేశంలోనే కొంత మంది పెద్దలు ఇప్పటికే మనం ఆహార ధాన్యాలు, పత్తి వంటి పంటల విషయంలో మిగులు సాధించి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం గనుక వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వనవసరం లేదు, ఎఫ్‌సిఐ, సిసిఐ, మార్క్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వ సంస్ధల అవసరం ఇంకేమాత్రం లేదని చెబుతున్నారు. అమెరికా వంటిదేశాలు తమ కార్పొరేట్‌ బకాసురుల కోసం మన వ్యవసాయ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు వత్తిడి తెస్తుంటే, మన మేథావులు కొందరు వారి ఏజంట్లుగా రంగంలోకి దిగితే మరికొందరిలో సమగ్రదృష్టి లోపించి వారికి తెలియకుండానే అవే వాదనలను బుర్రలకు ఎక్కించుకుంటున్నారు. మన దేశంలో ఆహార ధాన్యాల వుత్పత్తి గణనీయంగా పెరిగిన మాట నిజం, అయితే అది దేశ అవసరాలకు అనుగుణంగా పెరిగిందా అంటే లేదు. ఒక వైపు మన దేశం 2018 ఆకలి సూచికలో 119 దేశాల జాబితాలో 103వ స్ధానంలో, ఆక్స్‌ఫామ్‌ ఆహార లభ్యత 125 దేశాల సూచికలో 97వ స్ధానంలో వున్నాం అని చెబుతుండగా మనం ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నామంటే మన దగ్గర కొనుగోలు చేయలేక కడుపు మాడ్చుకుంటున్నవారు గణనీయంగా వున్నారన్నది చేదు నిజం. అందుకే పోషకాహార లేమి, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వాటితో వచ్చే జబ్బులతో జేబు గుల్ల చేసుకుంటున్నవారు గణనీయంగా వుంటున్నారు. భరించలేని వైద్య ఖర్చు కూడా రైతాంగాన్ని రుణవూబిలోకి దించే అంశాలలో ఒకటిగా వుందని తెలిసిందే.

మన సినిమా హీరోలు కంటి చూపుతో కాల్చి చంపుతుంటే, నరేంద్రమోడీ సర్కార్‌ అంకెలతో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తోంది. దేన్ని గురించి ప్రశ్నించినా మన దగ్గర అంకెలు సరైనవి కాదు అంటోంది. దాన్ని పక్కన పెడదాం వున్న అంకెల సమాచారం ప్రకారం 1903-08 సంవత్సరాల మధ్య బ్రిటీష్‌వారి పాలనలో మన తలసరి ఆహార ధాన్యాల లభ్యత 177.3కిలోలు. నూతన అర్దిక విధానాలు లేదా సంస్కరణలు ప్రారంభమైన 1991లో 186.2కిలోలు వుండగా పాతిక సంవత్సరాల తరువాత 2016లో 177.7కిలోలుగా వుంది. మనది ప్రజాస్వామ్యం కనుక కమ్యూనిస్టు చైనాతో పోల్చవద్దని కొందరు చెబుతుంటారు. అక్కడ 2015లో తలసరి లభ్యత 450, మన కంటే దరిద్రం తాండవించే బంగ్లాదేశ్‌లో 200, అమెరికాలో 1,100కిలోలు వుంది. ప్రజాస్వామ్యం అంటే జనాన్ని కడుపు మాడ్చటమా ? ఈ పరిస్దితుల్లో మన వుత్పత్తిని ఇంకా పెంచాలంటే ప్రభుత్వ ప్రోత్సహకాలు లేకుండా సాధ్యమా ?

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002ా03 నుంచి 2008ా09 నాటికి ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018ా19నాటికి 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాంలో 2014ా15లో 0.62శాతం వుండగా అది 0.43శాతానికి పడిపోయింది.నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్ల లోపు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు, చంద్రబాబు నాయుడు దానికి మరో నాలుగువేలు కలిపి పదివేలు చెల్లించేందుకు నిర్ణయించటం తాజా వార్త. ఈ విధంగా సబ్సిడీలను తగ్గిస్తూ రైతుల మీద భారాలు మోపుతుంటే సాగు సాగేదెట్లా ? గత్యంతరం లేని రైతాంగం రోడ్డెక్కకుండా ఎలా వుంటుంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోందా !

04 Saturday Mar 2017

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KODANDARAM, midterm elections, Telagana politics, Telangana, Telangana CM, trs

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతరాష్ట్ర మండలిలో తెలుగు చంద్రులేం ప్రసరించారు ?

18 Monday Jul 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, inter state council meet, Inter-State Council, ISC, KCR, Modi

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలుగు నాట భక్తి రసం డేంజరుగా మారుతోంది

26 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Chandrbabu, KCR, sins, temple income, troubles

“పాపాలు, ఇబ్బందులే హుండీ ఆదాయాలు పెంచుతున్నాయి”

సత్య

     తన రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయం, మహానాడుకు ముందుగా విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జనానికి వుపయోగపడే పనుల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో తెలియదుగానీ మద్యం గురించి చేసిన వ్యాఖ్యలతో కలెక్టర్ల సదస్సుకు కాస్త కిక్కు వచ్చింది. ప్రత్యేక రాష్రనఠ హోదారాదని తేలిపోవటం, చంద్రన్నే చెప్పినట్లు విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాకపోవటంతో వడదెబ్బ తగిలినట్లు కలెక్టర్ల సదస్సు ప్రసంగం నిస్సారంగా సాగిందని చెప్పవచ్చు.తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో తాను చేసిన వుపన్యాసాన్ని ఒక వర్గపు మీడియా వక్రీకరించిందని దేవుడి గురించి తాను పాజిటివ్‌గానే మాట్లాడానని రెండోరోజు వివరణ ఇచ్చారు.

    చంద్రబాబుకు సానుకూల మరొక వర్గపు మీడియాగా గుర్తింపు వున్న ఒక పత్రికలో కష్టాల్లో వున్న వారు దేవుణ్ని నమ్ముకొంటున్నారు అనే శీర్షికతో ప్రధాన వార్తలో వుప భాగంగా రాశారు. దేవాదాయశాఖ కష్టపడకపోయినా 27శాతం ఆదాయం పెరిగిందనీ, ఇది ప్రజల్లో పెరిగిన భక్తిని తెలియ జేస్తుందని చంద్రబాబు అన్నారు. కష్టాల ో్ల వున్న వాళ్లు దేవుణ్ని నమ్ముకుంటున్నారు. వారితో పాటు తప్పులు చేసిన వాళ్లు హుండీల్లో డబ్బులు వేస్తున్నారు. కష్టాల్లో వున్నామని వ్యసనాల బారిన పడకుండా దేవుణ్ని విశ్వసిస్తున్నారు. గుళ్లు, చర్చిలు, మసీదుల్లాంటివి లేకపోతే పిచ్చి వాళ్లయ్యేవారేమో ! దీక్షల కాలంలో దుర్వ్యవసనాలకు దూరంగా వుంటున్నారు. అయ్యప్ప దీక్షల్లాంటివి చేస్తూ 40 రోజుల పాటు మద్యాన్ని ముట్టుకోవటం లేదని చెప్పారు. ఇదే తరగతికి చెందిన మరొక పత్రిక పాపపు సొమ్ము అనే వుప శీర్షికతో వార్త ఇచ్చింది. ఎక్కువ తప్పులు చేసిన వారు, ఆదాయం బాగా వచ్చేవారు హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు ‘ అని నవ్వుతూ అన్నారు. అని పేర్కొన్నది.చంద్రబాబు చెప్పిన ఓ వర్గానికి చెందిన మీడియాలో భాగమైన ఒక పత్రిక తన పాఠకులకు మరింత కిక్కు ఇచ్చేందుకు ఇదే అంశాన్ని మొదటి పేజీలో, తరువాత లోపలి పేజీలో పతాక శీర్షికతో వార్తను ఇచ్చింది. ‘తప్పులు చేసే వారే గుడికి వెళుతున్నారు ‘అని రాయటంతో సమస్య వచ్చింది.

    ఇదే వార్తను ఏ వర్గానికీ చెందని మీడియాలో భాగంగా పరిగణించబడే ఒక ఆంగ్ల పత్రిక తనకు మందీ మార్బలం వున్నప్పటికీ పిటిఐ వార్తా సంస్ధ ఇచ్చిన కధనాన్ని ప్రచురించటం విశేషం. ‘తప్పులు(పాపాలు), ఇబ్బందులు పెరగటమే దేవాలయాల ఆదాయ పెరుగుదల కారణం ‘ అని శీర్షిక పెట్టింది.’ జనం పాపాలు చేస్తున్నారు. కొంత మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వాటిని వదిలించుకొనేందుకు దేవాలయాలకు వెళుతున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు. వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటే, ఎక్కువ పాపాలు చేస్తే వారు దేవాలయాలకు వస్తున్నారు, డబ్బులు సమర్పించుకుంటున్నారు, ఇది వాస్తవం’ అని చెప్పినట్లు దానిలో పేర్కొన్నారు. అందువలన మొత్తం మీద దీనిలో వక్రీకరణగా చెప్పాల్సి వస్తే తప్పులు చేసేవారే గుడికి వెళుతున్నారు అన్న శీర్షిక తప్ప ఆయన చెప్పిన అంశాలలో వక్రీకరణ కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడు రెండవ రోజు ప్రవచించిన అంశాలలో ఒకటి ఆధ్యాత్మిక టూరిజం. ఏడు ప్రధాన పుణ్య క్షేత్రాలలో దీనిని అభివృద్ధి చేయాలని కోరారు. పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధి ద్వారా ఆదాయం సమకూరే పరిస్ధితులు కనిపించటం లేదు కనుక అప్పనంగా వచ్చే ఆధ్యాత్మిక ఆదాయాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు పూనుకున్నారు.

   తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డేంజరుగా మారుతోంది అని ఎప్పుడో ఒక కవి చెప్పారు. ఇప్పుడు సునామీలా వుండబట్టే చంద్రబాబు నాయుడు అంత ఆనందంగా హుండీల ఆదాయం గురించి చెప్పారు. ఏ మతానికి చెందిన దేవుడు, దేవత లేక ప్రవక్తలు కూడా అవినీతిని సహించమనే చెప్పారు. కానీ వారి కళ్లెదుటే రోజు రోజుకూ దుర్మార్గాలు, పాపాలూ పెరిగి పోతున్నా వారెలాంటి చర్యలూ తీసుకోవటం లేదంటే వారు ఇస్తున్న డబ్బులు తక్కువనా లేక రూపాయి విలువ దిగజారిందని పట్టించుకోవటం లేదా? పోనీ బంగారం వేస్తున్న వారికి ఏదైనా ప్రత్యేక దారి వుందా అంటే అదీ లేదు. పాపులు వారి పాపాన వారే పోతారు అనుకుంటే మంచి వారికి ఎదురైన సమస్యలనైనా దేవతలు, దేవదూతలు, ప్రవక్తలు ఎందుకు పట్టించుకోవటం లేదు.

    మన దేశంలో ఇంకా ఫ్యూడల్‌ అవశేషాలు ఒకవైపు, ఆధునిక పెట్టుబడిదారీ తెంపరితనం మరొకవైపు కవలల మాదిరి కొనసాగుతున్నాయి. దాని పర్యవసానమే ఒక పక్కన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచే బిర్లా ప్లానెటోరియం వుంటే దాని పక్కనే మూఢ భక్తి, విశ్వాసాలను పెంచే బిర్లా మందిరం వుండటం. తమ విధానాలను ప్రశ్నించకుండా, జనాన్ని మతం మత్తులో ముంచేందుకు పూర్వకాలంలో రాజులు, రంగప్పలు గుడులు గోపురాలు కట్టించి జనం దృష్టిని మళ్లించేవారు లేదా మత బేధాలు పెంచేవారు. ఆధునిక పాలకులు కూడా అందుకు అతీతులు కాదు.గోదావరి పుష్కరాల గురించి ఎన్నడూ లేని విధంగా జనాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించి స్నానాలు చేయించటాన్ని చూశాము. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సిద్ధం అవుతున్నారు. పుష్కర ఘాట్లకు విదేశీ సాయం గురించి కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణాలో యాదాద్రి అభివృద్ధికి చూపుతున్న శ్రద్ధలో వెయ్యోవంతైనా దళితులకు భూమి పంపిణీ కార్యక్రమంపై చూపటం లేదంటే కారణం ఏమిటి?

   ప్రపంచ మంతా గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధల వంటి వన్నీ కార్పొరేట్‌ల లాభాలు తప్ప సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. వాటి ఎజండాలోనే అది లేదు. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి తప్ప వుల్లిపాయల వ్యాపారం చేయకూడదని, వాటిని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలన్నది చంద్రబాబు స్కూలు సిద్ధాంతం. గ్రామాల్లో పాలు, కూరగాయలు అమ్ముకొనే వారు హెరిటేజ్‌ వంటి సంస్ధలు పెట్టక ముందు నుంచీ వున్నారు. వారు ఎంత మంది కోటీశ్వరులయ్యారు? లక్షల కోట్ల సంపదలున్న అంబానీలు పట్టణాలలో మూల మూలనా దుకాణాలు తెరిచి వుల్లిపాయలు, కూరగాయలు, పిన్నీసుల వంటివి అమ్ముతున్నారు. జడ పిన్నులు కావాలన్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్ధలలో బుక్‌ చేసుకొని ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. అందుకే అనేక మంది చిన్న వ్యాపారులు తమకు కలిసి రావటం లేదని ఎప్పుడూ వాపోతుంటారు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు ఇంకా పెరిగి పోతారు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు దేవాదాయ శాఖ సిబ్బంది పని చేసినా చేయకపోయినా అభాగ్యుల సొమ్ముతో హుండీలు దండిగా నిండిపోతాయి. కాళ్లూ, చేతులు చూసి జాతకాలు చెప్పి సొమ్ము చేసుకొనే వారు ఇప్పటికే తామర తంపరగా పెరిగిపోయారు. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు అనుసరిస్తున్న విధానాలు సమాజంలో మెజారిటీకి నష్టదాయకమైతే వాటి వలన లాభపడే వారు కూడా వుంటారు.అదిగో అలాంటి వారే ఆదాయాలు పెరిగి పోయి మరింత పెరగాలని కోరుకుంటూ హుండీలలో నల్లధనాన్ని గుట్టలుగా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫ్లయింగ్‌ మోడీ నుంచి ఫెయిల్యూర్‌ మోడీ వరకు

21 Saturday May 2016

Posted by raomk in AP, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

Acheedin, BJP, CHANDRABABU, CHANDRABABU TWO YEARS RULE, failure Modi, flying Modi, KCR, KCR TWO YEARS RULE, Narendra Modi, NDA, NDA Two years rule, Two years Modi rule

అచ్చే దిన్‌ ఆమడ దూరం

ఎం కోటేశ్వరరావు

    కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మూడు చోట్లా అధికారానికి వచ్చిన వారు రాజకీయ, పాలనా రంగాలకు కొత్తవారు కాదు. అందువలన అనుభవాల గురించి మాట్లాడుకోవటంలో అర్ధం వుండదు. ఈ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏమిటి ? జనానికి వాటి పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. గత పాతిక సంవత్సరాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ నయా వుదారవాద విధానాల చట్రంలో పనిచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి వున్నా ఎడమ చేయికి,పురచేయికి వున్న తేడా తప్ప వేరు కాదు. నయా వుదార వాద విధానాలు విదేశీ కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్ధల విధానాలకు స్వదేశీ ముద్రవేసి అమలు జరుపుతున్నారన్నది స్పష్టమైంది. వాటి ప్రకారం దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన అమలు జరపాల్సి వుంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం వుంటే విదేశీ కంపెనీలకు తలనొప్పి. పన్ను రేట్లు, చట్టాలు ఒకే విధంగా వుండేట్లు ఇప్పటికే చూశారు. వాట్‌ బదులు జిఎస్‌టిని అమలు జరపాలన్నది కూడా దానిలో భాగమే.ఇలా ఎన్నో వున్నాయి. వాటి గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయికి ఎక్కువ, కేంద్రానికి తక్కువ.

   ఎవరు అవునన్నా కాదన్నా , అభిమానులు గింజుకున్నా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ పట్ల మోజు తగ్గిపోతున్నది.వెంకయ్య నాయుడి వంటి వంది మాగధులు నరేంద్రమోడీని దేవదూత, దేవుడు అని పొగడవచ్చు. కేంద్రంలో లేని ప్రత్యేకత ఏమంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పొగడాల్సి రావటం బోనస్‌ వంటిది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు నరేంద్రమోడీ తమ పాలిట బంగారు పళ్లెంతో వస్తారని రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు.తొలి ఏడాది ఫ్లయింగ్‌ మోడీగా పేరు తెచ్చుకున్న ప్రధాని రెండో ఏడాది ఫెయిల్యూర్‌ మోడీగా పిలిపించుకుంటున్నారు. మనువాదం పట్ల వున్న శ్రద్ధ జనవాదం గురించి లేకపోవటంతో అటు పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలు, సామాన్య జనం కూడా అసంతృప్తికి గురవుతున్నారు. విదేశీయులకు మన దేశం అంటే కనిపించేది నరేంద్రమోడీ తప్ప రాష్ట్రాలు కాదు. అందువలన శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీరతాళ్లతో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు విదేశాలలో, స్వదేశంలో ఎన్ని వీరంగాలు వేసినా వారిని కొమ్ముగాసే స్వరాష్ట్రాల మీడియాను తప్ప విదేశీ కార్పొరేట్లను రంజింపచేయవు.

    తాను అధికారానికి వస్తే గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ విస్తరిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయటం లేదు. అమలు జరుపుతున్నట్లా లేదా కనీసం ఆ నమూనా ఏమిటో అయినా జనానికి వివరించారా అంటే లేదు. చిత్రం ఏమిటంటే గుజరాత్‌ మోడల్‌ బండారం గురించి అనేక మంది అనేక సందర్భాలలో వెల్లడించారు. ఇక్కడ స్ధలాభావం వలన దాని గురించి వివరించటం లేదు. మోడీ మహాశయుడు చెప్పినట్లు అదొక ఆదర్శ నమూనా, వాస్తవమే అయితే అందుకు దోహదం చేసింది పంచవర్ష ప్రణాళికలే. నరేంద్రమోడీ అధికారానికి రాగానే అసలు ఆ విధానాన్నే రద్దు చేశారు. నీతి ఆయోగ్‌ పేరుతో ప్రణాళికా సంఘాన్ని తెరమరుగు చేశారు. రెండు సంవత్సరాలు సాము చేసి ఇప్పుడు చెబుతున్నదాని ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు అమలు జరిపే ఒక స్వప్న పత్రాన్ని రూపొందించబోతున్నారు.అది 2018 నుంచి అమలులోకి వస్తుంది. దాని ప్రకారం తొలి ఏడు సంవత్సరాలకు ‘ జాతీయ అభివృద్ధి అజెండా’ను రూపొందిస్తారు. దానిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. దాని ప్రకారం తొలి సమీక్ష 2020లో జరుగుతుంది. దీన్నే చిల్లి కాదు తూటు అంటారు. మరి అప్పటి వరకు అంటే 2018 వరకు ఏ విధానాలను అమలు జరుపుతారు? విఫల కాంగ్రెస్‌ విధానాలను కొనసాగిస్తున్నట్లా ?

    రెండు సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, సేవలు, నిర్మాణం,వ్యవసాయం మొదలైన రంగాలలో వాణిజ్య అవకాశాల తీరుతెన్నుల గురించి విశ్లేషణ జరిపిన జర్మనీకి చెందిన ఎంఎన్‌ఐ బిజినెస్‌ సూచిక 2014లో గరిష్టంగా 80.3 వుండగా ఈఏడాది ఏప్రిల్‌ నెలలో 69.6కు దిగజారింది. ఇదే కాలంలో చైనా సూచిక 50-55 పాయింట్ల మధ్య కదలాడినట్లు అదే సంస్ధ తెలిపింది. ఏ దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో సూచిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల నిమిత్తం ఇలాంటి సూచికలను రూపొందిస్తారు. వాటి ఆధారంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. దేశం మొత్తానికి ఈ సూచికను రూపొందించినప్పటికీ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేవారు కూడా వీటిని గమనంలోకి తీసుకుంటారు. మన రిజర్వుబ్యాంకు విశ్లేషణ ప్రకారం వాణిజ్య ఆశల సూచిక 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో 117.9 వుండగా 2016 తొలి మూడు నెలల్లో 111 పాయింట్లకు పడిపోయింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.2శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని గతంలో చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజా జోస్యం ప్రకారం సమీప భవిష్యత్‌లో ఆ అంకెను చేరుకొనే అవకాశం లేదని ఆచరణ వెల్లడిస్తోంది.

 అంతర్జాతీయంగా వినియోగదారుల విశ్వాసాన్ని అభివృద్ధి సూచికలలో ఒకదానిగా పరిగణిస్తున్నారు.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 98.2 వుండగా తరువాత అది 109కి పెరిగి ప్రస్తుతం 104.1 పడిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన పరిస్థితులకు ఇది ప్రతిబింబం అని భావిస్తున్నారు.ఈ ఏడాది మంచి వర్షాలు పడితే, కేంద్ర ప్రభుత్వం వుద్యోగులకు వేతనపెంపుదల చేస్తే సూచిక తిరిగి పెరగవచ్చని వాణిజ్యవేత్తలు ఆశిస్తున్నారు. పారిశ్రామిక వుత్పత్తి సామర్ధ్య వినియోగ సూచిక కూడా దేశ పరిస్ధితికి దర్పణం పడుతుంది. 2013-14 చివరి మూడు నెలల్లో ఈ సూచిక 76శాతం వుండగా 2015-16 మూడవ త్రైమాసికంలో 72.5 పాయింట్లకు పడిపోయింది. పారిశ్రామిక ఆర్డర్లు కూడా సగటున ప్రతి మూడు నెలలకు 1.45 బిలియన్‌ రూపాయల నుంచి 1.15 బిలియన్లకు పడిపోయింది. అంటే పెట్టుబడులను ఆకర్షించే పరిస్ధితి లేదన్నది దీని అర్ధం. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్‌, కెసిఆర్‌, కెటిఆర్‌లు ఎన్ని రాష్ట్రాలు, దేశాలు తిరిగినా వాగ్దానాలు తప్ప పెట్టుబడులు వచ్చేఅవకాశాలు ఏమేరకు వుంటాయో అర్ధం చేసుకోవచ్చు.గడచిన 24నెలల పాలనలో వరుసగా 17వ నెలలో కూడా మన ఎగుమతులు పడిపోయాయని అధికారికంగా ప్రకటించారు.2014-15తో పోల్చితే గతేడాది ఎగుమతుల మొత్తం 310 బిలియన్‌ డాలర్ల నుంచి 261 బిలియన్లకు పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన రూపాయి పతనం చెంది జనం మీద భారమూ పెరిగింది, అదే సమయంలో మన ఎగుమతులూ పడి పోయాయి. రూపాయి పతనమౌతుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో మన దిగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి కనుక విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సమస్య తీవ్రత కూడా తగ్గింది. ఈ స్థితిలో మేకిన్‌ ఇండియా గురించి చెప్పుకోవటం అంటే నరేంద్రమోడీ ఘోర వైఫల్యం గురించి గుర్తు చేయటమే.

  చిత్రం ఏమిటంటే ఆర్ధిక రంగంలో ఇన్ని వైఫల్యాలు,దిగజారుడు కనిపిస్తున్నప్పటికీ కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లు ఇప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర తనేజా మాట్లాడుతున్నారు. అసాధారణ రీతిలో ఆర్ధికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ప్రతిపక్షాలకు కనిపించటం లేదని, కోమాలోకి పోయిన ఆర్ధిక వ్యవస్ధను చైతన్యంలోకి తీసుకువచ్చి ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించి మార్పుకోసం పనిచేస్తున్నామని నమ్మబలుకుతున్నారు.

    నరేంద్రమోడీ పాలనలో ఒక్క అవినీతి వుదంతమైనా వున్నదా? అవినీతి సూచికలో మన స్థానం తగ్గిందని ప్రకటించటం చూడ లేదా అని ఆయన అభిమానులు అడ్డు సవాళ్లు విసురుతుంటారు. నిజమే, అసలు కొత్తగా ఏదైనా పనిచేస్తే కదా అవినీతి వున్నదీ లేనిదీ తెలిసేది. తొమ్మిదివేల కోట్లరూపాయలు ఎగవేసిన విజయ మాల్య వుదంతం ఏమి తెలియ చేస్తోంది. దాని గురించి అడిగితే అతగాడికి కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారని తెలివిగా సమాధానమిచ్చారు.అదే పెద్దమనిషి దేశం నుంచి పరారీ అవుతుంటే దొంగగారు పోతుంటే చూసి చెప్పమన్నారు తప్ప పట్టుకోమనలేదని నిఘా సంస్థలు చెప్పటం చూస్తే తెలివితక్కువ తనానికి సరికొత్త వుదాహరణగా మోడీ సర్కార్‌ను కొందరు వర్ణించారు. వీడ్కోలు ఇచ్చి మరీ విదేశాలకు పంపిన నిర్వాకాన్ని చూసి దేశం నివ్వెర పోతోంది. నిజానికి ఇది తెలివితక్కువ తనం కాదు, వున్నత స్థానాలలోని పెద్దల ప్రాపకం లేకుండా పట్టుకోవాల్సిన వ్యవస్థలను దానికి బదులు ఎటువెళుతున్నారో చెబితే చాలని ఆదేశాలు జారీచేయించింది ఎవరు? రేపు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తారనగా ముందురోజే దేశం నుంచి పరారీ కావటానికి పెద్దల సహకారంలేకుండా సాధ్యమా? అధికారం వున్నంత కాలం కాంగ్రెస్‌ను వుపయోగించుకొని పోగానే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా విజయమాల్యను ఆదర్శంగా తీసుకున్న పెద్దమనిషే,తమ దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది ధర్నా చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త నివేదన ఆధారంగా బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప పదవి నుంచి తప్పుకున్న విషయం లోకవిదితం. తిరిగి అదే పెద్ద మనిషిని ఆ పార్టీ అందలమెక్కించించింది. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతి వ్యతిరేక కబుర్లు చెబితే ప్రయోజనం వుందా ? కాంగ్రెస్‌ హయాంలో అవినీతి అక్రమాలపై విచారణను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత మందిని శిక్షించారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదా ? గొప్పగా చెబుతున్న గుజరాత్‌ మోడల్‌ ఏమిటి, అప్పనంగా ప్రకృతి సంపదలైన నీరు, భూముల వంటి వాటిని పెట్టుబడిదారులకు కట్టపెట్టమేగా ? దాన్ని ఏమంటారు ? వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతోంది . చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ అవినీతి గురించి ఎన్నికలపుడూ, ఇప్పుడూ నానా యాగీ చేశారు, చేస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించి తన పార్టీలో కలుపుకొనేందుకు చూపిన శ్రద్ధ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు చూపటం లేదేమి? చంద్రశేఖరరావు కూడా కాంగ్రెస్‌ అవినీతి గురించి అలాగే కబుర్లు చెప్పారు. అక్కడ కూడా జరుగుతున్నది అదే ఫిరాయింపులు, ఫిరాయింపులు.

  ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు గతేడాది నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడువేల కోట్లరూపాయలను నష్టపోయాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించటం లేదు. బ్యాంకులకు వుద్ధేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణలు ప్రతిపాదించటానికేే రెండు సంవత్సరాలు పట్టిందంటే దున్నపోతు మీద వానపడ్డట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపియే హయాంలో 2008-13 సంవత్సరాలలో బ్యాంకుల నిరర్ధక ఆస్థుల సగటు 2.6శాతం వుండగా తమ అసలైన ప్రతినిధి మోడీ అనుకున్నారేమో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రెండు సంవత్సరాలలో వాటిని 4.5శాతానికి పెంచి ఎంతో లబ్దిపొందారు, 2008లో 2.3శాతంగా వున్నవి కాస్తా 2015 నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వుద్ధేశ్యపూర్వంగా రుణాలు ఎగవేసిన పెద్ద మనుషులు 2015 డిసెంబరు నాటికి 7,686 మంది వుంటే వారి నుంచి రావాల్సిన సొమ్ము 66వేల కోట్ల రూపాయలు. అందువలన కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారన్నది సాకు మాత్రమే వారి మీద చర్య తీసుకుంటే, డబ్బువసూలు చేస్తే వీరికి ఎవరు అడ్డుపడ్డారు? అవినీతికి పాల్పడటం ఎంత నేరమో పాలకులుగా వుండి అవినీతి పరులను వుపేక్షించటం కూడా దానితో సమానమైన నేరమే అవుతుంది.సుగర్‌, బిపి కవల పిల్లల వంటివి. అలాగే పెట్టుబడిదారీ విధానంతో అవినీతి పెనవేసుకొనే వుంటుంది. అందుకే అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఎవరి గురించి అయినా ముందే సంబరపడిన వారు తరువాత విచారించకతప్పదు.

   జపాన్‌లో పిల్లలకు వేసే డైపర్ల కంటే వృద్ధులకు వేస్తున్న వాటి సంఖ్య పెరిగిపోతోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముంచుకు వస్తున్న వృద్ధాప్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్నాయి. మన దేశంలో పశు ‘వృద్ధాప్యం’ రైతాంగానికి, కొందరు వృత్తిదారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ సర్కార్‌ కొత్తగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగేస్తున్నారని మహారాష్ట్రలో కరువు ప్రాంతాల రైతాంగం వాపోతోంది. అనేక రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం కారణంగా వ్యవసాయానికి, పాడికి పనికిరాని పశువులను వదిలించుకోవటం రైతాంగానికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది. పశువుల ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రయోజనం లేని పశువులకు నీరు, మేత అందించటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ చేసిన వ్యాఖ్య బడా పారిశ్రామికవేత్తలలో నరేంద్రమోడీ విధానాల పట్ల వున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి, శక్తి కాదు.’ కొన్ని అంశాలు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, వుదాహరణకు కొన్ని రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం. ఇది స్పష్టంగా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిని దెబ్బతీస్తోంది, ఎందుకంటే ఈ వృధాగా వున్న ఆవులను మనం ఏమి చేసుకుంటాం, ఇది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది,ఎందుకంటే ఇది అనేక మంది రైతులకు మంచి ఆదాయ వనరు, అందువలన ఆ చర్య ప్రతికూలం. వేదకాలంలో కూడా భారతీయులు గొడ్డు మాంసం తినేవారు, కరవు పరిస్థితులు ఏర్పడినపుడు రైతులు పశువులను వధశాలలకు తరలించేవారు.’ అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాలలో జంతు వధ నిషేధం, జరిమానాలు, ఇతరంగా ఏదో ఒక రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో పశువుల ధరలు 13శాతం పడిపోయాయని రాయిటర్‌ వార్తా సంస్ధ తెలిపింది.

    రాజకీయ రాజధాని న్యూఢిల్లీ అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై.మహారాష్ట్రలోని బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ‘ గొడ్డు మాంసం, మరాఠీ చిత్రాలు తరువాత ఏమిటి; మధ్యాహ్న భోజనంలో విధిగా వడపావ్‌ తినాలి, మరాఠీ మాట్లాడాలి, ప్రతి రోజూ దేవాలయాలను సందర్శించాలనే చట్టాలు చేస్తారేమో అని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా వ్యాఖ్యానించారు.’ భారత్‌ ఇప్పుడు భవిష్యత్‌లో వెలిగిపోవాలంటే జనానికి ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ వుండాలి.ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలాపాలకు పరిమితం కావాలి, జనం ఏం చేయాలో చెప్పాల్సిన పాత్ర ధరించకూడదు’ అని రతన్‌ టాటా ఈ ఏడాది జనవరిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

    ఒక పార్టీ మరొక పార్టీ విధానాలను విమర్శించటం ప్రజాస్వామ్య పద్దతి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం క్షంతవ్యం కాదు. కానీ అధికార రాజకీయాలలో ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ విలువలను పాటించటం లేదు. కేరళ, బెంగాల్‌,త్రిపుర రాష్ట్రాలలో ఎవరైనా ఒకరో అరో వామపక్షాల నుంచి ఇతర పార్టీలలో చేరటం తప్ప ఇతర పార్టీల నుంచి వామపక్షాలు ఫిరాయించిన వుదాహరణలు లేవని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచటం, ఫిరాయింపులను ప్రోత్సహించాటాన్ని బిజెపి విమర్శించింది. కానీ అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పనిచేసినట్లు అరుణాచల్‌, వుత్తరాంచల్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టేందకు ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న పిలుపును ఈ విధంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్క ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిని ఒక పద్దతి ప్రకారం ఆకర్షించటమే పనిగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలంగాణాలో వైఎస్‌ఆర్‌సిపిని పూర్తిగా పూర్తిగా, తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు అదే విధంగా స్వాహా చేయటంలో టిఆర్‌ఎస్‌ జయప్రదమైంది. కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. వీటన్నింటినీ చూసినపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మార్చివేయటంలో ఈ పార్టీలన్నీ జయప్రదమయ్యాయి. రాజకీయాలలో హుందాగా ప్రవర్తించటం అన్నది దాదాపు కనుమరుగైంది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి స్థాయిలలో వున్నవారు కూడా అందుకు అతీతులు కాదని రుజువు చేశారు.

    చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చిన్నమాట. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించటం తప్ప వీటికంటూ ప్రత్యేక విధానాలు లేవు. అందువలన ధరల పెరుగుదలను నివారించటంలో రెండు చోట్లా వైఫల్యమే. కరవు పరిస్థితులను కప్పి పెట్టేందుకు ప్రయత్నించటం తప్ప జనాన్ని ఆదుకొనేందుకు, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటో జనానికి తెలియదు. రాష్ట్రం విడిపోతే యువతకు పెద్ద ఎత్తున వుపాధి దొరుకుతుందని తెలంగాణా నేతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలలో అంతకు ముందుతో పోల్చితే పెద్ద మార్పేమీ కనపడటం లేదు. బాబొస్తే జాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి, వున్న వుద్యోగాలు పోతున్నాయి తప్ప కొత్తవాటి జాడ కనిపించటం లేదు. తెలంగాణాలో ముడుపుల కోసమే ప్రాజక్టుల రూపురేఖలన్నీ మార్చివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుస్తాయన్నట్లు గతంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నవారికి, అధికారంలో వున్నవారికి కూడా ఈ విషయాలన్నీ కొట్టిన పిండి కనుక దేన్నీ కాదనలేము.ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోలవరం తప్ప కొత్తగా కట్టే పెద్ద ప్రాజక్టులేమీ లేవు. వున్నవన్నీ పూర్తి చేయాల్సినవే. పోలవరం వంటి వాటికి నీళ్లు లేకుండానే ముందుగానే కాలువలు తవ్వి గత పాలకులు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటి వారు వాటి పూడికలు తీసి సొమ్ము చేసుకుంటారు. అన్నింటి కంటే రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు తెరలేపారు.గతంలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు ఐదులక్షల కోట్ల పధకమది. అందువలన శ్రీశ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఏ పార్టీ చరిత్ర చూసినా గత రెండు సంవత్సరాలలో గర్వించదగిన చర్యలేమీ లేవు. రానున్నవి మంచి రోజులని చెప్పారు. అవి ఎండమావుల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చెంపమీద కొడితే మరో చెంప చూపమని మన వేదాంతం చెబుతుంది తప్ప కొట్టిన వారి చెంప చెళ్లు మనిపించమని చెప్పలేదు. అందుకే మన జనం కూడా అంత నిస్సారంగా తయారయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నారు. ఇదొక చిత్రం !

గమనిక :ఈ వ్యాసం ‘ఎంప్లాయీస్‌ వాయిస్‌’ మాసపత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

పత్తి పంటపై కెసిఆర్‌ది తద్దినపు తంతా ?

27 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

alternative crops, cotton, cotton cultivation, cotton subsidies, KCR, WTO

ఎం కోటేశ్వరరావు

     తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు ఏప్రిల్‌ 24వ తేదీన ఒక ప్రకటన చేశారు. ఒక విధంగా అది సాధారణం కాదు. రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం వుంది కనుక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సలహాయిచ్చారు. పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ సమావేశంలో పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేసే నిర్ణయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సంతకం చేశారని, అందువలన రానున్న రోజులలో పత్తి సంక్షోభం తీవ్రం కానుందన్నది ముఖ్య మంత్రి ప్రకటన సారాంశం.

    అసలేమీ పట్టించుకోకపోవటం కంటే ఆలస్యంగా అయినా మేలుకోవటం మంచిదే కదా అనే బి పాజిటివ్‌ (ప్రతిదీ మన మంచికే ) అనే దృక్పధానికి అనుగుణంగా వుందనుకుంటే కెసిఆర్‌ ప్రకటన ఓకే. మిగతా ముఖ్యమంత్రులు ఈ మేరకైనా మొక్కుబడి తీర్చుకున్నారో లేదో తెలియదు. బహుశా కేసిఆర్‌ ముఖ్య మంత్రి కాక ముందు ఒక్క తెలంగాణా రాష్ట్ర సాధన తప్ప మరొక విషయాన్ని పట్టించుకొని వుండరు. రాష్ట్రం వచ్చిన తరువాత మిగతా విషయాలన్నీ చూసుకుందామనుకొని లేదా చేసుకొందామని అనుకొని వుండవచ్చు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత పత్తి రైతులను హెచ్చరించటం గుడ్డిలో మెల్ల. ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో అంటే 2018 నాటికి భారత్‌ ఎగుమతులపై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గించాలని, ఈ లోగా సబ్సిడీని పెంచరాదని ప్రపంచ వాణిజ్య సంస్ధ 2010లోనే భారత్‌ను కోరింది. అంటే పత్తి,పత్తి వుత్పత్తుల ఎగుమతులపై సబ్సిడీని కూడా ఎత్తివేయాల్సి వుంటుంది.

     అమెరికా అంటే వామపక్షాలు మినహా మన రాజకీయ పార్టీల నేతలకు అది సైకిలైనా, కారయినా, హస్తం, కమలం పువ్వయినా మరొకరికైనా మహా ప్రీతి. కొన్ని దేశాల వారు తొడకోసు కుంటే మనవారు మెడ కోసుకుంటారని యుపిఏ పాలనా కాలంలో అన్ని పార్టీల వారు కలసి అమెరికాతో ఒప్పందాలపై సై అంటూ పార్లమెంట్‌లో మైనారిటీ యుపిఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించి మద్దతు పలికారు. అదే అమెరికా మన పత్తి సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెస్తోన్న విషయాన్ని కూడా కెసిఆర్‌ తన ప్రకటనలో ఎందుకు పేర్కొనలేదో తెలియదు. బహుశా రాష్ట్రానికి అమెరికా నుంచి వచ్చే పెట్టుబడుల కోసం వ్యూహాత్మకంగా మౌనం దాల్చి వుంటారని మనం అనుకోవాలి.

    గతేడాది అక్టోబరు 29న కేంద్ర ప్రభుత్వం వస్త్రాలతో సహా వాణిజ్య వుత్పత్తుల ఎగుమతులపై ఇస్తున్న రాయితీలను పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు గాను కేటాయింపులను 18 నుంచి 21వేల కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు దిగజారటం తప్ప పెరగని పూర్వరంగంలో ఈ చర్య తీసుకున్నారు. దీనిపై అమెరికాకు కోపం వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం వెయ్యి డాలర్ల కంటే తక్కువ వున్నపుడు, ఆ దేశం నుంచి అన్ని రకాల వస్త్ర ఎగుమతులు వరుసగా ప్రపంచ వాణిజ్యంలో 3.25శాతం దాటితే ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధల ప్రకారం ఎగుమతి రాయితీలను రద్దు చేయాలన్న ఒక నిబంధనను అమెరికా వెలికి తీసి ఆ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసింది.ఆ తరువాతే నైరోబీలో జరిగిన సమావేశంలో కెసిఆర్‌ చెప్పినట్లు నిర్మలా సీతారామన్‌ సంతకం చేశారు. నిజానికి ఇది జరగబోతోందని గతేడాది జనవరిలోనే అధికార వర్గాలను వుటంకిస్తూ వార్తలు వచ్చాయి.(http://www.financialexpress.com/article/economy/textile-export-subsidy-under-wto-scanner/25566/

     ఇప్పుడు రైతులను హెచ్చరించిన ముఖ్య మంత్రి ఏడాది కాలంగా, కేంద్రం సంతకం చేసినపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ? ఇలాంటి సమస్యలపై టిఆర్‌ఎస్‌ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఇలా ఒక్కొక్క పంట సాగును మానివేస్తూ పోతూ వుంటే అప్పుడు కెసిఆర్‌ అండ్‌ కో ప్రభుత్వం ముందు పరిష్కరించాల్సిన సమస్యలే వుండవు, పోనీ ప్రత్యామ్నాయంగా మిగిలే పంటలేమి వుంటాయి? రైతులు ఏమైనా ఫరవాలేదనా ? అని ఎవరైనా అంటే వారు తెలంగాణా అభివృద్ధి వ్యతిరేకి అన్న ముద్ర సిద్ధంగా వుంటుంది కదా !

    కనీస మద్దతు ధరకంటే తక్కువ రైతాంగం అమ్ముకుంటున్నపుడు వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకొని వుండుంటే అరే బయ్‌ ఇంక మనం చేయగలిగింది లేదు, వేరే పంటలు వేసుకోండి అంటే అర్ధం వుండి వుండేది. అదేమీ చేసినట్లు కనిపించటం లేదే ! మచ్చుకు గతేడాది నవంబరు మొదటి వారంలో పత్తి ధరలను చూసినపుడు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటు తెలంగాణాలోనూ పెద్ద తేడాలేమీ లేవు. అంతకు ముందు కంటే తక్కువ లేదా స్ధిరంగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రైతాంగ ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఎక్కువ తక్కువ అన్న చర్చలోకి పోనవసరం లేదు. ఒక అన్నదాత బలవన్మరణానికి పాల్పడినా అది పాలకుల విధానాల వైఫల్యం తప్ప మరొకటి కాదు.

   పత్తి పంట తమను అప్పుల వూబి నుంచి బయట పడవేస్తుందనే ఆశతో రైతాంగం సాగు చేస్తున్నారు. వారిని దాని నుంచి మళ్లించాలనుకోవటం తప్పుకాదు. మరికొద్ది వారాలలో సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టాల్సిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందా ? గతేడాది పంట మొత్తం రైతుల చేతి నుంచి బయటకు పోయిన తరువాత అంతకు ముందుతో పోల్చితే పత్తి ధరలు పెరిగాయి. అందుకు అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. రైతాంగాన్ని మానసికంగా సిద్దం చేయాలంటే వారితో ప్రత్యక్షంగా చర్చించాలి, వున్న అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్ధ, కేంద్ర ప్రభుత్వం, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మధనం జరపాలి. వేరే ప్రాంతాల మేథావులు తప్పుదారి పట్టిస్తారనుకుంటే తెలంగాణాలో కావాల్సినంత మంది వున్నారు. వారికే పరిమితం చేయవచ్చు. పత్తి విత్తనాల ధరల గురించి జరిగినంత చర్చ ప్రత్యామ్నాయ పంటల గురించి లేదంటే అతిశయోక్తి కాదేమో !

    ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రతి ఏటా వ్యవసాయ ముద్రించే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి మొక్కుబడిగా వుంటోంది తప్ప రైతులను ఏమాత్రం ప్రభావితం చేయటం లేదు. రైతులు ప్రత్యామ్నాయంవైపు చూడాలంటే పత్తి కంటే అవి ఆకర్షణీయంగా వుండాలి. కనీసం తొలి సంవత్సరాలలో అయినా ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ హామీ వుండాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న స్ధితిలో కేవలం ప్రకటనలు నమ్మి ముందుకు వస్తారా ? ఇప్పటికైనా పత్తి గురించి ఒక సమగ్రమైన శ్వేత పత్రాన్ని ప్రకటించి దానిని రాజకీయాలకు అతీతంగా చర్చించి రైతాంగం ముందుకు వెళ్లటం సముచితంగా వుంటుంది. లేకుంటే తద్దినపు తంతుగానే భావించాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

27 Sunday Mar 2016

Posted by raomk in AP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

BJP, KCR, police attack, Rohith Vemula, University of Hyderabad (UoH), UoH

ఎం కోటేశ్వరరావు

    ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

    ఇంతకీ ఇన్ని రోజుల తరువాతైనా మీ మాంస తీరిందా? కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ?

    ‘రోహిత్‌ వేముల మరణం దురదృష్టకరం ‘:ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం, దొడ్డిదారిన వచ్చి విద్యార్ధులను రెచ్చగొట్టిన వ్యక్తికి ప్రాణహాని తలెత్తిందనే సాకుతో విద్యార్ధులను చావబాదటం, బెయిలు రాని కేసులు పెట్టటం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం ! ఎలాంటి శషభిషలు లేకుండా పోలీసు చర్యలను సమర్ధించటం ఏ ముఖ్యమంత్రికైనా పూర్వజన్మ సుకృతం !

    ‘ విసి ఛాంబర్‌ వద్దకు విద్యార్ధులు పోయినపుడు వారిని ఆపితే ఒక పంచాయతీ, ఆపకుంటే ఒక పంచాయతీ. విద్యార్ధుల దాడిలో విసి చనిపోతే పరిస్థితి ఏంటంటూ పోలీసులు పరిస్థితిని వివరించారు’:ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

   నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ.  కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నపుడు అందరూ అనుకుంటున్నట్లుగా విసిపై చర్య తీసుకుంటే పరిస్థితి ఎలా అని సలహాదారులు పరిస్థితిని వివరించి వుంటారు. లాఠీలు తీయటం వుత్తమం అని చెప్పి వుంటారు.

    అసలు అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయానికి రాత్రిపూట రానేల? వచ్చెను పో పోలీసులకు ముందుగా ఎందుకు తెలియచేయలేదు, తెలియచేయలేదు పో అప్పారావు వస్తే మూగి వాడి ముందు ముక్కు గీరినట్లుగా వుంటుందని పోలీసులకు తెలియదా ? తెలిసెను పో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? తోమెను పో విద్యార్ధులపై అంతగా విరుచుకుపడాలా? అంతగా నోరు పారవేసుకోవాలా ? పారవేసుకుంటిరి పో తరువాత అయినా పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు తరువాత విద్యార్ధులు, ప్రొఫెసర్లపై బెయిలు రాని కేసులు పెట్టనేల, పెట్టెను పో నిండుపేరోలగములో కేంద్రప్రభుత్వ పాలకులకు నొప్పి తగల కుండా ఎలాంటి వెరపు లేకుండా సమర్ధించనేల…….అకటా ????

   ‘భారత మాతాకీ జై అనని వ్యక్తి విద్యార్ధుల గురించి మాట్లాడటమా ?’: ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌(బిజెపి ఎంఎల్‌ఏ)

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

     అవధానంలో అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే. చర్చ భారత మాత మీద కాదు. ప్రతిదానిని భారత మాత మీదకు మళ్లించే అజెండాలో భాగమైతే చెప్పండి నో ప్రాబ్లమ్‌. అసలింతకూ మీరు మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తిస్తున్నారా లేక గాడ్సేను దేశభక్తుడిగా గుర్తిస్తున్నారా ? జాతిపితగురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటారా? భారత మాత కూడా అంతే కదా .మేకిండియా మీద కేంద్రీకరించకుండా బ్రేకిండియాపై కేంద్రీకరించారు. ఇదే అసలైన దేశ భక్తా? మర్చిపోయాను హైదరాబాదు విశ్వవిద్యాలయంలో జరిగిన దానికి అసలు కారకులు మీరే అని కదా విద్యార్ధి లోకం కోడై కూస్తున్నది.

   ‘భారత మాతాకి జై అనకపోయినా కొంత మందితో జై హింద్‌ అనిపిస్తున్నామంటే సైద్ధాంతిక పోరు మొదటి రౌండులో బిజెపి విజయం సాధించినట్లే ‘: అరుణ్‌ జైట్లీ

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

   అవునులే భారత మాత దాస్యశృంఖలాలతో వుంటే ఆంగ్ల మాతను ఆరాధించిన మీరు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే వైఫల్యాల బాట పట్టి దాన్ని దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక పోరు ప్రారంభించారన్నమాట. భక్తి శివుడి మీద చిత్త చెప్పుల మీద అంటే ఇదేనా ! అవున్లే బ్రిటీష్‌ వారికి సావర్కర్‌ రాసిన లొంగుబాటు లేఖ కారణంగా స్వాతంత్య్ర వుద్యమ కాలంలో మీనోట స్వాతంత్య్రం మాట రాలేదు, భారత మాత దాస్యశృంఖలాలు మీకు కనపడలేదు. ఆ మాతను విముక్తి రాలిని చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వారిలో మీ పూర్వీకులెవరూ లేరు. భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్య అని కమ్యూనిస్టులు నిత్యం పాట పాడటం ఎప్పుడూ జెట్లీ విని వుండలేదేమో. భరత మాత అనే పదాన్ని తామే సృష్టించినట్లు దాని పేటెంట్‌ హక్కు కోసం పోరు జరిపినట్లు భలే బిల్డప్‌ ఇస్తున్నారులే. జైట్లీ మాదిరే పాతికేళ్ల క్రితం సోషలిజంపౖౖె పోరులో విజయం సాధించాం అని అమెరికా గర్వంగా చెప్పుకుంది. ఇప్పుడా అమెరికాలోనే ఎక్కడబడితే అక్కడ అవును మేం సోషలిస్టులం అని ప్రతి మూల నుంచీ యువకులు వస్తుండటంతో విజయం సాధించిన వారందరూ కమ్యూనిస్టులతో పెట్టుకొని తప్పు చేశామా అని తలలు పట్టుకుంటున్నారు. జైట్లీగారూ మీరు ప్రారంభించిన ఈ పోరులో తొలి విజయం సాధించినట్లు మీరు చెప్పుకుంటే దాన్ని స్వంత డబ్బా అంటారు. ఏమైనా దేశం ముందు సైద్దాంతిక యుద్ధాన్ని తెచ్చి ఎవరు ఎటో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకు మీకు అభినందనలు చెప్పక తప్పదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విద్యార్ధులపై దాడితో కెసిఆర్‌ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకున్నారా ?

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Education, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

JNU, kanniah kumar, KCR, police attack, students, University of Hyderabad (UoH), UoH

ఎంకెఆర్‌

   హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులతో అమీ తుమీ తేల్చుకొనేందుకే సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.అందుకు కెసిఆర్‌ కూడా సై అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంఛార్జి వైస్‌ ఛాన్సలర్‌కు సైతం తెలియకుండా సెలవుపై వెళ్లిన వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షం కావటం యాదృచ్చికంగా జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న విషయమేమీ రహస్యం కాదు. దానికి ముందుగానే వైస్‌ ఛాన్సలర్‌ అకస్మికంగా ప్రత్యక్షం కావటం కన్నయ్యను విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టకుండా చేయటానికే అన్నది సుస్పష్టం. తన ఆందోళన ప్రస్తానంలో విద్యార్ధులను ఎంతగానో వుపయోగించుకున్న తెలంగాణా ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు కనుసన్నలలో పనిచేసే పోలీసు యంత్రాంగం వివాదాస్పద వైస్‌ ఛాన్సలర్‌కు మద్దతుగా విద్యార్దుల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ఓడమల్లయ్య బోడి మల్లయ్యను గుర్తుకు తెస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ మద్దతు లేకుండా వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టే సాహసం చేసి వుండరని లోకం కోడై కూస్తున్నది.

    ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులపై దేశ ద్రోహ నేరం మోపేందుకు బహుశా బ్రిటీష్‌ పాలకులు కూడా సిగ్గుపడే విధంగా వీడియోలను తిమ్మిని బమ్మిని చేసి చేతులు కాల్చుకున్న కేంద్ర ప్రభుత్వం అది కాస్త చల్లబడగానే హైదరాబాదులో మరో అధ్యాయానికి తెరతీసింది. వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పగించటం ద్వారా విద్యార్ధులను రెచ్చగొట్టింది. వైస్‌ ఛాన్సలర్‌పై కేసులు నమోదు చేయాలన్న విద్యార్ధుల డిమాండ్లను పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సదరు అప్పారావు కబురు చేయగానే తగుదునమ్మా అంటూ విద్యార్ధులపై తన ప్రతాపం చూపింది. చివరకు అమ్మాయిలను కూడా మగ పోలీసులు వదలి పెట్టలేదు. బూతులు తిట్టకపోతే పోలీసులే కారు అని మరోసారి నిరూపించుకున్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రుజువు చేసుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా వుండాలనుకుంటే అది వేరే విషయం, కానీ అందుకు చూశారా విద్యార్ధులపై ఎలా లాఠీని ఝళిపించానో అంటూ మోడీని సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటం అన్యాయం. ఇప్పటి వరకు దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనే తన నిరసనను కేంద్రీకరించింది, ఇప్పుడు దానిలో కూడా వాటా కావాలని చంద్రశేఖరరావు కోరుకుంటునట్లున్నారు. వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అంశం పోలీసులకు తెలియదా ? వైస్‌ ఛాన్సలర్‌ రాక సందర్భంగా జరిగాయని చెబుతున్న వుదంతాలే అందుకు నిదర్శనం.అటువంటపుడు ఆయన వస్తే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని కేంద్రానికి తెలంగాణా సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది? ఆ వుదంతాలను ఎందుకు నిరోధించలేకపోయింది? పోనీ తగిన భద్రతా సిబ్బందిని నియమించి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? న్యూఢిల్లీ పోలీసు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కాబట్టి జెఎన్‌యు విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటానికి కేంద్ర ప్రభుత్వ వత్తిడి కారణం కావచ్చు. కానీ హైదరాబాదు పోలీసులు కూడా అదే పని చేస్తారని బహుశా విద్యార్ధులు వూహించి వుండరు.

   విద్యార్ధులకు తగిన ‘పాఠం’ చెప్పేందుకు ఎంతో అనుభవం వున్న వైస్‌ ఛాన్సలర్‌ హాస్టళ్లు,మెస్‌లను మూసి వేసి, ఇంటర్నెట్‌ను కట్‌ చేసి తానంటే ఏమిటో రుజువు చేసుకున్నారు. బహుశా దేశభక్త ఎబివిపి విద్యార్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వుంటారు, లేదా బయటి నుంచి సాయం తీసుకొని వుండాలి. తిరిగి వస్తూనే ఈనెల 24న జరగాల్సిన అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయటం ఆయన చేసిన తొలి ఘనకార్యంగా చెబుతున్నారు. ఆ సమావేశంలో వివక్ష వ ్యతిరేక కమిటీ ఏర్పాటు, వివిధ కమిటీలలో ఎస్‌సి,ఎస్‌టిల ప్రాతినిధ్యాన్ని పెంచటం, నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ ఎనిమిది నుంచి 25వేలకు పెంచే ప్రతిపాదనను పరిశీలించటం వంటి అంశాలు అజెండాగా వున్నాయి. అలాంటి ముఖ్యమైన సమావేశాన్ని వాయిదా వేయటం వుద్రిక్తతలను వుపశమించటానికి గాక మరింత ఎగదోయటానికే తోడ్పడతాయి.

   హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన తాజా వుదంతాలలో బోధనేతర సిబ్బందిని విద్యార్ధులకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నించటం కొత్త , ప్రమాదకర పరిణామం.వైస్‌ ఛాన్సలర్‌ నివాసంపై విద్యార్ధులు దాడి చేశారనే ఆరోపణతో బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటం, మెస్‌లను మూసివేయటం సరైన చర్య అవుతుందా? అది సమర్ధనీయమే అనుకుంటే విద్యార్ధుల పట్ల వైస్‌ ఛాన్సలర్‌ అనుసరించిన వైఖరి,వాటి పర్యవసానాలకు కూడా వారు బాధ్యత వహిస్తారా ? ఇది విశ్వవిద్యాలయంలో పరిస్థితులు మరింత దిగజారటానికి దారితీయ వచ్చు. బోధనేతర సిబ్బంది-విద్యార్ధులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. పంచాయతీ వారి మధ్య కాదు, వున్నతాధికారులు-విద్యార్ధుల మధ్య కనుక విచక్షణతో వ్యవహరించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Telangana police must immediately proceed on the registered cases against the Vice Chancellor:CPI(M)

24 Thursday Mar 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

CPI(M), Hyderabad Central University, K CHANDRA SEKHRA RAO, KCR, SITARAM YECHURY, students, Telangana, Telangana CM, University of Hyderabad (UoH)

full text of the letter addressed by CPI(M)
General Secretary, Sitaram Yechury addressed to the Telangana Chief
Minister, Shri K Chandrasekar Rao  on the brutal attack on students and
faculty members of Hyderabad Central University.

Shri Chandrasekar Rao Garu,

I have tried in vain to contact you over telephone the whole day today.
Several messages have been left with your staff, but there has been no
response.  Having thus failed, I am writing this letter.

I am writing this letter with a sense of anguish and anger.  I am
particularly agonized at writing this letter to you on the martyrdom day of
Shahid Bhagat Singh.

The brutal police attack against students and other sections of the academic
community in the Hyderabad Central University yesterday has been followed up
by another round of attack today.  Continuing the manner with which the
students were dealt with by the Telangana police yesterday, the police today
have reportedly mounted yet another attack inside the campus.  The manner in
which the girl students were attacked by the male police with  the liberal
usage of foul language against them is reprehensible.

Following the stoppage of water connection, access to wifi, food supplies to
the hostel messes, the students themselves organized the preparation of food
for the hostel inmates.  Today, all these facilities were attacked by the
police and the Vice Chancellor has reportedly shut down the hostels.

Most of us in the country are aghast at the manner in which such brutal
assault is mounted on the university community by the Telangana police in
one of the premier Central universities of our country.

The Vice Chancellor who proceeded on leave following the tragic suicide of
Rohith Vemula was booked under charges of aiding and abetting this suicide
by creating the circumstances leading to this tragedy.  Instead of
proceeding against the Vice Chancellor on this case, the Telangana police
has resorted to such brutality against the students.

The students were protesting against the return of this Vice Chancellor and
demanding that the case against him must be proceeded with.  It is clear
that the police action under the sanction of the state government was to
facilitate the return of this Vice Chancellor.

Further, we are informed that the first decision taken by the Vice
Chancellor upon the return was to defer the meeting of the Academic Council
on Thursday (March 24), which was convened by the in-charge Vice Chancellor
to discuss the setting up of an anti-discrimination committee on the campus,
to ensure adequate representation of SCs and STs  on various committees of
the university and to consider the proposal to increase the non-NET
fellowship from Rs. 8,000 to Rs. 25,000 per month on parity with the Junior
Research Fellowship in the country. The in-charge Vice Chancellor has
reportedly pleaded that he had no knowledge  of the Vice Chancellor
returning to assume charge of the university.

The Telangana government, under your stewardship, has been vocal in
announcing that it champions the interests of the overwhelming bulk of the
state’s population that comes from SC/ST and various Other Backward Classes
and the marginalized sections.  Surely, your government and administration
cannot concur with these latest decisions of this Vice Chancellor.  Yet, it
is the Telangana police, under the remit of your government, that has
spearheaded this brutal attack against the university and the students.
This has happened as the university community continues to remain
traumatized over the tragic suicide of Rohith Vemula and the circumstances
created on the campus leading to such a tragedy.

Instead of proceeding, I repeat, against the Vice Chancellor on the basis of
the case registered against him, your government has discharged this
responsibility of mounting this attack against this university community.
It is being reported in the media that 28 students, who are victims of this
brutal lathicharge, have now been remanded  into custody and lodged at the
Central Jail.

In the fitness of living up to your own  proclamations and assurances, the
arrested students must be released immediately and the cases against them
must be dropped.  The Telangana police must immediately proceed on the
registered cases against the Vice Chancellor.  As this is a Central
University, we are demanding of the Central Government that their appointed
Vice Chancellor be removed forthwith.

Yours sincerely

(Sitaram Yechury)

General Secretary, CPI(M)

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d