• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Modi

త్రిపుర ఐఏఎస్‌ అధికారికి నరేంద్రమోడీ ఫోను, సమాధానం లేని ప్రశ్నలు

30 Tuesday Aug 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

Modi, Modi Critics, Modi Sarkar, pm modi's call to tripura ias

ఎం కోటేశ్వరరావు

    ఒక ఐఏఎస్‌ అధికారికి రాత్రి పదిగంటల సమయంలో అదీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా ఫోన్‌ చేసి రోడ్డు మరమ్మతుల గురించి మాట్లాడటం ప్రస్తుతం మీడియాలో ఒక పెద్ద వార్తగా మారింది. తొలుత కోరా అనే ఒక వెబ్‌సైట్‌లో రాసిన కథనం క్రమంగా జాతీయ వార్తగా మారింది.నిజమే ఒక జిల్లా అధికారికి ప్రధాని స్వయంగా ఫోన్‌ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకోవటంతో నాలుగు రోజుల్లో రహదారి మరమ్మతులు పూర్తి చేసి లీటరు పెట్రోలు మూడువందల రూపాయలకు, అదే స్థాయిలో ఇతర నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్న త్రిపుర పౌరుల దుస్థితిని తప్పించి ఎంతో మహోపకారం చేశారన్నది కధనం సారాంశం. అయితే ఈ కధనాన్ని అనేక మంది అదొక కట్టుకధ అని భావించారు, ఇప్పటికీ భావిస్తున్నారు. కాదు నిజమే అని త్రిపుర వున్నతాధికారులు ధృవీకరించినట్లు అక్కడి ఒక పెద్ద పత్రిక రాసింది కనుక నిజమే అని, అనుమానం వున్నవారు దాన్ని చదవ వచ్చని కూడా కొందరు పేర్కొన్నారు. పెద్ద పత్రికలు అసలు అవాస్తవాలు రాయవు అన్నది వారి గట్టి నమ్మకం.

    ఈ వుదంతం వాస్తవమా అవాస్తవమా అన్నది తేల్చటం కష్టం .ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు తమకు తాము కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరైనా లేవనెత్తిన వాటికి సమాధానం చెప్పాలి. వున్నత పదవులలో వున్నవారి ప్రతిష్ట పెంచటంలో భాగంగా అలాంటి జిమ్మిక్కులు చేయటం ఈ వుదంతంతో ప్రారంభం కాలేదు, గతంలోనూ జరిగాయి, ఇంతటితో ఆగవు. అయితే దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయ మన్నట్లుగా ఎలాంటి ఆలోచన లేకుండా నమ్మేవారికి ఏ సందేహాలు రావు. జనమంతా అలాగే వుండాలని పాలకులు కోరుకుంటారు. అక్కడే వస్తుంది పేచీ. ప్రభువులు ఒక విధంగా ఆలోచిస్తే జనం ఆలోచన మరో విధంగా వుంటుంది.జన కోణం నుంచి ఈ వుదంతాన్ని పరిశీలిద్దాం.

    దాదాపు 93వేల కిలోమీటర్ల దూరం వున్న జాతీయ రహదారులలో ఒక రాష్ట్రానికి కీలకంగా వున్న ఒక రహదారిలో 15 కిలోమీటర్ల మేర తక్షణం మరమ్మతులు చేయాలంటే స్వయంగా ప్రధాని జోక్యం చేసుకుంటే తప్ప పని జరగని పరిస్థితి భారత్‌లో వుంది అని ప్రపంచానికి తెలిసింది. జాతీయ రహదారి కనుక ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుంది. రోడ్ల శాఖకు నితిన్‌ గడ్గరీ అనే ఒక పెద్దాయన మంత్రిగా వున్నారు. ఆయన కింద పెద్ద యంత్రాంగం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాన మంత్రి రాత్రి పది గంటలకు (ఈశాన్య ప్రాంతంలో ఒక గంట మనకంటే ముందే సూర్యుడు అస్తమిస్తాడు కనుక స్థానిక సమయం పదకొండు గంటలనుకోవాలి.) ఒక జిల్లాలోని ఐఏఎస్‌ అధికారిని లేపి ఆ సమయంలో అంతరాయం కలిగించినందుకు క్షమాపణ కూడా చెప్పి ప్రధాని మాట్లాడారంటే అప్పటి వరకు కేంద్ర మంత్రి ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

    ప్రధాన మంత్రి అంటే వున్నత స్ధాయిలో జరగాల్సిన దౌత్య నిర్ణయాలు, ఆర్ధిక, రాజకీయ విధానాల వంటి ముఖ్యమైన అంశాలపై కేంద్రీకరిస్తారని మాత్రమే ఇప్పటి వరకు అనుకుంటున్నాము. మరమ్మతులు చేయాల్సిన రోడ్ల వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా వదలటం లేదంటే మన దేశానికి మంచి రోజులు వచ్చినట్లే. మన వీధిలో మున్సిపాలిటీ, పంచాయతీ వారు చెత్త కుప్పలను ఎత్తివేయకపోయినా, రోడ్ల మీద తిరిగే వట్టి పోయిన ఆవులు పేడవేసినా అవి ప్రధాని దృష్టిలో వుంటాయని, ఏదో ఒక రోజు ప్రతి పారిశుధ్య కార్మికుడికి ఫోన్‌ వస్తుందని ఆశించటం తప్పుకాదు. కేంద్ర మంత్రులు, అధికారులు పెద్దగా పని చేయనవసరం లేదు, ఎందుకంటే అన్నీ ప్రధాని పట్టించుకుంటారు కదా !

   మరమ్మతు చేయాల్సిన రోడ్డు అసోంలో వుంది. ముందే చెప్పుకున్నట్లు జాతీయ రహదారుల నిర్వహణకు ఒక సంస్ధ, దానికి ఒక పెద్ద యంత్రాంగం వుండగా ప్రధాని సంబంధిత అధికారికి ,లేదా అసోం అధికారికి ఫోన్‌ చేయకుండా త్రిపుర ఛీఫ్‌ సెక్రటరీని వదలి ఒక జిల్లా అధికారికి ఎందుకు చేశారు? ఇక్కడ ఏం జరిగి వుండాలి. ప్రధాన మంత్రి కార్యాలయంలో లేదా ఇంటి వద్ద పని చేసే అధికార యంత్రాంగానికి రోడ్ల నిర్వహణ అధికార వ్యవస్ధ గురించి తెలిసి వుండకపోవటం, లేదా పని వత్తిడిలో ఆపరేటర్‌కు రాంగ్‌ నంబరు ఇచ్చి వుండాలి లేదా విసిగిపోయిన ఆపరేటర్‌ కనపడిన నంబర్‌కు కలిపి వుండాలి లేదా నానా ఇక్కట్లు పడుతున్నది త్రిపుర జనం కనుక ఆ రాష్ట్ర అధికారికి కలిపారా అన్నది అది బుర్రవున్నవారు అడగ కూడని ప్రశ్న. లేదా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే అసోంలో ఇప్పటికే బిజెపి అధికారంలో వుంది కనుక మరో మరో నాలుగున్నర సంవత్సరాల వరకు పట్టించుకోనవసరం లేదు. త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి ఏదైనా మేలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్న త్రిపుర జనానికి పాలక సిపిఎం పై ఆగ్రహం కలగాలి. రాష్ట్రం పట్ల ప్రధాని ఎంత శ్రద్ధ చూపుతున్నారో చూడండి, ఆయన స్వయంగా పట్టించుకున్న తరువాతనే రోడ్డు బాగుపడింది, అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం ఏమీ చేయించలేకపోయింది, బిజెపి ఆ పని చేసిందనే సానుభూతి అక్కడి జనానికి కలగాలని ఆ పని చేశారా ? ఏమో ?

    మన అధికార వ్యవస్ధలో ఒక వూరి ముససబు మరోవూరిలో వెట్టి కంటే హీనం అన్న సామెత గురించి తెలిసిందే. ఒకే ప్రభుత్వంలో ఒక శాఖకు సంబంధించి మరో శాఖ జోక్యం చేసుకుంటే దిగువ స్ధాయి గుమస్తా కూడా ఎందుకు చేయాలని ప్రశ్నించే పరిస్ధితి వుంది. అటువంటిది ప్రధాని ఒక జిల్లా అధికారికి ఫోన్‌ చేసి మరో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులతో పని చేయించి రోడ్డు మరమ్మతుల పని పురమాయించటం ఏమిటి ? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీకి ఈ చిన్న విషయం కూడా తెలియదా ? రంజుగా చెబుతున్న కథను వినాలే తప్పరామాయణంలో పిడకల వేటలా ఇలాంటివి అడగకూడదేమో ?

    తాను ఇప్పటికే అసోం, త్రిపుర ప్రభుత్వాలతో మాట్లాడానని కావాల్సిన సాయం అందుబాటులో వుంటుందని ఐఏఎస్‌ అధికారితో ప్రధాని చెప్పినట్లుగా కధనం వుంది. అంటే ఎవరి చేత పనిచేయించాలో నిర్ణయించేది ప్రధాని కార్యాలయమా? రాష్ట్ర ప్రభుత్వాలా, జాతీయ రహదారుల సంస్ధా ? నిజంగా ప్రధాని కార్యాలయం ఆ రోడ్డు గురించి అంతకు ముందే సంబంధిత రాష్ట్రాల లేదా జాతీయ రహదారుల సంస్ధ అధికారులతో మాట్లాడినపుడే పని చేయించాల్సిన అధికారిని కూడా నిర్ణయిస్తారా ? పోనీ నిర్ణయించిన తరువాత సంబంధిత రాష్ట్ర, సంస్ధ వున్నతాధికారులు తెలియచేసే లోపే ప్రధాని కార్యాలయం సంబంధిత ఐఏఎస్‌ను కాంట్రాక్టు చేసిందా ? రోజూ ఇలాగే ప్రధాని కార్యాలయం ప్రధానితో అందరితో మాట్లాడిస్తుందా ? తెల్లవారి ఐఏఎస్‌ అధికారి కార్యాలయానికి వెళ్లే సరికి ఆ సమాచారం అక్కడ వుందట. అదెలా సాధ్యం. అంతకు ముందు రోజు పని వేళల్లో వచ్చి వుంటే తప్ప తపాలాను తెరిచి చూసే వారే వుండరు కదా ? లేదా తెరిచి చూసిన వుద్యోగి అంతటి ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత అధికారికి ఎందుకు చెప్పలేదు ? మరుసటి రోజు సిబ్బందిని తీసుకొని త్రిపుర అధికారి అసోంలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేయించేందుకు వెళ్లే సరికే అక్కడ అసోం సర్కార్‌ జెసిబిలను సిద్ధం చేసిందట. కాశీ మజిలీ కధల్లో రాజకుమారులకు, గంధర్వులో ,తపస్సంపన్నమునులో, మారు వేషాలలో వున్న దేవతలు సమకూర్చినపుడు తప్ప ఈ రోజుల్లో అధికార యంత్రాంగానికి ఇలాంటివి సాధ్యమా ?

     మొత్తానికి మూడు వందల ట్రక్కుల్లో పరికరాలు, సామాగ్రి వచ్చి నాలుగో రోజుకల్లా రోడ్డు మరమ్మతు పూర్తి అయిందట. కేంద్ర మంత్రి గడ్కరీ ఆ అధికారికి ఫోన్‌ చేసి ఢిల్లీ వచ్చినపుడు ప్రధాని కార్యాలయానికి రమ్మని ఆహ్వానించారట. ఇదొక ట్విస్టు. పోనీండి సుఖాంతం అయింది. ప్రధాని ఫోన్‌ చేసింది జూలై 21న అంటే 26వ తేదీ నాటికి రోడ్డు మరమ్మతు పూర్తి అయింది. వెంకయ్య నాయుడికి ఈ సమాచారం తెలిసి వుంటే నరేంద్రమోడీ రెండు సంవత్సరాల పాలనలో సాధించిన విజయాల జాబితాకు దీనిని కూడా జత చేసి సమాచార, ప్రసార శాఖల మంత్రి కనుక వూరూ వాడా టాంటాం చేయించి వుండేవారు.యధాలాపంగా ఈ సమాచారం తెలిసినట్లు దీనిని ఒక నెల రోజుల తరువాత ఒక వెబ్‌ సైట్‌ తన కధనంగా రాసింది. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరిగిందో కూడా చూడకపోతే ఎలా !

http://www.indiatimes.com/news/india/tripura-s-only-link-with-the-world-has-turned-to-slush-after-rains-sadly-no-one-cares-257390.html

     దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైన వస్తువులు, ప్రయాణీకుల రవాణాకు కీలకమైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి,అసోం ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని త్రిపుర రవాణాశాఖ మంత్రి మాణికే డే జూన్‌ 25న విలేకర్ల ముందు వాపోయారు. అంతకు ముందు త్రిపుర గవర్నర్‌గా వున్న బిజెపి నేత తధాగతరాయ్‌, త్రిపుర బిజెపి నేతలు కూడా కేంద్ర మంత్రి గడ్కరీ, అసోం ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర మంత్రి, ప్రభుత్వానికి వందలాది ఇ మెయిల్స్‌ పంపినా ఒక్కదానికీ సమాధానం రాలేదని డివైఎఫ్‌ఐ నేత చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు నెలలుగా రవాణాకు పనికి రాకుండా రోడ్డు చెడి పోయిందని త్రిపుర పిడబ్ల్యుడి శాఖ మంత్రి బాదల్‌ సరోజ్‌ చెప్పారు. ఇంకా అనేక సంస్ధలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.పెట్రోలు, డీజిలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరతతో పాటు రోజుల తరబడి వందలాది వాహనాలు నిలిపోవటం గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.

http://economictimes.indiatimes.com/news/economy/infrastructure/tripura-urges-centre-assam-for-immediate-repair-of-national-highway-8/articleshow/52940775.cms

    సరైన రోడ్డు సౌకర్యం లేక కొల్‌కతా రేవు నుంచి బంగ్లాదేశ్‌కు సరకులను రవాణా చేసి అక్కడి నుంచి త్రిపురకు చేర్చిన వుదంతాలు అనేక వున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు మరమ్మతు గురించి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై త్రిపుర ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమైన తరువాతే రోడ్డు మరమ్మతు పూర్తయింది.

   ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు అంతకంటే తీవ్రమైన విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కదిలించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖలు రాస్తే వుపయోగం, అది ఎలా స్పందిస్తుందో, పనులు ఎంత త్వరగా తెలుస్తాయో స్వానుభవం పొందవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాడు కన్నీరు, నేడు ఆశాభంగం, రేపు ?

17 Wednesday Aug 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

CJI BREAKDOWN, CJI DISAPPOINTED, CJI THAKUR, Modi, Narendra Modi, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

    తగినంత మంది న్యాయమూర్తులను నియమించకపోవటంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ న్యూఢిల్లీలో జరిగిన ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్య మంత్రుల సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని సమక్షంలో తన ఆవేదనను ఆపుకోలేక కంటతడి పెట్టిన విషయం చాలా మందికి గుర్తుండే వుంటుంది. అనూహ్యమైన ఆ పరిణామంతో కంగుతిన్న ప్రధాన మంత్రి న్యాయమూర్తుల నియామకం గురించి చర్యలు తీసుకొనే విషయం ప్రధాన న్యాయమూర్తి, ఇతరులతో మాట్లాడతానని ప్రకటించినట్లు వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అలాంటి ప్రధాని ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటం పట్ల తాను ఆశాభంగం చెందినట్లు అదే ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రిని బహిరంగంగా ప్రశ్నించి మరో సంచలనానికి కారకులయ్యారు. మీడియా దీని గురించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకంటే వేలు ప్రధాని వైపు చూపుతుంది, అది ఆయనకు ఆగ్రహం తెప్పిస్తుంది కనుక అని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్రదినోత్సవం రోజున సుప్రీం కోర్టు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు.

   ‘మీరు బహుళ ప్రజాదరణ పొందిన మరియు జాతీయ వాది ప్రధాన మంత్రి ఒకటిన్నర గంటల పాటు చేసిన ప్రసంగం విన్నారు. మీరు కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాట్లాడింది కూడా విన్నారు. వుపన్యాసంలో న్యాయప్రస్తావన చో టు చేసుకుంటుందేమోనని నేను కూడా ఆశించాను. న్యాయమూర్తుల నియామకం గురించి మాట్లాడతారనుకున్నాను. నేను ఈ వేదిక మీద ఒక్కటే చెప్పదలచుకున్నాను. మీరు (వేదికపై వున్న న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ను వుద్ధేశించి) దారిద్య్రాన్ని తొలగించండి, జనానికి వుపాధి కల్పించండి, జాతిని ఐక్యంగా వుంచండి మరియు పెద్ద పధకాలన్నింటినీ రూపొందించండి కానీ మన దేశ ప్రజలకు న్యాయం చేయటం గురించి కూడా ఆలోచనకు చోటివ్వండి.’ అన్నారు. ‘మీరు ఇతరుల మీద పండ్లూ, పూలూ చల్లారు, అదే విధంగా నేను కూడా వాటికోసం ఇక్కడ వేచి చూస్తున్నాను’ అంటూ ఒక వుర్దూ కవితను చదివారు.’ నా వైఖరి ఏమిటో అందరికీ స్పష్టం, కోర్టు వెలుపలా లేదా బయట అయినా నేను నా మనసులో వున్నదానిని మాట్లాడతాను. నేను ఒక వున్నత స్ధాయికి వచ్చాను, సాధించగలిగింది సాధించాను. నేను ఇంతకు మించి వున్నతికి పోయేదేమీ వుండదు. అందువలన నా మనసులో వున్నదాని గురించి నేను మాట్లాడేప్పుడు ఇతరుల గురించి ఆలోచించను, సంకోచించను. నేను ఒక మంచి మాట చెబితే అది ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది, అదే నా బలం. బ్రిటీష్‌ వారి పాలనలో ఒక కేసును ఖరారు చేయటానికి పది సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పుడు కేసులు, వివాదాలు ఎక్కువయ్యాయి. ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయి. ఇదంతా మాకు కష్టంగా మారుతోంది అందుకే ఈ సమస్యల గురించి పట్టించుకొమ్మని పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అని చెప్పారు.

  సుప్రీం కోర్టులో పతాకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జండా ఎగురవేసేందుకు ప్రయత్నించగా జండా ముడి విడిపోలేదు. తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ మనం కూడా లబ్దిదారులమే,మనల్ని కూడా అడుగుతారు కానీ రవిశంకర్‌ ప్రసాద్‌గారూ ఈ ముడులను తీవ్రంగా పరిగణించండి.నేను పతాకావిష్కరణ చేయబోయినపుడు జరగాల్సిన విధంగా ముడులు విడిపో లేదు, అయినప్పటికీ ఇక్కడున్నవారందరికీ నేను ఒకటి చెప్పాలి. ఆ ముడుల గురించి ఆయన ధృఢంగా వుంటే మేము కూడా అలాగే వుంటాం. ఈ రోజు ఇక్కడ జండా ఎగుర వేయటానికి మేము ఇనుప రాడ్డును తీసి తిరిగి జండాను ఎలా అమార్చామో అంతా మీరు చూశారు’ అని కూడా పరోక్షంగా ప్రభుత్వ తీరును విమర్శించారు.

    ఈ రోజు భారత జనాభా 125 కోట్లు, దాదాపు 40శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన వున్నారు. మీరు గీచిన గీత ప్రకారం గ్రామాలలో రోజుకు రు 26, పట్టణాలలో రు.32లపైన సంపాదించిన వారంతా దారిద్య్రరేఖకు ఎగువున వున్నట్లే. కాబట్టి 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా మనం దారిద్య్రాన్ని నిర్మూలించగలమా లేదా అన్నది సవాలుగా వుంది.సుప్రీం కోర్టులో ఒక గుమస్తా వుద్యోగానికి కూడా ఒక పోస్టు గ్య్రాడ్యుయేట్‌ దరఖాస్తు చేస్తాడు. మనం దారిద్య్రం, దోపిడీ నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామో అదే నిజమైన స్వాతంత్య్రం అని ఠాకూర్‌ చెప్పారు.

    గత శుక్రవారం నాడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్బంగా జస్టిస్‌ ఠాకూర్‌ జడ్జీల నియామకం గురించి ప్రభుత్వంపై అపనమ్మక భావం కలుగుతోందని, ఈ ప్రతిష్టంభన తొలగింపునకు అవసరమైతే కోర్టు జోక్యం చేసుకొనే స్ధితికి తీసుకు వెళ్ల వద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు.’ వ్యవస్ధ స్థంభించేవరకు తీసుకురాకండి, న్యాయమూర్తుల నియామకంలో ఆటంకాలను మేము సహించజాలం, అది కోర్టు పనిని ఆటంకపరుస్తోంది. జవాబుదారీతనాన్ని ఇప్పుడు వేగవంతం చేస్తాం, ఎందుకీ అపనమ్మకం, ఈ ఆటంకం ఇలాగే కొనసాగేట్లయితే న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కొలీజియం మీకు పంపిన ప్రతి ఫైలు కోసం మేము అడగాల్సి వుంది అని చెప్పారు.

   న్యాయమూర్తుల కొరత కారణంగా దేశంలోని వివిధ కోర్టులలో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. మూడు దశాబ్దాల క్రితమే కనీసం నలభైవేల మంది న్యాయమూర్తులు అవసరమని లా కమిషన్‌ సిఫార్సు చేయగా ప్రస్తుతం 21వేల మంది మాత్రమే వున్నారు. దేశంలోని 24 హైకోర్టులలో 38లక్షలు, సుప్రీం కోర్టులో 60వేల కేసులు పెండింగ్‌లో వున్నాయి. జస్టిస్‌ వివి రావు ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి మాట్లాడుతూ వివిధ కోర్టులలో వున్న 3.128 కోట్ల కేసుల విచారణ పూర్తి కావాలంటే 320 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. గత మూడు దశాబ్దాలలో న్యాయమూర్తుల సంఖ్యదేశంలో ఆరు రెట్లు పెరిగితే కేసులు పన్నెండు రెట్లు పెరిగాయి.రానున్న మూడు దశాబ్దాలలో కేసులు 15 కోట్లకు చేరితే వాటి పరిష్కారానికి 75వేల మంది న్యాయమూర్తుల అవసరం వుంటుందని ఒక అంచనా. ప్రతి పదిలక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తుల అవసరం వుందని 1987లోనే లా కమిషన్‌ సిఫార్సు చేయగా ఆ సమయంలో పది మంది వుండగా ప్రస్తుతం మన దేశంలో 13 మంది వున్నారు. అమెరికాలో 1980 దశకంలోనే 107, బ్రిటన్‌లో 51, కెనడాలో 75 మంది చొప్పున న్యాయమూర్తులున్నారు.

   సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాని ప్రసంగంలో న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావన లేకపోవటాన్ని ప్రశ్నించటంతో అనేక మంది స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు వున్నవారి కోసం వెతుకుతున్న కారణంగానే కొలిజియం సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని ఆలశ్యం చేస్తున్నదని విమర్శించారు.

  న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించకుండా తనకు దాసులుగా వుండాలని ప్రధాని కోరుకుంటున్న కారణంగానే నియామకాలు జరపటం లేదని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.. న్యాయమూర్తులు ప్రధాని ప్రసంగాలపై వ్యాఖ్యలు చేయకూడదని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్‌ నారాయణ్‌ వ్యాఖ్యానించారు. న్యాయం ఎంత త్వరగా అందచేయాలో అని ఆలోచించాల్సిన న్యాయమూర్తులు దానికి బదులు ఎంత త్వరగా న్యాయమూర్తులను నియమిస్తారా అని చూడకూడదని, న్యాయమూర్తుల నియామకంతోనే న్యాయం జరగదని నరేంద్రమోడీని సమర్ధించే మితవాద పత్రిక స్వరాజ్య వ్యాఖ్యాత జగన్నాధన్‌ పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతరాష్ట్ర మండలిలో తెలుగు చంద్రులేం ప్రసరించారు ?

18 Monday Jul 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, inter state council meet, Inter-State Council, ISC, KCR, Modi

ఎం కోటేశ్వరరావు

     పది సంవత్సరాల తరువాత జూలై 17న న్యూఢిల్లీలో సాదాసీదాగా అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా నిధులు, విధుల బదలాయింపులు, రాష్ట్రాల హక్కుల గురించి చర్చ జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తున్నదో దశాబ్దకాలం పాటు అసలు సమావేశం జరగపోవటమే తేటతెల్లం చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పంఛి అధ్యక్షతన 2007 ఏప్రిల్‌ 27న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 2010 మార్చి 30 కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా తన పని తాను చేసిన కమిషన్‌గా ఇది పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ కమిషన్‌ నివేదికకు కాంగ్రెస్‌ హయాంలో నాలుగు సంవత్సరాలు, బిజెపి ఏలుబడిలో రెండు సంవత్సరాలు దుమ్ము పేరుకు పోయింది.దీనిలోని సిఫార్సులను ఏకాభిప్రాయంతోనే కేంద్రం అమలు జరుపుతుందని ముక్తాయింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర అంతరాష్ట్ర మండలి సమావేశ ముగింపులో చెప్పారు. అంటే దీని సిఫార్సులు ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియని స్ధితి.

    తెల్లవారే సరికి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్ధానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టగలిగిన బిజెపికి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆసక్తి, అన్నింటికీ మించి నిజాయితీ వుంటే ఈ నివేదికపై సమావేశం జరపటానికి రెండు సంవత్సరాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాఖ్య స్పూర్తిని, రాజ్యాంగ నిబంధనలను దెబ్బతీయటంలో కాంగ్రెస్‌ రికార్డును తిరగరాసేందుకు బిజెపి పూనుకుందని వుత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు చేసిన పనులను బట్టి స్పష్టమైంది. తమది భిన్నమైన పార్టీ అని స్వంత డబ్బా కొట్టుకొని ఇతరులను విమర్శించే నైతిక హక్కును అది కోల్పోయింది. పూంఛీ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా అది వ్యవహరించింది.తమది పనిచేసే ప్రభుత్వమని, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకున్న పార్టీ, ప్రభుత్వం ఈ సమావేశ ఏర్పాటుకు ముందే కమిషన్‌ చేసిన సిఫార్సులలో వేటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో వేటిని తిరస్కరించిందో, వేటిపై చర్చ జరగాలని కోరుకుంటోందో ఒక వైఖరిని తీసుకొని రాష్ట్రాల ముందు వుంచితే వాటి మంచి చెడ్డలపై మధనం జరిగి, ఒక కొలిక్కి వచ్చేందుకు దారి చూపేది. అదేమీ లేకుండా మొక్కుబడిగా సాగదీసేందుకు పూనుకుంది.

    ఇప్పటికే కేంద్రం-రాష్ట్రాల మధ్య వున్న సంబంధాలు, సత్సంప్రదాయాలు, వివిధ సమస్యలపై కోర్టులు వెలువరించిన అభిప్రాయాలతో కమిషన్‌ తాను వుచితం అనుకున్న సమస్యలన్నింటిపైన అభిప్రాయాలు తెలిపే విధంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాల కాంగ్రెస్‌, మధ్యలో అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే వున్న జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలుగానీ గతంలో వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను తుచ తప్ప కుండా లేదా వాటి స్ఫూర్తిని గానీ అమలు జరిపిన పాపాన పోలేదు. అందువలన కమిషన్లు అంటే సాగదీయటానికి, రిటైరైన న్యాయమూర్తులు, వున్నతాధికారులకు వుపాధి కల్పన అంశాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు, దాంతో జనానికి వాటిమీద విశ్వాసం పోయింది.పూంఛీ కమిషన్‌ సిఫార్సులు కూడా గత కమిషన్ల జాబితాలో చేరతాయా ?

    పూంఛీ కమిషన్‌ చేసిన ప్రధాన సిఫార్సుల సారాంశం ఇలా వుంది.కల్లోలం సంభవించిన నిర్దిష్ట ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్రం తన పాలన కిందకు తెచ్చుకొనేందుకు ఆర్టికల్‌ 355,356ను సవరించాలి. ఒక జిల్లా లేదా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్ధానిక అత్యవసర పరిస్ధితిని ప్రకటించేందుకు కేంద్రానికి అధికారం ఇచ్చే విధంగా 355,356 ఆర్టికల్స్‌ను సవరించాలి. అయితే అలాంటి అత్యవసర పరిస్థితి వ్యవధి మూడునెలలకు మించి వుండకూడదు. మత హింసాకాండ తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా స్వల్పకాలం పాటు కేంద్ర దళాలను దించేందుకు కేంద్రానికి అనుమతిచ్చే విధంగా మత హింసాకాండ బిల్లుకు సవరణ చేయాలి. సాయుధ దళాలను దించేందుకు రాష్ట్రాల అనుమతి ఆటంకంగా మారకుండా సవరణ చేయాలి.అయితే బలగాల మోహరింపు ఒక వారానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతకు మించి వుండేందుకు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి.ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి ఎన్నికలకు ముందు వున్న ఎన్నికల కూటమిని ఒక రాజకీయ పక్షంగా పరిగణిస్తూ స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో గవర్నర్లు ఏ పద్దతిని పాటించాలో కూడా స్పష్టం చేయాలి.ఎన్నికలకు ముందు వున్న కూటములలో ఎక్కువ సంఖ్య వున్నదానిని ఆహ్వానించాలి.ఎన్నికల అనంతరం ఏర్పడే కూటములలోని పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరే విధంగా నిర్దేశించాలి. ఒక మంత్రిపై చర్య తీసుకోకూడదని మంత్రివర్గం చేసిన సిఫార్సును తోసిపుచ్చి చర్యకు అనుమతి మంజూరు చేసే అధికారం గవర్నర్లకు వుండాలి. గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా చేసే సాంప్రదాయాన్ని రద్దు చేయాలి. గవర్నర్లుగా నియమితులయ్యే వారు స్ధానిక స్ధాయిలలో కూడా నియామకానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుండాలి. గవర్నరు సంబంధిత రాష్ట్రానికి చెందకూడదు, ప్రముఖ వ్యక్తి అయివుండాలి. గవర్నర్లను నిరంకుశంగా తొలగించకూడదు, గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్‌ మాదిరి పరిగణించటాన్ని నిలిపివేయాలి.గవర్నర్లను ఐదేళ్ల కాలానికి నియమించాలి, మధ్యలో వారిని తొలగించాలంటే అసెంబ్లీ అభిశంసన ద్వారా మాత్రమే జరగాలి. తొలగింపునకు కారణం బాధ్యతల నిర్వహణకు సంబంధించినదై వుండాలి. గవర్నర్‌ నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర వుండాలి. గవర్నర్ల నియామకానికి ప్రధాని, హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి.ఈ క్రమంలో వుపరాష్ట్రపతికి కూడా ప్రమేయం కల్పించవచ్చు.ఈ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అంతరాష్ట్ర మండలి సమావేశాలు ఏడాదికి మూడు సార్లు జరపాలి. జాతీయ సమగ్రతా మండలిని కనీసం ఏడాదికి ఒకసారి సమావేశ పరచాలి. ఎక్కడైనా మతపరమైన సమస్య తలెత్తినపుడు వెంటనే మండలిలోని ఐదుగురు సభ్యులను అక్కడికి పంపి నివేదిక తెప్పించుకోవాలి. రాష్ట్రాలపై ఏకాభిప్రాయ బాధ్యతను పెట్టబోయే ముందు కేంద్రం తన వైఖరి ఏమిటో తెలపాలి. నరేంద్రమోడీ అధికారానికి రాకముందే ఈ సిఫార్సులను చేశారు. ఒక వేళ వాటిని బిజెపి లేదా ఎన్‌డిఏ ఆమోదిస్తున్నట్లయితే వాటి స్ఫూర్తితో నిర్ణయాలు చేసి వుండవచ్చు. ఆచరణలో గవర్నర్ల విషయంలో సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించటాన్ని మనం చూశాము.

   నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా కేంద్రం మొక్కుబడిగా నిర్వహించిన ఈ సమావేశం సందర్భంగా కొందరు ముఖ్యమంత్రులు, పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరించాయి. అంతరాష్ట్ర మండలి సమావేశ ప్రారంభంలో ప్రధాని ప్రసంగిస్తూ పన్నుల వాటాను 32 నుంచి 42కు పెంచామని, 2014-15తో పోలిస్తే రాష్ట్రాలకు మరుసటి ఏడాది 21శాతం ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు వాస్తవాలు అంకెలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లలో గణనీయమైన కోత పెడుతున్నది కేంద్రం. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. కేంద్రం గొప్పగా చెబుతున్న 32 నుంచి 42 శాతం పన్నుల బదిలీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం జరుగుతుంది. బదిలీ 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో జరపాలి. అంటే ఐదేండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ పోయి ఐదవ ఏట నుంచి ప్రతి ఏటా పదిశాతం నిధుల బదిలీ జరుపుతారు.దీనికి అనుగుణంగా 2015-16లో రాష్ట్రాలకు జిడిపిలో 6.3శాతం నిధులను బదలాయించాలని ప్రతిపాదించారు.సవరించిన అంచనాల ప్రకారం అది 6.1శాతానికి తగ్గింది. వాస్తవ బదిలి తరువాత గానీ తెలియదు.కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు రకాలుగా బదిలీ జరుగుతుంది. ఒకటి పన్నుల బదిలీ. దానికేమీ షరతులు వుండవు.రెండవది గ్రాంట్లు. వీటికి సవాలక్ష షరతులు విధిస్తారు. ఇది కూడా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో వివాదాస్పద అంశమే. గతేడాది జిడిపిలో 3.4శాతం పన్నులను రాష్ట్రాలకు బడ్జెట్‌లో చూపారు. అది సవరించిన అంచనాలలో 3.7శాతానికి పెరిగింది. చూశారా మేం ఎంత వుదారంగా వున్నామో కేంద్రం గొప్పలు చెప్పుకోవచ్చు. పన్నులలో వాటాను పెంచినప్పటికీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది సర్‌చార్జీలు, సెస్‌ల రూపంలో వసూలు చేసి కేంద్ర ఖజానాకు చేర్చిన మొత్తం పన్ను ఆదాయంలో 6.1 నుంచి 8.1 శాతానికి పెరిగింది.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా వుండదు. గ్రాంట్లుగా రాష్ట్రాలకు బడ్జెట్‌లో 2.9శాతం చూపి సవరించిన దానిలో 2.4కు తగ్గించారు.వర్తమాన సంవత్సరంలో ఈ కేటాయింపులు ఎలా అమలు జరుగుతాయో చూడాల్సి వుంది. అందువలన ఆర్ధిక మంత్రి, నరేంద్రమోడీ ఏం చెప్పినప్పటికీ ఆచరణ ఏమిటన్నదే గీటురాయి. సేవా, రైతుల పేరుతో వసూలు చేసే సెస్సులన్నీ కేంద్ర ఖాతాకే పోతాయి అంటే కేంద్రానికి చేరే నిధుల శాతం మరింతగా పెరుగుతుంది.

    కేంద్ర పధకాల పేరుతో రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు ప్రముఖంగా తమ వైఖరిలో వెల్లడించారు.కేంద్ర ప్రాయోజిత పధకాలన్నీంటికీ గ్రాంట్ల రూపంలో తొలుత కేంద్రం నిధులు కేటాయిస్తుంది. తరువాత అసలు కధ మొదలౌతుంది. నరేంద్రమోడీ చెప్పినట్లు పన్నుల వాటా ఖరారు గాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు బదిలీ అయ్యాయి. పన్నుల వాటాను 42శాతానికి పెంచేందుకు అంగీకరించిన కేంద్రం,ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ పాలన, మోడల్‌ స్కూళ్ల వంటి ఎనిమిది పధకాలకు అంతకు ముందు వున్న 60:40 దామాషాలో వున్న నిధుల కేటాయింపులో కేంద్ర వాటాను తగ్గించింది. మిగతా పధకాలకు నిధుల విడుదలకు షరతులను కఠినతరం గావించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్మే నిధుల మొత్తం పెరిగిన తరువాత రాష్ట్రాల రుణ భారం, ఆర్దిక వత్తిడి తగ్గాలి. అయితే బడ్జెట్లలో చూపిన దానికంటే 16 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నట్లు జపాన్‌ సంస్ధ నోమురా నివేదిక తెలిపింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటాన్ని కేరళ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పూంఛీ కమిటీ సిఫార్సులపై చర్చకు ఒక స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

     తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పూర్తి పాఠాలను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు తన రీతికి తగినట్లుగా 13పేజీల ప్రసంగం చేస్తే చంద్రశేఖరరావు ఏడు పేజీలకే పరిమితం అయ్యారు. అందువలన వారిద్దరూ ఏం చెప్పారనే అంశాన్ని పరిశీలించుదాం. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగ సారాంశం ఇలా వుంది. జాతీయ రహదారులకు కేంద్రం కేటాయింపులు పెంచటం మంచిదే అదే సమయంలో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగానికి కూడా నిధులు పెంచాలి. సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పధకానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.వుమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి కేంద్రం ఏదైనా నూతన చట్టం లేదా వున్న వాటికి సవరణలు తీసుకురాదలిస్తే ప్రతి సందర్భంలోనూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవాలి. ఒక వేళ ఆర్ధికంగా భారం మోపేదైతే కేంద్రమే పూర్తిగా చెల్లించాలి. వుదాహరణకు విద్యాహక్కు చట్టాన్ని అమలు జరపాలంటే ఏటా తెలంగాణా ఒక్కదానికే 300 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మోడల్‌ స్కూళ్ల వంటి వాటికి ఇప్పుడు నిధులు పూర్తిగా నిలిపివేశారు, వేతనాలు, ఇతర ఖర్చులు రాష్ట్రాలకు భారం అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే ఏ పధకానికైనా మధ్యలో నిధులు నిలిపివేయటం గాక దాని నిర్వహణకు అయ్యే పూర్తి మొత్తాన్ని కేంద్రమే భరించాలి. వుమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఏకపక్ష అదుపును నివారించాలి. వుదాహరణకు విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలేజీలకు ఏఐసిటిఇ అనుమతులు ఇవ్వరాదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమాయానికి ఈ సంస్ధ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్‌ కాలేజీలు 356వరకు వున్నాయి.తగిన వసతులు లేని కారణంగా విశ్వవిద్యాలయాలు అనుబంధాలను రద్దు చేసిన కారణంగా వాటి సంఖ్య 172కు పడిపోయాయి. కొద్ది సంఖ్యలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యుజిసి నిధులలో 65శాతం, మిగతావాటన్నింటికీ కలిపి 35శాతం నిధులు ఖర్చు చేయటం అన్యాయం.గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలను సంప్రదించాలి. ఏదైనా ఒక బిల్లును నిరవధికంగా నిలిపివుంచే విచక్షణాధికారం గవర్నర్లకు వుండకూడదు, ఒక కాలపరిమితి నిర్ణయించాలి. విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను ఛాన్సలర్లుగా చేయరాదన్న పూంఛీ కమిషన్‌ సిఫార్సుకు మద్దతు ఇస్తున్నాం, దానిని ఇప్పటికే అమలు జరిపాము. అంతరాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలి, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలి.

      ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రసంగ సారాంశం ఇలా వుంది. సర్కారియా, ప్రస్తుత పుంఛీ కమిషన్‌ సిఫార్సులకు విరుద్దంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేశారు. అది అశాస్త్రీయంగా వుండటమే గాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బందులను కలిగించింది.అందరికీ వర్తించేదిగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్న ప్రమాణాలను పాటించారు. వుదాహరణకు జనాభాలో 58శాతం వున్న రాష్ట్రానికి వుమ్మడి రాష్ట్ర ఆదాయంలో 46శాతమే కేటాయించారు. అప్పులను జనాభా ప్రాతిపదికన, ఆస్థులను మాత్రం ఎక్కడివి అక్కడే అన్న పద్దతిలో పంచారు. విద్యుత్‌ రంగంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. రాష్ట్ర దుస్థితిని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేందుకు కేంద్రం మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధికంగానూ ఎంతో సాయం చేయాల్సి వుంది.రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి చేసిన హామీలన్నింటినీ అమలు జరిపేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రత్యేక రాష్ట్ర తరగతి హోదా, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్‌ మంజూరు, పరిశ్రమలకు పన్నుల రాయితీలు కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక పధకం, వనరుల లోటు పూడ్చేందుకు అవసరమైన గ్రాంటు మంజూరు చేయాలి. చివరి రాష్ట్రంగా వున్నందున ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది, గోదావరి, కృష్ణ బోర్డులను ఈ రోజు వరకు వేయలేదు.

     గవర్నరన్లు ఐదేండ్ల వ్యవధికి నియమించాలన్న పూంఛీ సిఫార్సుల వంటికి కొన్ని ఆచరణ సాధ్యం కాదు, తగిన విధంగా లేవు.గవర్నర్ల అభిశంసనకు అనుసరించాల్సిన పద్దతిపై సిఫార్సు అంగీకారం కాదు. బిల్లుల ఆమోదం, సూచనలకు ఆరునెలల వ్యవధి అవసరం లేదు, ఒక నెల చాలు. స్ధానికంగా అత్యవసర పరిస్ధితి విధింపునకు 355,356 ఆర్టికల్‌ను సవరించకూడదు. అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమించటమే. ఆర్ధిక మంత్రుల సాధికార కమిటీ పనితీరును చూసిన తరువాత ఇతర రంగాలకు అలాంటి సాధికార కమిటీలను వేయటం సరైంది కాదు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే పెద్ద రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం. కేంద్ర బలగాలను ఏకపక్షంగా నియమించటం ఫెడరలిజం సూత్రానికే విరుద్దం.జల వివాదాలపై ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై అప్పీలుకు సుప్రీం కోర్టుకు వెళ్లాలనటం సరైంది కాదు, రాజ్యాంగ బద్దంగా అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.

    ఇద్దరు ముఖ్య మంత్రులు చేసిన ప్రసంగ పాఠాలను చూసినపుడు చంద్రశేఖరరావు ఆర్ధికాంశాలపై ఎక్కువగా కేంద్రీకరించారు.చంద్రబాబు నాయుడు వాటిని దాదాపుగా విస్మరించారు. ఎవడబ్బ సొమ్మంటూ కేంద్రంపై ధ్వజమెత్తిన ఎన్‌టిరామారావు వారసులమని చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఏపీకి ఇస్తామన్న నిధుల గురించి అడిగారు తప్ప రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులు, విధుల గురించి విస్మరించటం విస్మయం గొలుపుతోంది. మాకు మా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలు ఇంకేమీ లేదు, బంగారు తెలంగాణాగా మార్చుకుంటాం అని వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చిన చంద్రశేఖరరావుకు కేంద్ర పధకాల భారపు సెగతగలటం, తెలంగాణాను బంగారంగా మార్చటం సాధ్యం కాదని అర్ధమైందేమో అనివార్యంగా నిధుల గురించి నిర్మొహమాటంగా చెప్పాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తీరే వేరు – గరిష్ట మంత్రులు, కనిష్ట పాలన

05 Tuesday Jul 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

cabinet reshuffle, Modi, modi cabinet, small government

ఎంకెఆర్‌

    ప్రధాని నరేంద్రమోడీ మరో వాగ్దానానికి తిలోదకాలిచ్చారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనే వాగ్దానానికి తూనా బొడ్డు అని చెప్పారు. గరిష్ట మంత్రులు-కనిష్ట పాలనకు తెరతీశారు. మంగళవారం నాడు ఐదుగురు మంత్రుల వుద్యోగాలు పీకివేసి 19మందికి కొత్తగా ఇచ్చారు. సంతుష్టీకరణ పనులు చేయబోమని గొప్పలు చెప్పుకొనే బిజెపి అదే బాటలో నడిచి జంబో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో 78 మంది వుంటే మందగా ఎద్దేవా చేసి చూడండి మేము 45 మందితో ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా చెప్పారు. మంత్రివర్గ ఏర్పాటులో అసాధారణం, సానుకూల మార్పు అని స్వయంగా నరేంద్రమోడీ తన అభిమానులకు ట్వీట్లు పంచారు. దానినే పెద్ద సంస్కరణగా వూరూ వాడా టాంటాం వేసుకున్నారు, వంది మాగధుల పొగడ్తలు అందుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌, అదే మన్మోహన్‌ సింగ్‌ బూట్లలో కాళ్లు దూర్చారు.పని చేయని మంత్రులుగా పేరు తెచ్చుకున్న వారిని కొనసాగించారు. నిబంధనావళి ప్రకారం 82 మంది వరకు మంత్రులు వుండవచ్చు. అంటే మరో నలుగురికి చోటు కల్పించేందుకు అవకాశం వుంది.

     డెబ్బయి అయిదు సంవత్సరాలు దాటిన ముసలి వారిని మంత్రులుగా తీసుకోకూడదన్నది విధాన నిర్ణయంగా నరేంద్రమోడీ ప్రకటించినపుడు అద్వానీ అండ్‌ కోను వదలించుకొనేందుకే అని కొందరు గొణిగినప్పటికీ వహ్వా వహ్వా అంటూ ఎందరో అభినందనలు చెప్పారు. ముసలివారిని తొలగిస్తారని వూహాగానాలు చేసిన, రాసిన వారందరూ నజ్మా హెప్తుల్లా, కల్‌రాజ్‌ మిశ్రాల కొనసాగింపును చూసి అవాక్కయ్యారు. ఎన్‌పిఏ(పని చేయని) మంత్రిగా పేరు తెచ్చుకున్న సదానంద గౌడతో సహా మరికొందరిని పని చేసేందుకు కొనసాగనిచ్చారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరిని కొనసాగించటం ద్వారా ‘మై హూనా ‘ అంటూ భరోసా ఇచ్చినట్లయింది.

    ఇప్పటికే 13 మంది మంత్రులున్న వుత్తర ప్రదేశ్‌కు మరి కొంత మందిని తోడు చేయటం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే అంటే కోపగించుకోకూడదు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో అబ్బే అలాంటిదేమీ లేదని రుజువు చేసుకుంటున్నది. మోడీ మంత్రి వర్గ విస్తరణ పాలనతో సంబంధం లేదు ఎన్నికలు అధికారంపై తన మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టు నిలుపుకొనే రాజకీయ చర్య అని ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని తరచూ మన్‌కీ బాత్‌ అంటూ మాట్లాడతారు తప్ప కామ్‌కీ బాత్‌ను పట్టించుకోరని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి సెపితిరి ! ఏమి సెపితిరి !! చిన్న మౌన ముని నరేంద్రమోడీ !!!

29 Wednesday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Arnab Goswami, BJP, Modi, Modi’s Interview, Modi’s silence, Prime Minister Narendra Modi, Times Now

ఎం కోటేశ్వరరావు

      పది సంవత్సరాలు అధికారంలో వున్న మన్మోహన్‌ సింగ్‌ పెద్ద మౌన మునిగా బిజెపి తదితరులతో పిలిపించుకున్నారు. కొద్ది వారాల క్రితమే రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చిన్న మౌన ముని నరేంద్రమోడీ తొలిసారిగా ఒక ప్రయివేటు టీవీ ఛానల్‌తో సంభాషించారు. తాము పూజించే లేదా అభిమానించే బాబాలు, మునులు ఎప్పుడు నోరు తెరుస్తారా మధుర భాషణం ఎప్పుడు విందామా అని ఎదురు చూసే భక్తులు, అభిమానులు ఆ క్షణంలో ఎంత తన్మయులౌతారో మోడీ భక్తుల పరిస్థితి కూడా అలాగే వుండి వుండాలి.

    నరేంద్రమోడీ నోరు తెరవటం ప్రపంచంలోని ఏడు వింతలలో చేరితే ఆయనను ఇంటర్వ్యూ చేసిన టైమ్స్‌ నౌ సంపాదకుడు ఆర్నాబ్‌ గోస్వామి పిల్లిలా మాట్లాడటం కూడా మరొకటిగా చేరటం మరొక విశేషం. మోడీ ఇంటర్వ్యూ చూసిన లేదా పత్రికలలో చదివిన వారు విమర్శనాత్మకంగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మోడీ అభిమానులు వారిని సహించరని వేరే చెప్పనవసరం లేదు. అయితే అంతర్గతంగా ఎలాగూ మాట్లాడటం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు, ఇంతకంటే పోయేదేముంది మాట్లాడి అనవసరంగా విమర్శల పాలయ్యారని తలపట్టుకోవచ్చు. ఇంటర్య్యూలోని మచ్చుకు కొన్ని అంశాలు ఎలా వున్నాయో చూడబోయే ముందు ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చూడటం అవసరం.

     ఆర్నాబ్‌ గోస్వామి గురించి సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌ కొన్ని వ్యంగ్యోక్తులు సంధించారు. అత్యాచారానికి గురైన మహిళ స్ధితి గురించి సల్మాన్‌ ఖాన్‌ నోరు పారవేసుకోవటం, మీడియా, సామాజిక మీడియా, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించటం, దాని మీద సలీంఖాన్‌ క్షమాపణ చెప్పటం ఇవన్నీ తెలిసిందే. అయినా రేటింగ్‌ల కోసం మీడియాలో గోస్వామి వంటి వారు సల్మాన్‌ ఖాన్‌ గురించి చేసిన హడావుడి నష్టనివారణకు దోహదం చేయలేదు. నరేంద్రమోడీ ఇంటర్వ్యూను టీవీలో చూసిన సలీమ్‌ ఖాన్‌ మోడీ మాటల కంటే ఆర్నాబ్‌ గోస్వామి ప్రశ్నించే తీరునే గమనించినట్లున్నారు. అందుకే పెద్ద ఖాన్‌ చేసిన ట్వీట్స్‌లోని అంశాలు ఇలా వున్నాయి.

       ‘ ఏమిటీ ? మీరు ఇప్పుడు టమ్స్‌ నౌ(ఛానల్‌) మాత్రమే చూడండి, అది కూడా ఆర్నాబ్‌ కోసం, సల్మాన్‌ ఖాన్‌ మీద అతని అవ్యాజ ప్రేమానురాగాలను చూడటానికి కాదు, వైద్య కారణాలతో దానిని చూడటం అంటే ఎంతో వున్నత గౌరవం వుంది. వైద్య కారణాలు ఏమిటంటారా ? అవును, ఎందుకంటే నేను రెండు చెవులూ నలభై శాతం వినికిడి లోపంతో వున్నాను. ప్రతి మాటనూ ఆ ఛానల్‌లో మాత్రమే వినగలను. కానీ గత రాత్రి ప్రధాన మంత్రిని ఆర్నాబ్‌ ఇంటర్వ్యూ చెయ్యటాన్ని చూడటానికి గరిష్ట స్థాయిలో శ్రుతిని(సౌండ్‌) పెంచినా నాకు ఒక్క మాటా వినిపించలేదు. ఆర్నాబ్‌ అంత మృదువుగా వ్యవహరించటాన్ని నేను చూడలేదు. ప్రధాని సమాధానాల కోసం ఎలా ప్రశ్నించారో వూహించుకోవచ్చు. అతను రంకెలు మాత్రమే వేస్తాడు లేదా ఎవరికీ భయపడడు అని చెప్పే నాలి ముచ్చులు ఎక్కడ ?’

      అర్నాబ్‌ గోస్వామి టీవీలో చర్చలు నిర్వహించటాన్ని తొలిసారి ఎవరైనా వీక్షిస్తే పాల్గొన్నవారి మీద వేసే రంకెలు, హావభావాలను చూసి మీదపడి కొడతారా ఏమిటి అన్నట్లుగా వుంటాయి. ప్రధానితో చేసిన ఇంటర్యూ చూసి ఆయన అభిమానులు ఆశాభంగం చెంది వుంటారు, ఇతర నేతలతో చేసిన ఇంటర్వ్యూలను పోల్చి మోడీతో ఒక పరిణితి చెందిన టీవీ జర్నలిస్టు మాదిరి గాక ఒక టీచర్‌-విద్యార్ధి సంభాషణగా వుంది అని ఒకరు వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని తొలిసారి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినపుడు ఆ సంభాషణ ద్వారా కొత్త విషయాలు రాబట్టే ప్రయత్నం, తీరు కనపడలేదని, చూసేవారికి కొత్తేదేముంది అన్నట్లుగా వుంది. ఆ కార్యక్రమం మోడీ ప్రదర్శన కాదు, మోడీని ఒక మూలకు నెట్టే మల్లయోధుడి పిడిగుద్దుల మాదిరి గాక పిల్లలు తాతయ్యలను చిరుకోపంతో ముట్టుకునే మాదిరి సాగింది, ఏ మల్లయోధుడైనా ఎదుటి వారిని ముష్టిఘాతాలతో ఆడుకోవటానికి గాక వర్తులం చుట్టూ వూరికే తిరుగుతారా అని ఎద్దేవా చేశారు.

     తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయిన ఆర్నాబ్‌ తన కార్యక్రమాల గురించి చర్చించటం తప్ప మరొక పనిలేని గుంపు ఒకటి వుంది. వారు ఎంతో విధేయతతో వుత్సాహంతో వాటిని చూస్తున్నందుకు వారికి కృతజ్ఞుడనై వుంటాను అని వుక్రోషంతో సమాధానమిచ్చాడు. ఇంటర్వ్యూ సమయంలో అసాధారణరీతిలో మీరు మౌనంగా వున్నారు ఎందువలన అని ఒక జర్నలిస్టు ఆర్నాబ్‌ను అడిగినపుడు ఇలా చెప్పాడు.’ కొంతమంది ఇంటర్వ్యూను చూస్తున్నారనుకోండి వారికి వార్తా విశేషాలు ఎంతో ముఖ్యం.పాకిస్థాన్‌లో మిలిటరీ-పౌర విభజన ఏర్పడే అవకాశం గురించి ప్రధాని సూచన ప్రాయంగా చెప్పారు. ఎన్‌ఎస్‌జి గురించి స్పందన వార్తాంశం ముఖ్యం అని నేను ఆలోచించాను. రఘురాం రాజన్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన(మోడీ) సమాధానమిచ్చిన తీరు సూటిగా వున్న వార్తాంశమని నేను అనుకున్నాను. ఈ వార్తాంశాలతో నా విధేయులైన వీక్షక బృందాన్ని, మీడియాను కూడా నిరాశపరిచాను’

    ఇంటర్వ్యూలో వున్న ఆ గొప్ప వార్తాంశమేమిటా అని అనేక మంది జర్నలిస్టులు చూశారు.తన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరైనా అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకపోతే ఆర్నాబ్‌ ఎలా రెచ్చిపోతారో చూసినవారికే అర్ధం అవుతుంది. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రాజన్‌ గురించి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి నేరుగా ప్రధానికి లేఖ రాశారు, బహిరంగంగా ఎంత రచ్చ చేసిందీ తెలిసిందే. రాజన్‌ గురించి ఆర్నాబ్‌ అడిగిన దానికి మోడీ చెప్పిన సమాధానం ఎంత సూటిగా వుందో చూడండి.’ ఎవరైనా, మా పార్టీ వారు కావచ్చు కాకపోవచ్చు, అటువంటి పనులు తగవు. అలాంటి ప్రచారం జిమ్మిక్కులతో దేశం బాగుపడదు. అటువంటి పనులు చేసే వారు మరింత బాధ్యతాయుతంగా వుండాలి. వ్యవస్థకంటే తాము పెద్ద వారమని ఎవరైనా భావిస్తే అది తప్పు’ అని మాత్రమే అన్నారు.ఇలాంటి సమాధానాలు ఇతరులు చెప్పి వుంటే ఆర్నాబ్‌ వారిని చీల్చి చెండాడి పేరు చెప్పేంతవరకు వదలి పెట్టరు.

    ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, ప్రధాని సమాధానం చెప్పిన తీరు మీద కూడా అనేక స్పందనలు వచ్చాయి. విషయం ఏమీ చెప్పకుండానే , సూటిగా మాట్లాడ కుండా ఎలా సమాధానాలు ఇవ్వవచ్చో నేర్పే విధంగా వున్నాయన్నది వాటిలో ఒకటి. పిల్లలు ఆవు, చెట్ల వలన వుపయోగాల గురించి రాసే వ్యాసాల మాదిరి వున్నాయంటే అతిశయోక్తి కాదు. అనేక అంశాలపై నరేంద్ర మోడీ మౌనం పాటిస్తారనే విమర్శ వుంది. దీంతో అది మరింత స్పష్టమైంది. ముఖ్య అంశాలపై మాట్లాడినప్పటికీ సూటిగా సమాధానాలు లేవు. అన్నింటికీ మించి విలేకర్ల గోష్టి కాకుండా తనకు మద్దతునిచ్చే ఒక ఛానల్‌తో మాట్లాడటాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా కొందరు భావించారు. మీడియాను ఎదుర్కొనే స్ధితిలో ప్రధాని లేరనేది స్పష్టమైందన్న అభిప్రాయమూ వుంది.

     ప్రధాన మంత్రి తరచూ విదేశీ ప్రయాణాలు, ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారన్న విమర్శలు వచ్చినపుడు అనేక మంది మంత్రులు, బిజెపి నేతలు విదేశీ పెట్టుబడుల కోసం జరుపుతున్నట్లు చెప్పారు. కానీ మోడీ సమాధానం అందుకు భిన్నంగా వుంది.’ ప్రపంచానికి నా గురించి తెలియదు. ఒక దేశానికి ఎవరు సారధిగా వున్నారు అని తెలుసుకోవాలని ప్రపంచం అనుకుంటుంది. ఎవరైనా మీడియా ద్వారా మోడీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అలాంటి వారు అసలైన మోడీ ఎవరు అని తికమక పడే అవకాశం వుంది. అది జరిగితే దేశానికి నష్టం. భారత్‌పై విశ్వాసం కలగటానికి మోడీ వ్యక్తిత్వం ఆటంకం కాకూడదు, అందువలన నేను అందరు నాయకులను కలుసుకోవాలి, ముఖాముఖీ మాట్లాడాలి, నేను నిర్మొహమాటంగా మాట్లాడకపోతే వారికి భారత సారధి గురించి తెలియదు. అందువలన ఇది నాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. ఇంతకు ముందు ప్రపంచ నాయకులను కలుసుకొనే అవకాశం రాలేదు.’

    నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పారన్న ప్రశ్నకు ‘ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్య అది, వారికి మాట్లాడటానికి ఏదో ఒక సమస్య వుండాలి కదా ‘ అన్నారు. ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ గత ప్రభుత్వ హయాంలో ధరలు వేగంగా పెరగటాన్ని మీరు చూడవచ్చు, నేడు వేగం బాగా తగ్గింది. మీరు అంకెలను చూడవచ్చు.రెండవది వరుసగా రెండు సంవత్సరాలు కరవు వుంది.కూరగాయలు, ఆహారం, పప్పుల ధరలపై కరవు ప్రభావం ప్రత్యక్షంగా వుంటుంది, ఎందుకంటే అవన్నీ భూమిలో పండుతాయి. అంత పెద్ద కరవు వున్నపుడు ఎవరి చేతుల్లో ఏమీ వుండదు. ఇటువంటి పరిస్థితులలో దిగుమతులు చేసుకోవటం రెండవ అవకాశం. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. మూడవది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంయుక్త బాధ్యత అది.’

     కొందరు కేంద్ర మంత్రులు మతవుద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనల చేయటం గురించి అడిగిన ప్రశ్నకు ‘ అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని వాటి ద్వారా హీరోలుగా మార్చవద్దని నేను చెప్పదలచుకున్నాను.వారిని హీరోలను చేయకండి, వారే మానుకుంటారు.’ అన్నారు. ఇక వుపాధి గురించి చిరంజీవి సినిమాను గుర్తుకు తెచ్చేలా చెప్పారు. ‘ మొదటి విషయం మన దేశంలో 35 సంవత్సరాల లోపు వారు 80కోట్ల మంది వున్నారు. వుద్యోగాల కోసం పెద్ద డిమాండ్‌ వున్న విషయాన్ని మనం అంగీకరించాలి.కానీ వారెక్కడ వుపాధి పొందుతారు ? పెట్టుబడులు రావాలి. వాటిని మౌలిక సదుపాయాలు, వుత్పాదక, సేవా రంగాలలో వుపయోగించాలి. ఇప్పుడు మనం చొరవ తీసుకున్నాము, ముద్రా యోజన ప్రారంభించాము. రజకులు, క్షురకులు,పాలవారు, వార్తాపత్రికలు అమ్మేవారు, బండ్ల మీద అమ్మేవారందరూ కలసి దేశంలో మూడు కోట్ల మంది వున్నారు. వారి పనిని విస్తరించేందుకు ఎలాంటి హామీతో పనిలేకుండా దాదాపు 1.25లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చాము. ఒకరు ప్రస్తుతం ఒకరికి పని కల్పిస్తున్నారనుకుందాం, దానిని విస్తరిస్తే అతనికి ఇద్దరు కావాలి. అదే ఇద్దరు వుంటే ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మూడు కోట్ల మంది ఈ చిన్న వ్యాపారులకు రుణం అందుబాటులోకి వచ్చిందనుకోండి వారు తమ పనిని విస్తరించక తప్పదు. మేం మరొక చిన్న నిర్ణయాన్ని తీసుకున్నాం. దేశంలో పెద్ద దుకాణాలు 365 రోజులూ నడుస్తాయి, కానీ చిన్న దుకాణాలను సెలవు రోజుల్లో మూసివేయాలి.చిన్న దుకాణాలను కూడా పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులు తెరవ వచ్చని మేము బడ్జెట్‌లో ప్రకటించాము. పెద్ద దుకాణాలకు లేని ఆంక్షలు చిన్న దుకాణాల వారికి ఎందుకు వర్తింపచేయాలి? కాబట్టి పొద్దుపోయే వరకు, వారానికి ఏడు రోజులూ తెరిచేందుకు అవకాశం వుంది కనుక గతంలో ఒకరిని వుద్యోగానికి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరిని పెట్టుకోవాలి, దీని వలన వుపాధి పెరగదా ? 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలని చెబుతున్నాము.ఈ రంగం ఎంతో మందికి వుపాధి కల్పిస్తుంది.’

    కొంత మంది మంత్రులు, నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం గురించి ప్రస్తావించి మతం పేరుతో రాజకీయాలు చేయకూడదు కదా, వారిని అదుపు చేయాల్సిన అవసరం లేదా అని ఆర్నాబ్‌ ప్రశ్నించారు.’ మొదటిది, అభివృద్ధి వైపు జాతి పురోగమించాలని గట్టిగా విశ్వాసం వున్న వాడిని, అది అవసరం కూడా, అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని హీరోలుగా చేయవద్దని నేను మీడియాను కోరుతున్నాను.’

      కానీ వారు వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు కదా ?’ వారిని హీరోలను చేయవద్దు వారే ఆగిపోతారు.’

    మేం వారిని హీరోలను చేయలేదు, విలన్లుగా చేశాము ‘ కానీ మీరు వారిని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు. అలాంటి ప్రకటనలు చేయటాన్ని నేను టీవీలలో చూశాను, వారి ముఖాలు కూడా నేను చూడలేదు, చివరికి వారు టీవీలో అధికార ప్రతినిధులుగా మారుతున్నారు.’

  తమకు తామే ప్రతినిధులుగా ప్రదర్శించుకుంటున్నారు ‘ అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు ‘

    మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారి గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలివి. ఒక ప్రధాని స్ధాయిలో వున్న వ్యక్తి అనేక ముఖ్యాంశాల గురించి మాట్లాడిన తీరుతో అనేక మంది విస్తుపోతున్నారు. అభిమానులు ఎలాగూ వేరే అర్ధాలు తీస్తారన్నది తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పప్పుల కోసం నరేంద్రమోడీ విదేశీ యాత్రలా ?

20 Monday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Availability of Pulses, Modi, pulse prices, Pulses

పప్పులో నీళ్లు కలిపి తినమంటున్న రామ్‌దేవ్‌

ఎం కోటేశ్వరరావు

     ఈ శీర్షికను చూసి ప్రధాని నరేంద్రమోడీ వీర భక్తులు, కాషాయ దేశభక్తులు కోపం తెచ్చుకోవద్దని మనవి.అంధుల రాజ్యంలో ఒంటి కన్నువాడు మహారాజు అని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఏ చిత్తంతో అన్నారో గానీ మోడీగారి పాలన రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సలహాలు ఇచ్చేవారు కూడా అపూర్వ మేథాసంపన్నులుగా వున్నట్లున్నారు. పప్పుల ధరలు చుక్కలు చూపిస్తున్న ఈ రోజుల్లో మా కాలంలోనే పప్పులతో ముఖం కడుక్కొని పప్పులతో స్నానం చేసి పప్పులలోనే నిద్రపోయే వారం అని పిల్లలకు రాత్రి పూట పిట్ట కధలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందా ? ఏమో ! ‘పప్పుల ధరల అదుపుకు మోడీ ఆఫ్రికా దేశాల పర్యటన’ ఇది ఒక ఆంగ్ల వార్త శీర్షిక.http://indiatoday.intoday.in/story/modi-to-visit-african-countries-to-check-racing-pulse-prices/1/695912.html

       మేకిండియా పిలుపును అమలు చేసేందుకే మా ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తున్నారని భజన బృందం చెబుతుంటే కామోసనుకున్నాం. ఇప్పుడు పెట్టుబడుల కోసమే కాదు, పప్పుల కోసం వెళుతున్నారని మనం చెవులప్పగించి వినాలి కాబోలు.కోరి తలమీద పెట్టుకున్నాం కనుక తప్పదేమో మరి ! పట్టణాలలో కొన్ని పప్పుల ధరలు గరిష్టంగా 180 నుంచి 200 రూపాయల వరకు వున్నాయి.గ్రామాలలో అందునా మారు మూల గ్రామాలలో ఇంకా ఎక్కువ వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. మంచి రోజులు రానున్నాయని చెప్పటానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు తప్ప పప్పులుడికేందుకు చర్యలు లేవు. ప్రధాని నరేంద్రమోడీ జూలై తొలి వారంలో ఆఫ్రికా దేశాల పర్యటన జరుపుతున్నారు.ఆయనతో పాటు సీనియర్‌ అధికారుల బృందం వెళ్లి ఆఫ్రికా ఖండ దేశాలలో ప్రయివేటు వారితో కాంట్రాక్టు సాగు పద్దతిలో పప్పులు పండించేందుకు, పప్పులను దిగుమతి చేసుకొనేందుకు గల అవకాశాలను పరిశీలించి వస్తారని అధికారులే చెప్పినట్లు వార్తలు. పెట్టుబడుల కోసం మోడీయే విదేశాలు తిరిగి, పప్పుల కోసమూ ఆయనే వెళ్లాల్సి రావటం అంటే అధికారులు మోడీ మెప్పు పొందేందుకు, ఆయనను మెప్పించేందుకు ఇలా చేస్తున్నారా లేక సంబంధిత మంత్రులు వుత్సవిగ్రహాలా ?

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు తామరతంపరగా పుట్టుకు వస్తున్నారు, వారిపై నిఘావేయటానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి), ఐబి, రెవెన్యూ ఇంటెలిజన్సు విభాగాలకు సిబ్బంది చాలని పరిస్థితులో పప్పులపై ఒక కన్నేసి వుంచమని కూడా ప్రభుత్వం చెప్పిందట. మన దేశంలో ఏటా పదిలక్షల టన్నుల పప్పుల వినియోగం పెరుగుతున్నదని అంచనా, ప్రస్తుతం ఏటా 24మిలియన్‌ టన్నులు అవసరం కాగా నాలుగు లక్షల టన్నుల వరకు దిగుమతులు చేసుకుంటున్నాం.

   ప్రపంచ పప్పుల సంవత్సరంగా 2016ను ప్రకటించారు. మన వినియోగదారులకు పప్పుల షాక్‌ కూడా ఈ సంవత్సరమే తగలటం విశేషం. పప్పుల వినియోగం, కొరత గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఏం చేసిందన్నది ఒక ప్రశ్న. (వుత్పత్తి, దిగుమతి మిలియన్‌ టన్నులలో, ఖర్చు కోట్ల రూపాయలలో, వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా )

సంవత్సరం    వుత్పత్తి       దిగుమతి       దిగుమతి ఖర్చు

2012-13       18.34          4.02             13,357

2013-14        19.27         3.18             11,038

2014-15        17.15         4.00             14,396

2015-16        17.33         5.50             24,198

     పై అంకెలను చూసినపుడు ఏటేటా పెరుగుతున్న వినియోగం, తగ్గుతున్న వుత్పత్తికి అనుగుణంగా దిగుమతులు లేవన్నది స్పష్టం. 2015-16 సంవత్సరానికి సంబంధించి వుత్పత్తి అంకెలు అంచనా మాత్రమే. దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాభావం, కరవు కారణంగా వుత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని మనకు కనిపిస్తున్నా ప్రభుత్వం గొప్పకోసం వుత్పత్తి పెరుగుదల అంచనా చూపింది. రెండవది 2012-13 సంవత్సరాలలో టన్ను రు 33వేల చొప్పున దిగుమతి చేసుకుంటే గతేడాది 43వేలకు పెరిగింది. మన పప్పుల వుత్పత్తి తగ్గిపోయిన విషయం గమనంలో వున్న కేంద్రం లేదా రాష్ట్రాలు గానీ అవసరమైన దిగుమతులను చేసుకోని కారణంగానే, అనేక చోట్ల నిల్వలన్నీ అయిపోవటాన్ని అవకాశం తీసుకున్న వాణిజ్యశక్తులు ధరలను అనూహ్యంగా పెంచివేశాయి. వారిని అదుపు చేసేందుకు, దొంగ నిల్వలను పట్టుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ కనపడదు.

    ఆఫ్రికా ఖండంలో పప్పులను పండించి దిగుమతి చేసుకొని ధరలను తగ్గిస్తామని కేంద్రం చెబుతుంటే దానికి గట్టి మద్దతుదారుగా స్వయం ప్రకటిత బాబా రామదేవ్‌ ఏ చిట్కా చెప్పారో తెలుసా. న్యూఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాదులో యోగా శిక్షణలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ పప్పుల ధరల పెరుగులకు నరేంద్రమోడీని విమర్శించకూడదని సెలవిచ్చారు. పోనీ అంతటితో ఆగితే ఫరవాలేదు, ఈ సమస్యను అధిగమించటానికి పప్పులో నీళ్లెక్కువ పోసుకొని తింటే పొదుపు చేసి ఖర్చుకు ఖర్చు, పెంచుకున్న ఒళ్లు తగ్గి ఆరోగ్యానికి ఆరోగ్యమూ అని కూడా వుద్భోదించారు. అంటే కోడిగుడ్డంత బంగారం లేనివారెవరూ ఈదేశంలో లేరన్నట్లుగా పప్పులు ఎక్కువగా తిని జనమంతా వూబకాయాలను పెంచుకున్నారని గౌరవనీయులైన రామదేవ్‌ బాబా అనుకుంటున్నారా ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ సిఫార్సు ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 80గ్రాముల పప్పులు తినాల్సి వుంది. మనదేశంలో సగటు లభ్యతే 40 గ్రాముల లోపు వుంది. అసలు పప్పుల ముఖం చూడనివారు కూడా వున్నారంటే ఆశ్చర్యం లేదు.

     రామ్‌దేవ్‌ ఇలా సెలవిస్తే మన కేంద్ర ఆహార మంత్రి మాననీయ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ గారు ధరల పెరుగుదల గురించి ఆశ్చర్యపోతున్నారట. పప్పులను పండించేందుకు లేదా దీర్ఘకాలిక దిగుమతులు చేసుకొనేందుకు గాను మయన్మార్‌,మొజాంబిక్‌ దేశాలకు ప్రతినిధులను పంపుతున్నామని చెప్పారు.ఇదెలా వుందంటే దాహంతో చస్తున్నామయ్యా అంటే దేశంలో అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పినట్లు వుంది.పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నపుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం, వారిని నడిపించాల్సిన మంత్రులు ఇంతకాలంగా ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? దేశంలో టమోటాలు, బంగాళాదుంపలు, వుల్లిపాయల వుత్పత్తి గణనీయంగా పెరిగింది, వినియోగంలో మార్పు లేదు అయినా ధరలు పెరిగాయంటే దీనికి పుకార్లే కారణం అని కూడా పాశ్వాన్‌ సెలవిచ్చారు. పుకార్లను తొలగించటానికి ప్రభుత్వ యంత్రాంగం నమో భజనలో వందోవంతైనా ప్రచారంలో స్ధానంలో కల్పించలేదేం?

     మన పొరుగు దేశం పాకిస్థాన్‌ మంత్రి మరొక మహత్తర సలహా ఇచ్చారు. పప్పుల కంటే కోడి మాంసం ధర తక్కువగా వుంది కనుక దాన్ని తినండన్నారు. అక్కడ కిలో పప్పులు రు.260 వుంటే కోడి మాంసం రు.200లకే దొరుకుతోందట. ఇవేమి ధరలయ్యా బాబూ అని అక్కడి ప్రతిపక్షాల వారు అడిగితే ఈ సలహా ఇచ్చారు.

     మన దేశంలో ఎకరానికి 750కిలోల పప్పుల దిగుబడి వుంటే అభివృద్ధి చెందిన దేశాలలో 1200 నుంచి 1800 కిలోల వరకు వుంది. దీనికి తోడు గత రెండు సంవత్సరాలలో రూపాయి విలువను దిగజార్చిన ప్రభుత్వ విధానాల కారణంగా దిగుమతి చేసుకొనే పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రమంత్రులతో కుమ్మక్కయిన వ్యాపారుల సిండికేట్లు ఆఫ్రికా నుంచి కిలో 55 రూపాయలకు పప్పులను దిగుమతి చేసుకొని మన దేశంలో 175 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకొన్నట్లు, దానిలో మోడీకి ఎల్లవేళలా అండదండలుగా వుండే అదానీ వంటి వారు వున్నట్లు వచ్చిన వార్తలను ఇంతవరకు ప్రభుత్వం ఖంచించినట్లు మనకు తెలియదు.పప్పుల దిగుమతికి అదానీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది.http://www.indiasamvad.co.in/investigation/inside-story-how-rs-55-per-kilo-african-dal-was-sold-in-india-for-rs-175-7853 అదానీ రేవులలో దిగుమతి చేసుకున్న పప్పులను నిలవ చేసి దాచివేశారని కూడా ఆరోపణలు వున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) On Two Years of BJP-Modi Government

31 Tuesday May 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

BJP, Communal Polarisation, Congress party, CPI()M, electoral tactics, Kerala, LDF, Modi, Narendra Modi, RSS-BJP, Trinamool Congress, Two Years of BJP-Modi Government, West Bengal

The Polit Bureau of the Communist Party of India (Marxist) met at New Delhi
on May 29 & 30, 2016. It has issued the following statement:

The BJP government had conducted a gaudy celebration of the completion of
two years in office making many bombastic claims.

These two years have confirmed that a new `trimoorti? is being sculpted.
Its three faces represent the following: one, the relentless pursuit of
aggressive communal polarization in the effort to transform the secular
democratic character of the Indian Republic into the RSS version of a
rabidly intolerant fascistic `Hindu Rashtra?; two, the pursuit of the
neo-liberal trajectory of economic reforms, more aggressively than pursued
by the UPA government, imposing unprecedented burdens on the vast majority
of our people; and three, increasing recourse to authoritarian measures
undermining the institutions of parliamentary democracy and running
roughshod over democratic rights and civil liberties.

As far as the majority of the Indian people are concerned, there is an
economic disaster rather than any cause for celebrations.
*        Six year low for new jobs in eight labour-intensive industries. In
2015, official figures reveal that only few new jobs were created in the
country as against the promise of creating two crores of new jobs annually.
Every year, over 1.3 crore of Indian youth join the job market
*        Worst decline in exports in 63 years – decline for 17 months in a
row
*        Core inflation of 6.8 per cent, Dal prices rise by more than 30 per
cent
*        Annual core sector growth of only 2.7 per cent, a decade low
*        2,997 farmers committed suicide in 2015, 116 farmers in
January-March 2016
*        MGNREGA payments not made, arrears paid after Supreme Court orders
*        Rural wages decline in real terms in a decade
*        Savings bank deposits growth at a 53 year low
*        NPAs of banks more than Rs 13 lakh core and growing
*        27 per cent zero-balance Jan Dhan accounts, 33 per cent duplicate
accounts
*        New and more taxes, surcharges and cesses on items used by the
poor
On top of this, the agrarian distress is worsening.  The Modi government
promised ?minimum of 50 per cent profits over cost of production?.

Reality:
*        Profitability down to less than 10 per cent, and in some crops,
into losses
*        Agriculture and allied sector grew at -0.2 per cent  in FY15 & 1.1
per cent in FY16
*        Foodgrains production dropped by 5 per cent in FY15, to decline
further in FY16

Severe Drought Situation
*        12 states were declared drought-hit only after Supreme Court?s
orders. Overall,  54 crore people in 13 states are suffering in the grip of
drought
*        25 per cent of India?s rural inhabitations face drinking water
crisis.
The unprecedented drought situation has resulted in the death of thousands
of poor people and lakhs of livestock.  Immediate relief must be provided to
the suffering people.  Despite the Supreme Court intervention, nothing
tangible is being done by the Central government.
The Polit Bureau of the CPI(M) demands that the sufferings of the people
must be mitigated on a war footing.

Sharpening Communal Polarisation

The RSS-BJP are, once again, resorting to whipping up communal passions in
the run up to the forthcoming Assembly elections in Uttar Pradesh in 2017.
It is reported that the Bajrang Dal has been organizing arms training camps
in several parts of the state.  This is clearly an exercise  to provoke
communal conflicts and tensions and reap the consequent electoral gains from
such polarization.  Such efforts are an expression of the worst ?vote bank
politics? seeking the consolidation of the Hindutva communal vote bank at
the expense of  weakening the unity of India?s social fabric.  The Polit
Bureau of the CPI(M) strongly condemns such activities and demands that both
the Central government and the UP state government take strong action in
accordance with the law of the land.
Racial Attacks against the People of African Origin
The reports of increasing violence resulting in the death of people of
African origin living in India is a matter of grave concern.  That such
grievous attacks take place in the national capital of Delhi is, indeed,
shameful.  Such racist attacks undermine the centuries old relationship
between India and the African countries. This has already assumed the
dimension of affecting diplomatic ties between India and the African
countries.
The Central government must immediately intervene to ensure that stringent
action is taken against the culprits and those propagating racist hatred.
This is absolutely essential to prevent the further downslide in the
international image of India.

Elections to the State Assemblies

The CPI(M) state committees in West Bengal, Kerala, Tamilnadu and  Assam are
scheduled to meet to prepare a detailed review of the CPI(M)?s performance
in the elections and the post election political situation arising in these
states.  On the basis of these review reports prepared by the state
committees, the Central Committee will conduct its review at its forthcoming
meeting from June 18-20.
With regard to the electoral tactics pursued by the CPI(M) in various
states, the electoral tactics evolved in West Bengal was not in consonance
with the Central Committee decision based on the political-tactical line of
the Party which states that there shall be no alliance or understanding with
the Congress party.

Post-Declaration of Result Violence

The Trinamool Congress has unleashed widespread violence against the cadres
of the opposition parties.  Many CPI(M) cadres have been murdered and over
600 CPI(M) and mass organization offices have been ransacked and some set on
fire.  Apart from targeting the offices of all opposition parties and mass
organizations, the attacks specifically focus on constituencies and areas
where Trinamool Congress lost in these elections.  Widespread  bomb attacks,
arson and extortions of huge amounts of money as ransom are being reported.
Those who voted against the Trinamool Congress are reportedly coerced into
paying a hefty fine for having exercised their  democratic choice.
Under these circumstances, the CPI(M) calls upon the people of West Bengal
to unitedly resist this murder of democracy and civil liberties in the
state.  The strength of the people?s unity is the answer to meet this
unprecedented unleashing of violence.

Kerala

The Polit Bureau of the CPI(M) salutes the people of Kerala for reposing
faith in the LDF in a resounding manner in these Assembly elections.  The
LDF government has assumed office with a resolve to fulfill the commitments
that it made to the people of Kerala during the polls.
The physical attacks by the RSS against the CPI(M) and the LDF continue.
Forty one such attacks have already taken place since the results were
declared. Two comrades have lost their lives, with Sasikumar, who was
seriously injured in an attack at Engandiyoor in Thrissur on 22nd May
succumbing to his injuries on May 27.  82 comrades have been injured in
these brutal attacks including an elected MLA who has now been sworn in as a
Minister.
The CPI(M) calls upon the RSS/BJP to respect the verdict of the people and
desist from such murderous onslaughts.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబుకు ఓ అభిమాని బహిరంగ లేఖ

03 Tuesday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Modi, Narendra Modi, special status to Andhra pradesh, YS jagan

బాబు గారూ మీరు మెతక మనిషని ఎవరన్నారు ?

      చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అపర చాణుక్యుడు, సర్దార్‌ పటేల్‌ కంటే గట్టి పిండం, గ్రీకు వీరుడు హెర్క్యులస్‌ను మించిన బలశాలి అనుకుంటున్న మీ అభిమానులను ఒక్కసారిగా నాగలోకం నుంచి నక్కల మధ్య పడేశారు. సందేహ సముద్రంలో ముంచేశారు. నేను మెతక మనిషినేం కాదు, ధృడచిత్తంతో వున్నాను అని స్వయంగా మీరు చెప్పటంతో మా చిత్తాలు చిత్తడి అయిపోతున్నాయి. బాబు గారూ అసలు మీరు మెతక మనిషని ఎవరన్నారు ? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు ? వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోటీ పడి వస్తున్నా మీ కోసం పేరుతో మీరు చేసిన పాదయాత్ర మెతక మనుషులకు సాధ్యమా ? బిజెపి, నరేంద్రమోడీ పట్ల ఒకసారి కఠినంగా మరోసారి మెతకగా వున్నట్లు మీపై విమర్శలు వస్తే వచ్చి వుండవచ్చుగాక, అవి రాజకీయాలు, నిరంతరం మీరు కలలు కనే రాష్ట్రం కోసం తప్ప మీ మెతక తనానికి నిదర్శనాలు ఎలా అవుతాయి ? మామ అని కూడా చూడకుండా ఎన్‌టి రామారావు పట్ల కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మీరు మెతక మనుషులని అనుకోవటానికే ఏదోగా వుంది.

    అసలు మీకు ఏమైంది ? మీరు ఏనుగు వంటి వారు. ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు మీ వెనుక ఏదో అంటే మిమ్మల్ని సమర్ధించటంలో మీ మంత్రులు సరిగా వ్యవహరించనందుకు మందలించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి గానీ మా వంటి అభిమానులు ఎక్కడైనా తగ్గినట్లు విన్నారా? మేం ఎన్నడైనా అంగీకరించామా? లేదే ! అటువంటిది నేను మెతక మనిషిని కాదు అని బేలగా, జాలిగా మీరు అనటం ఏమిటి బాబూ ! మేం ఏం కావాలి ? కష్టపడటం నా తప్పా అని మీరు అంటుంటే చివరికి మనప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపికి, జగన్‌కు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబూ అన్నట్లు మా కడుపు తరుక్కు పోతోంది.

   మిమ్మల్ని (మనల్ని )నమ్ముకొని అనేక మంది తమ నియోజకవర్గాలను కూడా తెల్లారేసరికి సింగపూరో, మలేషియానో, జపానో, అమెరికాగానో మార్చేద్దామనే కదా వైసిపినుంచి ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నుంచి గాదె వెంకట రెడ్డి వంటి నేతలు సైతం పార్టీకిలోకి ప్రవాహాలుగా వస్తున్నారు.నేను మెతక మనిషిని కాదు అన్న మాట ఏ వుద్ధేశ్యంతో అన్నారో గానీ లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య సామెతను గుర్తుకు తెస్తోందని ప్రతిపక్ష పార్టీల వారు అంటుంటే అటు కాదనలేక ఇటు అవుననలేక మేం మెత్తపడక పడక తప్పటం లేదు. రెండు సంవత్సరాలు చూశాం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించటం తప్ప రాష్ట్రానికి ఏం పనులు జరిగాయి, ఏం పీకారు అంటుంటే వెర్రి మొహాలు వేసుకొని ఇంకా ఎంతకాలం సమర్ధించాలో అర్ధం కావటం లేదు. దీనికి తోడు పార్టీ అధికారానికి వస్తే గడ్డ పెరుగు ముక్కల మాదిరి తిందామని అనుకుంటుంటే ఎదుటి పార్టీల నుంచి ఎందరు వస్తే అంత మందినీ కలుపుకోండని, అంతా మనమంచికే అని చెబుతున్నారు. మీకేం బాబూ ! మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. గత ఎన్నికలలో ఎంత ఖర్చు చేశామో మీకు తెలియనిది కాదు. ఇది ఎప్పుడూ వుండేదే . కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి, ఎన్నికల సమయంలో వున్న కార్యకర్తల కంటే తరువాత ఫిరాయించిన వారు ముద్దు , ఓడమల్లయ్య బోడి మల్లయ్య వంటి ఈ విషయాల గురించి తరువాత మరోసారి విన్నవించుకుంటా.

    మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి ప్రధానికి సరైన సమాచారం అందుతోందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు చదివాం. బాబు గారూ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నా మంత్రులు, అధికారులు సక్రమంగా లేరని మన శ్రేయోభిలాషుల మాదిరి వుండే కొందరు జర్నలిస్టులు రాసిందానిని నిజమే అని గతంలో నమ్మారని ఇప్పుడూ అనుకుంటున్నారని వింటున్నాం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే అదే జర్నలిస్టులు ఇటు మిమ్మల్ని, అటు కేంద్రంలో అంతకంటే ప్రధాన మంత్రిని ఎక్కువగా సమర్ధిస్తున్నారు. అందువలన కేంద్ర అధికారులు ప్రధానికి సరిగా తెలియచేయటం లేదనే పాట మీ కోసం కాదేమో చూడండి. లేక ప్రధాని మీద మాట పడకుండా మిమ్మల్ని ‘సంతృప్తి ‘ పరుస్తున్నారా? బిజెపికి సంతృప్తి రాజకీయాలు గిట్టవని తెలుసు కదా ! జర జాగ్రత్త, జనం నమ్మేట్లు లేరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర మనోగతం ఏమిటో అర్ధం కావటం లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా లేక సమస్య తీవ్రత తెలియక పట్టించుకోవటం లేదా అన్నది అర్ధం చేసుకోలేకపోతున్నాం. వెళ్లి కలిసినపుడు బాగా మాట్లాడుతున్నారు, కాని ఫలితం రావటం లేదు అన్నారు.

   ముందు మన శాసన మండలి, అసెంబ్లీ తీర్మానాలు చేయటమేనా, అసలు వాటిని మన అధికారులు కేంద్రానికి పంపారా ? అన్న అనుమానం కలుగుతోంది. మరి పంపితే వాటికి వచ్చిన సమాధానాలు ఏమిటి , మన మంత్రులు, ఎంపీలు కలిసినపుడు ఏం చెప్పారు. మన అధికారులు వచ్చిన వర్తమానాలను పూర్తిగా చూపటం లేదా అన్న సందేహం తలెత్తుతోంది. పార్లమెంట్‌లో సమాధానాలు, ఇతర లోగుట్టు కధనాల పేరుతో రాసిన వార్తలు తప్ప మాకు నిజం తెలియటం లేదు. రాష్ట్రం పంపిన తీర్మానాలేమిటి ? వాటికి కేంద్రం నుంచి వస్తున్న సమాధానాలు ఏమిటో అధికారికంగా తెలియచేస్తే అభిమానులం మేం కూడా ఒక పట్టు పడతాం కదా? అదేం వుండటం లేదు. అసలూ మనకు కేంద్రంలో ఇద్దరు మంత్రులు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా వున్నారు. వారు రోజూ కేంద్రంతో సంప్రదించవచ్చు. మరి వారేమి చేస్తున్నట్లు ? మీరు అనేక సార్లు ప్రధాన మంత్రిని కలిశారు. మీకేమో గుజరాతీ, హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. అందువలన అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఆవో బాబూ ఆవో మై హూనా కాఫీ, చాయ్‌ పానీ పీనేకే బాద్‌ తుమ్‌ ఏపి జావో, బాద్‌మే అచ్చే దిన్‌ ఆ రహా హయ్‌ అంటే మీరు మంచిగా మాట్లాడుతున్నట్లు అనుకుంటున్నారా ఏమిటి ? ఇలా అయితే మీరు మరో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఇదే జరుగుతుందన్న నీరసం వస్తోంది మాకు. మీరు నిరాశగా మాట్లాడటం చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు , చెప్పుకోలేని బాధ, కేంద్రంలో మీకు అవమానం జరిగిందేమో అన్న అనుమాన బీజం మాలో పడింది.

    కేంద్రంలో వున్న మన వెంకయ్య నాయుడు గారేమో తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక సమస్య పరిష్కారమో, కొత్త పధకమో తెస్తున్నట్లు చెబుతారు.ప్రధాని ఆయన ఎంత చెబితే అంత అంటారు. మీరేమో ప్రధాన మంత్రి దృష్టిపెడితే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయంటున్నారు.అంటే మీరు ప్రధాని దృష్టిని, కనీసం తోటి వెంకయ్య నాయుడి దృష్టిని సైతం ఆంధ్రప్రదేశ్‌పై మళ్లించటంలో రెండు సంవత్సరాలుగా విఫలమయినట్లేనా అన్న వూహనే తట్టుకోలేకపోతున్నాము.

    ఇంతవరకు జరిగిందానిని బట్టి, అనేక రాష్ట్రాలలో జరుగుతున్నదానిని బట్టి మన వంటి వారిపై ఆధారపడే కంటే స్వంతంగా బలపడాలని, అందుకు గాను వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలపరుచుకోవాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.ఎదుటి పార్టీ వారిని ఆకర్షించటం మాకూ చేతనవును అని అనేక రాష్ట్రాలలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్ధం అయ్యేట్లు చేయాలని బిజెపి నేతలకు అర్ధం అయింది. ఈ విషయం మీకు అర్ధం అయినా మరొక దారి లేక బింకాలు పోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

    బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తున్నది అనే ప్రచారం క్రమంగా పెంచుతున్నారు. కేంద్రం సహకరించినా దానిని వినియోగించుకోవటంలో బాబు గారు విఫలమయ్యారు కనుక ఒక అవకాశం మాకే ఇవ్వండి అని వారు ముందుకు వస్తారా ? వస్తే మన పార్టీలో ఎందరు మిగులుతారు అన్నవి ప్రస్తుతానికి వూహా జనిత ప్రశ్నలే కావచ్చు కానీ, ప్రస్తుతం మన వంటి పార్టీల నేతలు డొల్లుపుచ్చకాయల వంటి వారు, ఎటైనా దొర్ల వచ్చు. ఇంతకు ముందు మన పార్టీలో కాంగ్రెస్‌ రక్తం ఎంత వ్యతిరేక రక్తం ఎంత అని కొలిచేవారు, ఇప్పుడు కాక్‌టెయిల్‌ మందు మాదిరి, ఏది ఎంతో తెలియటం లేదు.

   చివరగా ఒక్క మాట. అధికారంలో లేనపుడు అభిమానుల సూచనలు పట్టించుకుంటారని, అధికారం వచ్చిన తరువాత ఇతరుల మాటలు వింటారని మీ గురించి గిట్టని వారూ, గిట్టే వారు కూడా చెబుతుంటారు. ఈ సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతామని ప్రకటించారు.ఏదో తొలి ఏడాది దీక్ష అంటే అర్ధం వుంది, ప్రతి ఏడాదీ దీక్షలేమిటంటే ఏం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు దీక్షలు చేయటం అంటే అర్ధం వుంది. అధికారంలో వున్నవారు దీక్షలు చేస్తే చాలా బాగోదు. బరువు తగ్గటానికైతే ఓకే. ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా, రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు సాయం వంటి వాటిపై దీక్ష చేస్తేనన్నా ప్రధాని రాష్ట్రం వైపు దృష్టి పెడతారేమో చూడండి బాబు గారూ.ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ తగ్గింపుపై కార్మికుల తడాఖాను చూసిన తరువాతే ప్రధాని వాటిపై దృష్టి సారించారు.వెనక్కు తగ్గారు. కేసుపోయినా మన ప్లీడరు గట్టిగా వాదించాడు అని వచ్చే ఎన్నికలలో మేమంతా చెప్పుకోవటానికి దారులు వెతుక్కోవటం మంచిదేమో చూడండి మరి.

    వుంటా బాబూ ! రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రం, మన అమరావతి , మన ఇటుకలు, మన మట్టి, మన నీరు అంటూ వుత్సాహంతో, వుద్వేగంతో ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మా వాడు జాబు గురించి హైదరాబాదో, బెంగలూరో పోవాలంటున్నాడు. దాని సంగతేదో చూడాల, మన అమరావతిలో జాబులు వచ్చినపుడు వాడిని ఇక్కడికే రప్పిస్తాలే, అప్పటి దాకా వుంచుకోలేకం కదా ! ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లాడు కదా !

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీకి నోటి తుత్తర సుబ్రమణ్యస్వామి వరమా ! శాపమా !

28 Thursday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Loose cannons, Modi, Narendra Modi, Subramanya swamy, Swamy

ఎం కోటేశ్వరరావు

    రాజ్యసభకు నామినేటెడ్‌ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడీకి వుపయోగపడతారా? సమస్యలను కొని తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. పూవు పుట్టగానే పరిమళిస్తుంది ! తలిదండ్రులు తమకు బిడ్డలు పుట్టినపుడు కంటే వారు ప్రయోజకులైనపుడు ఎక్కువ సంతోషిస్తారు !! పది సంవత్సరాల తరువాత పార్లమెంట్‌లో అడుగు పెట్టి నోరు విప్పిన 15 సెకన్లలోనే రాజ్యసభ వాయిదా పడిందంటే ఆయన నోరు ఎంతటి ప్రతిభావంతమైనదో వేరే చెప్పనవసరం లేదు. అఫ్‌కోర్సు ఆయన మాటలను రికార్డులనుంచి తొలగించారనుకోండి. సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున జనానికి ఆ సమాచారం చేరిపోతుంది, మాట్లాడిన వారి ప్రయోజనం నెరవేరుతుంది. ఆ తరువాత అధికారిక రికార్డులలో వుంటేనేం లేకుంటేనేం ! సభ వాయిదా పడటం, కార్యకలాపాలు కుంటుపడటం, సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా చూడటం అదేగా పాలకపార్టీ వ్యూహం. నరేంద్రమోడీ నాయకత్వం అదే కోరుకొంటోందా ?

     సుబ్రమణ్య స్వామి రాజకీయంగా జనసంఘంలో పుట్టి దీపంలా వెలిగి, తరువాత జనతా పార్టీలో నాగలి పట్టిన రైతు అవతారమెత్తి, తరువాత దానిని బిజెపిలో విలీనం చేసి కమలం పువ్వుతో పరిమళిస్తున్నారు. తాజాగా నామినేటెడ్‌ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టి తనకు రాజకీయ జన్మనిచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆనందం కలిగిస్తున్నారు. అచ్చ తెలుగులో నోటి తుత్తర గాడిగా పిలిపించుకొంటూ నిత్యం ముస్లింలపై విరుచుకుపడే ఈ తమిళ బ్రాహ్మణుడు కుటుంబ విషయాలలో అందుకు భిన్నమైన వ్యక్తి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

     సంఘపరివార్‌ సంస్థలలో శిక్షణ పొందిన వారి పరిభాషలో చెప్పాలంటే స్వయంగా ‘లవ్‌ జీహాదీ’. పార్సీ మతస్థులను ‘సంతృప్తి పరచటానికి’ ఆ మతానికి చెందిన రుక్సానాను చదువుకునే సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ముస్లింలను ‘సంతృప్తి పరచటానికి’ తన ఒక కుమార్తెను ఒక ముస్లింకు ఇచ్చి వివాహం చేశాడు.’హిందువులను సంతృప్తి పరచటానికి ‘ మరో కుమార్తెను విశాఖ పట్టణానికి చెందిన ప్రముఖ రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఇఏఎస్‌ శర్మ కుమారుడు, ప్రొఫెసర్‌ అయిన సంజయ శర్మతో వివాహం చేశారు . అయినా సరే నిత్యం తోటి లవ్‌ జీహాదీలతో కలసి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఈ పెద్దమనిషిని హిందూ తాలిబాన్‌ అంటే అతికినట్లు సరిపోతుందేమో.

     అంతకు ముందు జనసంఘం, జనతా పార్టీ ఎంపీ. కేంద్రమంత్రిగా పని చేసిన ఆయనను తాజాగా బిజెపి రాజ్యసభకు నామినేట్‌ చేసింది. బిజెపి సభ్యుడైన స్వామి సాంకేతికగా ప్రస్తుతం రాజ్యసభలో స్వతంత్రుడు. అలాంటి వారు ఏదో ఒక పార్టీని ఎంచుకోవచ్చు. ఈ స్వామి స్వభావం, పార్టీలోని నాయకులతో వున్న వైరుధ్యాలను బట్టి ఏం చేస్తారో చూడాల్సి వుంది. ఇలాంటి వారిని పిల్లిని చంకన పెట్టుకు వచ్చే వారు అనికూడా అంటారు.

    సంఘపరివార్‌ విధేయుడిగా తనను తాను రుజువు చేసుకున్న స్వామి హార్వర్డ్‌ ఆర్ధిక శాస్త్రవేత్త. ఎవరికి వుపయోగపడతారన్నది వేరే విషయం. ఆయన బదులు ఒక న్యాయవాది అయిన అరుణ్‌ జెట్లీని ఆర్ధిక మంత్రిగా తీసుకున్నపుడు స్వామిని ఎందుకు విస్మరించారని గతంలో చర్చ జరిగింది.డెబ్బయి ఆరు సంవత్సరాల సదరు స్వామి బిజెపికి నష్టం చేస్తాడా, లాభం చేకూరుస్తాడా? అసలు ఆయనను రాజ్యసభకు ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఇప్పుడు చర్చ కావటం కూడా స్వామి ప్రత్యేకతల్లో ఒకటి. జెట్లీ -స్వామి వుప్పునిప్పులా , ఒక గదిలో ఎవరో ఒకరు మాత్రమే వుంటారని చెబుతారు. అలాంటిది ఇప్పుడు రాజ్యసభలో జెట్లీ నాయకత్వంలో స్వామి పనిచేయాల్సి వస్తోంది. తాను నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు ఆరు అంశాలతో కూడిన లేఖను ప్రభుత్వానికి రాశానని, ఆర్ధిక మంత్రి తీసుకున్న చర్యలను చూస్తే నల్లధనం వెనక్కు రాదని ఆరునెలల క్రితం జైట్లీపై ధ్వజమెత్తిన స్వామి, తనకు బాధ్యతలు ఇస్తే ఆరునెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని అయితే మనకు ఒక ఆర్ధిక మంత్రి ఇప్పటికే వుండి పోయారే అని వ్యంగ్యంగా అన్నారు. తన జనతా పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు జైట్లీ అడ్డు పడ్డారని, తరువాత 2014 ఎన్నికలలో న్యూఢిల్లీ నుంచి పోటీ చేసేందుకు సీటు రాకుండా చేశారని స్వామి మండిపడుతూ వుంటారు.

    ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయినా స్వామిని నామినేట్‌ చేయటానికి నరేంద్రమోడీ ఎందుకు సుముఖత చూపారన్నది ప్రశ్న. బిజెపిలో అరుణ్‌ జైట్లీ వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ శిష్యుడు అన్నది బహిరంగ రహస్యం. అంటే నరేంద్రమోడీకి వ్యతిరేకం కాకపోయినా అనుకూలం కాదు.మోడీకి తగినంత ఆంగ్ల పరిజ్ఞానం లేని కారణంగా ఎవరైనా విదేశీయలు, ఇతర ప్రముఖులు వచ్చినపుడు అంతా అరుణ్‌జెట్లీ మాట్లాడతారని చెబుతారు. రెండవది తనకు వ్యతిరేకంగా పార్టీలో, ప్రభుత్వంలో మరొక అధికార కేంద్రం ఏర్పడకుండా చూసుకోవాలని నిరంతరం మోడీ చూస్తుంటారని వార్తలు. సుబ్రమణ్యస్వామి పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రత్యేక అభిమానం చూపే వారు వున్నారని మోడీకి తెలుసు. అందువలన అటు వారిని సంతృప్తి పరచటానికి, ఇటు జైట్లీను అదుపులో వుంచటానికి సుబ్రమణ్యస్వామి తగిన వ్యక్తని భావించారని విశ్లేషణ.ఇదే కోవకు చెందిన వారు ఇంకా అరుణ్‌ శౌరీ, రామ్‌జత్మలానీ, యశ్వంత సిన్హా వంటి వారు ఇంకా వున్నారు. వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తారా ? వారి నోరు మూయించకపోతే బిజెపిని విమర్శించటానికి ప్రతిపక్షాలు అవసరం లేదని ఇంతకు ముందే వారు తమ సత్తా ఏమిటో వెల్లడించుకున్నారు.

    సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు అనేక విషయాలను ఆఫ్‌ ద రికార్డు అని చెప్పి మరీ విలేకర్లకు ఎంతో వినోదంతో పాటు అనేక వాస్తవాలు చెబుతారు. సుబ్రమణ్యస్వామి సాఫ్ట్‌వేర్‌లో ఆఫ్‌ ద రికార్డు లేదు, దేన్నీ దాచుకోరు. తనకు ఆర్ధిక మంత్రి పదవి, బ్రిక్స్‌ బ్యాంకు గవర్నర్‌ పదవి, జెఎన్‌యు వైస్‌ ఛాన్సలర్‌ పదవి ఇస్తామని వాగ్దానం చేశారని స్వయంగా చెప్పారు. పేరు మోసిన కోర్టు పక్షిగా ప్రాచుర్యంలోకి వచ్చిన సుబ్రమణ్యస్వామి ఎప్పుడో ఎవరూ దొరకనపుడు తన మీదే ఒక కేసు వేసుకున్నా ఆశ్చర్యం లేదని జోక్స్‌ వెలువడ్డాయి.

    రాజ్యసభలో తొలిసారిగా నోరు విప్పి అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా గాంధీ పాత్ర గురించి మాట్లాడి సభ వాయిదాకు కారకుడైన స్వామి తన చర్యకు ఏ మాత్రం విచార పడలేదట.నేనేదో మంచి బాలుడిని అనా నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసింది అని తోటి సభ్యుడితో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో కాంగ్రెస్‌ ముఖ్యంగా సోనియా గాంధీపై దాడి చేస్తున్న స్వామిని భీష్ముడిపై దాడికి శిఖండిని వినియోగించినట్లే రాజ్యసభలో బలంగా వున్న కాంగ్రెస్‌పై దాడికి సుబ్రమణ్యస్వామిని ఆయుధంగా వాడుకోవాలని బిజెపిలోని ఒక బలమైన తరగతి కోరుకుందట. ఇలాంటివారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు వడ్డీతో సహా చెల్లిస్తాం, కేవలం మాపై దాడి కోసమే రాజ్యసభకు నామినేట్‌ చేశారు. అని కాంగ్రెస్‌ ఎంపి ఒకరు వ్యాఖ్యానించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి సమావేశాలలో నరేంద్రమోడీ భజన

21 Monday Mar 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP National executive meet, Congress, Modi, narendra modi namo mantra

సత్య

   న్యూఢిల్లీలో శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం జాతీయ వాదం, భారత మాతాకీ జై, అభివృద్ధి గురించి జపం చేసిందన్నది మీడియా వార్తల సారాంశం. అభివృద్ధి, అభివృద్ధి, మరింత అభివృద్ధి మీద కేంద్రీకరించాలి తప్ప ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఇతర అంశాల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్రమోడీ నొక్కి వక్కాణించినట్లు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన హోంమంత్రి రాజనాధ్‌ సింగ్‌ చెప్పారు. గత ఇరవై రెండు నెలల బిజెపి కేంద్ర పాలన తీరును చూస్తే అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు బిజెపికి ఏమైనా వుందా ? ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ఐదు చోట్లా బిజెపికి ఎక్కడా అవకాశాలు లేవన్నది స్పష్టం. పార్లమెంట్‌ ఎన్నికలలో అసోంలో అది పొందిన ఓట్లను బట్టి అక్కడ పెద్ద పార్టీగా అవతరించవచ్చని కొంతమంది వూహాగానాలు చేస్తున్నారు, బిజెపి కూడా అదే ఆశతో వున్నట్లు కనిపిస్తోంది. చిత్రం ఏమిటంటే అక్కడ మోడీని ముందు పెడితే ప్రయోజనం లేదనుకుందో ఏమో ముందుగానే ముఖ్య మంత్రి అభ్యర్ధిని ప్రకటించింది. దీని వలన ఫలితం ఎలా వున్నా ఏ విధంగా అయినా భాష్యం చెప్పుకోవచ్చు. మోడీని ముందు పెడితే ప్రతికూల ఫలితాలు వస్తే మరింత పరువుపోవటం ఖాయం కనుక ఇలా చేశారని చెబుతున్నారు.

  భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయ విమర్శలను తాము అంగీకరిస్తామని కానీ స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలను అంగీకరించేది లేదని రాజనాధ్‌ సింగ్‌ రాజకీయ తీర్మానం గురించి వివరించారు.భారత మాతాకి జై అంటేనే జాతీయ వాదం, దేశ భక్తి అనే విధంగా జాతీయ వాదానికి బిజెపి తాజా వ్యాఖ్యానం చెప్పటం జర్మనీలో హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నది.

   బిజెపి జాతీయ కార్యవర్గంలో నిజంగా ఏం చర్చించారో, ఎవరు ఏం మాట్లాడారో మిగతావారు వినలేదా ? అంటే సమాధానం చెప్పటం కష్టం. రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారు.దాని గురించి మరో మంత్రి ఆరుణ్‌ జైట్లీ విలేకర్లకు వివరించారు. వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారన్న సమాచారం తప్ప ఆయనేం మాట్లాడారనే అంశాన్ని కనీస ప్రస్తావన కూడా చేయలేదు. అంతకు ముందే వెంకయ్య నాయుడు తన ప్రసంగంలోని అంశాలంటూ మీడియాకు ఇమెయిల్‌ ద్వారా పంపారు. దానిలో ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు. ఇదే విషయం గురించి హోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను అడగగా వెంకయ్యగారు చెప్పిన వాటితో అంగీకరించటానికి గానీ కాదనటానికి గానీ తానసలు వెంకయ్య వుపన్యాసం వినలేదని భట్టిప్రోలు పంచాయతీ తీర్పు చెప్పారు.

    ఇంతకీ వెంకయ్య ఏం చెప్పారు? ఆయన మీడియాకు పంపిన ఇమెయిల్‌ ప్రకారం ‘మోడీ దేశానికి ఒక వరం, దేవుడు పంపిన పేదల రక్షకుడు, మోడీ పేరు ప్రతిష్టలు నూతన స్ధాయికి చేరాయి.లండన్‌లోని మాడమే టుస్సాడ్స్‌లో మోడీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోటీ ఎనభైలక్షల మంది ట్విటర్‌ అనుచరులు, మూడు కోట్ల ఇరవైలక్షల మంది ఫేస్‌బుక్‌ లైక్‌లతో ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకుడు మోడీ. అభివృద్ధి చెందుతున్న భారత్‌ను రూపాంతరం(మోడి ఫయర్‌) చెందించిన వ్యక్తి. ఇలా సాగింది వెంకయ్య గారి మోడీ స్త్రోత్రం. మోడీ పేదలకు బదులు పెట్టుబడిదారుల రక్షకుడని కాంగ్రెస్‌ ఎత్తి పొడిచింది.

   ఈ పొగడ్తల గురించి మీడియా ముందు జెట్లీ లేదా రాజనాధ్‌ సింగ్‌ చెప్పరని వెంకయ్యకు బాగా తెలుసు.అందుకే తన మీడియా మేనేజ్‌మెంట్‌ పద్దతులలో ప్రసంగ అంశాలను మీడియాకు ముందే పంపారు.ఈ భజన చూస్తే అత్యవసర పరిస్థితి సందర్భంగా ఇందిరే ఇండియా ఇండియా ఇందిర అని కాంగ్రెస్‌ నేత డికె బారువా చేసిన పొగడ్తలు గుర్తుకు వస్తున్నాయి. దాని గురించి ఆ నాడు జనసంఘంగా వున్న నేటి బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నేడు వెంకయ్య పొగడ్తలు అంతకు తక్కువేమీ కాదు.

   మోడీని వ్యతిరేకించే ఎల్‌కె అద్వానీ ప్రియశిష్యుడిగా పేరు పొందిన వెంకయ్య నాయుడు పార్టీలో నరేంద్రమోడీ ప్రాభవం పెరగ్గానే ఇటువైపు ఫిరాయించారు. తన స్వామి భక్తిని నిరూపించుకొనేందుకు మోడీని పదే పదే పొగడటంలో వెంకయ్య పేరు మోశారు. తాజా సమావేశాలలో ఆయన పొగడ్తల గురించి రాజనాధ్‌ సింగ్‌ గాలి తీయటం, దానిని జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొని వ్యాఖ్యానాలను రాయటం బహుశా వెంకయ్య నాయుడు వూహించి వుండరు. నరేంద్రమోడీ మోడీని పొగడటంలో కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు.

    ఈ సమావేశాలకు ముందు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో నరేంద్రమోడీ 2026 వరకు ప్రధానిగా పదవిలో కొనసాగుతారని 1555లోనే ఫ్రెంచి జోస్యుడు నోస్ట్రాడామస్‌ చెప్పారని ఒక పోస్టును పెట్టాడు. మోడీ భారత్‌ను స్వర్ణయుగంలో ప్రవేశపెడతారని, అనేక దేశాలకు రక్షణ కల్పించే దేశంగా భారత్‌ ఎదుగుతుందని పేర్కొన్నాడు. ‘ 2014 నుంచి 2026 వరకు మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి భారత్‌కు నాయకత్వం వహిస్తాడని, ఆయనను తొలుత జనం ద్వేషించినా, తరువాత ఎంతగానో ప్రేమిస్తారని దేశ దశ, దిశను ఆయన మారుస్తాడని, ఆయన నాయకత్వంలో భారతదేశమే గాక మొత్తం ప్రపంచం స్వర్ణయుగంలో ప్రవేశించటమే గాక ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుందని ‘ జోస్యం చెప్పినట్లు రిజు పేర్కొన్నారు.

   సాధించిన విజయాలేమీ లేనపుడే ఇలాంటి పోసుకోలు కబుర్లతో నాయకత్వాన్ని పొగుడుతూ కాలక్షేపం చేయటం అన్ని పాలకవర్గ పార్టీలలో వున్న ఒక వుమ్మడి లక్షణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d