• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: tdp

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు-వైఎస్‌ జగన్‌ తిట్ల దండకంలో ఎవరిది తప్పు, ఒప్పు

05 Sunday Jun 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

   ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటంపై రెండు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కవి చౌడప్పకు సమాజం మీద కోపం వచ్చి తిట్లదండకం రచించారు. మరి ఈ పార్టీల వారికి ఏమి వచ్చి అందుకు పాల్పడుతున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ప్రత్యేకించి తెలుగుదేశం-వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు కొన్ని సార్లు సభ్యతగా మాట్లాడినపుడు మాట్లాడుతున్నది మనవారే అని వారి అభిమానులకే అనుమానం వస్తుంది, నీరసపడిపోతారు. రాజకీయాలంటే తిట్లు, నిందలుగా తయారు చేసి కార్యకర్తలకు, జనానికి గంజాయి దమ్ము వంటి కిక్కు ఎక్కించారు. అది లేకపోతే డీలా పడిపోతారు. దొందూ దొందే అన్నట్లు ఎవరూ తక్కువ కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తిట్లకు దిగటం అంటేనే విమర్శలలో పసలేక వాటిని ఆశ్రయిస్తున్నారని లేదా అసలు విషయాల నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారని అనుకోవాలి.

    ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పులతో కొట్టాలని అది బాగాలేదంటే చీపుర్లతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటం కొంత మందికి వినోదంగా మరికొందరికి అభ్యంతరంగా కనిపిస్తోంది. అదే చంద్రబాబు , తెలుగుదేశం మంత్రులు, నేతలు జగన్‌ను నేరస్థుడు, దొంగ వంటి ఎన్నో పద ప్రయోగాలు చేసినపుడు కూడా పైన చెప్పిందే జరిగింది. అందువలన ఎవరు ఎవరిని తప్పుపట్టాలి? వారికి వారు కూర్చుని నిర్ధారించుకుంటే తప్ప దీనిని ఎవరు ముందు ప్రారంభించారని తేల్చటం కూడా కష్టమే. ఒక ప్రముఖుడిని చెప్పుతో, చీపుర్లతో కొట్టాలి అని విమర్శించటం చట్టవిరుద్దమా, సభ్య సమాజంలో పలకాల్సిన మాట కాదా ? కానీ ఏ నేరం రుజుకు కాకుండానే ఒకరిని నేరస్ధుడు అని వర్ణించటం చట్ట బద్దమా ? జగన్‌ కొట్టాలి అన్నారు, కానీ తెలుగు తమ్ముళ్లు అనంతపురం జిల్లాలో ఏకంగా చెప్పులతో దాడి చేసి కొట్టి చూపించారు. ఏది మంచో ఏది చెడో ఎవరూ వినే పరిస్థితి లేదు. ఒక అసహ్యకర పరిస్థితిని రెండు పార్టీలూ సృష్టించాయన్నది మాత్రం స్పష్టం. దాని నుంచి వెనక్కు తగ్గే చైతన్యం, సంస్కారాన్ని ఎవరు ముందు ప్రదర్శిస్తారో చూడాలి.

    చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేలతో కలసి సంఖ్యా పరంగా ఎంతో బలంగా కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా రాజకీయంగా ఎంతో బలహీనపడి పోయారు.ఎప్పుడైతే కేంద్రం నుంచి ఆశించింది రాకపోవటంతో శాశ్వత రాజధానికి అట్టహాసంగా శంకుస్థాపన చేసి తాత్కాలిక రాజధానిపేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలను తగలేస్తున్నారో అప్పుడే చంద్రబాబు బలహీనత వెల్లడైంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వూరించిన పాకేజీకీ కూడా గతి లేకపోయింది. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని కనీసం సానుకూల విమర్శలు కూడా చంద్రబాబు చేయలేకపోయారు. తన ఎంఎల్‌ఏలు ఒక్కొక్కరుగా జారిపోతుంటే జగన్‌ నిస్సహాయుడై గుడ్లప్పగించి చూస్తూ సంఖ్యా పరంగా బలహీనపడిపోయారు. పోయినవారు పోగా ఇంకా ఎంత మంది మిగులుతారన్నది ప్రశ్న. అయితే ఇదే సమయంలో చంద్రబాబు తన వాగ్దానాలు, విజన్‌ రంగుల కలలు మసకబారి పోయేకొద్దీ ఆ బలహీనతను ఆధారం చేసుకొని రాజకీయంగా దాడి చేయటానికి రాబోయే రోజుల్లో జగన్‌కు ఇంకా అవకాశాలు పెరగవచ్చు. కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు విమర్శ చేయకుండా చంద్రబాబుకే పరిమితమైతే జనం మెచ్చరని, అనుమానిస్తారని జగన్‌ గుర్తించాలి.

    బిజెపి నేతలు ఒకవైపు తమ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశమంతటా సభలు, ప్రదర్శనలు పెడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విభజన కారణంగా తాము నష్టపోయామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పునర్‌నిర్మాణం పేరుతో దీక్షలను పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విజయాలు దానికి కనిపించే స్ధితి లేదు.అలాగే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూసే స్ధితిలో బిజెపి నేతలూ లేరు. ఈ తరుణంలో కోరని వరంలా జగన్‌ విమర్శలు తెలుగుదేశం పార్టీ వారి నోళ్లకు పని చెప్పి వుత్సాహాన్ని నింపాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో చేశానని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె స్ధానాన్ని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అలంకరించారు. రైల్వే ప్రత్యేక జోన్‌ ఎలాగూ ఇచ్చే, వచ్చే పరిస్ధితి కనిపించటం లేదు, కనీసం దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న రైల్వే ప్రాజెక్టులలో రానున్న మూడు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి అయినా మద్దతు ఇచ్చి అందలం ఎక్కించినందుకు చంద్రబాబు జన్మ ధన్యమైనటే.్ల .

Share this:

  • Tweet
  • More
Like Loading...

చాలు చంద్రన్నా చాలు !

31 Tuesday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, chandranna, nirmala sita raman, Rajyasabha, suresh prbhu, tdp, Venkaiah naidu, ysrcp

సత్య

   కింద పడ్డా గెలుపు నాదే అని తన వాక్చాతుర్యంతో తనను తాను సమర్ధించుకోగల నేర్పరి ముప్పవరపు వెంకయ్య నాయుడు అని తెలుగు వారందరికీ తెలిసిందే. అయితే కర్ణాటక నుంచి గత పద్దెనిమిది సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యుడిగా వుండి కన్నడిగులను మెప్పించటంలోనూ, ఒప్పించటంలోనూ బొక్కబోర్లా పడ్డారు. ఒక్కసారి కూడా ఎగువ సభలో కర్ణాటక గురించి మాట్లాడలేదు వెంకయ్యా సాకయ్యా (వెంకయ్యా ఇక చాలయ్యా అని అర్ధం) అంటూ అక్కడి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్బంగా అంతా తానే అయి పార్లమెంట్‌లో ఎంత హడావుడీ చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా చూశారు. తీరా ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరుతో ఆంధ్రప్రదేశ్‌ జనం మూగవారిని చూసి ముక్కు గిల్లితే ఎంత ఆగ్రహం వ్యక్తం అవుతుందో వెంకయ్య నాయుడి మీద బిజెపి మీదా అదే రీతిలో జనం ఆగ్రహంతో వున్నారు. అందువలన ఆంధ్రప్రదేశ్‌ నుంచి సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు నాయుడికి సుతరామూ అంగీకారం వుండదు.దాంతో తట్టా బుట్టా సర్దుకొని బతుకుజీవుడా అంటూ రాజస్థాన్‌లో పాగా వేసేందుకు వెళ్లి పోయారు.

     ఇక నిర్మలా సీతారామన్‌ ఆమె తెలుగింటి ఆడపడుచు అని రాజ్యసభ కట్టబెడితే మంత్రిగా తెలుగు రాష్ట్రానికి ఫలానా ప్రయోజనం చేకూర్చామని చెప్పుకోవటానికేమీ లేదు. మెట్టినింటికి వచ్చి కూడా పుట్టింటి తరఫున మాట్లాడినట్లుగా ప్రత్యేక హోదా విషయంలో తమిళనాడు పక్షాన మాట్లాడినట్లు ఆమెపై ఆరోపణలు వున్నాయి. అందువలన ఆమెకు మరోసారి అవకాశమిస్తే చంద్రబాబుకు పరువు దక్కదు. ఇక్కొడక బిజెపి పిట్టకధ చెప్పాలి. అక్కడి బిజెపి నేతల వర్ణనల ప్రకారం నిర్మలా సీతారామన్‌ ‘ కర్టాటక దా సోస్‌’ కర్ణాటక కోడలు. అదెలా అంటే ఆమె భర్త పరకాల ప్రభాకర్‌ కొంత కాలం కర్ణాటకలో వున్నారట. కన్నడ వాదులను ‘సంతృప్తి’ పరచే చౌకబారు వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇక రాష్ట్రానికి అనేక విషయాలలో రిక్త హస్తం చూపినా కేంద్ర ప్రభుత్వం, బిజెపితో బంధాన్ని తెంచుకొనేందుకు సిద్ధంగా లేరని మూడవ సీటును బిజెపి సురేష్‌ ప్రభుకు ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు స్పష్టం చేశారు. పోనీ ఈ పెద్ద మనిషి ఏమైనా రాష్ట్రం పట్ల సానుకూలంగా వున్నారా అంటే వాగ్దానం చేసిన రైల్వే జోన్‌ కూడా ఇచ్చేది లేదని ఇప్పటికే సంకేతాలు పంపారు. అయినా చంద్రబాబు ఈ ప్రభువును ఆంధ్రప్రజల నెత్తిన ఎక్కించేందుకు పూనుకున్నారు.

    తెలుగు దేశం పార్టీ గ్యారంటీగా గెలుచుకొనే రెండు రాజ్యసభ స్ధానాల విషయంలో రుణ ఎగవేత ఆరోపణలున్న సుజనా చౌదరికి ఇవ్వటం ద్వారా చంద్రబాబు తన ‘క్లీన్‌ ఇమేజ్‌’ ను మరింత పెంచుకున్నట్లయిందని. రెండో సీటు ఎస్సీలకా, బీసిలకా అని ఊరించి, లీకుల కధనాలు రాయించి పక్కా ‘రాజకీయ’ వ్యాపారి టీజీ వెంకటేష్‌కు విక్రయించి తెలుగుదేశం కంపెనీని లాభాల బాటలో నడిపే పక్కా సిఇఓగా చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆకర్షించిన ఎంఎల్‌ఏలతో నాలుగో సీటుకు స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దించి వైఎస్‌ఆర్‌సిపిని మరింత దెబ్బతీసేందుకు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. విజయం సాధిస్తే లోకేష్‌ బాబు వ్యూహానికి దక్కిన ఘనతగాను, వికటిస్తే దాన్ని ఫిరాయింపు ఎమ్మేల్యేల ఖాతాలో వేయ వచ్చు. ఇవన్నీ చూసిన తరువాత ఇక చాలు చంద్రన్నా, ఇకనైనా రాజకీయాలు మాని కాస్తయినా జనానికి మేలు చేయమని జనం అంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహానాడు జయప్రదంగా జరిగింది, అయితే ఏమిటి ?

30 Monday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, CHANDRABABU, Nara lokesh, tdp, tdp mahanadu, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   తిరుపతిలో తెలుగుదేశం మహానాడు మూడు రోజుల సువార్త కూటములు ముగిశాయి. రాష్ట్ర దేవదూత చంద్రబాబు నాయుడు అన్నీ తానే అయి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులకు సందేశాలను అందచేశారు. ఇదే సమయంలో కేంద్ర దేవదూత నరేంద్రమోడీ ప్రభుత్వ విజయ గానోత్సవాలు దేశమంతటా ప్రారంభమయ్యాయి. అయితే ఏమిటి అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకటం లేదు. తిరుపతిలో మిగిలిపోయిన తీర్మానాలు లేదా అక్కడ చేసిన వాటినే పునరుద్ఘాటిస్తూ జూన్‌ రెండున విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసలు సమస్యల గురించి తేల్చకుండా ఎన్ని దీక్షలు చేసినా ఆ ప్రాంతంలో జనాన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురిచేయటం తప్ప సాధించేదేమీ వుండదు. గతేడాది దీక్ష ఫలితంగా ఏం సాధించారో చెప్పి ఈ ఏడాది ఎందుకు చేస్తున్నారో చెబితే అర్ధం వుంటుంది.

    ఇటు చంద్రబాబు మూడు రోజుల ప్రసంగాలు, ఆయన వంది మాగధుల స్త్రోత్రాలు, అటు కేంద్రంలో నరేంద్రమోడీ వుపన్యాసాలు, భజనపరుల కీర్తనలు అతిశయోక్తులతో నిండి దాదాపు ఒకే విధంగా వున్నాయి. సందేశ, వుపదేశ, భజన వ్యూహాలను బహుశా ఒకటి కొంటే ఒకటి వుచితం అన్నట్లుగా ఒకే నిపుణుల బృందం రెండు చోట్లా సమకూర్చి వుండాలి. చేసిన పనులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా పెద్దవి చేసి చెప్పటం (తమపాలనలో దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారం చేసి 2004 ఎన్నికలలో ఆరిపోయిన విషయాన్ని నరేంద్రమోడీ, చంద్రబాబు మరిచి పోయి లేదా గోబెల్స్‌ను ఆదర్శంగా అయినా తీసుకొని వుండాలి), ఆత్మస్తుతి, పరనిందలతో మోతెక్కించారు. కాంగ్రెస్‌ తన ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నదని మోడీ చెబితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తమ పాలనకు ఆటంకం కలిగిస్తున్నదని తెలుగుదేశం మహానాడు తీర్మానించింది. వాస్తవం ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు, వైఎస్‌ఆర్‌సిపికి వున్నా ప్రయోజనం లేని పార్టీగా కనిపిస్తున్నది. అవ్వతో వసంత మాడినట్లు రెండు చోట్లా రెండు సంవత్సరాల తరువాత కూడా వాటిపై దాడి చేస్తూ కాలం గడుపుతున్నారు. తన ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైనా వుంటే చూపమని ఢిల్లీలో మోడీ సవాలు విసిరితే, తన ప్రభుత్వంలో అవినీతి లేదుకను రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నానని చంద్రబాబు, తన మీద అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే తానే వెళ్లి జైల్లో కూర్చుంటానని కుమారుడు నారా లోకేష్‌ తమ ప్రసంగాలలో చెప్పారు.

    ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు( లోకేష్‌ తొమ్మిదో, పదో చదువుతుండగానే 1996లో తాత్కాలిక మైన ప్రధాని పదవి చేపట్ట వద్దని తనకు సలహా యిచ్చినట్లు చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా విలేకర్లతో ఇష్టాగోష్టిగా వెల్లడించారని వార్తలు)కుమారుడు లోక్‌ష్‌, మంత్రులు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో తిరిగి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో రాయితీలు వస్తాయి గనుక రా రమ్మని ఆహ్వానాలు పలికి వచ్చారు. ఇప్పుడు అది రాదని తేలిపోయింది. పాండవులకు చివరకు ఐదూళ్లు కాదు కదా సూది మోపినంత స్ధలం కూడా ఇవ్వం అని కౌరవులు స్పష్టం చేసినట్లుగా ఏపికి ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక పాకేజి కూడా సాధ్యం కాదని బిజెపి వారు తేల్చిపారవేశారు. మరి ఇప్పుడేమి చేస్తారు?

    పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదాకు ఆటంకంగా వున్నాయని పిట్టకధలు చెబుతున్నారు. అటువంటపుడు ఆ నిబంధనలు ప్రత్యేక పాకేజికి కూడా ఆటంకమే కదా. లేకుంటే గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదు. పోనీ ఇప్పటికైనా సూటిగా ఎందుకు తేల్చరు? ప్రపంచంలో పెట్టుబడులు ఎక్కడ లాభం వుంటే అక్కడకు తరలుతాయి. టాటా తన నానో కార్ల ఫ్యాక్టరీని బెంగాల్‌ నుంచి భారీగా రాయితీలు ఇచ్చిన గుజరాత్‌కు తరలించారు. మిగతా రాష్ట్రాలు పోటీ పడలేకపోయాయి. వుమ్మడిగా వున్నపుడే ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడలేక అనేక పరిశ్రమలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పోయేట్లు చేసింది. ఇప్పుడు అసలే ఇబ్బందుల్లో వున్న స్థితిలో స్వంత నిధులతో రాయితీలు ఇచ్చి ఆకర్షించటం సాధ్యమయ్యేదేనా ? కేంద్రం ఇతర రాష్ట్రాలలో వెనుక బడిన ప్రాంతాలకు ఇస్తున్న మాదిరే ఆంధ్రప్రదేశ్‌కూ ఇస్తున్నది తప్ప దయా దాక్షిణ్యం కాదు, లోటు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని కూడా కేంద్రం నెరవేర్చటం లేదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ఈ స్ధితిలో వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మహానాడు ఇచ్చిన సందేశం లేదా భరోసా ఏమిటి ?

   తెలుగు దేశం మహానాడు జరుగుతున్న కాలంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాదు పర్యటనకు వచ్చారు. తెలుగు దేశం పార్టీ 2019 తెలంగాణాలో అధికారానికి రావాలని తీర్మానం చేసిన సమయంలోనే తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని అమిత్‌ షా తెలంగాణా బిజెపికి దిశానిర్ధేశం చేశారు. అంటే తెలుగు దేశం పార్టీని పక్కకు నెట్టేయమనేగా ? ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నేతలు పదే పదే మాట్లాడుతున్నదేమిటి ? దేశమంతటా చెబుతున్నదేమిటి? తమకు అవకాశం లేని చోట పాగా వేయటానికి ప్రాంతీయ పార్టీలను సోపానాలుగా చేసుకోవటం తరువాత, వాటిని పక్కన పెట్టి తమ చుట్టూ తిప్పుకోవటమేగా. మహారాష్ట్రలో బలంగా వున్న శివసేన, అసోంలో వున్న ఏజిపీలను బిజెపి అలాగే పక్కకు నెట్టివేయలేదా ? కర్ణాటకలో జరిగిందేమిటి ? తెలుగు దేశం పార్టీతో సఖ్యత తెగకొట్టుకున్నది తాము కాదనే పేరు తెచ్చుకోకుండా బిజెపి జాగ్రత్త పడుతున్నది. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ ఫినిష్‌ అయిందన్న అంచనాతోనే బిజెపి నేతలు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ వైఖరిని వెల్లడించేందుకు అది సమయం కోసం ఎదురు చూస్తున్నది. విజయోత్సవాలలో భాగంగా విజయవాడలో కూడా బిజెపి ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది.

     కేంద్రం ఇప్పటికే ఎంతో చేసింది, వాటికి లెక్కలు చెప్పాలంటున్న బిజెపి నేతలకు సమాధానంగా మహానాడులో ఇప్పటి వరకు జరిగిందేమిటో శ్వేత పత్రం ద్వారా వెల్లడించి వుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడి అయి వుండేవి. భక్తులు స్వామీజీల, బాబాల వుపన్యాసాలు వినేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళతారు. బోధనలు విన్నంత సేపు అలాగే వుండాలనుకుంటారు. ఇంటికి వచ్చిన తరువాత షరా మామూలే. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు, జనానికి వుపన్యాసాలతో చంద్రబాబు బోధలు చేసి పంపారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల పధకాల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, ప్రత్యేక హోదా రాకపోవటం, లోటు భర్తీకి చర్యలు తీసుకోకపోవటం, రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధులు ఇవ్వకపోవటం కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేసే మహానాడు ఈ విషయంలో ఆలోచించిన ప్రత్యామ్నాయం ఏమిటి ? 2050వరకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలో వుండాలని వూదరగొట్టటంద్వారా యువతకు వుద్యోగాలు వస్తాయా ?అవినీతి, కేసుల గురించి వూకదంపుడుగా చెప్పటమే తప్ప సత్వర విచారణకు తీసుకున్న చర్యలు లేవు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లేదా తండ్రీ ,కొడుకులు ప్రతిపక్ష నేతపై ఎంత కాలం శాపనార్ధాలు పెడుతూ, తిట్టిపోస్తూ ఎంత కాలం గడుపుతారు? దాని వలన రాష్ట్రానికి ఒరిగేదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాచ్‌మన్ల జాతి పిత నరేంద్రమోడీ

29 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, Literature., Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, tdp, tdp mahanadu, telugudesam, YS jagan

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిననూ పోయి రావలె హస్తినకు…..

18 Wednesday May 2016

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Chandrababu Delhi mission, Narendra Modi, special status to Andhra pradesh, tdp

చంద్రబాబు ఢిల్లీ యాత్ర విఫలం !

ఎం కోటేశ్వరరావు

   అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మరోసారి హస్థినాపురి పర్యటనకు వెళ్లి వచ్చారు. జూదంలో ఓడిపోయిన పాండవులకు చివరకు ఐదు వూళ్లు కాదుకదా సూదిమోపినంత స్థలం కూడా ఇచ్చేది లేదని కౌరవులు చెప్పినట్లుగా కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఎంతో స్పష్టంగానే చెప్పారు. కాదని చెప్పటానికి మీరెవరు. అవునన్నా కాదన్నా అగ్రజుడితోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకుంటా అన్నట్లగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, తిరిగి వచ్చారు. సాధించేదిమిటి అన్నది అర్ధంగాక రాష్ట్ర జనం జుట్టుపీక్కుంటున్నారు. తెలుగుదేశం వీరాభిమానులు కూడా వారిలో వుంటారు. కసు ఓడిపోయిన వారు కోర్టులోనే ఏడిస్తే గెలిచిన వారు ఇంట్లో ఏడ్చినట్లుగా వారు బయట పడరు అదే తేడా. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది విలేకర్లందరితో ఒకేసారి, ఒకటే అయినా ఒకే పత్రికను చదివితే ఆయనేం మాట్లాడిందీ పూర్తిగా తెలియని స్థితి.

    చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ పత్రిక ‘సాక్షి ‘(దాని ఆస్థులు ప్రభుత్వ ఆధీనంలో వున్నాయన్నారు కనుక) పత్రిక ‘ హోదాతో ఏం వస్తుంది ‘ అని చంద్రబాబు అన్నట్లు శీర్షిక పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ‘ ఆ రెండు ‘ పత్రికలలో ఒకటైన ‘ఆంధ్రజ్య్రోతి’ ‘కేంద్రానిదే బాధ్యత ‘ అనగా ‘ఈనాడు’ ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు ‘ అని ‘ప్రజాశక్తి ‘ చట్టంలోని అంశాలే ‘ అని పేర్కొన్నది. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే దింపుడు కళ్లం ఆశను కూడా చంద్రబాబు తీర్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక పెద్ద మలుపుకు నాంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం రాజకీయం ఏ రకంగా వుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్యూహాలు పన్నటానికి ప్రతి పార్టీ కొంత సమయం తీసుకోవచ్చు.లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఫోజు పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ వంటి వారు ఎలా లేస్తారు ? తెలుగుదేశం-బిజెపి తెగతెంపులు చేసుకుంటే పరస్పరం లాభమని భావిస్తాయా, కలిసి వుంటేనే కలదు సుఖం అనుకుంటాయా అన్నది స్పష్టం కావటానికి సమయం పట్టవచ్చు.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియనట్లు ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక పాకేజీ కూడా రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.గతేడాది రాజధాని శంకుస్థాపనకు ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక పాకేజిని అడిగినట్లు ప్రకటించి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత నష్ట నివారణ చర్యగా తాను పొరపాటున హోదాబదులు పాకేజి అన్నానని సవరించుకున్నారు. కేంద్రంపై వున్న భ్రమలు, దింపుడు కళ్లం ఆశతో వున్నారని అప్పుడే వెల్లడైంది. అందువలనే గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా కెలికితే తప్ప సాధ్యమైన మేరకు వాటి ప్రస్తావన రాకుండా చూసుకున్నారు, ఒక వేళ వచ్చినా బి పాజిటివ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. ఎంతైనా తెలివైన రాజకీయవేత్త కదా ! హోదా వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ వుండదని జనానికి, హోదారాకపోయినా కనీసం ఆర్ధికంగా మంచి పాకేజి ఇచ్చినా సరిపెట్టుకుంటామన్నట్లుగా కేంద్రానికి అనేక సంకేతాలు పంపారు. మరోవైపు రాజధాని నిర్మాణం, విదేశాల నుంచి భారీఎత్తున పెట్టుబడుల పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. ఎన్నిదేశాలు తిరిగినా ,ఎవరితో కూర్చున్నా వూసులు తప్ప కాసుల రాశులు రావటం లేదు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా ప్రతివారూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడుల కోసం పోటీ పడని రాష్ట్రం లేదని వారికీ అర్ధం అయింది. ఎవరైనా వూరికి దూరంగా ఇల్లు కడుతుంటే సామాన్లు వేసుకోవటానికి అవసరమైన తాత్కాలిక షెడ్డు వేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా తాత్కాలిక రాజధాని నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. అంటే శాశ్వత రాజధాని శంకుస్థాపన దగ్గరే ఆగిపోతుందన్నది స్పష్టం. తనను సవాలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోయినా తాను సృష్టించుకున్న సమస్యలే ఎంతో బలంగా చంద్రబాబును నిలదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

    ప్రత్యేక హోదా, ప్యాకేజీల వంటివి ఏమీ రాకపోయినా జనాన్ని ఏదో విధంగా జోకొట్ట వచ్చు, అందుకు గాను ముందు ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు చాణక్యంగా కనిపిస్తోంది. ఒక వేళ బిజెపి తనను వదలి పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే దానికి అంత సీన్‌ లేదని అందరికీ తెలుసు. అందులోనూ ఐదు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా అని పార్లమెంట్‌లోపలా, వెలుపలా హడావుడి చేసిన పార్టీ అది. చివరికి నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వకుండా బిజెపి ఏ మొహం పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళుతుంది.అందులోనూ దానిలో కాంగ్రెస్‌ ముఖాలే కనిపిస్తాయి. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్‌ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది, దానిని పునరుద్ధరించే నాయకత్వం కూడా లేదు. వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ విఫల ప్రతిపక్ష నేత. ఆ పార్టీని మరింతగా దెబ్బకొట్టటానికి ఒక పధకం ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తారని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగు దేశం పార్టీని కూడా ముఠాలతో మునిగి వుండే మరొక కాంగ్రెస్‌ పార్టీగా తయారు చేసినా ఒకరి జుట్టును మరొకరికి ముడివేసి తాను చక్రం తిప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సిపిని బలహీన పరిస్తే పరిపాలనలో తాను వైఫల్యం చెందినా మరొక ప్రత్యామ్నాయం వుండదు కనుక బొటాబొటా మెజారిటీతో అయినా జనం తమను తప్ప మరొకరిని ఎన్నుకొనే అవకాశం లేదన్న అంచనాతో వున్నట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ నేతలు వూహించిన విధంగా పరిణామాలు వుంటాయని చెప్పలేము. అందుకు ఒకసారి వెనక్కు తిరిగి చూడాలి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించినప్పటికీ సీట్లు పొందటంలో విఫలమైది. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరినీ కాంగ్రెస్‌ తనలో కలిపేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అయితే తెలుగు దేశం రూపంలో తన ఏకపక్ష పాలనకు తెరదించే రోజులు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం ఆనాడు కనీసంగా వూహించలేదు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిణామాలను పునరావృతం చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి దుకాణాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆయన వూహిస్తున్నట్లు లేదా చెబుతున్న విధంగా విధిలేక జనం తననే ఎన్నుకుంటారా ? ఊహించని విధంగా కొత్త శక్తులు రంగంలోకి వస్తాయా ? ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?

     దేశంలోని కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు చీవాట్లు వేసిన తరువాత కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు తప్ప ప్రత్యేక హోదా గురించి చర్చించటానికి కాదు అన్నది తెలుసుకోవాలి. ఈ సందర్బాన్ని చంద్రబాబు వుపయోగించుకొని ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక హోదా, ఇతర ఆర్ధిక సమస్యలను గురించి నివేదించారు. దీన్ని గురించి కూడా అధికారిక ప్రకటనేమీ లేదు. లీకుల సమాచారమే. ఎందుకంటే నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. వారి మధ్య ఏం నడిచిందన్నది ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ వెల్లడించి వుండాలి. ఈ భేటీ గురించి ఒక పత్రికలో ప్రధానితో చంద్రబాబు సూటిగా మాట్లాడారని రాశారు అంటే చేతులు నలుపుకోకుండా గట్టిగా అడిగారనే అర్ధం ధ్వనించే విధంగా. ఒక ప త్రిక పదినిమిషాలే సమయం ఇచ్చినప్పటికీ రెట్టింపు సమయం మాట్లాడినట్లు రాస్తే మరొక పత్రిక అరగంట సేపు అని రాసింది. ఏది నిజం.

   మొత్తం మీద హోదా, నిధుల గురించి నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు తెలుగు దేశం నాయకత్వానికి మార్గాలు వెతికేందుకు మరికొంత కాలం గడపవచ్చు. ఇప్పటికే తెలుగుదేశంపై ధ్వజమెత్తుతున్న బిజెపి రానున్న రోజులలో మరింతగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి నెపం మోపేందుకు ప్రయత్నించవచ్చు. మంగళవారం నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడిన అంశాల తీరు తెన్నులను చూస్తే బిజెపికి వ్యతిరేకంగా సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్న చంద్రబాబు మరి బిజెపి సంగతి ఏమిటంటే తాను ఎన్నికలపుడే రాజకీయాలు మాట్లాడతానని తప్పించుకున్నారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని మరొక మాట. మొత్తం మీద ప్రధానితో మాట్లాడిన తరువాత గందరగోళానికి, వత్తిడికి గురైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి.ఎవరికి ఏమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనవాదం ! మనువాదం !! అవకాశవాదం !!!

10 Sunday Apr 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, communist, Congress, CPI(M), K CHANDRA SEKHRA RAO, manuvadam, Narendra Modi, opportunism, pro people, RSS, tdp, trs

గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు.

   ఎం కోటేశ్వరరావు

      అటు కేంద్రంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి రెండు సంవత్సరాలు కావస్తోంది. వచ్చే నెలలో ద్వితీయ వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నాయి.ఈ రెండేళ్లలో వారు చేసిందేమిటో తెలియదు గానీ వసంతం రా ముందే కూసిన కోకిల మాదిరి వచ్చే ఎన్నికల రావాలు అక్కడక్కడా అప్పుడప్పుడు వినిపిస్తున్నారు. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఫిరాయింపుదారులు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మూడు ప్రభుత్వాలకు ముగ్గురు భిన్న పార్టీల వారు నేతృత్వం వహిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా మొత్తం మీద ఏ ఒక్కరూ తాము ఓటర్లకు చేసిన బాసలు మినహా మిగతా అంశాలపైనే, (అవి ఎవరికి లబ్ది చేకూర్చేవి అన్నది వేరే విషయం ) కేంద్రీకరిస్తున్నారు. ఇదంతా ముందే కూడ బలుక్కున్నారా లేక అధికారానికి వచ్చాక సమన్వయం చేసుకుంటున్నారా,లేక ముగ్గురూ ఒకతానులో ముక్కలేనా అంటే ఎవరికి వారు తమకు తాము అన్వయించుకోవచ్చు. ఫిరాయింపుదారులు కూడా పార్టీలతో నిమిత్తం లేకుండా నియోజక అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నట్లు ఒకే మాట చెబుతున్నారు. అంతిమ ఫలితం, మనకు కనిపిస్తున్నదే ముఖ్యం. మూడు పక్షాలకూ సంపూర్ణ మెజారిటీ వుంది, అన్నింటికీ మించి ఏ పార్టీలోనూ తిరుగుబాటు శక్తులూ, వున్నవారికి అంత సీనూ, శక్తీ లేదు. ఎందుకంటే అనేక అనుభవాల తరువాత నీకది, నాకిది అనే సర్దుబాటు మనస్థత్వం బాగా వంట బట్టించుకున్నారు గనుక ఎవరూ తెగించి కూర్చున్న వారిని కూలదోసేందుకు గద్దెల కాళ్లు లాగటం లేదు. అందుకే పుష్పక విమానాల్లా ఎంత మంది వచ్చినా ఒకరికి ఖాళీ అన్నట్లు ఎన్ని పార్టీల నుంచి, ఎన్ని ముఠాల నుంచి ఎందరు వచ్చినా మరొకరికి ఖాళీ కనిపిస్తోంది.అక్షయ పాత్ర మాదిరి జనం సొమ్ము ఎంత తిన్నా తరగటం లేదు. అందుకే ముగ్గురు నేతలూ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు ఎదురు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారే. అధికారంలో తాము మాత్రమే వుండాలి, ప్రశ్నించే వారెవరూ వుండకూడదు అనేది తప్ప నైతిక సూత్రాలు, రాజ్యాంగంపట్ల గౌరవం, భవిష్యత్‌ తరాలు తమను ఎలా భావిస్తాయి అనే అంశాన్ని ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇలా అనేక అంశాల విషయంలో వారి వ్యవహారశైలిలో ఏకీభావం కనిపిస్తోంది.

    గద్దె నెక్కిన తరువాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పని కంటే మాట్లాడటం ఎక్కువ చేసి వుండవచ్చు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు, జన్‌కీ బాత్‌తో సంబంధం లేని మన్‌కీ బాత్‌ తప్ప పనీ, మాట్లాడటం రెండూ ఆపి వుండవచ్చు. మోడీకి, బిజెపికి, ఇతర అనుబంధ సంఘాల వారికీ మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార నేతల మాటలు లేదా విధానాలను వెల్లడించే అనేక ప్రకటనలు పెరిగి తమ నిజమైన ఎజెండాను ముందుకు తెచ్చి వుండవచ్చు గానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో ముగ్గురు నేతలూ రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.

     ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, ఫిరాయింపులు, రాష్ట్రపతి పాలనల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా జాతీయ గీతంగా జన గణమన కంటే వందే మాతరం గొప్పది అన్న ప్రకటనల వంటి చరిత్ర చెత్తబుట్టలో వేసిన వాటిని పైకి తీసి సంఘపరివార్‌ తన అజెండాగా నడిపిస్తోంది. తొలుత వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించటం, తరువాత ప్రతిస్పందన తమకు వ్యతిరేకంగా వస్తే వాటిపై వివరణ పేరుతో తోకముడవటం. కానీ దాని అనుయాయులు మాత్రం మొదటి దానినే కొనసాగిస్తారు. ఇదంతా పిర్ర గిల్లి జోలపాడే చౌకబారు ఎత్తుగడలో భాగమే. భారత మాతాకీ జై నినాదం గురించే చూస్తే ఇది అర్ధంలేని వివాదమని అద్వానీ అంతటి కరడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదే కొట్టి పారవేశారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి కూడా ఆ నినాదాన్ని ఎవరికి వారు అనాలి తప్ప ఎవరిమీదా బలవంతంగా రుద్ద కూడదు అని సుద్దులు చెప్పారు. ఇదంతా జరిగిన తరువాతే మరో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌ ఆ నినాదం చేయనివారు దేశం విడిచి వెళ్లాలని సెలవిచ్చారు. ఇక బాబాగా చెప్పుకొనే రామ్‌దేవ్‌ చట్టాలు వుండబట్టిగానీ లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాడినని నోరు పారవేసుకుంటాడు. అలా మాట్లాడటానికి ఆయనకు వాక్‌ స్వాతంత్య్రం వర్తించదా అని బిజెపి అధిపతి అమిత్‌ షా సమర్ధిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలే ప్రారంభించాయని బిజెపి అధికార ప్రతినిధి ఎంజె అక్బర్‌ పచ్చి అవాస్తవాన్ని చెప్పారు.మార్చినెల మూడవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో మాతృశక్తి అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ యువతరానికి భారత మాతాకు జై అని నినదించటం నేర్పాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పది రోజులకు మజ్లిస్‌ నేత తాను అలా నినదించనని ఏం చేస్తారో చేసుకోండని రెచ్చగొట్టాడు. ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరుగుతున్నదీ చూస్తున్నాము. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు సైతం వాటి ఛాందసవాదాలు వాటికి ఎలాగూ వుంటాయి) పాలకవర్గ పార్టీలకు అవకాశవాదం తప్ప మరొకటి పట్టదు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా గురించి, బాబొస్తే జాబొస్తుందని తెలుగుదేశం, రాష్ట్రం విడిపోతే తెలంగాణా యువతకు వుపాధి పెరుగుతుందని టిఆర్‌ఎస్‌ ఏం చెప్పినా రంగుల పూసల్లో తెల్ల దారంలా ఒకటే . వివిధ పార్టీలు చెప్పిన అన్ని అంశాలనూ ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలన్నట్లు అనేక అంశాలతో ముడి పడి వున్న వుపాధి గురించి చూద్దాం.

    ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌,టిడిపి, టిఆర్‌ఎస్‌ వంటి పాలక పార్టీల భాష, పదజాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వాలు ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తమ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. వుదాహరణకు వుపాధి కల్పిస్తామని చెప్పటానికి బదులు వుపాధిని చూపుతామనే పదాలను వాడుతున్నాయి. వెంటనే బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటే యువతరంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మన యువతకు నైపుణ్యం తక్కువగా వుందనే ప్రచారం మొదలు పెట్టారు. అందుకు గాను నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని ఎక్కువగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు వున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. అలాంటి వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు ? వాటికి తగిన సిబ్బందిని నియమించకుండా, నిధులు ఇవ్వకుండా చేయటంతో పాటు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆ విద్యా సంస్ధలలో ఎక్కడో ఒకటీ అరా తప్ప అత్యధిక భాగం కేవలం డిగ్రీలు అమ్ముకొనే వ్యాపార సంస్ధలు తప్ప మరొకటి కాదని తేలిపోయింది.చివరకు వైద్య సంస్ధలు కూడా అదేపని చేస్తున్నాయి. అవి ఇచ్చే డిగ్రీలను పట్టుకొని బయటకు వచ్చే వారికి కనీస పరిజ్ఞానం కూడా వుండటం లేదని వెల్లడైంది. మరోవైపు అలాంటి పరిస్థితిని సృష్టించిన వారే మన యువతలో నైపుణ్యం లేదని నిందలు వేస్తూ తాము శిక్షణ కల్పిస్తామంటూ తయారయ్యారు. ఏమిటీ నాటకం ? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో అంటే పేరుకు యువతకు శిక్షణ ఆచరణలో ప్రయివేటు రంగానికి పరోక్షంగా ఆమేరకు ఖర్చు తగ్గించి లాభాలను పెంచటం తప్ప మరొకటి కాదు.

     ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు. తీరా చూస్తే రెండేళ్ల తరువాత ప్రధాని, కేంద్ర మంత్రుల , చంద్రబాబు నాయుడి వంటి ముఖ్య మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా దండగమారితనంగా తేలిపోయింది.

    తాము రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్‌లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్‌ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్‌ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంత ప్రహసంగా నడుస్తున్నాయో, నిధులు దుర్వినియోగం ఏ స్థాయిలో వుందో అందరికీ తెలిసిందే. ప్రతిదానిలో కుంభకోణం, కుంభకోణం.

     గతేడాది ఏప్రిల్‌ 17వ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్‌-జూన్‌లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్‌ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.

      ఈ ఏడాది మార్చి 31వ తేదీన హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరిగినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్‌ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు(తగ్గించటానికి పెట్టిన ముద్దు పేరు).ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు.

    కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్‌, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్‌-జూన్‌లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్‌ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. నరేంద్రమోడీని సంతృప్తి పరచటానికి ఇలా వ్యాఖ్యానిస్తే ఓకే. ఎనిమిది ప్రధాన రంగాలలోనే పరిస్థితి అలావుంటే మిగతా రంగాలలో గొప్పగా వుందని చెబుతుంటే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకు లేరు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్‌ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు

      వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.

    మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. మరి కొత్త ప్రతిపాదనల సంగతేమిటి ? నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు.ఇప్పుడు వాటి అర్ధమేమిటి ?

    ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు పెట్టటానికి, అవి వుత్పత్తి ప్రారంభం కావటానికి సమయం పడుతుంది. కానీ ఐటి కంపెనీలకు అలాంటి అవసరం లేదు. వుదయం కార్యాలయం ప్రారంభిస్తే సాయంత్రానికి వుత్పత్తి ప్రారంభించవచ్చు. అలాంటి మాజిక్‌ జరగటం లేదు. అన్నింటి కంటే అన్నింటి తాను అమెరికాలో కాలి నడకన తిరిగి హైదరాబాదులో ఐటి పరిశ్రమను అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాదులో పదిశాతం కంటే తక్కువే ఐటి వుద్యోగులు వున్నారు. బెంగలూరు నాలుగో వంతు వుద్యోగాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ స్ధానమెక్కడో వేరే చెప్పనవసరం లేదు. దేశంలో ఐటి రంగం 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్‌ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్‌ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్‌ కుమార్‌ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే బాబొస్తే జాబ్‌ అన్న నినాదం పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్ధిక సర్వే నివేదిక 2014-15 ప్రకారం 2014 నవంబరు నాటికి 1742 భారీ, మెగా పరిశ్రమలు రు.78,860 కోట్ల పెట్టుబడితో వుత్పత్తిలోకి వచ్చి 4,21,222 మందికి వుపాధి కల్పించాయి.2014-15లో 15 పరిశ్రమలపై 1875 కోట్ల రూపాయలతో 6814 మందికి వుపాధి కల్పించారు.ఇది గాక 1,06,504 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 11,65,102 మందికి 2014 మార్చి వరకు వుపాధి కల్పించాయి. వాటిపై పెట్టిన పెట్టుబడి 1,69,121 కోట్ల రూపాయలు.2014-15లో సెప్టెంబరు వరకు 2,263 కోట్లతో 25,175 మందికి వుపాధి కల్పించారు.

    చంద్రబాబు నాయుడు పూర్తి పాలన సాగించిన 2015-16 ప్రకారం రు.81,261 కోట్ల పెట్టుబడితో 1784 భారీ, మెగా పరిశ్రమలలో కల్పించిన వుపాధి 4,35,506 మందికి మాత్రమే. అంటే ఏడాది కాలంలో ప్రయివేటు రంగంలో సైతం అదనంగా కల్పించిన వుపాధి 14,384 మాత్రమే.ఈ మధ్య రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వుద్యోగాల గురించి ఆశలు పెట్టుకున్నవారు వాటి బదులు వేరే చూసుకోవటం మంచిదని ఒక ప్రకటనలో పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 6,97,621 కాగా వాటిలో 1,42,825 ఖాళీ వున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. మంజూరైన పోస్టులు 4,83,491కాగా ఖాళీలు 77,737 మాత్రమే అని తెలిపారు. వీటన్నింటినీ నేరుగా నింపటం జరగదని, ప్రమోషన్లు, ఇతర సేవల నుంచి బదిలీల ద్వారా నింపుతారని, అందువలన నేరుగా నింపేవి 20వేలకు అటూ ఇటూగా మాత్రమే వుంటాయని వెల్లడించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నింపాల్సిన పోస్టుల గురించి సమీక్ష జరపాలనుకుంటున్నామని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన పోస్టులను మాత్రమే నింపాలని ప్రస్తుత ఆలోచనగా వుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్వంత ఆదాయంలో 55శాతం వుద్యోగుల వేతనాలకు పోతున్నదని, ప్రభుత్వ రంగంలోనే వుపాధి కల్పించటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కానీ ఇదే మంత్రి నాయకత్వంలో 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికాంశాలపై శ్వేత పత్రం విడుదల చేసింది. దానిలో వుద్యోగుల వేతనాలకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో స్వంతాదాయంలో 58శాతం ఖర్చు కాగా మిగిలిన ఏపీలో అది 73 శాతానికి పెరుగుతుందని తెలిపారు. అందువలన అంకెలతో ఆడుకోవటంలో యనమల తన అనుభవన్నాంతా రంగరిస్తారనటంలో సందేహం ఏముంది?

    చివరిగా ఒక్క మాట. మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలపేరుతో వినాశకర సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు గడిచాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అశోక్‌ పార్ధ సారధి తాజాగా హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం జయప్రదం కావాలంటే 1991 దశకం తరువాత చేసిన నష్టాన్ని ముందుగా సరిచేయాలని నరేంద్రమోడీ సర్కార్‌కు సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ పైకి ఏమి చెప్పినా ఆచరణలో గతంలో వాజ్‌పేయి హయాంలో ప్రస్తుతం మోడీ ఏలుబడిలో అది విదేశీ ఆదరణ మంచ్‌గా మారిపోయింది. గత కాంగ్రెస్‌ పాలకులు విదేశీ ఐటి హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు స్వదేశీ హార్డ్‌వేర్‌ పరిశ్రమను దెబ్బతీస్తూ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి ముసుగులో విదేశీ హార్డ్‌వేర్‌ వుత్పత్తులపై పన్నులను తగ్గించి దిగుమతులకు తలుపులు బార్లా తెరిచారు. ఫలితంగా 1990 దశకంలోనే మన తయారు చేయగలిగిన వాటిని ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. మన సాప్ట్‌ వేర్‌ పరిశ్రమ దిగుమతి చేసుకున్న హార్డ్‌ వేర్‌ను అప్పటికే మన దేశంలో తయారు చేయగలిగి వున్నామని పార్ధ సారధి పేర్కొన్నారు. మన రక్షణ, అణు ఇంధనం, అంతరిక్ష సంస్ధలు వాటిని వుపయోగించటమే గాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు కూడా చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నూతన విధానాలు మన పరిశ్రమలను ఎలా దెబ్బతీసిందీ, దిగుమతులపై ఎలా అధారపడుతున్నదీ ఆయన సోదాహరణంగా పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రధాని వినిపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! ఎంత బాగా చెప్పిండో కదా !

04 Friday Mar 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, land scam, tdp, YS jagan, ysrcp

సత్య

   అబ్బో ఆ భూములన్నీ వారే దగ్గరుండి కొనిపించినట్లు, రిజిస్టర్‌ చేయించినట్లు రాశారే అని అమరావతి ప్రాంతంలో అధికారపక్ష నేతలు భూములు కొనుగోలు గురించి వచ్చిన వార్తలను చూసి ఒక వ్యక్తి వ్యాఖ్య.

   నిజమే, వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని ఇప్పటికీ తెలుగు దేశం వారు చెబుతున్నారు. అంటే జగన్‌ ఆ డబ్బంతా తీసుకుంటున్నపుడు వారంతా దగ్గరుండి చూశారా, లేక వారే ఇప్పించారా అని తాపీగా మరొకరి ప్రశ్న.

     వాస్తవం ఏమిటి ?ఎంతో కొంత రెండూ నిజమే. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.అసలు అవినీతి పాల్పడని వారు ఎవరు అని జనం అనుకొంటున్న స్ధితిలో ఎవరూ అక్రమంగా సంపాదించటానికి వెనుకాడటం లేదు. సిగ్గు పడటం అసలే లేదు, ఆడామగా తేడా, వయస్సు బేధం లేదు, సంపాదించకపోతే జనమే అసమర్ధులంటారు కదా !

    అమరావతి ప్రాంతంలో ఎవరి డబ్బు పెట్టి వారు భూములు కొంటే తప్పేంటి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అమాయకంగా, ఎంతో ప్రజాస్వామ్య యుతంగా అడుగుతున్నారు. ఎవరో భూములు కొనుక్కుంటే అది మాకు అనవసరం, నాకు కావలసింది నిబంధనలు పాటించారా లేదా అన్నదే అని కూడా చెప్పారు. నిజమే కదా తప్పేముంది !

    జగన్‌ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ముఖ విలువ కంటే ఎన్నో రెట్లకు వాటిని కొనుగోలు చేసినట్లు ,ఆ రూపంలో అక్రమంగా లంచాలు సమర్పించినట్లు తెలుగుదేశం వారు విమర్శించారు. వారి డబ్బు వారిష్టం ఒక రూపాయి వస్తువును వందరూపాయలు పెట్టి ఎందుకు కొన్నారంటే అది వారిష్టం అని జగన్‌ మద్దతుదార్లు సమర్ధించారు.అదీ చట్టబద్దంగానే జరిగింది, రికార్డులలో వున్నది కావాలంటే చూసుకోండి అన్నారు. చిత్రంగా వుందే అదీ నిజమే కదా ! కాదంటారా ?

    అప్పుడు జగన్‌ కంపెనీ రికార్డులను చూపి అవినీతి జరిగిందని తెలుగు దేశం వారు విమర్శించారు.ఇప్పుడూ అదే పద్దతుల్లో దస్తావేజులను చూసి చూపి జగన్‌ మీడియా లేదా మద్దతుదార్లు బదులు తీర్చుకున్నారు. కాదంటారా ? అవునంటారా ?

   పక్కవారిపై బురదజల్లి తుడుచుకోమన్నట్లు నిజం నిరూపించుకో అంటున్నారు ఎక్కడైనా అవినీతి వుంటే చర్యలు తీసుకోవచ్చు అన్నారు చంద్రబాబు.

   లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌పై ఆరోపించి కాదని రుజువు చేసుకోమన్నపుడు చంద్రబాబుకు ఆయన సైనికులకు ఈ తర్కం బహుశా గుర్తులేదేమో కదా !

    జగన్‌ లేదా రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నాయకుడు, నాయకురాలూ, వారి వారసులూ అవినీతికి పాల్పడలేదని ఎవరూ అనటం లేదు, అవి తేలే వరకు ఆరోపణలు, అంతవరకు నిందితులు మాత్రమే.

     అప్పుడూ-ఇప్పుడూ జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. అదే నేటి ప్రత్యేకత. ఎవరూ అతీతులు కాదు.

     జగన్‌ పత్రిక ఇష్టానుసారం రాసిందని, ఆ రాతలతో అమరావతి ఇమేజ్‌కు పెద్ద డామేజ్‌ చేయటమే లక్ష్యమని, ఆ పత్రిక రాసిన రాతలు నిరూపించకపోతే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ప్రతి భారత పౌరుడికీ వున్న హక్కు. వుపయోగించండి, మరొకరు ఇలా రాయకుండా చేయండి.

     ఇక్కడ మరో సమస్య అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్‌ ఇమేజ్‌ను ఎవరు ఎంత డామేజ్‌ చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పది సంవత్సరాల పాటు రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులపై పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా, కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి రెండు పత్రికలు, రెండు టీవీ ఛానల్స్‌ మద్దతుతో చేసిన ఆరోపణలతో రాష్ట్ర ఇమేజ్‌ డామేజ్‌ కాలేదా ? అక్కడకు వెళితే మా కెంత ఇస్తారు అని పీక్కు తింటారని విదేశీ కంపెనీలు అనుకోలేదా ? అందువలన ఇప్పుడు అమరావతి కుంభకోణాల గురించి రాయటంతో కొత్త వారు వచ్చినా ఇంతే కదా అని ఎవరూ రారని కదా చంద్రబాబు లబలబలాడి పోతున్నారు. ఇక్కడొక పాయింటు వుంది, గతంలో ఇలాంటి డామేజ్‌ను ఎదుర్కొన్నవారు దాన్ని తొలగించలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు తన చాణక్య నీతితో దాన్ని సరిచేయలేరా ? అవి కేవలం ఆరోపణలే వాస్తవాలు ఇవీ అని టెక్‌ బాబు డిజిటల్‌ టెక్నాలజీతో నిరూపించలేరా ?

     కానీ కొన్ని విషయాలు సామాన్యులకు అర్ధం కావటం లేదు. భూములు కొన్నది ఎవరో ప్రయివేటు వ్యక్తులైతే వారి గురించి చర్చ, బయట పెట్టాల్సిన అవసరం లేదు.అవి కూడా వాస్తవానికి రహస్యమైనవి కాదు. ఎవరైనా ఆసక్తి ప్రదర్శిస్తే వాటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాంటి దారిలోనే కదా జగన్‌ కంపెనీల వివరాలన్నీ చంద్రబాబు లేదా ఆయన మద్దతుదారులు తెలుసుకోగలిగింది. అసలు అమరావతి ప్రాంతం, గ్రామాలు కూడా ఎక్కడుంటాయో తెలియని వారు కోట్లు పెట్టి స్ధలాలు కొనటం దగ్గరే అసలు సమస్య వచ్చి పడింది. డబ్బున్న వారు స్దలాలు కొనటం కొత్త విషయమేమీ కాదు, అధికారంలో వున్న పెద్దలందరూ కూడబలుక్కున్నట్లు అమరావతి ప్రాంతంలోనే ఎలా కొన్నారన్నది సమస్య. మిగతా వారంతా వేరే చోట ఎందుకు కొన్నారు, అమరావతి ప్రాంతంలో కొన్న వారంతా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యుల బినామీలన్నది విమర్శ. దస్తావేజుల వివరాలతో సహా ఒక పత్రిక ప్రచురించింది. అవే రుజువులని, చెబుతోంది. అంతకంటే ఇంకా ఏమి రుజువులు ఇవ్వాలి. ఒక వేళ అవి నకిలీ దస్తావేజులైతే సదరు పత్రిక యాజమాన్యం మీద, వాస్తవమే అయితే తన మంత్రులు, ఎంఎల్‌ఏల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకుంటారా లేదా ? అధికారంలో వున్నవారికి ఆ మాత్రం కనీస బాధ్యత కూడా లేదా, ఎవరికీ ఇవ్వని అవకాశం తనకు ఇచ్చారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు కదా? అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా వారందరూ ఎదురు చూస్తున్న వాస్తవాలను బయట పెట్టి అవసరమైతే తాటతీసి తన నిజాయితీని వెల్లడించుకోవచ్చు కదా ! లేకపోతే తన ఇమేజ్‌ను తానే డామేజ్‌ చేసుకున్నట్లు అవుతుందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొడదామంటే కడుపుతో వుంది-తిడదామంటే అక్కకూతురై పోయింది !

01 Tuesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

Amaravati, ANDHRA PRADESH, Andhrapradesh new Capitol, AP CM, Central budget 2016, tdp, Telangana, trs

 

ఎం కోటేశ్వరరావు

   సాంకేతికంగా చూస్తే రెండోదే కావచ్చు గానీ నరేంద్రమోడీ గారీ ముచ్చటైన మూడో బడ్జెట్‌ రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు పెద్ద ఇబ్బందే తెచ్చి పెట్టింది. అందరికీ తెలిసిన సామెత ‘కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్క కూతురై పోయింది’ అన్నట్లుగా ఇద్దరు చంద్రుల పరిస్ధితి తయారైంది. జనం ముందు ఎలా కనిపించినా తగిలిన ఎదురు దెబ్బలతో వెనక్కు తిరిగి గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు. బడ్జెట్‌ అంటే నిబంధనల ప్రకారం రూపొందించేది. మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. మహారాజులు, పాదుషాల హయాం కాదిది. ఒక రాష్ట్రానికి ఒక రూపాయి అదనంగా కేటాయించాలన్నా ఏదో ఒక ప్రాతిపదిక, వాటికి సవాలక్ష నిబంధనలు వుంటాయి.వాటిని దాచి పెట్టి కేంద్రం దగ్గర తమ కెంతో పలుకుబడి వుందని చూపుకొనేందుకు కబుర్లు చెప్పటం ఒక ఫ్యాషనై పోయింది.

   హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి సీట్లేమీ రావని చంద్రబాబుకు ముందే తెలుసని ఆయన అంతరంగంగా అందరూ పరిగణించే ఒక మీడియా వ్యాఖ్యాత ఫలితాలు వెలువడిన తరువాత ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల పాటు వున్న కాలంలో చంద్రబాబు జోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి వుండాలి. తాను అభివృద్ధి చేసిన పరాయి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తన జనం తనకు ఒక్కటంటే ఒక్కటే కార్పొరేటర్‌ సీటను కట్టబెడతారని ముందే తెలుసుకున్నపుడు తన స్వంత రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా మోడీ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వరని చంద్రబాబుకు తెలియకుండా ఎలా వుంటుంది. అందుకే తాత్కాలిక సచివాలయం పేరుతో కధ నడిపించేందుకు పూనుకున్నారా ? ఏపికి ప్రత్యేక హోదారాదని ముందే నిర్ధారణ అయినందున అసలు అలాంటి ఒక ప్రతిపాదన వుందని కూడా ఎరగనట్లుగా అమాయకత్వం నటిస్తున్నారు.తొలి రోజుల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తారని కట్టుకధలు ప్రచారం చేశారు. వాటిని ఎంతో కాలం చెప్పలేరు కదా. దాంతో ఇప్పుడు లీకుల్లో గానీ చెప్పేవాటిలో గానీ దాని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

    పైసా పైసాను ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకోవాల్సిన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న మాట తిరుగులేని నిజం. చంద్రబాబు నాయుడి ఇరవై నెలల పాలన చూస్తే అసలు విషయాలను దాచిపెట్టి ఏదో ఒకదానిపై జనం దృష్టిని మళ్లించి తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ స్థితిలో చంద్రబాబు అభివృద్ధి ఆకర్షణకు తట్టుకోలేక ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పిన లేదా రేపు చెప్పబోయే వైసిపి ఎంఎల్‌ఏలలో కొందరికి మంత్రి పదవులు, కొందరికి పైరవీలు తప్ప దక్కేది మరేమీ వుండవు, వచ్చే ఎన్నికలలో మరో పార్టీ కండువా కప్పుకునేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేయటం కూడా అవసరమేమో ? ఎంత లేదనుకున్నా తొలిసారి మారటానికి కాస్త సిగ్గూ బిడియం, మాన,మర్యాదల గురించి జంఝాటం వుంటుంది. ఒకసారి అలవాటు పడి అదొక జీవన విధానం అయినపుడు మారేవారు , చేర్చుకొనే వారు సిగ్గుపడితే పనులెలా అవుతాయి? రాజకీయాల్లో కిక్కేముంటుంది?

     అమరావతి శాశ్వత రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర బడ్జెట్‌ మౌనం దాల్చింది. నూతన రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని లేదా నిర్మించాలని చంద్రబాబు విభజన సమయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. నాలుగు వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది కావాలని చంద్రబాబు కోరారు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. పెద్ద ఎత్తున వందల కోట్లు ఖర్చు చేసి రాజధాని శంకుస్తాపన పేరుతో నిధులు తగలేశారు. దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని చెబుతున్న మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతాయి . జనం సొమ్ము కాంట్రాక్టర్ల పాలు కావటమే. ఇప్పటికే రెవెన్యూ ఆర్ధిక లోటు రు.13,779 కోట్లు వుండగా ఒకటి తాత్కాలికంగా, మరొకటి శాశ్వత రాజధాని నిర్మాణానికి వుదారంగా ఖర్చు చేసే డబ్బు ఎక్కడుంది? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా ఈ ఖర్చు ? వుమ్మడి రాజధానిగా మరో ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదులో వున్న వసతులను వుపయోగించుకోవటానికి అవకాశం వుండగా తాత్కాలిక సచివాలయం పేరుతో మూడు లేదా నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం ఏ జవాబుదారీతనం కిందికి వస్తుంది ? వాటినే శాశ్వత సచివాలయ నిర్మాణానికి ఎందుకు వుపయోగించరు? ఈ ప్రశ్న వస్తుందని గ్రహించే తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా భవిష్యత్‌లో వుపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదే వాస్తవం అయితే తన మకాం విజయవాడకు మార్చే సమయంలోనే హైదరాబాదులోని తన కార్యాలయ సుందరీకరణకు పదుల కోట్లు ఎందుకు వెచ్చించినట్లు ? ఆ తరువాత ఒక్క రోజైనా ఆఫీసును వుపయోగించుకున్నారా ? ఇప్పటికే మంత్రులు, అధికారులు పనీ పాటా లేకుండా విజయవాడ-హైదరాబాదు చుట్టూ తిరుగుతూ అనవసరంగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది.

     కేంద్ర నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా అడుక్కోవటంలో పిసినారితనం ఎందుకన్నట్లుగా రాజధాని పరిసరాల్లో పెట్టబోయే పరిశ్రమలకు నూటికి నూరుశాతం పన్ను రాయితీలు ఇవ్వాలన్న కోరికను కేంద్రం అసలు పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు రెండువేల కోట్లు అడిగితే వంద కోట్లు ప్రకటించారు. అంతకంటే పెద్ద దైన విశాఖ మెట్రోకు మాత్రం మొండిచేయి చూపారు.అసలే అవి గిట్టుబాటు కావన్న అభిప్రాయం వుండగా ఇలాంటి కేటాయింపులతో నిర్మాణ భారం పెరిగిపోతే వాటిని జనం నెత్తిమీదే కదా రుద్దేది? ఇక కేంద్రం ప్రకటించిన విద్యా సంస్ధల భవన నిర్మాణాలకు కూడా విదిలింపులే తప్ప గణనీయమొత్తాలను కేటాయించలేదు. దీని వలన అరకొర అద్దె లేదా వసతులు లేని భవనాలలోనే వాటిని దీర్ఘకాలం కొనసాగించాలన్నమాట.

      తెలంగాణా పరిస్ధితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఆ మధ్య ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన జరిపి మోడీ పాదుషా గారిని ఖుషీ చేసేందుకు ముఖస్తుతి చేసి వచ్చినట్లు ,ఎంతో ఆత్మీయంగా, చొరవగా మాట్లాడినట్లు మీడియా కధనాలు వచ్చాయి. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ ఈ బడ్జెట్‌లో స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధ వంటి పధకాలకు 30వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని, కొన్నింటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభువులకు కెసిఆర్‌ పెద్ద జాబితానే ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 30వేల కోట్ల పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న బకాయిలను కూడా పూర్తిగా చెల్లించని కేంద్రం గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా వంద కోట్లు కేటాయించింది.ఈ లెక్కన ఆ ప్రాజెక్టు 150వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి గాని పూర్తి కాదేమో ?అలాంటపుడు అలూచూలూ లేని తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందా?

     బడ్జెట్‌ ప్రతిపాదనల తీరుతెన్నులను చూసినపుడు గత యుపిఏ పాలనకూ, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ వర్తింప చేస్తామన్న నరేంద్రమోడీ పాలనకూ ఇంతవరకు పెద్ద తేడా ఏముంది? కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచారు. ఇది హర్షణీయమే. ఇదే సమయంలో కొన్ని పధకాల అమలు బాధ్యతను రాష్ట్రాలపై మోపటం ద్వారా ఆ పెంపుదల కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా అయింది తప్ప వేరు కాదు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాని పర్యవసానం రానున్న సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పధకాలపై తీవ్రంగా పడుతుందని వేరే చెప్పనవసరం లేదు.నిధులకు ఎంత కటకట ఏర్పడితే పాలకులు కబుర్లు అంత ఎక్కువగా చెబుతారు.అంతగా జనం మోసపోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d