• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ఫ్లయింగ్‌ మోడీ నుంచి ఫెయిల్యూర్‌ మోడీ వరకు

21 Saturday May 2016

Posted by raomk in AP, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

Acheedin, BJP, CHANDRABABU, CHANDRABABU TWO YEARS RULE, failure Modi, flying Modi, KCR, KCR TWO YEARS RULE, Narendra Modi, NDA, NDA Two years rule, Two years Modi rule

అచ్చే దిన్‌ ఆమడ దూరం

ఎం కోటేశ్వరరావు

    కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మూడు చోట్లా అధికారానికి వచ్చిన వారు రాజకీయ, పాలనా రంగాలకు కొత్తవారు కాదు. అందువలన అనుభవాల గురించి మాట్లాడుకోవటంలో అర్ధం వుండదు. ఈ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏమిటి ? జనానికి వాటి పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. గత పాతిక సంవత్సరాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ నయా వుదారవాద విధానాల చట్రంలో పనిచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి వున్నా ఎడమ చేయికి,పురచేయికి వున్న తేడా తప్ప వేరు కాదు. నయా వుదార వాద విధానాలు విదేశీ కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్ధల విధానాలకు స్వదేశీ ముద్రవేసి అమలు జరుపుతున్నారన్నది స్పష్టమైంది. వాటి ప్రకారం దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన అమలు జరపాల్సి వుంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం వుంటే విదేశీ కంపెనీలకు తలనొప్పి. పన్ను రేట్లు, చట్టాలు ఒకే విధంగా వుండేట్లు ఇప్పటికే చూశారు. వాట్‌ బదులు జిఎస్‌టిని అమలు జరపాలన్నది కూడా దానిలో భాగమే.ఇలా ఎన్నో వున్నాయి. వాటి గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయికి ఎక్కువ, కేంద్రానికి తక్కువ.

   ఎవరు అవునన్నా కాదన్నా , అభిమానులు గింజుకున్నా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ పట్ల మోజు తగ్గిపోతున్నది.వెంకయ్య నాయుడి వంటి వంది మాగధులు నరేంద్రమోడీని దేవదూత, దేవుడు అని పొగడవచ్చు. కేంద్రంలో లేని ప్రత్యేకత ఏమంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పొగడాల్సి రావటం బోనస్‌ వంటిది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు నరేంద్రమోడీ తమ పాలిట బంగారు పళ్లెంతో వస్తారని రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు.తొలి ఏడాది ఫ్లయింగ్‌ మోడీగా పేరు తెచ్చుకున్న ప్రధాని రెండో ఏడాది ఫెయిల్యూర్‌ మోడీగా పిలిపించుకుంటున్నారు. మనువాదం పట్ల వున్న శ్రద్ధ జనవాదం గురించి లేకపోవటంతో అటు పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలు, సామాన్య జనం కూడా అసంతృప్తికి గురవుతున్నారు. విదేశీయులకు మన దేశం అంటే కనిపించేది నరేంద్రమోడీ తప్ప రాష్ట్రాలు కాదు. అందువలన శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీరతాళ్లతో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు విదేశాలలో, స్వదేశంలో ఎన్ని వీరంగాలు వేసినా వారిని కొమ్ముగాసే స్వరాష్ట్రాల మీడియాను తప్ప విదేశీ కార్పొరేట్లను రంజింపచేయవు.

    తాను అధికారానికి వస్తే గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ విస్తరిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయటం లేదు. అమలు జరుపుతున్నట్లా లేదా కనీసం ఆ నమూనా ఏమిటో అయినా జనానికి వివరించారా అంటే లేదు. చిత్రం ఏమిటంటే గుజరాత్‌ మోడల్‌ బండారం గురించి అనేక మంది అనేక సందర్భాలలో వెల్లడించారు. ఇక్కడ స్ధలాభావం వలన దాని గురించి వివరించటం లేదు. మోడీ మహాశయుడు చెప్పినట్లు అదొక ఆదర్శ నమూనా, వాస్తవమే అయితే అందుకు దోహదం చేసింది పంచవర్ష ప్రణాళికలే. నరేంద్రమోడీ అధికారానికి రాగానే అసలు ఆ విధానాన్నే రద్దు చేశారు. నీతి ఆయోగ్‌ పేరుతో ప్రణాళికా సంఘాన్ని తెరమరుగు చేశారు. రెండు సంవత్సరాలు సాము చేసి ఇప్పుడు చెబుతున్నదాని ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు అమలు జరిపే ఒక స్వప్న పత్రాన్ని రూపొందించబోతున్నారు.అది 2018 నుంచి అమలులోకి వస్తుంది. దాని ప్రకారం తొలి ఏడు సంవత్సరాలకు ‘ జాతీయ అభివృద్ధి అజెండా’ను రూపొందిస్తారు. దానిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. దాని ప్రకారం తొలి సమీక్ష 2020లో జరుగుతుంది. దీన్నే చిల్లి కాదు తూటు అంటారు. మరి అప్పటి వరకు అంటే 2018 వరకు ఏ విధానాలను అమలు జరుపుతారు? విఫల కాంగ్రెస్‌ విధానాలను కొనసాగిస్తున్నట్లా ?

    రెండు సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, సేవలు, నిర్మాణం,వ్యవసాయం మొదలైన రంగాలలో వాణిజ్య అవకాశాల తీరుతెన్నుల గురించి విశ్లేషణ జరిపిన జర్మనీకి చెందిన ఎంఎన్‌ఐ బిజినెస్‌ సూచిక 2014లో గరిష్టంగా 80.3 వుండగా ఈఏడాది ఏప్రిల్‌ నెలలో 69.6కు దిగజారింది. ఇదే కాలంలో చైనా సూచిక 50-55 పాయింట్ల మధ్య కదలాడినట్లు అదే సంస్ధ తెలిపింది. ఏ దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో సూచిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల నిమిత్తం ఇలాంటి సూచికలను రూపొందిస్తారు. వాటి ఆధారంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. దేశం మొత్తానికి ఈ సూచికను రూపొందించినప్పటికీ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేవారు కూడా వీటిని గమనంలోకి తీసుకుంటారు. మన రిజర్వుబ్యాంకు విశ్లేషణ ప్రకారం వాణిజ్య ఆశల సూచిక 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో 117.9 వుండగా 2016 తొలి మూడు నెలల్లో 111 పాయింట్లకు పడిపోయింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.2శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని గతంలో చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజా జోస్యం ప్రకారం సమీప భవిష్యత్‌లో ఆ అంకెను చేరుకొనే అవకాశం లేదని ఆచరణ వెల్లడిస్తోంది.

 అంతర్జాతీయంగా వినియోగదారుల విశ్వాసాన్ని అభివృద్ధి సూచికలలో ఒకదానిగా పరిగణిస్తున్నారు.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 98.2 వుండగా తరువాత అది 109కి పెరిగి ప్రస్తుతం 104.1 పడిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన పరిస్థితులకు ఇది ప్రతిబింబం అని భావిస్తున్నారు.ఈ ఏడాది మంచి వర్షాలు పడితే, కేంద్ర ప్రభుత్వం వుద్యోగులకు వేతనపెంపుదల చేస్తే సూచిక తిరిగి పెరగవచ్చని వాణిజ్యవేత్తలు ఆశిస్తున్నారు. పారిశ్రామిక వుత్పత్తి సామర్ధ్య వినియోగ సూచిక కూడా దేశ పరిస్ధితికి దర్పణం పడుతుంది. 2013-14 చివరి మూడు నెలల్లో ఈ సూచిక 76శాతం వుండగా 2015-16 మూడవ త్రైమాసికంలో 72.5 పాయింట్లకు పడిపోయింది. పారిశ్రామిక ఆర్డర్లు కూడా సగటున ప్రతి మూడు నెలలకు 1.45 బిలియన్‌ రూపాయల నుంచి 1.15 బిలియన్లకు పడిపోయింది. అంటే పెట్టుబడులను ఆకర్షించే పరిస్ధితి లేదన్నది దీని అర్ధం. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్‌, కెసిఆర్‌, కెటిఆర్‌లు ఎన్ని రాష్ట్రాలు, దేశాలు తిరిగినా వాగ్దానాలు తప్ప పెట్టుబడులు వచ్చేఅవకాశాలు ఏమేరకు వుంటాయో అర్ధం చేసుకోవచ్చు.గడచిన 24నెలల పాలనలో వరుసగా 17వ నెలలో కూడా మన ఎగుమతులు పడిపోయాయని అధికారికంగా ప్రకటించారు.2014-15తో పోల్చితే గతేడాది ఎగుమతుల మొత్తం 310 బిలియన్‌ డాలర్ల నుంచి 261 బిలియన్లకు పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన రూపాయి పతనం చెంది జనం మీద భారమూ పెరిగింది, అదే సమయంలో మన ఎగుమతులూ పడి పోయాయి. రూపాయి పతనమౌతుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో మన దిగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి కనుక విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సమస్య తీవ్రత కూడా తగ్గింది. ఈ స్థితిలో మేకిన్‌ ఇండియా గురించి చెప్పుకోవటం అంటే నరేంద్రమోడీ ఘోర వైఫల్యం గురించి గుర్తు చేయటమే.

  చిత్రం ఏమిటంటే ఆర్ధిక రంగంలో ఇన్ని వైఫల్యాలు,దిగజారుడు కనిపిస్తున్నప్పటికీ కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లు ఇప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర తనేజా మాట్లాడుతున్నారు. అసాధారణ రీతిలో ఆర్ధికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ప్రతిపక్షాలకు కనిపించటం లేదని, కోమాలోకి పోయిన ఆర్ధిక వ్యవస్ధను చైతన్యంలోకి తీసుకువచ్చి ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించి మార్పుకోసం పనిచేస్తున్నామని నమ్మబలుకుతున్నారు.

    నరేంద్రమోడీ పాలనలో ఒక్క అవినీతి వుదంతమైనా వున్నదా? అవినీతి సూచికలో మన స్థానం తగ్గిందని ప్రకటించటం చూడ లేదా అని ఆయన అభిమానులు అడ్డు సవాళ్లు విసురుతుంటారు. నిజమే, అసలు కొత్తగా ఏదైనా పనిచేస్తే కదా అవినీతి వున్నదీ లేనిదీ తెలిసేది. తొమ్మిదివేల కోట్లరూపాయలు ఎగవేసిన విజయ మాల్య వుదంతం ఏమి తెలియ చేస్తోంది. దాని గురించి అడిగితే అతగాడికి కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారని తెలివిగా సమాధానమిచ్చారు.అదే పెద్దమనిషి దేశం నుంచి పరారీ అవుతుంటే దొంగగారు పోతుంటే చూసి చెప్పమన్నారు తప్ప పట్టుకోమనలేదని నిఘా సంస్థలు చెప్పటం చూస్తే తెలివితక్కువ తనానికి సరికొత్త వుదాహరణగా మోడీ సర్కార్‌ను కొందరు వర్ణించారు. వీడ్కోలు ఇచ్చి మరీ విదేశాలకు పంపిన నిర్వాకాన్ని చూసి దేశం నివ్వెర పోతోంది. నిజానికి ఇది తెలివితక్కువ తనం కాదు, వున్నత స్థానాలలోని పెద్దల ప్రాపకం లేకుండా పట్టుకోవాల్సిన వ్యవస్థలను దానికి బదులు ఎటువెళుతున్నారో చెబితే చాలని ఆదేశాలు జారీచేయించింది ఎవరు? రేపు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తారనగా ముందురోజే దేశం నుంచి పరారీ కావటానికి పెద్దల సహకారంలేకుండా సాధ్యమా? అధికారం వున్నంత కాలం కాంగ్రెస్‌ను వుపయోగించుకొని పోగానే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా విజయమాల్యను ఆదర్శంగా తీసుకున్న పెద్దమనిషే,తమ దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది ధర్నా చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త నివేదన ఆధారంగా బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప పదవి నుంచి తప్పుకున్న విషయం లోకవిదితం. తిరిగి అదే పెద్ద మనిషిని ఆ పార్టీ అందలమెక్కించించింది. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతి వ్యతిరేక కబుర్లు చెబితే ప్రయోజనం వుందా ? కాంగ్రెస్‌ హయాంలో అవినీతి అక్రమాలపై విచారణను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత మందిని శిక్షించారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదా ? గొప్పగా చెబుతున్న గుజరాత్‌ మోడల్‌ ఏమిటి, అప్పనంగా ప్రకృతి సంపదలైన నీరు, భూముల వంటి వాటిని పెట్టుబడిదారులకు కట్టపెట్టమేగా ? దాన్ని ఏమంటారు ? వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతోంది . చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ అవినీతి గురించి ఎన్నికలపుడూ, ఇప్పుడూ నానా యాగీ చేశారు, చేస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించి తన పార్టీలో కలుపుకొనేందుకు చూపిన శ్రద్ధ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు చూపటం లేదేమి? చంద్రశేఖరరావు కూడా కాంగ్రెస్‌ అవినీతి గురించి అలాగే కబుర్లు చెప్పారు. అక్కడ కూడా జరుగుతున్నది అదే ఫిరాయింపులు, ఫిరాయింపులు.

  ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు గతేడాది నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడువేల కోట్లరూపాయలను నష్టపోయాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించటం లేదు. బ్యాంకులకు వుద్ధేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణలు ప్రతిపాదించటానికేే రెండు సంవత్సరాలు పట్టిందంటే దున్నపోతు మీద వానపడ్డట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపియే హయాంలో 2008-13 సంవత్సరాలలో బ్యాంకుల నిరర్ధక ఆస్థుల సగటు 2.6శాతం వుండగా తమ అసలైన ప్రతినిధి మోడీ అనుకున్నారేమో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రెండు సంవత్సరాలలో వాటిని 4.5శాతానికి పెంచి ఎంతో లబ్దిపొందారు, 2008లో 2.3శాతంగా వున్నవి కాస్తా 2015 నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వుద్ధేశ్యపూర్వంగా రుణాలు ఎగవేసిన పెద్ద మనుషులు 2015 డిసెంబరు నాటికి 7,686 మంది వుంటే వారి నుంచి రావాల్సిన సొమ్ము 66వేల కోట్ల రూపాయలు. అందువలన కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారన్నది సాకు మాత్రమే వారి మీద చర్య తీసుకుంటే, డబ్బువసూలు చేస్తే వీరికి ఎవరు అడ్డుపడ్డారు? అవినీతికి పాల్పడటం ఎంత నేరమో పాలకులుగా వుండి అవినీతి పరులను వుపేక్షించటం కూడా దానితో సమానమైన నేరమే అవుతుంది.సుగర్‌, బిపి కవల పిల్లల వంటివి. అలాగే పెట్టుబడిదారీ విధానంతో అవినీతి పెనవేసుకొనే వుంటుంది. అందుకే అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఎవరి గురించి అయినా ముందే సంబరపడిన వారు తరువాత విచారించకతప్పదు.

   జపాన్‌లో పిల్లలకు వేసే డైపర్ల కంటే వృద్ధులకు వేస్తున్న వాటి సంఖ్య పెరిగిపోతోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముంచుకు వస్తున్న వృద్ధాప్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్నాయి. మన దేశంలో పశు ‘వృద్ధాప్యం’ రైతాంగానికి, కొందరు వృత్తిదారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ సర్కార్‌ కొత్తగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగేస్తున్నారని మహారాష్ట్రలో కరువు ప్రాంతాల రైతాంగం వాపోతోంది. అనేక రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం కారణంగా వ్యవసాయానికి, పాడికి పనికిరాని పశువులను వదిలించుకోవటం రైతాంగానికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది. పశువుల ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రయోజనం లేని పశువులకు నీరు, మేత అందించటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ చేసిన వ్యాఖ్య బడా పారిశ్రామికవేత్తలలో నరేంద్రమోడీ విధానాల పట్ల వున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి, శక్తి కాదు.’ కొన్ని అంశాలు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, వుదాహరణకు కొన్ని రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం. ఇది స్పష్టంగా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిని దెబ్బతీస్తోంది, ఎందుకంటే ఈ వృధాగా వున్న ఆవులను మనం ఏమి చేసుకుంటాం, ఇది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది,ఎందుకంటే ఇది అనేక మంది రైతులకు మంచి ఆదాయ వనరు, అందువలన ఆ చర్య ప్రతికూలం. వేదకాలంలో కూడా భారతీయులు గొడ్డు మాంసం తినేవారు, కరవు పరిస్థితులు ఏర్పడినపుడు రైతులు పశువులను వధశాలలకు తరలించేవారు.’ అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాలలో జంతు వధ నిషేధం, జరిమానాలు, ఇతరంగా ఏదో ఒక రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో పశువుల ధరలు 13శాతం పడిపోయాయని రాయిటర్‌ వార్తా సంస్ధ తెలిపింది.

    రాజకీయ రాజధాని న్యూఢిల్లీ అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై.మహారాష్ట్రలోని బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ‘ గొడ్డు మాంసం, మరాఠీ చిత్రాలు తరువాత ఏమిటి; మధ్యాహ్న భోజనంలో విధిగా వడపావ్‌ తినాలి, మరాఠీ మాట్లాడాలి, ప్రతి రోజూ దేవాలయాలను సందర్శించాలనే చట్టాలు చేస్తారేమో అని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా వ్యాఖ్యానించారు.’ భారత్‌ ఇప్పుడు భవిష్యత్‌లో వెలిగిపోవాలంటే జనానికి ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ వుండాలి.ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలాపాలకు పరిమితం కావాలి, జనం ఏం చేయాలో చెప్పాల్సిన పాత్ర ధరించకూడదు’ అని రతన్‌ టాటా ఈ ఏడాది జనవరిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

    ఒక పార్టీ మరొక పార్టీ విధానాలను విమర్శించటం ప్రజాస్వామ్య పద్దతి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం క్షంతవ్యం కాదు. కానీ అధికార రాజకీయాలలో ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ విలువలను పాటించటం లేదు. కేరళ, బెంగాల్‌,త్రిపుర రాష్ట్రాలలో ఎవరైనా ఒకరో అరో వామపక్షాల నుంచి ఇతర పార్టీలలో చేరటం తప్ప ఇతర పార్టీల నుంచి వామపక్షాలు ఫిరాయించిన వుదాహరణలు లేవని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచటం, ఫిరాయింపులను ప్రోత్సహించాటాన్ని బిజెపి విమర్శించింది. కానీ అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పనిచేసినట్లు అరుణాచల్‌, వుత్తరాంచల్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టేందకు ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న పిలుపును ఈ విధంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్క ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిని ఒక పద్దతి ప్రకారం ఆకర్షించటమే పనిగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలంగాణాలో వైఎస్‌ఆర్‌సిపిని పూర్తిగా పూర్తిగా, తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు అదే విధంగా స్వాహా చేయటంలో టిఆర్‌ఎస్‌ జయప్రదమైంది. కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. వీటన్నింటినీ చూసినపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మార్చివేయటంలో ఈ పార్టీలన్నీ జయప్రదమయ్యాయి. రాజకీయాలలో హుందాగా ప్రవర్తించటం అన్నది దాదాపు కనుమరుగైంది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి స్థాయిలలో వున్నవారు కూడా అందుకు అతీతులు కాదని రుజువు చేశారు.

    చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చిన్నమాట. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించటం తప్ప వీటికంటూ ప్రత్యేక విధానాలు లేవు. అందువలన ధరల పెరుగుదలను నివారించటంలో రెండు చోట్లా వైఫల్యమే. కరవు పరిస్థితులను కప్పి పెట్టేందుకు ప్రయత్నించటం తప్ప జనాన్ని ఆదుకొనేందుకు, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటో జనానికి తెలియదు. రాష్ట్రం విడిపోతే యువతకు పెద్ద ఎత్తున వుపాధి దొరుకుతుందని తెలంగాణా నేతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలలో అంతకు ముందుతో పోల్చితే పెద్ద మార్పేమీ కనపడటం లేదు. బాబొస్తే జాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి, వున్న వుద్యోగాలు పోతున్నాయి తప్ప కొత్తవాటి జాడ కనిపించటం లేదు. తెలంగాణాలో ముడుపుల కోసమే ప్రాజక్టుల రూపురేఖలన్నీ మార్చివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుస్తాయన్నట్లు గతంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నవారికి, అధికారంలో వున్నవారికి కూడా ఈ విషయాలన్నీ కొట్టిన పిండి కనుక దేన్నీ కాదనలేము.ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోలవరం తప్ప కొత్తగా కట్టే పెద్ద ప్రాజక్టులేమీ లేవు. వున్నవన్నీ పూర్తి చేయాల్సినవే. పోలవరం వంటి వాటికి నీళ్లు లేకుండానే ముందుగానే కాలువలు తవ్వి గత పాలకులు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటి వారు వాటి పూడికలు తీసి సొమ్ము చేసుకుంటారు. అన్నింటి కంటే రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు తెరలేపారు.గతంలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు ఐదులక్షల కోట్ల పధకమది. అందువలన శ్రీశ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఏ పార్టీ చరిత్ర చూసినా గత రెండు సంవత్సరాలలో గర్వించదగిన చర్యలేమీ లేవు. రానున్నవి మంచి రోజులని చెప్పారు. అవి ఎండమావుల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చెంపమీద కొడితే మరో చెంప చూపమని మన వేదాంతం చెబుతుంది తప్ప కొట్టిన వారి చెంప చెళ్లు మనిపించమని చెప్పలేదు. అందుకే మన జనం కూడా అంత నిస్సారంగా తయారయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నారు. ఇదొక చిత్రం !

గమనిక :ఈ వ్యాసం ‘ఎంప్లాయీస్‌ వాయిస్‌’ మాసపత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ వామపక్షాలకు సవాలు విసిరిన ఓటింగ్‌ సరళి

20 Friday May 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ 2 Comments

Tags

BJP, Congress, CPI(M), INDIAN LEFT, LDF, LEFT FRONT, UDF

ఎం కోటేశ్వరరావు

    ఐదు సంవత్సరాల తరువాత కేరళలో తిరిగి అధికారానికి రావటంతో సిపిఎంతో సహా అన్ని వామపక్షాలు, శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారానికి రాకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలను అయినా వామపక్షాలు సాధిస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో వున్న స్ధానాలను కోల్పోయాయి. అందువలన కేరళ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేవు. ఇది భౌతిక వాస్తవం. కేరళలో మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం రెండు స్ధానాలు మాత్రమే తగ్గాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) విజయానికి వున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించజాలరు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు కడుపు మంటతో ఏడవలేక నవ్వు ముఖం పెడతారు. అది సహజమే, అర్ధం చేసుకోవాలి అంతే. ఇదే సందర్భంలో మరో కోణం నుంచి కూడా ఫలితాలను విశ్లేషించటం అవసరం.అది ఈ దేశంలో అభ్యుదయ పురోగామి శక్తులు మరింతగా పెరగాలని కోరుకొనే వారందరూ చేయాలి. ఓటమి చెందినపుడు ఎంత తీవ్రంగా అంతర్మధనం చేయాలో గెలిచినపుడు దానిని కొనసాగించటానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సి వుంటుంది.

     కేరళలో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువగా సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి సీట్లు  వచ్చాయి.ఎల్‌డిఎఫ్‌ ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం తెచ్చుకుంది. కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుపొందింది. త్రిసూర్‌, పథ్థానం తిట్ట, అలప్పూజ, వైనాడ్‌ జిల్లాలో ఒక సీటు మినహా , కన్నూరు, కాలికట్‌ జిల్లాలో రెండేసి తప్ప అన్నింటినీ గెలుచుకుంది. ఇదే సమయంలో ఓటింగ్‌ తీరు తెన్నులు సిపిఎంకు ఒక పెద్ద సవాలును కూడా విసిరాయి.

1.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు దాదాపు ఒక శాతం తక్కువగా 43.1శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో అధికారం రానప్పటికీ కాసరగోడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఒక్క కొల్లం జిల్లాలోనే ఆ విజయాన్ని కొనసాగించింది.

2. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గి 45 నుంచి 38.78శాతానికి పడిపోయాయి. పోటా పోటీగా కేరళలో జరిగే ఎన్నికలలో రెండు కూటముల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తేడా వుండటం, రెండు కూటములకూ ఓటింగ్‌ శాతం తగ్గటం కూడా ఇదే ప్రధమం.

3.బిజెపి నాయకత్వంలోని కూటమి గత ఎన్నికలలో వచ్చిన ఆరుశాతాన్ని 15కు పెంచుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, కొద్ది నెలల కితం జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికల కంటే కూడా అదనంగా ఓట్లు తెచ్చుకొంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు గెలుచుకోవటంతో పాటు ఏడు చోట్ల రెండవ స్ధానంలో నిలిచింది.

     కాంగ్రెస్‌ మీద వున్న వ్యతిరేకతతో పాటు బిజెపి గణనీయంగా ఓట్లు చీల్చటం కూడా ఎల్‌డిఎఫ్‌కు కలసి వచ్చి ఘన విజయం సాధించిందని ఓటింగ్‌ తీరుతెన్నులను బట్టి కొందరు విశ్లేషించారు. గతంలో అనేక సందర్బాలలో కమ్యూనిస్టులను అధికారానికి రానివ్వకూడదన్న గుడ్డి వ్యతిరేకతతో బిజెపి తన ఓట్లను కాంగ్రెస్‌కు బదలాయించిందన్నది బహిరంగ రహస్యం.ఈ సారి ఎలాగైనా బిజెపి పర్మనెంటు అభ్యర్ధిగా పేరు తెచ్చుకున్న ఓ రాజగోపాలన్‌ను గెలిపించేందుకు తోడ్పడటం ద్వారా బిజెపి హిందూత్వ ఓటర్ల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ ఆయనపై బలహీనమైన అభ్యర్ధిని నిలిపి పరోక్ష సందేశం పంపింది. అయితే బిజెపి కాంగ్రెస్‌ మద్దతు పొంది తొలిసారిగా కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది తప్ప మొత్తం మీద తన ఓట్లను బదలాయించినట్లు కనిపించటం లేదు. అయితే గతంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అనేక చోట్ల ఈ సారి బిజెపి ఓట్లు తగ్గాయి. అంటే అక్కడ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయించారా ? చూడాల్సి వుంది. కాంగ్రెస్‌, బిజెపి చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా సిపిఎంకు హిందువుల ఓట్లతో పాటు అనేక చోట్ల మైనారిటీలు కూడా మద్దతు ఇచ్చినట్లు ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషకులు చెబుతున్నారు.’ సాంప్రదాయంగా సిపిఎంకు ఓటు చేసే హిందువులలో చీలిక తెచ్చేందుకు చివరి దశలో బిజెపిఏ తనకు ప్రధాన ప్రత్యర్ధి అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కానీ ఫలితాలను చూస్తే హిందువులు మెజారిటీ వున్న ప్రాంతాలతో పాటు బిజెపి పెరుగుదల కారణంగా మైనారిటీలు ఎక్కువగా వున్న కొన్ని చోట్ల కూడా సిపిఎం తన ఓట్లను పెంచుకున్నట్లు వెల్లడి అవుతోందని’ డెక్కన్‌ క్రానికల్‌ కేరళ ఎడిషన్‌ సంపాదకుడు కెజె జాకబ్‌ అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు కారణంగానే ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెజారిటీ 70వేల నుంచి 27వేలకు పడిపోయిందన్నారు.

    బెంగాల్లో ఫలితాలు వామపక్షాలను తీవ్రంగా పునరాలోచనలో పడవేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఎన్నికలలో 16శాతం ఓట్లు పొందిన బిజెపి అసెంబ్లీలో 10శాతానికి పడిపోయింది.అవి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమికి కారణాలుగా చెబుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యలను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సి వుంది. మమతాబెనర్జీ కిలో రెండు రూపాయల బియ్యం పధకం ప్రవేశపెట్టి శారద, నారద వ్యతిరేకతను అధిగమించారన్నది ఒకటి. దేశవ్యాపితంగా ఆహార భద్రత కావాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు బెంగాల్‌లో తమ మూడున్నర దశాబ్దాల పాలనలో సబ్సిడీ బియ్యం పధకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బాలికలకు స్కాలర్‌ షిప్పులు, సైకిళ్లు ఇచ్చారని మరికొన్ని ఇలాంటివే వున్నాయి. అన్నింటినీ ప్రజాకర్షక పధకాలుగా కొట్టివేయలేము. సిపిఎం కార్యక్రమం జనతా ప్రజాస్వామిక విప్లవ దశకు చేరటం తప్ప నేరుగా సోషలిజం కాదు. అటువంటిది ఒక రాష్ట్రంలో మౌలిక మార్పులను చేయలేని పరిస్థితులలో వున్నంతలో ప్రజలకు వుపశమనం కలిగించటం అవసరమా లేదా ? అందువలన బెంగాల్లో గతంలో ఏం జరిగింది అని అంతర్గతంగా మధించుకోవటంతప్ప ఇప్పుడు బహిరంగంగా చర్చించి ప్రయోజనం లేదు. అధికారంలో వున్న త్రిపుర, కేరళలో అయినా అలాంటి వైఫల్యాలు, లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

    రెండవది కాంగ్రెస్‌ ఓటింగ్‌ పూర్తిగా బదిలీకాలేదన్న వాదన. దీని గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. బదిలీ అవుతాయి అని ఎవరైనా భావిస్తేనే భ్రమలకు లోనయినట్లుగా పరిగణించాలి. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇతర వామపక్షపార్టీలతో కలిగిన అనుభవం ఏమిటి? సిపిఎం ఓట్లు పూర్తిగా, నిజాయితీగా బదిలీ అయ్యాయి తప్ప ఇతర పార్టీల నుంచి అవి మిత్రపక్షాలుగా వున్నపుడే పూర్తిగా బదిలీ జరగలేదని తేలింది. అలాంటిది బెంగాల్లో గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పనిచేసిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బదిలీ అవుతాయని భావించటం అత్యాశే అవుతుంది. సాధారణ పరిస్థితులలో పార్టీ పనిచేయటానికి కూడా అవకాశం లేని స్ధితిలో ప్రజాస్వామ్య పరిస్ధితుల పునరుద్దరణకోసం చేసుకున్న సర్దుబాటు తప్ప అది మరొకటి కాదు. కమ్యూనిస్టులు ప్రపంచంలో అనేక చోట్ల అంతకంటే తీవ్ర నిర్బంధం, ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తున్నారు. అందువలన బెంగాల్లో వామపక్షాలు రాబోయే అయిదు సంవత్సరాలలో మరిన్ని దాడులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నూతన పరిస్ధితులకు అనుగుణంగా పని చేసి తిరిగి ప్రజల విశ్వాసం పొందటం తప్ప మరొక మార్గం లేదు. అది ఎలాగన్నదే సమస్య.

     ఫలితాలకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణలు రాబోయే రోజుల్లో వెలువడతాయి. వామపక్షాల ముందున్న ఒక తీవ్ర సవాలును అవి ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. అదే మిటంటే గత ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే స్పష్టం అవుతుంది. వర్గరీత్యా ఒక శాతం పెట్టుబడిదారులు, భూస్వాములు అయితే 99శాతం కార్మికవర్గం, ఇతర కష్టజీవులే. అటువంటపుడు కమ్యూనిస్టులు పొందుతున్న ఓటింగ్‌ శాతం దానిని ప్రతిబింబించటం లేదు. అనేక మంది శ్రామికులు కమ్యూనిస్టులు కాని పార్టీల, కుల మత శక్తుల వెనుక వున్నారు. ఓడిపోయిన ప్రతి సారీ కమ్యూనిస్టులు ఆత్మశోధన చేసుకొని బలహీనతను అధిగమిస్తామని చెబుతూనే వున్నారు. కానీ తరువాత అది ప్రతిబింబించటం లేదు. కమ్యూనిస్టుల బలం ఒక పరిధికి మించి పెరగటం లేదు. అలాగని దీన్ని గురించి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు గానీ తీవ్రంగా పరిశీలించకతప్పదు. వివరాలు చూడండి. కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌,బిజెపి ఓట్ల శాతాలు ఇలా వున్నాయి.

                1987      1991      1996     2001     2006     2011     2016

ఎల్‌డిఎఫ్‌    44.65     45.80    44.69    43.70     48.60    44.83   43.10

యుడిఎఫ్‌    44.04     48.07    43.58    49.27    42.98     45.90   38.78

బిజెపి                                                5.20       4.75      6.00    15.00

     గత ఏడు ఎన్నికలలో తొలిసారిగా 2016లో అటు ఎల్‌డిఎఫ్‌ ఇటు యుడిఎఫ్‌ రెండు కూటములు అతి తక్కువ ఓట్లు పొందాయి.ఏడు ఎన్నికల సగటు ఎల్‌డిఎఫ్‌కు 45, యుడిఎఫ్‌కు 44.6శాతంగా వున్నాయి. ఎల్‌డిఎఫ్‌ గరిష్టంగా 2006లో 48.6శాతం, యుడిఎఫ్‌ 2001లో 49.27 శాతం ఓట్లు పొందాయి.

     పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2006 వరకు జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటన సగటున 49.82 శాతం ఓట్లు పొందింది. ఏడు ఎన్నికలలో రెండు సార్లు మాత్రమే 50 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది. బెంగాల్‌, కేరళలో రెండు చోట్లా సగం మంది కంటే తక్కువ ఓటర్ల మద్దతు మాత్రమే వామపక్షాలు ఇంతకాలం పొందగలిగాయి. బెంగాల్లో గత రెండు ఎన్నికలలో వామపక్ష ఓటింగ్‌ గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి ప్రజా మద్దతు పొందటం ఎలా అన్నది ఆ పార్టీలు చూసుకుంటాయి, అది వేరే విషయం. బాగా వున్న రోజులలో కూడా వాటి బలం అంతకు మించి పెరగ లేదు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో బెంగాల్లో పోయిన పునాదిని తిరిగి సంపాదించటం ఒక సవాలైతే కేరళలో పునాదిని మరింత పెంచుకోవటం అంతకంటే పెద్ద సవాలు. కేరళలో వున్న సామాజిక పరిసిస్థితులలో 43శాతం మైనారిటీ జనాభాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని మరిచి పోరాదు. మైనారిటీలందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కానప్పటికీ వారు మెజారిటీగా వున్న ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను చూసినపుడు మతశక్తుల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో రాజీపడటం, కుమ్మక్కు కావటమే ఇప్పటివరకు దాని చరిత్రగా వుంది. ప్రపంచంలో మత ధోరణులతో పాటు నయా వుదార వాద విధానాల ప్రభావం అన్ని తరగతులలో బలంగా వ్యాపిస్తున్న తరుణమిది.అందుకే మన దేశంలో మైనారిటీ మతాలకు చెందిన కొన్ని శక్తులు బిజెపిని చూసి ఒకవైపు భయపడుతూనే మరోవైపు దానిని సమర్ధించటానికి కూడా పరిమితంగానే అయినప్పటికీ వెనుకాడటం లేదు. ఆ తరగతులలో మధనం జరుగుతోంది. దీనికి కేరళ మినహాయింపు అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిననూ పోయి రావలె హస్తినకు…..

18 Wednesday May 2016

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Chandrababu Delhi mission, Narendra Modi, special status to Andhra pradesh, tdp

చంద్రబాబు ఢిల్లీ యాత్ర విఫలం !

ఎం కోటేశ్వరరావు

   అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మరోసారి హస్థినాపురి పర్యటనకు వెళ్లి వచ్చారు. జూదంలో ఓడిపోయిన పాండవులకు చివరకు ఐదు వూళ్లు కాదుకదా సూదిమోపినంత స్థలం కూడా ఇచ్చేది లేదని కౌరవులు చెప్పినట్లుగా కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఎంతో స్పష్టంగానే చెప్పారు. కాదని చెప్పటానికి మీరెవరు. అవునన్నా కాదన్నా అగ్రజుడితోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకుంటా అన్నట్లగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, తిరిగి వచ్చారు. సాధించేదిమిటి అన్నది అర్ధంగాక రాష్ట్ర జనం జుట్టుపీక్కుంటున్నారు. తెలుగుదేశం వీరాభిమానులు కూడా వారిలో వుంటారు. కసు ఓడిపోయిన వారు కోర్టులోనే ఏడిస్తే గెలిచిన వారు ఇంట్లో ఏడ్చినట్లుగా వారు బయట పడరు అదే తేడా. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది విలేకర్లందరితో ఒకేసారి, ఒకటే అయినా ఒకే పత్రికను చదివితే ఆయనేం మాట్లాడిందీ పూర్తిగా తెలియని స్థితి.

    చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ పత్రిక ‘సాక్షి ‘(దాని ఆస్థులు ప్రభుత్వ ఆధీనంలో వున్నాయన్నారు కనుక) పత్రిక ‘ హోదాతో ఏం వస్తుంది ‘ అని చంద్రబాబు అన్నట్లు శీర్షిక పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ‘ ఆ రెండు ‘ పత్రికలలో ఒకటైన ‘ఆంధ్రజ్య్రోతి’ ‘కేంద్రానిదే బాధ్యత ‘ అనగా ‘ఈనాడు’ ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు ‘ అని ‘ప్రజాశక్తి ‘ చట్టంలోని అంశాలే ‘ అని పేర్కొన్నది. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే దింపుడు కళ్లం ఆశను కూడా చంద్రబాబు తీర్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక పెద్ద మలుపుకు నాంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం రాజకీయం ఏ రకంగా వుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్యూహాలు పన్నటానికి ప్రతి పార్టీ కొంత సమయం తీసుకోవచ్చు.లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఫోజు పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ వంటి వారు ఎలా లేస్తారు ? తెలుగుదేశం-బిజెపి తెగతెంపులు చేసుకుంటే పరస్పరం లాభమని భావిస్తాయా, కలిసి వుంటేనే కలదు సుఖం అనుకుంటాయా అన్నది స్పష్టం కావటానికి సమయం పట్టవచ్చు.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియనట్లు ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక పాకేజీ కూడా రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.గతేడాది రాజధాని శంకుస్థాపనకు ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక పాకేజిని అడిగినట్లు ప్రకటించి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత నష్ట నివారణ చర్యగా తాను పొరపాటున హోదాబదులు పాకేజి అన్నానని సవరించుకున్నారు. కేంద్రంపై వున్న భ్రమలు, దింపుడు కళ్లం ఆశతో వున్నారని అప్పుడే వెల్లడైంది. అందువలనే గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా కెలికితే తప్ప సాధ్యమైన మేరకు వాటి ప్రస్తావన రాకుండా చూసుకున్నారు, ఒక వేళ వచ్చినా బి పాజిటివ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. ఎంతైనా తెలివైన రాజకీయవేత్త కదా ! హోదా వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ వుండదని జనానికి, హోదారాకపోయినా కనీసం ఆర్ధికంగా మంచి పాకేజి ఇచ్చినా సరిపెట్టుకుంటామన్నట్లుగా కేంద్రానికి అనేక సంకేతాలు పంపారు. మరోవైపు రాజధాని నిర్మాణం, విదేశాల నుంచి భారీఎత్తున పెట్టుబడుల పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. ఎన్నిదేశాలు తిరిగినా ,ఎవరితో కూర్చున్నా వూసులు తప్ప కాసుల రాశులు రావటం లేదు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా ప్రతివారూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడుల కోసం పోటీ పడని రాష్ట్రం లేదని వారికీ అర్ధం అయింది. ఎవరైనా వూరికి దూరంగా ఇల్లు కడుతుంటే సామాన్లు వేసుకోవటానికి అవసరమైన తాత్కాలిక షెడ్డు వేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా తాత్కాలిక రాజధాని నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. అంటే శాశ్వత రాజధాని శంకుస్థాపన దగ్గరే ఆగిపోతుందన్నది స్పష్టం. తనను సవాలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోయినా తాను సృష్టించుకున్న సమస్యలే ఎంతో బలంగా చంద్రబాబును నిలదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

    ప్రత్యేక హోదా, ప్యాకేజీల వంటివి ఏమీ రాకపోయినా జనాన్ని ఏదో విధంగా జోకొట్ట వచ్చు, అందుకు గాను ముందు ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు చాణక్యంగా కనిపిస్తోంది. ఒక వేళ బిజెపి తనను వదలి పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే దానికి అంత సీన్‌ లేదని అందరికీ తెలుసు. అందులోనూ ఐదు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా అని పార్లమెంట్‌లోపలా, వెలుపలా హడావుడి చేసిన పార్టీ అది. చివరికి నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వకుండా బిజెపి ఏ మొహం పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళుతుంది.అందులోనూ దానిలో కాంగ్రెస్‌ ముఖాలే కనిపిస్తాయి. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్‌ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది, దానిని పునరుద్ధరించే నాయకత్వం కూడా లేదు. వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ విఫల ప్రతిపక్ష నేత. ఆ పార్టీని మరింతగా దెబ్బకొట్టటానికి ఒక పధకం ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తారని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగు దేశం పార్టీని కూడా ముఠాలతో మునిగి వుండే మరొక కాంగ్రెస్‌ పార్టీగా తయారు చేసినా ఒకరి జుట్టును మరొకరికి ముడివేసి తాను చక్రం తిప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సిపిని బలహీన పరిస్తే పరిపాలనలో తాను వైఫల్యం చెందినా మరొక ప్రత్యామ్నాయం వుండదు కనుక బొటాబొటా మెజారిటీతో అయినా జనం తమను తప్ప మరొకరిని ఎన్నుకొనే అవకాశం లేదన్న అంచనాతో వున్నట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ నేతలు వూహించిన విధంగా పరిణామాలు వుంటాయని చెప్పలేము. అందుకు ఒకసారి వెనక్కు తిరిగి చూడాలి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించినప్పటికీ సీట్లు పొందటంలో విఫలమైది. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరినీ కాంగ్రెస్‌ తనలో కలిపేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అయితే తెలుగు దేశం రూపంలో తన ఏకపక్ష పాలనకు తెరదించే రోజులు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం ఆనాడు కనీసంగా వూహించలేదు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిణామాలను పునరావృతం చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి దుకాణాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆయన వూహిస్తున్నట్లు లేదా చెబుతున్న విధంగా విధిలేక జనం తననే ఎన్నుకుంటారా ? ఊహించని విధంగా కొత్త శక్తులు రంగంలోకి వస్తాయా ? ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?

     దేశంలోని కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు చీవాట్లు వేసిన తరువాత కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు తప్ప ప్రత్యేక హోదా గురించి చర్చించటానికి కాదు అన్నది తెలుసుకోవాలి. ఈ సందర్బాన్ని చంద్రబాబు వుపయోగించుకొని ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక హోదా, ఇతర ఆర్ధిక సమస్యలను గురించి నివేదించారు. దీన్ని గురించి కూడా అధికారిక ప్రకటనేమీ లేదు. లీకుల సమాచారమే. ఎందుకంటే నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. వారి మధ్య ఏం నడిచిందన్నది ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ వెల్లడించి వుండాలి. ఈ భేటీ గురించి ఒక పత్రికలో ప్రధానితో చంద్రబాబు సూటిగా మాట్లాడారని రాశారు అంటే చేతులు నలుపుకోకుండా గట్టిగా అడిగారనే అర్ధం ధ్వనించే విధంగా. ఒక ప త్రిక పదినిమిషాలే సమయం ఇచ్చినప్పటికీ రెట్టింపు సమయం మాట్లాడినట్లు రాస్తే మరొక పత్రిక అరగంట సేపు అని రాసింది. ఏది నిజం.

   మొత్తం మీద హోదా, నిధుల గురించి నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు తెలుగు దేశం నాయకత్వానికి మార్గాలు వెతికేందుకు మరికొంత కాలం గడపవచ్చు. ఇప్పటికే తెలుగుదేశంపై ధ్వజమెత్తుతున్న బిజెపి రానున్న రోజులలో మరింతగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి నెపం మోపేందుకు ప్రయత్నించవచ్చు. మంగళవారం నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడిన అంశాల తీరు తెన్నులను చూస్తే బిజెపికి వ్యతిరేకంగా సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్న చంద్రబాబు మరి బిజెపి సంగతి ఏమిటంటే తాను ఎన్నికలపుడే రాజకీయాలు మాట్లాడతానని తప్పించుకున్నారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని మరొక మాట. మొత్తం మీద ప్రధానితో మాట్లాడిన తరువాత గందరగోళానికి, వత్తిడికి గురైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి.ఎవరికి ఏమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చట్టం కొందరికి చుట్టం కొందరికి దయ్యమైంది ఎందుకు ?

17 Tuesday May 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AYUSH, BJP, doctored JNU videos, forgery, JNU, reporter

సత్య

    చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టానికి చుట్టాలుగా వుంటారా ? న్యూఢిల్లీలో మేనెల రెండవ వారంలో పుష్పా శర్మ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాన్ని ఫోర్జరీ చేశారని, దానిని పత్రికలో ప్రకటించి తప్పుడు సమాచారంతో మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా దినం సందర్భంగా శిక్షకుల ఎంపికలో ఒక్క ముస్లింనుకూడా చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారమే అలా చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారన్నది పోలీసుల అభియోగం. అది నిజమే అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు.ఈ వుదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసాధారణంగా వుంది. ఆ వార్తను ప్రచురించిన పత్రిక ‘మిలీ గజెట్‌ ‘ అనే పత్రికకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందినట్లు పేర్కొన్న సదరు శర్మను అనేక మార్లు పోలీసులు ప్రశ్నించారు. ఎలాంటి వారంటు లేకుండానే అరెస్టు చేసే బెయిలు రాని సెక్షన్‌ 153ఏ కింద కేసు బనాయించారు.

     కానీ ఇదే పోలీసులు ఫిబ్రవరి నెలలో జెఎన్‌యు వుదంతంలో తిమ్మిని బమ్మిని చేసి చేయని దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా రూపొందించిన వీడియోలను పదే పదే ప్రసారం చేసిన జాతీయ టీవీ ఛానల్స్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.ఆ వీడియోల కారణంగా దేశమంతటా ప్రతిష్టాత్మక జెఎన్‌యు పరువు పోయింది, దానిలో చదువుకొనే విద్యార్ధులు దేశద్రోహులుగా దేశం ముందు ప్రదర్శితమయ్యారు. విద్యార్ధి సంఘనేత కన్నయ్య కుమార్‌తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం కేసులు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ కోర్టుల వద్ద దేశ భక్తుల ముసుగులో వున్న లాయర్లు విద్యార్ధులు, ఆవార్తలను కవర్‌ చేయటానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటాన్ని దేశమంతా చూసింది. భారత మాతాకీ జై అన్న నోళ్లతోనే విద్యార్ధుల అరెస్టులు అక్రమం అన్న మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని బెదిరించారు. దేశమంతటా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకు దోహదం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు తోడ్పడిన వీడియో టేపులను తయారు చేసిన వారు, వాటిని ప్రసారం కోట్లాది మంది జనంలో విద్వేషాన్ని నింపిన సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలు, ఆ తప్పుడు వీడియోల ఆధారంగా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు యంత్రాంగంపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతే కాదు వుమర్‌ ఖాలిద్‌ అనే విద్యార్ధికి వుగ్రవాద సంస్ధతో సంబంధాలు వున్నాయని తప్పుడు వార్తలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. తనతో పాటు అనిర్‌బన్‌ భట్టాచార్య అనే విద్యార్ధిపై ప్రచురించిన తప్పుడు వార్తల కారణంగా తాము కనిపిస్తే చంపే విధంగా జనంలో ఆగ్రహం వెల్లడైందని వారు స్వయంగా కోర్టుకు విన్నవించుకున్నారే. అంతటి తీవ్రమైన చర్యలు అక్రమాలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపించ లేదా ? ఒక జర్నలిస్టు పుష్పా శర్మ ఫోర్జరీ(రుజువు కావాల్సి వుంది) కారణంగా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే, మరో ఫోర్జరీ వీడియోల ద్వారా రాజకీయంగా లాభపడేందుకు అదే ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకేనా వీడియో అక్రమాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా స్చేచ్చకు ముంచుకు వస్తున్న ముప్పు

14 Saturday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

attacks on journalists, journalist, journalistic independence, press, press freedom, Reporters Without Borders

ఎం కోటేశ్వరరావు

    మేనెల మూడవ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్చా దినాన్ని పాటించారు. మీడియా స్వేచ్చ ప్రాధాన్యతను తెలియ చేసేందుకు ప్రతి ఏటా ఈ దినాన్ని పాటిస్తున్నారు. 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే మూడవ తేదీ వరకు ఆఫ్రికా ఖండం నైరోబీ దేశంలోని విండ్‌హాక్‌ పట్టణంలో ఆఫ్రికా ఖండ జర్నలిస్టుల సమావేశం పత్రికా స్వేచ్చ సూత్రాల గురించి ఒక ప్రకటనను ఆమోదించింది. తరువాత ఐక్యరాజ్యసమితి ఆ తీర్మానాన్ని తనదిగా స్వీకరించి ఆమోదం పొందిన మూడవ తేదీని ప్రపంచ పత్రికా దినోత్సవంగా ప్రకటించింది.ఈ ఏడాది ఈ ప్రకటనకు పాతికేండ్లు నిండటంతో పాటు ప్రపంచంలో తొలిసారిగా 1776లో స్వీడన్‌ ఆమోదించిన పత్రికా స్వేచ్చ చట్టానికి 250 సంవత్సరాలు నిండటం కూడా ఈ ఏడాదే కావటం విశేషం. ఇంతవరకు 95దేశాలు పత్రికా స్వేచ్చకు సంబంధించి ఏదో ఒక చట్టాన్ని ఆమోదించాయి. ప్రతి ఏటా ఒక దేశంలో మీడియాకు సంబంధించి ఒక ఇతివృత్తంపై ఐరాస మే మూడవ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కొలంబియాలో 1986లో తన కార్యాలయం ఎదుటనే మాదక ద్రవ్యాల మాఫియా చేతిలో గ్యూ లెర్మో కనో అనే జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. అతని సంస్మరణంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో మీడియా స్వేచ్ఛకోసం పోరాడిన జర్నలిస్టుకు బహుమతి ఇస్తోంది. ఈ ఏడాది అజర్‌బైజాన్‌ జర్నలిస్టు ఖతీజా ఇస్మాయిలోవాకు ప్రకటించారు. ఈ సందర్బంగా వివిధ దేశాలలో వున్న పరిస్థితుల గురించి చర్చలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిన్లండ్‌ రాజధాని హెల్సింకీలో ‘అందుబాటులో సమాచారం మరియు ప్రాధమిక స్వేచ్ఛలు ‘ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. వెయ్యిమందికిపైగా పాల్గొన్న జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురైన వారికి నివాళులు అర్పించారు. అనేక దేశాలలో ఇదే రోజున పలు కార్యక్రమాలు జరిగాయి.

     పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌, ఇంటర్నెట్‌ ఏ మీడియా రంగంలో పని చేస్తున్నప్పటికీ జర్నలిస్టు జీవితం అంత సులభం కాదు. కత్తిమీద సాము వంటిది. నిత్యం ప్రమాదాలు పొంచి వుంటాయి. అవి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అవినీతి,అక్రమాలు ఏవైనా సరే జర్నలిస్టులను ప్రమాదపు అంచుల వరకు తీసుకు వెళుతున్నాయి. అయినా సరే ఈ వృత్తిని ఎంచుకొనేందుకు నిబద్దులై వుండే యువతీ యువకులు ముందుకు వస్తూనే వున్నారని ఈ సందర్బంగా ప్రపంచ వ్యాపితంగా మరోసారి వెల్లడైంది.

   జర్నలిస్టులు కనిపించగానే నమస్తే చెప్పటం, పక్కకు తిరిగి నోరు బట్టని బూతులు తిట్టటం సర్వసాధారణం. అక్రమాలకు పాల్పడే శక్తులే కాదు, రాజకీయ వేత్తలు, అధికారయంత్రాంగం ఇలా ఒకరని కాదు, తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించే ప్రతి వారూ చివరకు భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జెఎన్‌యు ఘటనల సందర్బంగా భారతమాతాకు జై అంటూ ఒకవైపు నినదిస్తూనే అదే నోటితో మరోవైపు ఆ వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన, ఆ ఘటనల పట్ల విమర్శనాత్మక కధనాలు వెలువరించిన, చర్చలు నిర్వహించిన మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని కూడా బెదిరించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వుద్యోగ భద్రలేమి మరొక ప్రధాన అంశం. అధికారంలో వున్నవారికి నచ్చకపోయినా, యాజమాన్యం ఇచ్చగించకపోయినా బలౌతున్నది జర్నలిస్టులు. మీడియా స్వేచ్చ అన్నది రోజు రోజుకూ పరిమితం కావటంతో పాటు దుర్వినియోగం అవుతున్నది. యాజమాన్యాలు తమ లాభాల కోసం అనుసరిస్తున్న అక్రమ పద్దతుల కారణంగా జర్నలిస్టులు సమిధలుగా మారుతున్నారు.

    సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ(రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) గతనెలలో విడుదల చేసిన నివేదిక మీడియా స్వేచ్చ అన్ని ప్రాంతాలలో మొత్తం మీద దిగజారుతున్నది. ఈ సంస్ధ 2002 నుంచి ప్రతిఏటా నివేదికలను ప్రకటిస్తూ సూచికలను వెల్లడిస్తున్నది. దాని ప్రకారం గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లండ్‌ మీడియా స్వేచ్చలో అగ్రస్ధానంలో వుంటున్నది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్విడ్జర్లండ్‌లో భాగంగా ఫిన్లండ్‌ వుండేది. స్వేచ్ఛాయుత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై రాయటం, ప్రచురించటం మూలస్థంభాలుగా వుండాలని వుదారవాది అయిన ఫిన్నిష్‌ మతాధికారి ఆండెర్స్‌ చైడెనియస్‌ 1765లో ఒక రచనలో తన అభిప్రాయం వెల్లడించారు. జర్నలిజం మంచి చట్టాలు రూపొందించటానికి, అధికార యంత్రాంగ బాధ్యతలు, పరిమితుల గురించి సమాచారాన్ని అందించటంలో రాజ్యానికి సహాయపడుతుందని, దానినే ఒక చట్టంగా రూపొందించాలని పార్లమెంట్‌కు నివేదించాడు. అది లేకపోతే అధ్యయనం, వినయ విధేయతలు అణచివేయబడతాయని, ఆలోచనలో మొరటుతనం చోటు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు అది చట్టమైంది. అంతకు ముందు ఎక్కడా అలాంటి చట్టాలు వున్నట్లు దాఖలాలు లేకపోవటంతో ప్రపంచంలో తొలి చట్టంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు అందరికీ అందుబాటులో వుంచటం ప్రజల హక్కుగా గుర్తించటం దానిలోని ముఖ్యాంశం.ఇది జరిగి రెండువందల యాభై సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పత్రికా స్వేచ్ఛ పూర్తిగా అన్ని దేశాలలో అమలులోకి రాలేదు.

    గత పన్నెండు సంవత్సరాలలో గతేడాది మీడియా స్వేచ్చకు అత్యంత చెడ్డదిగా వుందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సూచిక వెల్లడించింది. ప్రపంచ వ్యాపితంగా మీడియా స్వేచ్ఛ ఆందోళనకరంగా వుందని, అనేక మంది ప్రపంచ నేతలు నిజమైన జర్నలిజం పట్ల ఒక విధమైన మానసిక రుగ్మతకు గురి అవుతున్నారని, భయ పూరిత వాతావరణం చర్చలు జరిపేందుకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు విముఖులను చేస్తోంది. గతం కంటే ఎక్కువగా ప్రభుత్వాలు మీడియా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యాలలో వున్న మీడియాలలో రిపోర్టింగ్‌ వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడుతున్నది.’ అని ఆర్‌ఎస్‌ఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ క్రిస్టోఫీ డెలోయిర్‌ వ్యాఖ్యానించారు. తాజా సూచికలో ప్రధమ స్ధానంలో ఫిన్లండ్‌, నెదర్లాండ్‌, నార్వే తదుపరి స్ధానాలలో వున్నాయి.

     ఖండాల వారీగా చూస్తే ఐరోపా సూచిక 19.8,ఆఫ్రికా 36.9, వుత్తర, దక్షిణ అమెరికా ఖండాలు 37.1, ఆసియా 43.8గా వుంది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు ఐరోపా, మధ్య ఆసియా 48.4, వుత్తర ఆఫ్రికా , మధ్యప్రాచ్యం 50.8 పాయింట్లతో అధమ స్ధానంలో వుంది. 2013తో పోల్చితే మొత్తం మీద సూచిక 13.6శాతం పతనమైంది. గతేడాది 3,857 పాయింట్లు వుంటే తాజాగా 3,719కి పడిపోయింది. మతపరమైన అంశాలతో సహా దీనికి అనేక కారణాలు వున్నాయి. ప్రపంచ వ్యాపితంగా కార్పొరేట్‌ శక్తులు మీడియా రంగంలో ప్రవేశిస్తూ ప్రభుత్వాలపై వత్తిడిని పెంచుతున్నాయి. కొన్ని దేశాలలో ఇంటర్నెట్‌ను అందుబాటులో లేకుండా చేయటానికి, పత్రికా ముద్రణను అడ్డుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. గత మూడు సంవత్సరాలలో ఈ సూచిక 16శాతం దిగజారింది. స్వల్ప కారణాలను సాకుగా చూపి జర్నలిస్టులను శిక్షించటానికి వీలుగా చట్ట సవరణలు కూడా ఈ కాలంలో పెరిగాయి. అధ్యక్షుడు, ప్రధానిని అమానించారనో, మత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డారని, వుగ్రవాదులకు తోడ్పడటం వంటి కారణాలను వాటిలో పొందుపరుస్తున్నారు.

      మిగతా ప్రాంతాలతో పోల్చితే ఐరోపా జర్నలిస్టులు ఎక్కువ స్వేచ్చాయుత వాతావరణంలోనే పని చేస్తున్నారు, అయితే అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. పోలాండ్‌లో కొత్త ప్రభుత్వానికి విధేయులుగా లేరనే సాకుతో ప్రభుత్వ రేడియో, టీవీ సర్వీసులనుంచి 135 మంది జర్నలిస్టులకు వుద్వాసన పలికారు. జర్నలిస్టుల వార్తా వనరుల విషయంలో పోలీసులు నిబంధనలను వుల్లంఘించిన కారణంగా బ్రిటన్‌ రేటింగ్స్‌ పడిపోతున్నాయి. టర్కీ అధ్యక్షుడిపై ఒక వ్యంగ్య పద్యాన్ని ప్రచురించినందుకు ఆదేశం కోరిక మేరకు ఒక కమెడియన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆదేశించారు. మీడియా స్వేచ్చ సూచికలో 180 దేశాలలో టర్కీ స్ధానం 151 అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో వూహించుకోవచ్చు. పత్రికా స్చేచ్చలో అగ్రగాములుగా వున్న దేశాలలో ఒకటైన స్వీడన్‌లో జర్నలిస్టులపై బెదిరింపుల కారణంగా దాని సూచిక ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. ‘ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు, ఇంటర్నెట్‌ మీడియాలో వ్యాఖ్యల విభాగాలను ఎత్తివేస్తున్నాయి.అనేక మంది జర్నలిస్టులు స్వయం సెన్సార్‌ విధించుకుంటున్నట్లు చెబుతున్నారని స్వీడిష్‌ జర్నలిజం ప్రొఫెసర్‌ ఇంగెలా వాడ్‌ బ్రింగ్‌ తెలిపారు. పనామా పత్రాలతో సంబంధం వున్న సమాచారాన్ని పన్నులు, పోలీసు అధికారులకు అందచేయాలని ఫిన్లండ్‌ ఆర్ధిక మంత్రి హుకుం జారీ చేశారు. ఇది ప్రమాదకర సంప్రదాయం అవుతుందంటూ ప్రభుత్వ మీడియా సంపాదకులు తిరస్కరించారు. హెల్సింకీలో ప్రపంచ మీడియా స్వేచ్చా పరిరక్షణ దిన సదస్సు జరుగుతుండటంతో మంత్రి తాత్కాలికంగా వెనక్కు తగ్గాడు.

    మన దేశం విషయానికి వస్తే తాజా సూచికలో 133వ స్థానంలో వున్నందుకు తల దించుకోవాలి. గతేడాది కంటే మూడు ర్యాంకులు తగ్గిందన్న మాటే గానీ ఇదేమీ గౌరవ ప్రదమైంది కాదు. వుగ్రవాదులనుంచి జర్నలిస్టులకు ఎదురవుతున్న బెదిరింపుల పట్ల ప్రధాని నరేంద్రమోడీ నిర్లిప్తంగా వున్నారని, జర్నలిస్టులను రక్షించేందుకు క్రియా విధానం లేదని,ఎప్పుడు అవకాశం వచ్చినా మీడియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక పేర్కొన్నది. మన పొరుగు దేశాల సూచికలు ఇలా వున్నాయి. చైనా 176, పాకిస్థాన్‌ 147, బంగ్లాదేశ్‌ 144, శ్రీలంక 141, ఆఫ్ఘనిస్తాన్‌ 120, నేపాల్‌ 105, భూటాన్‌ 94. ఇదే సమయంలో స్వేచ్చా ప్రపంచంగా చెప్పుకొనే అమెరికా 44, కమ్యూనిస్టు ఇనుప తెరలను బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న రష్యా 148వ స్థానంలో వుంది. ఈ నివేదికలో లోపాలు వున్నాయని అభిప్రాయం కూడా వుంది.

     అక్రమ గనుల తవ్వకాల గురించి పరిశోధించిన సందీప్‌ కొథారి అనే జర్నలిస్టును మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు.ఈ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు కొద్ది వారాలలోనే చేసిన రెండవ హత్య ఇది. ఇసుక, మాంగనీస్‌ మాఫియా గురించి రాయటమే ఆ జర్నలిస్టు చేసిన ‘తప్పిదం’. స్నేహితుడితో కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న అతనిని కారుతో ఢీకొట్టించి తరువాత కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అంతకు ముందు వుత్తర ప్రదేశ్‌లో జగేంద్ర సింగ్‌ అనే జర్నలిస్టును అతని ఇంటి వద్దే పోలీసులు సజీవ దహనం చేశారు. దేశంలో వుత్తర ప్రదేశ్‌ అత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది. జర్నలిస్టుల హత్యలను నేర సమాచారంలో ప్రత్యేకంగా పరిగణించటం లేదని హోంమంత్రి తెలిపారని, 2014లో దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక జర్నలిస్టు దాడులకు గురైనట్లు పేర్కొన్నది.

    ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు చెందిన మీడియా నుంచి సమాచారాన్ని సేకరించటం లేదు. ముఖ్యంగా మన వంటి ప్రాంతీయ భాషల మీడియా రంగంలో జరుగుతున్న దాడులను కూడా నివేదికలలో చేరిస్తే సమగ్రంగా వుంటుంది. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలు చోట్ల జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. పోలీసులు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటం కొత్త పరిణామం. దీనిపై మీడియాలో పనిచేస్తున్న వారు మేల్కొనకపోతే మరొక మెక్సికో, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాల మాదిరి పరిస్థితులు తయారయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల తీరు తెన్నులు

    ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్బంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్ధ కొన్ని వుదంతాలలో జర్నలిస్టులు ఎలా దాడులకు గురైందీ తెలిపింది. జర్నలిస్టులు తమ విధులను నిర్వహించినందుకు తప్ప వారిని వేధించటానికి మరొక కారణాలేమీ లేవని పేర్కొన్నది.’ ప్రపంచ వ్యాపితంగా జర్నలిస్టులను ఏకపక్షంగా అరెస్టు చేస్తున్నారు. పార్టీ విధానాలకు అనుగుణం లేకుండా అధికారంలో వున్న వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినందుకు గాను వారిని జైలు పాలు చేస్తున్నారు, చివరకు చంపేందుకు కూడా వెనుకాడటం లేదని సంస్ధ పరిశోధనా విభాగపు సీనియర్‌ డైరెక్టర్‌ అన్నా నెయిస్టాట్‌ వ్యాఖ్యానించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సేకరించిన వందలాది కేసులలో కొన్నింటి వివరాలు సంక్షిప్తంగా ఇలా వున్నాయి.

1.మహమ్మద్‌ అబు జైద్‌ అలియాస్‌ షకవాన్‌ ఓ ఫొటో జర్నలిస్టు. కైరోలో నిరసనల సందర్బంగా భద్రతా దళాలు సాగించిన హింసాకాండను చిత్రాలలో బంధించినందుకు మూడు సంవత్సరాల పాటు జైలులో వున్నాడు.అతనిని చిత్రహింసలు కూడా పెట్టారు.మరణశిక్ష పడటానికి వీలు కలిగించే సెక్షన్లతో బనాయించిన కేసులను అతను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.ఈజిప్టులో నిర్బంధించిన 20 మంది జర్నలిస్టులలో అతను ఒకడు.

2.ఆఫ్రికాలోని కామెరూన్‌లో బాబా వామె, రోడ్రిగ్‌ టోంగ్‌, ఫెలిక్స్‌ ఎబోల్‌ బోలా అనే ముగ్గురు జర్నలిస్టులు భద్రతా దళాలు- ఒక సాయుధ బృందం కుమ్మక్కై ఒక పట్టణంపై చేసిన దాడి గురించి వారు పరిశోధించారు.వారు సేకరించిన సమాచారం దేశ భద్రతకు ముప్పుతెచ్చే దంటూ వారికి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వం వారిపై కేసులు బనాయించింది. వార్త వనరులను చెప్పేందుకు వారు నిరాకరించారు.

3.ఖతీజా ఇస్మాయిలోవా అజర్‌బైజాన్‌లో దేశాధ్యక్షుడి కుటుంబంతో సహా అనేక మంది అక్రమాల చిట్టాను బయట పెట్టిన జర్నలిస్టు. ఆమె నోరు మూయించేందుకు అన్ని రకాలుగా బెదిరించినా ఆమె లొంగలేదు. చివరకు తప్పుడు అభియోగాలు మోపి విచారణను బూటకంగా మార్చివేసి ఏడున్నర సంవత్సరాల శిక్ష వేసి జైలులో పెట్టారు.

4. ఆఫ్రికాలోని బురుండీలో ఒక వున్నత సైనికాధికారిని హత్య చేసిన వుదంతంలో ఫొటోలు తీసినందుకు గాను ఎడ్రాస్‌ దికుమానా అనే జర్నలిస్టును అరెస్టు చేశారు.చిత్రహింసల పాలు చేశారు. ప్రస్తుతం అతను ప్రవాసంలో వున్నాడు. తమ పట్ల విమర్శనాత్మకంగా వున్నారనే దుగ్దతో పాలకపార్టీ జర్నలిస్టులు,ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడింది. గతేడాది ఒక తిరుగుబాటు సందర్బంగా నాలుగు ప్రయివేటు రేడియోస్టేషన్లను పోలీసులు ధ్వంసం చేశారు.

5. అనాబెల్‌ ఫ్లోరెస్‌ సలజార్‌, మెక్సికోలో ఒక పత్రిక క్రైమ్‌ రిపోర్టర్‌.ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యచేశారు. సాయుధులైన వ్యక్తులు ఆమెను ఇంటి నుంచి తీసుకు వెళ్లి చంపివేశారు. గత ఆరు సంవత్సరాలలో మెక్సికోలో 17 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

6. అంగోలాలో సెడ్రిక్‌ కార్‌వాలో, డోమింగోస్‌ డా క్రజ్‌ అనే ఇద్దరు జర్నలిస్టులను మరో 15 మందితో కలిపి అరెస్టు చేశారు. వారు చేసిందేమీ లేదు ప్రజాస్వామ్యం, స్వేచ్చ గురించి చర్చించుకోవటమే. తిరుగుబాటుకు సన్నాహంగా కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

7.థాయ్‌లాండ్‌లో రాజకుటుంబాన్ని విమర్శించే రెండు వ్యాసాలను ప్రచురించినందుకు సోమయోట్‌ అనే సంపాదకుడికి పది సంవత్సరాల జైలు శిక్ష వేశారు.

8. పత్రికలో వచ్చిన రెండు వార్తాకధనాల ద్వారా అధికారిక రహస్యాలను వెల్లడించారనే పేరుతో కంహరియత్‌ పత్రిక సంపాదకుడు కన్‌ దుండర్‌, ఒక విలేకరిని టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసింది. సిరియాలోని సాయుధ ముఠాలకు టర్కీ సైన్యం మానవతా పూర్వక సాయం ముసుగులో ఆయుధాలను ఎలా అందించిందన్నదే వాటి సారాంశం.

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాసపత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జై నీల్‌- జై లాల్‌ నినాదం అర్థం ఏమిటి ?

12 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Social Inclusion

≈ 1 Comment

Tags

Ambedkarists, Buddha, caste discrimination, caste system, communist manifesto, Communists, jai lal, jai neel, jyothiba phule, karal marx, sc, scheduled castes, st's

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాస్తిక వాదం గురించి ఆస్థికులు ఆవేదన చెందటం చిత్రమే మరి !

08 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Opinion, RELIGION, Religious Intolarence

≈ 3 Comments

Tags

ATHEISM, athists, believers, Communists

ఎం కోటేశ్వరరావు

    నాస్తిక వాదం నలిగిపోతోందా అనే శీర్షికన మే ఐదవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గీతాంజలి మూర్తి కొన్ని అంశాలను లేవనెత్తారు.నిరతంతరంగా జరిగే నాస్తిక, ఆస్థిక వాదం చర్చలో అనేక మంది లేవనెత్తుతున్న పాత విషయాలే అవి. నాస్తికులైన తండ్రుల బిడ్డలు ఆస్థికులుగా ఎందుకు మారుతున్నారు? అంటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, శ్రీశ్రీ, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి వంటి పేర్లను ప్రస్తావించారు.తరిచి చూస్తే వారి ప్రశ్నలోనే సమాధానం వుంది. పైన పేర్కొన్న ప్రముఖ నాస్థికుల తలిదండ్రులందరూ మామూలు ఆస్థికులు, ఆ కుటుంబాలలో అంతకు ముందేమీ పండిత చర్చలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటపుడు వారి బిడ్డలు ప్రముఖ నాస్థికులుగా ఎలా మారారు, మూర్తిగారు స్వయంగా హేతువాది అయిన ఆస్థికుడిని అని చెప్పుకున్నారు, వారి తలిదండ్రులు ఏ భావజాలంతో వుండేవారో తెలియదు. మరి ఆయనెందుకు అలా మారారు? ఎందుకు అని ప్రశ్నించుకొని సరైన సమాధానం పొందేవరకు వదలని తత్వం నాది అని మూర్తిగారు అన్నారు కను సమాధానం ఏం పొందారో కూడా ఆయనే చెప్పి వుండాల్సింది.లేక నాస్థికుల నుంచి సమాధానం వచ్చే వరకు వదలను అని చెబుతున్నారా ? ఆయన చెప్పినట్లు నిజంగా హేతువాదే అయి వుంటే ఆస్థికుడిగా వుండే వారే కాదు, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

   ఆస్థిపాస్తులకు, భావజాలానికి వారసత్వం వుంటుంది. కానీ రెండింటికీ మౌలిక తేడా వుంది. తలిదండ్రుల ఆస్థులపై బిడ్డలకు లేదా దాయాదులకు వారసత్వం హక్కుగా వస్తుంది. కానీ భావజాలం కొనసాగింపు బిడ్డల, ఇతర కుటుంబ సభ్యుల హక్కు లేదా బాధ్యత, విధి కాదు. ఎలా అంటే మూర్తిగారు నాస్థికులను సమర్ధిస్తూనో, విమర్శిస్తూనో ఒక పెద్ద గ్రంధం రాస్తే దాని ప్రచురణపై ఆయన వారసులకు కాపీ రైట్‌ చట్ట ప్రకారం హక్కు వుంటుంది. అంతమాత్రాన దానిలో పేర్కొన్న భావజాలానికి వారు కట్టుబడి వుండాలని లేదు. ఆ పుస్తకం అచ్చువేస్తే వచ్చే డబ్బుకు మాత్రమే వారసులు, కానీ దానిలోని భావజాలానికి నిబద్దులైన ఇతరులు వారసులు అవుతారు.

   కారల్‌ మార్క్స్‌ తంaడ్రి లాయర్‌ ,తన బిడ్డను కూడా లాయర్‌ను చేయాలనుకున్నాడు. కానీ ప్రపంచగతినే మార్చే ఒక అపూర్వ తత్వశాస్త్రానికి ఆద్యుడు అయ్యాడు. మార్క్స్‌తో పాటు విడదీయరాని మేథావి ఎంగెల్స్‌. ఆయనొక పెట్టుబడిదారుడి తనయుడు. కానీ ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు తన ఫ్యాక్టరీ నుంచే పాఠాలు తీసుకున్నాడు. కారల్‌ మార్క్స్‌ను వివాహం చేసుకున్న జెన్నీ రాజకుటుంబాల నుంచి వచ్చిన యువతి. మార్క్స్‌ను వివాహం చేసుకొని జీవితాంతం అష్టకష్టాలను ఎందుకు అనుభవించింది? మధ్యలోనే విడాకులిచ్చి మరొక ధనవంతుడిని వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి వన్నీ ఎందుకు జరుగుతాయో మూర్తి వంటి వారు అర్ధం చేసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం కూడా దొరుకుతుంది.

     భాగవతాన్ని నమ్మటమా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిలో పేర్కొన్న హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి. కుమారుడు విష్ణు భక్తుడు. వారికి ఆస్థి, రాచరికం దగ్గర పేచీ రాలేదు, విష్ణువును కొలవటమా లేదా అన్న భావజాలం దగ్గరే వచ్చింది. అందువలన ఆస్థికుల పిల్లలు నాస్తికులుగా మారినా, అటుదిటు అయినా, పెట్టుబడిదారుల కొడుకులు కార్మికవర్గ పక్షపాతులైనా, లేదా ఏమీ లేని వారు పెట్టుబడిదారులుగా మారి ఆ భావజాలాన్ని అనుసరించినా ఆయా కాలాల్లో వుండే అనేక పరిస్థితులు, ముందుకు వచ్చిన అంశాల ప్రభావం వారిపై పడుతుంది.ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ భావజాలాన్ని అలవరుచుకుంటారు. త్రిపురనేని రామస్వామి నాస్తికుడిగా, హేతువాదిగా మారిన సమయంలో ఆంధ్రదేశంలో, కృష్ణా.గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా వున్నా ఆయన కమ్యూనిస్టుగా మారలేదు. అదే సమయంలో అనేక మంది నాస్తికులు కమ్యూనిస్టులుగా మారారు. అంత మాత్రాన ఇతర భావజాలాలు అంతరించినట్లో నలిగిపోయినట్లో అవుతుందా ? తమిళనాడులో డిఎంకె నేతలు గుడులు,గోపురాలకు వెళ్లినంత మాత్రాన నాస్తికత్వ వాదం నశిస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం వుండదు.

    మనది వేద భూమి అంటారు కొందరు. వేదాలు వునికిలోకి వచ్చినపుడే వాటిని వాటిని తిరస్కరించిన హేతువాదులు కూడా ఇక్కడే పుట్టారు, అందువలన హేతు భూమి అని కూడా ఎందుకు పిలవకూడదు? బుద్దుడు కూడా ఇక్కడే పుట్టినందున కొందరు బుద్ధ భూమి అనటం లేదా ? వేద ప్రమాణాన్ని తిరస్కరించిన చార్వాకులు, లోకాయతులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా ధ్వంసం చేశారు. అయితేనేం తరువాత వేమన అవతరించలేదా, ఆ చార్వాక, లోకాయత, వేమన్నవాద భావజాల వారసులు దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారా లేదా ? వేదాలను నమ్మేవారు ఎక్కువ, నాస్తికులు, హేతువాదులు తక్కువ ఎందుకు వున్నారు అని ఎవరైనా అడగొచ్చు. వేదాలు కొన్ని దేశాలు, ప్రాంతాలకే పరిమితం, అన్ని రకాల మతాలను,దేవుళ్లను వ్యతిరేకించే నాస్తికులు, హేతువాదులు ప్రపంచవ్యాపితంగా వున్నారు. గరిటెడైనను చాలు గంగిగోవు పాలు అన్న వేమన్న సమాధానం వుండనే వుంది. ఎవరూ విత్త కుండానే వర్షాలు పడి, రుతువు రాగానే అనేక మొక్కలు మొలుస్తాయి, వాటిలో పనికిరాని కలుపు , ప్రయోజనం చేకూర్చే మంచి మొక్కలూ వుంటాయి. అదే వర్షాలు లేకపోతే ఆ విత్తనాలు అలాగే భూమిలో వుండిపోతాయి. అలాగే ఏ భావజాల వ్యాప్తికైనా పరిస్థితులు దోహద పడాలి. అది ఎంతకాలం అంటే ఎవరు చెబుతారు.మూర్తిగారే అన్నట్లు హిందూ మత పూర్వ వైభవం తెచ్చుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఎవరినైనా చెప్పమనండి !

     హేతువాదుల ఇండ్లలో ఇతర కుటుంబ సభ్యులు పూజలు, పునస్కారాలు చేయటం గురించి ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులనే మార్చటంలో ఎందుకు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. ఇది వినటానికి ఇంపుగానే వుంటుంది. మొదటి విషయం నాస్థికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మిగతావారికంటే అత్యంత ప్రజాస్వామిక వాదులు. తమ భావాలను కుటుంబ సభ్యులతో సహా ఇతరులపై రుద్దరు. మోతీలాల్‌ నెహ్రూ మితవాది, ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ కాంగ్రెస్‌లో అతివాది అయ్యాడు. కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య భూస్వామిక కుటుంబంలో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పచ్చి మితవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.లోకసభ స్పీకర్‌గా,సిపిఎం అగ్రనేతగా వున్న సోమనాధ్‌ చటర్జీ తండ్రి ఒక పెద్ద లాయర్‌, హైకోర్టు జడ్జి. అంతకు మించి ఆయన హిందూ మహాసభ నాయకుడు. సుందరయ్య,నంబూద్రిపాద్‌, సోమనాధ్‌లు కమ్యూనిస్టులు కాకుండా చేయటంలో వారి కుటుంబ పెద్దలు ఎందుకు విఫలమయ్యారు?

    మతం కూడా ఒక భావజాలమే. ప్రముఖ బిజెపి నాయకులు, సంఘపరివార్‌ పెద్దలు ముస్లింలు లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూ యువతులను వివాహమాడి, మతమార్పిడి చేస్తున్నారంటూ ముస్లిం మత భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం గగ్గోలు పెడుతుంటారు.అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, తొగాడియా,సుబ్రమణ్యస్వామి అలాంటి ఎందరో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు ముస్లింలను వివాహం చేసుకుంటుంటే ఎందుకు ఆపలేకపోయారు? ఇతరులకు ఎందుకు నీతులు చెబుతున్నారు? అందుకని చర్చను అలాంటి వైపు తిప్పితే ప్రయోజనం లేదు. ఏ వాదంలో అయినా దాని మంచి చెడ్డలను చర్చించటం మంచిది.

     భారత దేశాన్ని మొగలాయీలు ఆక్రమించినపుడు స్వాతంత్య్రం కావాలన్న వాంఛ దేశ ప్రజలలో పుట్టలేదు, బ్రిటీష్‌ వారు ఆక్రమించిన తరువాత కూడా చాలా కాలం వరకు కలగలేదు. ప్రధమ స్వాతంత్య్ర పోరాటం తరువాత కూడా దేశంలో అంతగా జ్వాల రగలలేదు. అంత మాత్రాన 1857 తిరుగుబాటు విఫలమైనట్లు కాదు. కాంగ్రెస్‌ ఏర్పడిన వెంటనే జనం కుప్పలు తెప్పలుగా వుద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు బ్రిటీష్‌ వాడి పాలనే బాగుందని చెప్పిన వారు మనకు ఎందరో తెలుసు. అందువలన ఒక భావజాలాన్ని మెజారిటీ అంగీకరించి అనుసరించనంత మాత్రాన అది విఫలమైనట్లు , మెజారిటీ ఆమోదించిన భావజాలాలన్నీ సఫలమైనట్లూ కాదు. హిందూమతంపై తిరుగుబాటుగానే బౌద్దం అవతరించింది. అది మన దేశంలో ఆదరణ పొందలేదు, అంత మాత్రాన అది విఫలమైనట్లా ? తరువాతనే మన దేశంలోకి ఇస్లాం, క్రైస్తవం వచ్చాయి.ఎందరో బలహీనవర్గాల వారు ఆ మతాలపట్ల ఆకర్షితులయ్యారు. మెజారిటీగా వున్న హిందూమతం లేదా దానిని కాపాడాలని కంకణం కట్టుకున్న పెద్దలు ఎందుకు ఆ పరిణామాన్ని నివారించలేకపోయారు?

    నాస్తికత్వం, హేతువాదం, భౌతిక వాదం వీటన్నింటినీ కొంతమంది ఒకే గాటన కడుతున్నారు. వాటిలో అనేక అంశాలు ఒకటిగా వుండటం ఒక కారణం. ఈ మూడు వాదాలతో ప్రభావితులైన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కానీ కమ్యూనిస్టులు ఈ మూడు అంశాలను కలిగి వుంటారు. వాటిని జనంలో కలిగించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కమ్యూనిస్టులుగా వుండి మూఢనమ్మకాలను, తిరోగమన భావాలను ప్రోత్సహిస్తే తప్పు. అయితే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేరటానికి ఈ అంశాలను షరతులుగా పెట్టటం లేదన్నది తెలుసుకోవాలి.అంటే పార్టీలో ఆస్థికులు,నాస్థికులూ అందరూ వుంటారు. ఎవరైనా దేవాలయం, మసీదు, చర్చికో వెళుతూ మరోవైపు దోపిడీ లేని సమసమాజం కావాలని కోరుకుంటే అలాంటి వారిని ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సభ్యులుగా వద్దంటే అంతకంటే పిచ్చిపని మరొకటి వుండదు. మా మతం కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని వ్యతిరేకించమని చెప్పింది అంటేనే పంచాయతీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మతాలు పుట్టినపుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదు.అందువలన మతాలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది? తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అలాంటి వారిని పార్టీలు అంగీకరించవు. పార్టీ సభ్యులుగా చేరిన తరువాత వేల సంవత్సరాలుగా వచ్చిన అనేక అన్యవర్గ ధోరణులను పోగొట్టటానికి ప్రయత్నిస్తారు. అయితే అది అన్ని చోట్లా, అందరూ ఒకే విధంగా చేయకపోవచ్చు. అలాంటివి ఏవైనా వుంటే సద్విమర్శలు చేయాలి. ఒక కమ్యూనిస్టు సంస్మరణ సభలో కొందరు వక్తలు బొట్లు పెట్టుకొని జోహార్‌ కామ్రేడ్‌ అనటం చూసి అవాక్కయ్యానని మూర్తిగారు రాశారు. సంస్మరణ సభ కనుక ఇతరులు ఎవరైనా వచ్చి అలా చేసి వుండవచ్చు.దానికి అవాక్కవ్వాల్సిందేముంది. ఎవరైనా బొట్టుపెట్టుకో కూడదని కమ్యూనిస్టుపార్టీ ఎక్కడైనా చెప్పిందా ? సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాండ్రైన బృందాకరత్‌, సుభాషిణీ అలీ పెద్ద బొట్లు పెట్టుకోవటం లేదా ? మతాలు, మతాచారాలు మాత్రమే అలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

     అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్నట్లు దైవశక్తి ఆస్థికుల అనుభవంలోకి రావటాన్ని నాస్తికవాదులు ఎన్నిరాసినా అడ్డుకోలేరు అని ఒక నిర్ధారణ చేశారు. ఆస్థికులలో కూడా మేథావులు వున్నారని మరువరాదు అన్నారు. మొదటి విషయం, ఆస్థికులలో మేథావులు వుండరని నాస్తివాదం చెప్పలేదు. కొద్ది మందిగా వున్న నాస్థిక, హేతువాద మేథావుల వైఫల్యం గురించి మూర్తిగారు సంతోష పడుతున్నారు ఓకే. వేల సంవత్సరాలనాడే వుద్భవించిన నాస్థిక వాదం ఇప్పటికీ వునికిలో వుందంటే అత్యధికులుగా వున్న ఆస్థిక మేథావులు, పండితులు, మతాధికారులు, వారి రాజపోషకులు, కొత్తగా టాటా , బిర్లావంటి పెట్టుబడిదారీ పోషకుల వైఫల్యం కనపడటం లేదా ? హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన అనేక మంది ఆస్థిక మేథావులు ఎందుకు విఫలమయ్యారు. వీధికొక దొంగబాబా పుట్టుకు వచ్చి మతం పేరుతో దండుకుంటుంటే ఎందుకు నివారించలేకపోయారు ? వెర్రి మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు? ఇది వైఫల్యం కాదా ?

    శంకరాచార్యుడు తన వాదనా పటిమతో అనేక మందిని బౌద్ధం నుంచి మళ్లించి హిందూ మతానికి పూర్వ వైభవం తెచ్చారు అని మూర్తిగారు చెప్పారు. ఇది ఘర్‌ వాపసీ ప్రచార ప్రభావంగా కనిపిస్తోంది. ఆ శంకరాచార్యుడు పుట్టిన కేరళలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత మంది క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎందుకు ఆ మతాలవారు విస్తరించారు? ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల అనేక మంది హిందూ నుంచి ఇతర మతాలకు ఎందుకు మారిపోతున్నారు? ఆస్థికులు అంటే ఒక్క హిందువులే కాదు, దైవాన్ని, దైవదూతలను నమ్మే ఇతర మతాల వారు కూడా ఆస్థికులే. వారు మార్చుకొనేది మతం తప్ప ఆస్తికత్వాన్ని కాదు, అయినా ఎందుకు ఆ మార్పిడులపై ఎందుకు అంత రగడ చేస్తున్నారు? ఆస్థికులలో ప్రజాస్వామ్యం లేదా ?

     చివరగా ఒక్క మాట నాస్థికులు,హేతువాదులు, భౌతిక వాదులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వేల సంవత్సరాల నుంచి మా విశ్వాసం, మనోభావాలు అంటారు తప్ప సరైన సమాధానం చెప్పటంలో ఆస్థికులు విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో తమ వ్యతిరేక భావాలను,చర్చలు, వాదనలను కూడా సహించటం లేదు. దబోల్కర్‌, పన్సారే,కులుబుర్గి వంటి నాస్థిక,హేతువాదుల్ని హతమార్చారు. ఇంకా అనేక మందిని అదే చేస్తామని బెదిరిస్తున్నారు. వారి హత్యలను ఆస్థికులుగా వున్న ప్రముఖులు ఏ మతం వారైనా ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వారి వాదనలు ఆస్థికవాద మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, అహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది ఈనాటిది కాదు, చార్వాకులు,లోకాయతుల నుంచి జరుగుతున్నదే. హిందూ మతానికి ఒక సాధికార కేంద్రమే లేదు. అందువలన హిందూమతావలంబకులు, దానిని కాపాడాలనుకొనేవారు, ముందు ఎవరు సాధికారులో తేల్చుకొని విశ్వాసం, మనోభావాలను కాసేపు పక్కన పెట్టి ఆ పండితులు, మతాధిపతులతో శాస్త్రీయమైన పద్దతులలో చర్చలు జరిపి నాస్థికవాదం తరతరాలుగా ‘ఎందుకు’ వునికిలో వుంటున్నదో, ఇప్పటి వరకు హిందూ మతం పేరుతో జరిగిన తప్పులను, ఇప్పటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, వివక్ష, వంటి సవాలక్ష అవలక్షణాలను, మతం పేరుతో బాబాలు,యోగులు,యోగినులు భారీగా ఆస్థులను పోగేసుకోవటాన్ని ఎలా అరికట్టాలో తేల్చి ప్రకటించాలి.మనుషులను మనుషులుగా చూస్తారనే భరోసా కలిగించాలి. అప్పుడే జనానికి మతం మారాలన్న ఆలోచన వుండదు. మతాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు ఆ పని చేస్తామంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఏమతం అయినా కావచ్చు, జనం ఇతర మతాలోక్లి మారుతున్నారన్న దుగ్దకంటే మన మతంలోకి ఇతరులను ఎలా ఆకర్షించాలనే విషయంలో అన్ని మతాలూ పోటీ పడటం ఆరోగ్యకర లక్షణం.అలాగాక దాడులకు దిగటం బలహీనత, అనాగరిక లక్షణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

The transit of Mercury over the disk of the Sun on Monday, May 9, 2016

03 Tuesday May 2016

Posted by raomk in Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Science

≈ Leave a comment

Tags

Sun, The transit of Mercury, The transit of Mercury over the disk of the Sun

 

A transit of Mercury over the disc of the Sun will take place in the afternoon of May 9, 2016 (19 Vaishakha, 1938 Saka Era). This transit phenomenon will be visible from India.

This phenomenon takes place when the planet Mercury will be seen as a small black dot travelling from one limb of the solar disc to the other.

From the Earth this phenomenon is seen when the Mercury passes between the Sun and the Earth. This happens only when the Sun, the planet Mercury and

the Earth are lined up in one plane. The Mercury appears as a dot on the solar disc because its angular size is very small compared to that of the Sun as seen

from the Earth.

The transit begins with Contact-I, the instant when the disc of the planet Mercury is externally tangent with the Sun (Ingress exterior) followed by Contact-II

when the Mercury is internally tangent with the Sun (Ingress interior). The Mercury will be seen as a black spot, traveling several hours over the face of the disc,

will reach the opposite limb of the Sun at Contact-III, when the disc of the planet Mercury is internally tangent with the Sun (Egress interior). Finally,

the transit ends at Contact-IV when the disc of the planet Mercury is externally tangent with the Sun (Egress exterior).

The phenomenon is a relatively rare one which occurs 13 or 14 times in a century. It occurs in the month of May and November. The interval between

one November transit and next November transit may be 7, 13 or 33 years whereas the interval between one May transit and the next May transit may be 13 or 33 years.

The transit of Mercury will be visible from most of Asia (except south eastern parts and Japan), Europe, Africa, Greenland, South America,

North America, Arctic, North Atlantic Ocean and most of the Pacific Ocean. The entire transit, from beginning to end, will be visible from eastern

North America, northern South America, the Arctic, Greenland, extreme northwestern Africa, western Europe, and the North Atlantic Ocean.

In India, the beginning of the event comprising of Ingress exterior (Contact-I) and Ingress interior (Contact-II) will be visible from all places. The duration of the

entire transit event will be about 7 hour and 30 minutes. The observer in India will not see the ending of the event as the same will be in progress after sunset.

Depending upon the sunset time of different places in India, the observer located in the extreme east of the country will see the event about 1 hour from

the beginning and the observer located in the extreme west of the country will see the event about 2 hours and 45 minutes from the beginning.

 

In Delhi, the event can be seen for a duration of about 2 hours 20 minutes as it will start at 16h 41m IST and sunset will take place at 19h 01m IST.

Similarly, in Kolkata the event will start at 16h 41m IST and it can be seen for a duration of about 1 hour 26 minutes, in Mumbai the event will start

at 16h 41m IST and it can be seen for a duration of about 2 hours 24 minutes, in Chennai the event will start at 16h 41m IST and it can be seen for a

duration of about 1 hour 45 minutes.

A table related to local circumstances of some places in India is appended below for ready reference.

LOCAL CIRCUMSTANCES RELATING TO CERTAIN PLACES IN INDIA

 

Place Ingress

Exterior

contact

Ingress

Interior

contact

Egress

Interior

contact

Egress

Exterior

contact

Sunset Duration
h      m    s h      m    s h   m h   m
Agartala 16   40   33.6 16   43   45.6 **   ** **   ** 17   57 1   16
Ahmedabad 16   40   45.5 16   43   57.0 **   ** **   ** 19   12 2   31
Aijawl 16   40   33.1 16   43   45.1 **   ** **   ** 17   52 1   11
Ajmer 16   40   45.3 16   43   56.9 **   ** **   ** 19   09 2   28
Allahabad 16   40   39.5 16   43   51.3 **   ** **   ** 18   39 1   58
Amritsar 16   40   48.4 16   44   00.1 **   ** **   ** 19   17 2   36
Bangalore 16   40   37.8 16   43   49.4 **   ** **   ** 18   37 1   56
Bhagalpur 16   40   36.5 16   43   48.4 **   ** **   ** 18   18 1   37
Bhopal 16   40   41.4 16   43   53.1 **   ** **   ** 18   53 2   12
Bhubaneswar 16   40   34.5 16   43   46.3 **   ** **   ** 18   15 1   34
Cannanore 16   40   39.5 16   43   51.0 **   ** **   ** 18   44 2   03
Chandigarh 16   40   46.2 16   43   57.9 **   ** **   ** 19   06 2   25
Chennai 16   40   35.8 16   43   47.4 **   ** **   ** 18   26 1   45
Cochin 16   40   38.5 16   43   49.9 **   ** **   ** 18   37 1   56
Cooch Behar 16   40   35.9 16   43   47.9 **   ** **   ** 18  0 9 1   28
Cuttack 16   40   34.5 16   43   46.3 **   ** **   ** 18   15 1   34
Darjeeling 16   40   36.9 16   43   48.9 **   ** **   ** 18   15 1   34
Dehradun 16   40   45.0 16   43   56.7 **   ** **   ** 19   01 2   20
Delhi 16   40   44.4 16   43   56.1 **   ** **   ** 19   01 2   20
Dibrugarh 16   40   34.7 16   43   46.8 **   ** **   ** 17   48 1   07
Dwarka 16   40   48.3 16   43   59.7 **   ** **   ** 19   24 2   43
Gandhinagar 16   40   45.5 16   43   57.0 **   ** **   ** 19   12 2   31
Gangtok 16   40   36.9 16   43   48.9 **   ** **   ** 18   14 1   33
Gaya 16   40   37.2 16   43   49.0 **   ** **   ** 18   25 1   44
Guwahati 16   40   35.0 16   43   47.0 **   ** **   ** 18   01 1   20
Haridwar 16   40   44.7 16   43   56.4 **   ** **   ** 19   01 2   20
Hyderabad 16   40   38.2 16   43   49.8 **   ** **   ** 18   39 1   58
Imphal 16   40   33.3 16   43   45.3 **   ** **   ** 17   49 1   08
Itanagar 16   40   35.0 16   43   47.1 **   ** **   ** 17   54 1   13
Jaipur 16   40   44.6 16   43   56.2 **   ** **   ** 19   05 2   24
Jalandhar 16   40   47.8 16   43   59.4 **   ** **   ** 19   13 2   32
Jammu 16   40   49.2 16   44   00.9 **   ** **   ** 19   19 2   38
Kanyakumari 16   40   37.4 16   43   48.9 **   ** **   ** 18   31 1   50
Kavalur 16   40   36.7 16   43   48.2 **   ** **   ** 18   31 1   50
Kavaratti 16   40   41.8 16   43   53.2 **   ** **   ** 18   53 2   12
Kohima 16   40   33.7 16   43   45.8 **   ** **   ** 17   49 1   08
Kolkata 16   40   34.2 16   43   46.0 **   ** **   ** 18   07 1   26
Kozikode 16   40   39.2 16   43   50.7 **   ** **   ** 18   42 2   01
Lucknow 16   40   40.8 16   43   52.6 **   ** **   ** 18   44 2   03

 

“** **” indicates the event occurs after sunset.

 

LOCAL CIRCUMSTANCES RELATING TO CERTAIN PLACES IN INDIA

 

Place Ingress

Exterior

contact

Ingress

Interior

contact

Egress

Interior

contact

Egress

Exterior

contact

Sunset Duration
h      m    s h      m    s h   m h   m
Madurai 16   40   36.9 16   43   48.4 **   ** **   ** 18   30 1   49
Mangalore 16   40   40.3 16   43   51.7 **   ** **   ** 18   48 2   07
Mount Abu 16   40   46.0 16   43   57.6 **   ** **   ** 19   14 2   33
Mumbai 16   40   43.6 16   43   55.1 **   ** **   ** 19   05 2   24
Murshidabad 16   40   35.1 16   43   47.0 **   ** **   ** 18   10 1   29
Muzaffarpur 16   40   37.7 16   43   49.6 **   ** **   ** 18   25 1   44
Mysore 16   40   38.6 16   43   50.0 **   ** **   ** 18   40 1   59
Nagpur 16   40   39.1 16   43   50.7 **   ** **   ** 18   42 2   01
Nasik 16   40   43.2 16   43   54.7 **   ** **   ** 19   03 2   22
Panaji 16   40   41.5 16   43   53.0 **   ** **   ** 18   55 2   14
Patna 16   40   37.4 16   43   49.3 **   ** **   ** 18   24 1   43
Pondicherry 16   40   36.0 16   43   47.5 **   ** **   ** 18   27 1   46
Port Blair 16   40   28.7 16   43   40.6 **   ** **   ** 17   35 0   54
Pune 16   40   42.6 16   43   54.1 **   ** **   ** 19   00 2   19
Puri 16   40   34.2 16   43   46.0 **   ** **   ** 18   14 1   33
Raipur 16   40   37.4 16   43   49.2 **   ** **   ** 18   33 1   52
Rajkot 16   40   46.9 16   43   58.3 **   ** **   ** 19   18 2   37
Ranchi 16   40   36.1 16   43   48.0 **   ** **   ** 18   20 1   39
Shillong 16   40   34.5 16   43   46.5 **   ** **   ** 17   59 1   18
Shimla 16   40   46.2 16   43   58.0 **   ** **   ** 19   06 2   25
Silchar 16   40   33.6 16   43   45.7 **   ** **   ** 17   54 1   13
Siliguri 16   40   36.5 16   43   48.4 **   ** **   ** 18   13 1   32
Silvassa 16   40   43.7 16   43   55.2 **   ** **   ** 19   05 2   24
Srinagar 16   40   50.4 16   44   02.1 **   ** **   ** 19   22 2   41
Sringeri 16   40   39.7 16   43   51.2 **   ** **   ** 18   46 2   05
Tamelong 16   40   33.6 16   43   45.7 **   ** **   ** 17   50 1   09
Thanjavur 16   40   36.2 16   43   47.7 **   ** **   ** 18   27 1   46
Thiruvanantapuram 16   40   38.1 16   43   49.5 **   ** **   ** 18   34 1   53
Udaipur 16   40   45.1 16   43   56.7 **   ** **   ** 19   10 2   29
Ujjain 16   40   42.8 16   43   54.4 **   ** **   ** 18   59 2   18
Vadodara 16   40   44.4 16   43   55.9 **   ** **   ** 19   07 2   26
Varanasi 16   40   38.5 16   43   50.3 **   ** **   ** 18   32 1   51

 

“** **” indicates the event occurs after sunset

 The last transit of Mercury occurred on 6 November, 2006 when just end of the event was visible from the extreme north eastern parts of India at the time of

sunrise.  The next transit of Mercury will take place on 11 November, 2019 but the event will not be seen from India as the same will begin after the sunset

time of all places in India. The transit of Mercury on 13 November, 2032 will be visible again from India.

 

The apparent diameter of Mercury will be nearly 12 arc-second which is 1/158 of Sun’s apparent diameter. Thus, it will be difficult to see the Mercury at

transit over the face of the Sun without optical magnification. This event can be viewed with the help of binocular or telescope attached with proper solar

filter or by making projection of the Sun’s image on a white board by telescope. The Sun should never be viewed with the naked eye. Safe technique to

observe is by using filter like aluminized mylar, black polymer or welding glass of shade number 14.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ- చంద్రబాబు ప్రత్యేక హోదా రాజకీయ క్రీడలో అమాయక ఆంధ్రులు

01 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Narendra Modi, pavan kalyan, special status, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   మూడు ఆకర్షణలు-ఆరు ఫిరాయింపులుగా లాహిరి లాహిరిలో ఓ హో జగ(నే)మే వూగెనుగా వూగెనుగా అంటూ ఆనందంతో తేలియాడుతున్నపుడు అంతరాయం కలిగిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? వున్న రెండు కళ్లలో ఒకదానిని పొడుస్తున్నా ఎంతో సహనంగా అదీ మనమంచికే అన్నట్లు ,తాపీగా కుమారుడు లోకేష్‌కు అధికార పదవిని ఎలా, ఎపుడు కట్టబెట్టాలా అని చూస్తున్న చంద్రబాబుకు మధ్యలో అంతరాయం కలిగిస్తే చిరుకోపం కూడా రాకుండా వుంటుందా ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రహోదా గురించి మరిచి పొమ్మని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టం చేసిన తరువాత ‘ ఏ మాటలవి ‘ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తమలపాకుతో చంద్రబాబు నాయుడు చిరుకోపం ప్రకటించారు. మామ వాగ్దానం నెరవేర్చనందుకు కాదు, తోడల్లుడు కిసుక్కు మన్నందుకు అన్నట్లు ఇంతకాలం ఏమీ చేయకపోగా దాని గురించి మరిచిపోండి అన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వదలి కేసుల కోసం తప్ప ఏనాడైనా జగన్‌ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లారా అని చంద్రబాబు ఆగ్రహించారు. జగన్‌ తన కేసుల కోసమే తిరుగుతున్నారనుకుందాం. అందులో తప్పేముంది? కేంద్రంలో వున్న చంద్రబాబు మిత్ర పక్షం, స్వయంగా తెలుగు దేశం మంత్రులు కాబినెట్‌లో వున్నారు. అందువలన జగన్‌ ఢిల్లీ వచ్చి తన కేసుల గురించి ఏం పైరవీలు చేసుకుంటున్నారో, వాటిని తామెలా ఎదుర్కొంటున్నారో చెబితే వుపయోగం. కేవలం తిరుగుతున్నారంటే అర్ధం లేదు.

      నిజమే చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినట్లు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై అదనపు భారం మోపే దారి ఖర్చులు దండగతప్ప అదనంగా సాధించిందేమిటి అన్నది అసలు ప్రశ్న. పదహారు వేల కోట్ల రూపాయల లోటుకు కేవలం 2,800 కోట్లు మాత్రమే కేంద్రం సాయంగా అందించిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే ఆ మిగతా మొత్తం కూడా రాదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అలా పదే పదే ఢిల్లీ తిరగటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాట్టు పెట్టిన గత పాలకులు, పాలనను గుర్తు చేయటం లేదా ?వారికీ వీరికీ వున్న తేడా ఏమిటి ? తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్‌ గానీ వీటికి సమాధానాలు చెప్పాలి. అలాగాకుండా రోజంతా జగన్‌ భజన చేస్తూ వుంటే సామాన్య జనానికే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు కూడా విసుగు పుడుతుంది. 1978లో జనతా పార్టీ ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌ పూర్తిగా తనలో చేర్చుకున్నట్లుగా మరికొద్ది రోజుల్లో మిగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఏలను కూడా ‘అభివృద్ధి’ ముసుగులో తెలుగుదేశంలోకి ఆకర్షిస్తారు.ఆ తరువాత చెప్పుకోవటానికి ఏమీ వుండదు.

    రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇటుక ఇటుకనూ పేరుస్తూ నిమగ్నమైన చంద్రబాబుకు కేంద్రంపై ఆగ్రహం కలిగించటానికి తప్పితే తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ప్రయివేటు బిల్లుపెట్టటం ఏమిటి ? పెట్టెను పో దాని మీద చర్చ జరగనీయటం ఏమిటి? జరిగెను పో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది, కావాలంటే ఇంకా అదనంగా కూడా ఏం కావాలంటే అది చేస్తాం అని లాలీపప్‌ సమాధానం చెప్పటం గాక వాటి గురించి మరిచి పోండి అని కేంద్ర మంత్రి కట్టెవిరిచినట్లు మాట్లాడటం ఏమిటి ? మోడీ బాబా నోరు విప్పకుండా శిష్యులతో ఇలాంటి ప్రకటనలు చేయించటం కావాలని చంద్రబాబుకు ఇబ్బంది కలిగించటం కాదా ?

   తానొవ్వ, ఇతరులను నొప్పించక సజావుగా సాగిపోవాలనుకుంటున్న తనకు మధ్య మధ్యలో తలనొప్పి కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడికి తీయని కోపం వస్తోందా? అది శ్రీకృష్ణుడి మీద సత్యభామకు వచ్చినటువంటిదేనా ? తాను ఏం చెప్పినా, ఏం చేసినా ప్రశ్నించేవారు వుండకూడదు, అలా వుండాలంటే చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా పోవాలి, అది జరగాలంటే అన్ని పార్టీల వారూ తన పార్టీలో చేరి నోర్మూసుకోవాలి.అందుకే ఇతర పార్టీల వారికి గాలం.లొంగని వామపక్ష పార్టీల వారిపై కేసులు, దమనకాండ, దాడులు.

    ప్రత్యేక రాష్ట్ర హోదా చర్చ తలెత్తినపుడల్లా ఇబ్బంది పడుతున్నవారిలో చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. కాంగ్రెస్‌ మాదిరి తప్పు చేయవద్దని బిజెపికి సలహా ఇస్తూ ట్వీటర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. బిజెపిలో చేరిన కామెడీ హీరో శివాజీ వంటి వారికి కూడా కోపం వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడికీ తెలిసినంతగా మరొకరికెవ్వరికీ తెలియదు.

    ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా పొందాలంటే అందుకు ఎలాంటి పరిస్థితులు వుండాలో అసలు ప్రత్యేక రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశం ఎజండాలో లేక ముందే నిర్ణయించారు. అననుకూల పరిస్ధితులు వున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించి, పన్నుల రాయితీలు కల్పించాలని ఐదవ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు 1969తో జమ్ము-కాశ్మీర్‌, అస్సాం, నాగాలండ్‌ను ఈ తరగతిలో చేర్చారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, హిమచల ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌కు కూడా దానిని వర్తింప చేశారు. 1. కొండలూ,లోయలతో సంచరించటానికి కష్టంగా వుండే ప్రాంతాలు, 2. జనాభా సాంద్రత తక్కువ లేదా గణనీయ సంఖ్యలో గిరిజనులు వుండటం, 3. పొరుగు దేశాల సరిహద్దులతో వుండి వ్యూహాత్మక ప్రాంతాలలో వుండటం, 4.ఆర్ధిక, మౌలిక వసతుల విషయంలో వెనుకబడి వుండటం, 5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గిట్టుబాటు కాకపోవటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) ఆమోదం మేరకు ఈ హోదా కల్పిస్తారు.

    ఈ హోదాను పొందిన రాష్ట్రాలకు నిధులు ఎలా కేటాయించాలన్నదానిపై కూడా మార్గదర్శక సూత్రాలు వున్నాయి. ప్రణాళికా సంఘం సాయాన్ని మూడు తరగతులుగా విభజించింది. 1.సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సిఏ), 2. అదనపు కేంద్ర సాయం(ఎసిఏ) 3.ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సిఏ). కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలకు కేటాయించే సాధారణ కేంద్ర సాయం 100 అనుకుంటే ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 30, మిగతా వాటికి 70 అందచేస్తారు.ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించే నిధుల కేటాయింపునకు ప్రత్యేక నిబంధనలు వుంటాయి. సాధారణ సాయం ఈ రాష్ట్రాలకు 90శాతం గ్రాంటు, పదిశాతం రుణంగా వుంటుంది. అదే సాధారణ రాష్ట్రాలకు 30,70 శాతాలుగా వుంటుంది. సాధారణ రాష్ట్రాలకు కేటాయించే నిధులలో నిధులు 100 అనుకుంటే వాటిలో జనాభా మాషాకు 60, తలసరి ఆదాయాన్ని బట్టి 25, ఆర్ధిక వ్యవస్ధ పనితీరును బట్టి, ప్రత్యేక సమస్యలుంటే ఏడున్నర శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక ప్రాతిపదికలేమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులలో 2010-11 లెక్కల ప్రకారం సాధారణ కేంద్ర సాయం కేవలం ఐదుశాతం మాత్రమే వుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు, గిరిజన వుప ప్రణాళికలు, సరిహద్దు వుండేట్లయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేక సాయం అందుకుంటాయి. ఈ సదుపాయాలు కాకుండా ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన విధంగా ఎక్సయిజ్‌, కస్టమ్స్‌, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రాయితీలు పొందుతాయి. విదేశీ నిధులతో ఏర్పాటయ్యే పధకాలు, కేంద్ర ప్రభుత్వ పధకాల సాయం కూడా పొందుతాయి.

      నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘం స్ధానంలో నీతి ఆయోగ్‌ వునికిలోకి వచ్చింది. అదింకా పూర్తిగా కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తెలివిగా నీతి ఆయోగ్‌కు బాధ్యతను అప్పగించింది. అది ఇంకా పరిశీలిస్తూనే వుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టిన సందర్బంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని బిల్లులో చేర్చలేదు. దీనిని బిజెపి లేదా తెలుగు దేశం పార్టీలు అప్పుడు మౌనంగా వుండి ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నాయి. నిజానికి వాటికి చిత్త శుద్ధి వుంటే ఇప్పుడైనా విభజన చట్టానికి సవరణలు చేయవచ్చు. అయితే విభజన కారణంగా ప్రత్యేక హోదాలు కల్పించేట్లయితే అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాటితో నిమిత్తం లేకుండానే ఒడిషా వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కల్పించమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాయి. నిజానికి ఈ విషయాలు విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌, బిజెపిల పెద్దలతో పాటు తెలుగు దేశం నేతలకు కూడా తెలియనివి కావు. అప్పుడు మాకు తెలియ లేదన్నా లేదా తెలుసన్నా జనంలో అభాసుపాలు కావాల్సి వస్తుంది కనుక రాజకీయంగా కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నారు. దానికి వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది తామే అనుకున్నా ఇక్కడా జనం ఓడించారు, రాష్ట్రాన్ని చీల్చారనే కోపంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దానికి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జనాన్ని ఈ పార్టీలన్నీ బకరాలుగా చేసి వాడుకున్నాయి, ఇప్పుడు రాజకీయంతో ఆడుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d